<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.aksharadarbar.com/rajeshwer/author-5" rel="self" type="application/rss+xml" />
                <generator>అక్షర దర్బార్ RSS Feed Generator</generator>
                <title>RV - అక్షర దర్బార్</title>
                <link>https://www.aksharadarbar.com/author/5/rss</link>
                <description>RV RSS Feed</description>
                
                            <item>
                <title>పీడీఎస్ రైస్ పట్టివేత </title>
                                    <description><![CDATA[<p>- 62 బస్తాల బియ్యం స్వాధీనం</p>
<p>- టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/global/pds-rice-pattiveta/article-484"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img-20260706-wa0021.jpg" alt=""></a><br /><p>పీడీఎస్ రైస్ పట్టివేత <br />- 62 బస్తాల బియ్యం స్వాధీనం<br />- టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు</p>
<p>అక్షరదర్బార్, హనుమకొండ: ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 62 బస్తాల్లో నిల్వ ఉన్న 31 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.1.08 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు హనుమకొండలోని గోపాలపూర్ గణేష్‌నగర్‌లో దాడి నిర్వహించారు. అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బండారి రాజ్‌కుమార్ (30) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు పెద్దపల్లి జిల్లా కల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందినవాడని, ప్రస్తుతం గోపాలపూర్‌లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణలో గోపాలపూర్ పరిసర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి, అధిక ధరకు ఇతరులకు విక్రయిస్తున్నట్లు నిందితుడు అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం, నిందితుడిని తదుపరి చర్యల కోసం కేయూసీ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ఎ మధుసూదన్ తెలిపారు. ఈ దాడిలో టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ బండారి రాజు, సిబ్బంది పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/global/pds-rice-pattiveta/article-484</link>
                <guid>https://www.aksharadarbar.com/global/pds-rice-pattiveta/article-484</guid>
                <pubDate>Mon, 06 Jul 2026 19:35:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260706-wa0021.jpg"                         length="158194"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏసీబీ వలలో తహశీల్దార్ </title>
                                    <description><![CDATA[<p>- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు</p>
<p>- రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/tehsildar-in-acb-network/article-483"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img-20260706-wa0019.jpg" alt=""></a><br /><p>ఏసీబీ వలలో తహశీల్దార్ </p>
<p>- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు</p>
<p>- రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ </p>
<p>సిద్దిపేట జిల్లా చేర్యాల మండల తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. భూమి సంబంధిత పని కోసం వచ్చిన వ్యక్తి నుంచి రూ.70 వేల లంచం తీసుకుంటుండగా తహశీల్దార్ దిలీప్ నాయక్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.<br />ఫిర్యాదు మేరకు ముందస్తు ప్రణాళికతో ట్రాప్ నిర్వహించిన ఏసీబీ అధికారులు, అనంతరం కార్యాలయంలో సోదాలు చేపట్టి పలు రికార్డులు, పత్రాలను పరిశీలించారు. లంచం వ్యవహారానికి సంబంధించిన మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. తహశీల్దార్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలపై ఏసీబీ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ ఘటనతో చేర్యాల మండలంలో కలకలం రేగింది.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/tehsildar-in-acb-network/article-483</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/tehsildar-in-acb-network/article-483</guid>
                <pubDate>Mon, 06 Jul 2026 18:33:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260706-wa0019.jpg"                         length="132889"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గోదావరి జలాలను వృదా చేయొద్దు </title>
                                    <description><![CDATA[<p>- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి<br />- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం<br />- కేసీఆర్‌కు వారం రోజులు ప్రాజెక్టు అప్పగించండి.. తెలంగాణకు నీళ్లు అందించి చూపిస్తాం<br />- రాజకీయ కక్షతో కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.. రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు<br />- కాళేశ్వరం వద్ద కేటీఆర్ ఫైర్.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర విరుచుకుపాటు<br />- పోలీసుల అడ్డంకుల మధ్య కన్నెపల్లి చేరుకున్న కేటీఆర్.. భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/global/dont-waste-godavari-water/article-482"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img-20260705-wa0023(1).jpg" alt=""></a><br /><p>గోదావరి జలాలను వృథా చేయొద్దు<br />- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి<br />- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం<br />- కేసీఆర్‌కు వారం రోజులు ప్రాజెక్టు అప్పగించండి.. తెలంగాణకు నీళ్లు అందించి చూపిస్తాం<br />- రాజకీయ కక్షతో కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.. రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు<br />- కాళేశ్వరం వద్ద కేటీఆర్ ఫైర్.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర విరుచుకుపాటు<br />- పోలీసుల అడ్డంకుల మధ్య కన్నెపల్లి చేరుకున్న కేటీఆర్.. భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు</p>
<p>అక్షరదర్బార్, కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ కక్షసాధింపుతో నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గోదావరి జలాలు లక్ష క్యూసెక్కుల చొప్పున ప్రతిరోజూ సముద్రంలో కలిసిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెంటనే కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను ప్రారంభించి తెలంగాణ రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.</p>
<p>హైదరాబాద్ నుంచి కన్నెపల్లి పర్యటనకు బయలుదేరిన కేటీఆర్ కాన్వాయ్‌ను పోలీసులు పలు చోట్ల అడ్డుకున్నారు. భారీ పోలీసు బందోబస్తుతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను నిలిపివేయడంతో బీఆర్ఎస్ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జంగావ్ జిల్లా పెంబర్తి, భూపాలపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కాన్వాయ్‌ను కొంతసేపు నిలిపివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ కేటీఆర్ తన పర్యటనను కొనసాగించి కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్నారు.</p>
<p>ముందుగా ఫోర్‌బే బ్రిడ్జిపై నుంచి గోదావరి ప్రవాహాన్ని పరిశీలించిన కేటీఆర్, అనంతరం పంప్‌హౌస్ గేట్లను సందర్శించారు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లి గోదావరిలో నుంచి వృథాగా సముద్రంలోకి వెళ్తున్న నీటిని పరిశీలించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఘాటుగా విమర్శలు చేశారు.</p>
<p>కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ప్రస్తుతం 97 మీటర్ల నీటి మట్టం ఉందని, 93 మీటర్ల నీరు ఉన్నా పంపులను ప్రారంభించి తెలంగాణకు సాగునీరు అందించవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కావాలనే పంపులను ఆన్ చేయడం లేదని ఆరోపించారు. ప్రతిరోజూ లక్ష క్యూసెక్కుల గోదావరి నీరు సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిని ఎత్తిపోస్తే రాష్ట్రంలోని లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రైతుల కళ్ల ముందే నీటిని వృథా చేయడం దారుణం అని అన్నారు.</p>
<p>వెంటనే మోటార్లు ప్రారంభించండి. లేకపోతే తెలంగాణ నలుమూలల నుంచి 50 వేల మంది రైతులతో వచ్చి కన్నెపల్లి పంప్‌హౌస్‌ను మేమే ప్రారంభించి రైతులకు నీళ్లు అందిస్తాం. రైతుల ప్రయోజనాల కోసం ఎలాంటి పోరాటానికైనా వెనుకాడం అని కేటీఆర్ హెచ్చరించారు.</p>
<p>ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వహించే సామర్థ్యం లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పది రోజుల పాటు అప్పగించాలని సవాల్ విసిరారు. కేసీఆర్‌కు పది రోజులు ప్రాజెక్టు అప్పగించండి. అన్ని పనులు పూర్తి చేసి తెలంగాణ రైతులకు నీళ్లు అందించి చూపిస్తాం. చేతకాకపోతే పక్కకు తప్పుకోండి అని వ్యాఖ్యానించారు.</p>
<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్షతో కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్టును వినియోగించకుండా మూసివేయడం రైతులకు చేస్తున్న అన్యాయం. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఆలోచనతో కాళేశ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. రైతుల భవిష్యత్తుతో చెలగాటమాడే హక్కు ఎవరికీ లేదు అని విమర్శించారు.</p>
<p>మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి అవగాహనతో మాట్లాడాలని సూచించారు. ముందు ప్రాజెక్టు గురించి తెలుసుకోండి. ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయొద్దు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాళేశ్వరం నీళ్లే రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి చేరుతున్నాయి. మీ నియోజకవర్గంలోని చివరి గ్రామానికి కూడా కాళేశ్వరం నీరే వెళ్తుంది అని అన్నారు.</p>
<p>మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులపై స్పందించిన కేటీఆర్, రెండు పిల్లర్ల మరమ్మతులకు సుమారు రూ.400 కోట్లు అవసరమని, ఆ మొత్తాన్ని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి భరించేందుకు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం 30 నెలలుగా పనులు ప్రారంభించలేదని ఆరోపించారు. రాజకీయ కక్షతో పనులు నిలిపివేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేల్కొని మేడిగడ్డ మరమ్మతులు పూర్తి చేసి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగించాలి  అని డిమాండ్ చేశారు.</p>
<p>పోలవరం ప్రాజెక్టు దశాబ్దాలుగా పూర్తికాలేదని, కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ దూరదృష్టితో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పునర్వ్యవస్థీకరించి గోదావరి-ప్రాణహిత సంగమ ప్రాంతంలో సమగ్ర సర్వేలు నిర్వహించి మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించారని కేటీఆర్ వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, పర్యావరణ శాఖల నుంచి అన్ని అనుమతులు సాధించి కేవలం నాలుగేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాలలో ఒకటైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని చెప్పారు.</p>
<p>కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కాంక్రీట్ నిర్మాణం కాదు.. ఇది తెలంగాణ రైతుల జీవనాడి. ఈ ప్రాజెక్టును నిలిపివేయడం అంటే తెలంగాణ భవిష్యత్తును నిలిపివేయడమే. గోదావరి జలాలను సముద్రంలో కలపడం రైతుల పట్ల చేస్తున్న క్షమించరాని తప్పు అని కేటీఆర్ పేర్కొన్నారు.</p>
<p>ఈ సందర్భంగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ, ప్రభుత్వానికి నిజంగా దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కన్నెపల్లి పంప్‌హౌస్‌కు రావాలి. మేము రెండు రోజులైనా ఇక్కడే ఉంటాం. అందరం కలిసి పంపులను ప్రారంభించి తెలంగాణ రైతులకు నీళ్లు అందిద్దాం. హెలికాప్టర్లలో తిరుగుతూ విమర్శలు చేయడం కాదు.. క్షేత్రస్థాయికి వచ్చి వాస్తవాలు చూడాలి అని సవాల్ విసిరారు.</p>
<p>ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పెద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు పల్లె రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.<img src="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260705-wa0013.jpg" alt="IMG-20260705-WA0013" width="1280" height="850"></img><img src="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260705-wa0014.jpg" alt="IMG-20260705-WA0014" width="1280" height="850"></img></p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/global/dont-waste-godavari-water/article-482</link>
                <guid>https://www.aksharadarbar.com/global/dont-waste-godavari-water/article-482</guid>
                <pubDate>Sun, 05 Jul 2026 18:56:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260705-wa0023%281%29.jpg"                         length="139788"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భర్త హత్యకు భార్య స్కెచ్ </title>
                                    <description><![CDATA[<p>- రూ.4 లక్షల సుపారీ<br />- సింగారం మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేధన<br />- యాకయ్య మృతి వెనుక అసలు నిజాలు బయటపెట్టిన ఎస్పీ <br />- భార్యతో సహా ఏడుగురు అరెస్ట్</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/a-sketch-of-a-wife-for-murdering-her-husband/article-476"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img-20260704-wa0019.jpg" alt=""></a><br /><p>భర్త హత్యకు భార్య స్కెచ్ <br />- రూ.4 లక్షల సుపారీ<br />- సింగారం మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేధన<br />- యాకయ్య మృతి వెనుక అసలు నిజాలు బయటపెట్టిన ఎస్పీ <br />- భార్యతో సహా ఏడుగురు అరెస్ట్</p>
<p>అక్షరదర్బార్, మహబూబాబాద్:<br />మహబూబాబాద్ మండలం సింగారం గ్రామంలో ఈ నెల 1వ తేదీ తెల్లవారుజామున జరిగిన మాజీ ఉప సర్పంచ్ యాకయ్య (57) హత్య కేసును మహబూబాబాద్ టౌన్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. వివాహేతర సంబంధం, ఆస్తి గొడవలే ఈ దారుణ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. భర్తను అంతమొందించేందుకు రూ.4 లక్షల సుపారీ మాట్లాడిన భార్య యశోద (53)తో పాటు హత్యకు పాల్పడిన మరో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శబరిష్ ఈ సంచలన హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.<br />- పరాయి మహిళకు ఆస్తి ఇస్తాడనే భయంతోనే..<br />పోలీసుల కథనం ప్రకారం.. మృతుడు యాకయ్యకు గ్రామంలోని మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో తన ఆస్తిని ఆ మహిళకు ఎక్కడ రాసిస్తాడోననే భయం భార్య యశోదలో మొదలైంది. దీంతో భర్తను పూర్తిగా వదిలించుకోవాలని నిర్ణయించుకున్న ఆమె, యాకయ్యను హత్య చేసేందుకు రూ.4 లక్షల సుపారీని మాట్లాడి నిందితులతో ఒప్పందం కుదుర్చుకుంది.<br />- దోపిడీగా చిత్రీకరించే ప్రయత్నం ఫెయిల్..<br />పథకం ప్రకారం.. ఈ నెల 1వ తేదీ తెల్లవారుజామున దుండగులు యాకయ్యపై ఇనుప రాడ్‌తో దాడి చేసి దారుణంగా కొట్టి చంపారు. అనంతరం ఇదంతా దొంగల పనిగా చిత్రీకరించేందుకు యాకయ్య మెడలోని బంగారు గొలుసును తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. అయితే రంగంలోకి దిగిన టౌన్ పోలీసులు సాంకేతిక ఆధారాలు, పక్కా సమాచారంతో దర్యాప్తు చేపట్టి అసలు సూత్రధారి భార్య యశోదనే అని గుర్తించారు.<br />- సామగ్రి సీజ్.. పోలీసులకు అభినందనలు<br />ఈ కేసులో ప్రధాన నిందితురాలైన భార్య యశోదతో పాటు మరో ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి 7 సెల్‌ఫోన్లు, ఒక ఐరన్ రాడ్, 2 ద్విచక్ర వాహనాలు, మృతుడి మెడ నుంచి దొంగిలించిన 1 బంగారు గొలుసును పోలీసులు సీజ్ చేశారు. కేసును చాకచక్యంగా ఛేదించిన టౌన్ పోలీస్ సిబ్బందిని ఎస్పీ శబరిష్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.<img src="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260704-wa0020.jpg" alt="IMG-20260704-WA0020" width="540" height="1200"></img></p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/a-sketch-of-a-wife-for-murdering-her-husband/article-476</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/a-sketch-of-a-wife-for-murdering-her-husband/article-476</guid>
                <pubDate>Sat, 04 Jul 2026 19:11:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260704-wa0019.jpg"                         length="75850"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లంచం అడిగితే నా దృష్టికి తేండి </title>
                                    <description><![CDATA[<p>- పేదల సంక్షేమంలో రాజీ లేదు.. నియోజకవర్గ అభివృద్ధియే మా లక్ష్యం<br />- వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వమే కారణం<br />- ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి<br />- అభివృద్ధిపై చర్చకు సిద్ధమని బీజేపీ, బీఆర్ఎస్‌లకు సవాల్</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/global/a-bribe/article-469"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img-20260702-wa0013.jpg" alt=""></a><br /><p>లంచాలు అడిగితే <br />నా దృష్టికి తీసుకురండి<br />- పేదల సంక్షేమంలో రాజీ లేదు.. నియోజకవర్గ అభివృద్ధియే మా లక్ష్యం<br />- వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వమే కారణం<br />- ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి<br />- అభివృద్ధిపై చర్చకు సిద్ధమని బీజేపీ, బీఆర్ఎస్‌లకు సవాల్<br />- రూ.2.10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన</p>
<p>అక్షరదర్బార్, హనుమకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిలో భాగంగా 53వ డివిజన్ పరిధిలోని లష్కర్ నగర్ సింగారం, గోపాల్పూర్ జంక్షన్ ప్రాంతాల్లో సుమారు రూ.2.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి జరిగిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో ఒక్కో డివిజన్‌కు నామమాత్రంగా నిధులు కేటాయించి చేతులు దులుపుకునేవారని విమర్శించారు. కానీ ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో ప్రతి డివిజన్‌కు రూ.10 కోట్ల నుండి రూ.20 కోట్ల వరకు నిధులు కేటాయించి అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి కాలనీకి మెరుగైన రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.<br />- లంచాలు అడిగితే వెంటనే నా దృష్టికి తీసుకురండి<br />రేషన్ కార్డులు, పెన్షన్లు లేదా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఎవరైనా రాజకీయ నాయకులు గానీ, అధికారులు గానీ డబ్బులు అడిగితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేదలకు సంబంధించిన ప్రతి పథకం పూర్తిగా ఉచితమని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుల చేతికే నేరుగా ప్రయోజనాలు చేరేలా పారదర్శక వ్యవస్థను అమలు చేస్తున్నామని చెప్పారు. ఎవరైనా లంచాలు ఇచ్చి ప్రోత్సహిస్తే సమాజానికి అన్యాయం చేసినట్లవుతుందని హితవు పలికారు. ఇప్పటికే పెన్షన్లు, రేషన్ కార్డుల అర్హుల జాబితాలను డివిజన్ వారీగా తుది దశకు తీసుకువచ్చామని వెల్లడించారు.<br />- అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. విపక్షాలకు సవాల్<br />నియోజకవర్గ అభివృద్ధిపై తాము ఎప్పుడూ చర్చకు సిద్ధమేనని, ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం సరికాదని విపక్షాలకు ఎమ్మెల్యే నాయిని స్పష్టం చేశారు. విమర్శలు చేసే ముందు తాము చేసిన పనులేంటో చెప్పాలని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే వందల కోట్ల రూపాయలు వెచ్చించి భూసేకరణ పూర్తి చేసి, కేంద్రానికి అప్పగించినా కేంద్రం విమానాశ్రయ అభివృద్ధిని వేగవంతం చేయలేదని విమర్శించారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్ తీసుకురాకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక విధానాల పేరుతో లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను సైతం బలహీనపరుస్తూ ప్రైవేటీకరణకు ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు క్షేత్రస్థాయి అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం అనవసర రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. ఎవరు అభివృద్ధి చేస్తున్నారో, ఎవరు కేవలం మాటలకే పరిమితమవుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని, వారే సరైన తీర్పు ఇస్తారని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/global/a-bribe/article-469</link>
                <guid>https://www.aksharadarbar.com/global/a-bribe/article-469</guid>
                <pubDate>Thu, 02 Jul 2026 18:18:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260702-wa0013.jpg"                         length="114249"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లంచాలు అడిగితే నా దృష్టికి తేండి</title>
                                    <description><![CDATA[<p>పేదల సంక్షేమంలో రాజీ లేదు.. నియోజకవర్గ అభివృద్ధియే మా లక్ష్యం<br />- వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వమే కారణం<br />- ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి<br />- అభివృద్ధిపై చర్చకు సిద్ధమని బీజేపీ, బీఆర్ఎస్‌లకు సవాల్<br />- రూ.2.10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>లంచాలు అడిగితే <br />నా దృష్టికి తీసుకురండి<br />- పేదల సంక్షేమంలో రాజీ లేదు.. నియోజకవర్గ అభివృద్ధియే మా లక్ష్యం<br />- వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వమే కారణం<br />- ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి<br />- అభివృద్ధిపై చర్చకు సిద్ధమని బీజేపీ, బీఆర్ఎస్‌లకు సవాల్<br />- రూ.2.10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన</p>
<p>అక్షరదర్బార్, హనుమకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిలో భాగంగా 53వ డివిజన్ పరిధిలోని లష్కర్ నగర్ సింగారం, గోపాల్పూర్ జంక్షన్ ప్రాంతాల్లో సుమారు రూ.2.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి జరిగిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో ఒక్కో డివిజన్‌కు నామమాత్రంగా నిధులు కేటాయించి చేతులు దులుపుకునేవారని విమర్శించారు. కానీ ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో ప్రతి డివిజన్‌కు రూ.10 కోట్ల నుండి రూ.20 కోట్ల వరకు నిధులు కేటాయించి అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి కాలనీకి మెరుగైన రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.<br />- లంచాలు అడిగితే వెంటనే నా దృష్టికి తీసుకురండి<br />రేషన్ కార్డులు, పెన్షన్లు లేదా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఎవరైనా రాజకీయ నాయకులు గానీ, అధికారులు గానీ డబ్బులు అడిగితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేదలకు సంబంధించిన ప్రతి పథకం పూర్తిగా ఉచితమని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుల చేతికే నేరుగా ప్రయోజనాలు చేరేలా పారదర్శక వ్యవస్థను అమలు చేస్తున్నామని చెప్పారు. ఎవరైనా లంచాలు ఇచ్చి ప్రోత్సహిస్తే సమాజానికి అన్యాయం చేసినట్లవుతుందని హితవు పలికారు. ఇప్పటికే పెన్షన్లు, రేషన్ కార్డుల అర్హుల జాబితాలను డివిజన్ వారీగా తుది దశకు తీసుకువచ్చామని వెల్లడించారు.<br />- అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. విపక్షాలకు సవాల్<br />నియోజకవర్గ అభివృద్ధిపై తాము ఎప్పుడూ చర్చకు సిద్ధమేనని, ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం సరికాదని విపక్షాలకు ఎమ్మెల్యే నాయిని స్పష్టం చేశారు. విమర్శలు చేసే ముందు తాము చేసిన పనులేంటో చెప్పాలని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే వందల కోట్ల రూపాయలు వెచ్చించి భూసేకరణ పూర్తి చేసి, కేంద్రానికి అప్పగించినా కేంద్రం విమానాశ్రయ అభివృద్ధిని వేగవంతం చేయలేదని విమర్శించారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్ తీసుకురాకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక విధానాల పేరుతో లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను సైతం బలహీనపరుస్తూ ప్రైవేటీకరణకు ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు క్షేత్రస్థాయి అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం అనవసర రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. ఎవరు అభివృద్ధి చేస్తున్నారో, ఎవరు కేవలం మాటలకే పరిమితమవుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని, వారే సరైన తీర్పు ఇస్తారని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/global/if-you-ask-for-bribes-bring-it-to-my-attention/article-468</link>
                <guid>https://www.aksharadarbar.com/global/if-you-ask-for-bribes-bring-it-to-my-attention/article-468</guid>
                <pubDate>Thu, 02 Jul 2026 18:08:36 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సీఐ, ఎస్సై సస్పెన్షన్ </title>
                                    <description><![CDATA[<p>- ఒకే కేసులో సీఐ, ఎస్ఐలను సస్పెన్షన్ చేసిన వరంగల్ సీపీ <br />- విచారణలో అవినీతి ఆరోపణలు నిజమని తేలటంతో నిర్ణయం</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/suspension-of-ci-sci/article-466"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-06/546-5467892_telangana-police-logo-png-telangana-police-logo-transparent.png" alt=""></a><br /><p>సీఐ, ఎస్సై సస్పెన్షన్ </p>
<p>- ఒకే కేసులో సీఐ, ఎస్ఐలను సస్పెన్షన్ చేసిన వరంగల్ సీపీ <br />- విచారణలో అవినీతి ఆరోపణలు నిజమని తేలటంతో నిర్ణయం </p>
<p>అక్షరదర్బార్, హనుమకొండ: వరంగల్ కమిషనరేట్ పరిధిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారులపై కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కొరడా ఝలిపిస్తున్నారు. తాజాగా మరో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు. వెస్ట్ జోన్ పరిధిలోని నర్మెట్ట సర్కిల్ ఇన్ స్పెక్టర్ యం అబ్బయ్య, గతంలో బచ్చన్నపేట ఎస్ఐగా పని చేసి ప్రస్తుతం ఏఆర్ అటాచ్డ్ లో ఉన్న ఎస్ఐ షేక్ హమీద్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఇరువురు అధికారులను సస్పెండ్ చేస్తునట్లు సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే కేసులో సీఐ, ఎస్సైపై సీపీ సస్పెన్షన్ వేటు వేయడం కమిషనరేట్ పరిధిలో కలకలం రేపింది.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/suspension-of-ci-sci/article-466</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/suspension-of-ci-sci/article-466</guid>
                <pubDate>Sun, 28 Jun 2026 13:12:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-06/546-5467892_telangana-police-logo-png-telangana-police-logo-transparent.png"                         length="245806"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title> జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా వెంకన్న</title>
                                    <description><![CDATA[<ul>
<li>ఆయన స్వస్థలం మరిపెడ</li>
<li>అదనపు బాధ్యతల నుంచి కలెక్టర్ రిలీవ్ </li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/global/venkanna-as-gwmc-commissioner/article-465"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-06/img-20260626-wa0023.jpg" alt=""></a><br /><p>జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా వెంకన్న<br />- ఆయన స్వస్థలం మరిపెడ <br />- అదనపు బాధ్యతల నుంచి కలెక్టర్ రిలీవ్ </p>
<p>అక్షరదర్బార్, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బదిలీ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం హెచ్‌ఎండీఏలో కోర్ అర్బన్ రీజియన్, మెట్రో రైల్ విభాగం జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న టి వెంకన్న ను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ నియమించింది. ఈ మేరకు ఇప్పటి వరకు జీడబ్ల్యూఎంసీ మున్సిపల్ కమిషనర్ పదవికి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయిని ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన కమిషనర్ టి వెంకన్న త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. వెంకన్న స్వస్థలం మహబూబాబాద్ జిల్లా మరిపెడ. 2007లో గ్రూప్-1 అధికారిగా మున్సిపల్ కమిషనర్ గా ఎంపికయ్యారు. ఇప్పటివరకు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గా ఐఏఎస్ అధికారులను నియమించిన ప్రభుత్వం తాజాగా గ్రూప్ -1 అధికారిని నియమించటం చర్చనీయమైంది.</p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/global/venkanna-as-gwmc-commissioner/article-465</link>
                <guid>https://www.aksharadarbar.com/global/venkanna-as-gwmc-commissioner/article-465</guid>
                <pubDate>Fri, 26 Jun 2026 18:32:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-06/img-20260626-wa0023.jpg"                         length="112293"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రం గుట్టురట్టు</title>
                                    <description><![CDATA[<p>- టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి.. ఒకరి అరెస్ట్</p>
<p>- రూ. 2.25 లక్షల విలువైన నిల్వలు స్వాధీనం</p>
<p> </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/the-adulterated-greens-manufacturing-center-is-gutturattu/article-464"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-06/img-20260625-wa0003.jpg" alt=""></a><br /><p> </p>
<p>కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రం గుట్టురట్టు</p>
<p>- టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి.. ఒకరి అరెస్ట్</p>
<p>- రూ. 2.25 లక్షల విలువైన నిల్వలు స్వాధీనం</p>
<p> </p>
<p>అక్షరదర్బార్, వరంగల్: వరంగల్ నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఒక అక్రమ, కల్తీ పచ్చడి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ నకిలీ పచ్చళ్ల దందాను మట్టుబెట్టి, ఒకరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 2.25 లక్షల విలువైన కుళ్లిపోయిన ఆహార నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.</p>
<p>- ఇల్లే కేంద్రంగా అక్రమ వ్యాపారం</p>
<p>టాస్క్ ఫోర్స్ అధికారుల కథనం ప్రకారం... ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశీబుగ్గ సాయి వీధిలో ఉన్న ఓ నివాస గృహంలో అక్రమంగా పచ్చళ్లు తయారు చేస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఎ మధుసూదన్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ బండారి రాజు, ఆర్‌ఎస్‌ఐ ఓ. భాను ప్రకాష్ మరియు సిబ్బంది ఆ గృహంపై ఆకస్మిక దాడి జరిపారు. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున కుళ్లిపోయిన పచ్చడి ముడిసరుకులు, ప్రమాదకర రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ కుళ్లిపోయిన నిల్వలను చిన్న చిన్న ఆకర్షణీయమైన ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి, స్థానిక కిరాణా దుకాణాలు, హోటళ్లు, ఇతర చిన్న వ్యాపార కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.</p>
<p>- భారీగా కుళ్లిపోయిన సరుకు స్వాధీనం</p>
<p>ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన కాశీబుగ్గ నివాసి అరికెల శ్రీనివాస్ (51) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తయారీ కేంద్రం నుండి దాదాపు 2,100 కిలోల కల్తీ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 750 కిలోల టమోటా ముడిసరుకు, 900 కిలోల మామిడి ముక్కలు, 200 కిలోల నిమ్మకాయలు, 100 కిలోల ఉసిరికాయలు, 150 కిలోల అల్లం-వెల్లుల్లి పేస్ట్ ఉన్నాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ.2,25,000 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పట్టుబడిన నిందితుడిని, స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.</p>
<p>- ప్రజలు అప్రమత్తంగా ఉండాలి</p>
<p>"మార్కెట్లో లభించే బ్రాండ్ లేని, అనుమానాస్పద ఆహార పదార్థాలు, పచ్చళ్లను కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తక్కువ ధరకు వస్తున్నాయని కొని ఆరోగ్యాలను పాడుచేసుకోవద్దు. నగరంలో ఎక్కడైనా ఇలాంటి అక్రమ నిల్వ కేంద్రాలు లేదా కల్తీ ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలి, సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతాం." అని టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎ. మధుసూదన్ అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/the-adulterated-greens-manufacturing-center-is-gutturattu/article-464</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/the-adulterated-greens-manufacturing-center-is-gutturattu/article-464</guid>
                <pubDate>Thu, 25 Jun 2026 16:48:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-06/img-20260625-wa0003.jpg"                         length="223228"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లారీ బీభత్సం.. ఆర్టీవో మృతి </title>
                                    <description><![CDATA[<ul>
<li>భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు ఘోర ప్రమాదం</li>
<li>దూసుకెళ్లిన లారీ.. ఆర్టీవో వెంకన్న దుర్మరణం </li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/larry-bibhatsam-rto-died/article-463"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-06/img-20260622-wa0005.jpg" alt=""></a><br /><p>లారీ బీభత్సం.. ఆర్టీవో మృతి </p>
<p>- భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు ఘోర ప్రమాదం</p>
<p><br />అక్షరదర్బార్, భూపాలపల్లిక్రైమ్:</p>
<p>గణపురం మండలం చెల్పూర్ వద్ద భూపాలపల్లి - పరకాల ప్రధాన రహదారిపై గల జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా అధికారి (ఆర్టీవో) కార్యాలయం ముందు సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీవో వెంకన్న బొగ్గు లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఓ బొగ్గు లారీ ఆర్టీవో వెంకన్న పైనుంచి దూసుకు వెళ్లింది. నడుముపై నుంచి వెళ్లటం వల్ల తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే సంఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయారు. </p>
<p>సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్టీవో సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని భూపాలపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే అధికారిగా పేరున్న వెంకన్న మృతి పట్ల జిల్లా యంత్రాంగం, రవాణా శాఖ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీవో కార్యాలయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. వెంకన్న ఇటీవలే ఈనెల 4న జగిత్యాల నుంచి బదిలీపై భూపాలపల్లి జిల్లా రవాణా అధికారిగా వచ్చారు. వెంకన్న స్వస్థలం మహబూబాబాద్ జిల్లా. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు.<img src="https://www.aksharadarbar.com/media/2026-06/img-20260622-wa0008.jpg" alt="IMG-20260622-WA0008" width="1072" height="712"></img></p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/larry-bibhatsam-rto-died/article-463</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/larry-bibhatsam-rto-died/article-463</guid>
                <pubDate>Mon, 22 Jun 2026 10:29:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-06/img-20260622-wa0005.jpg"                         length="187354"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నిషేధిత కలుపు మందు స్వాధీనం </title>
                                    <description><![CDATA[<p>- పరకాలలో విజిలెన్స్ దాడులు.. </p>
<p>- 150 లీటర్ల స్పీడ్ పారాక్వాట్ పట్టివేత</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/global/possession-of-prohibited-weed/article-459"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-06/img-20260614-wa0006.jpg" alt=""></a><br /><p>నిషేధిత కలుపు మందు స్వాధీనం</p>
<p>- పరకాలలో విజిలెన్స్ దాడులు.. </p>
<p>- 150 లీటర్ల స్పీడ్ పారాక్వాట్ పట్టివేత</p>
<p>అక్షరదర్బార్, పరకాల: <br />పరకాల పట్టణంలోని ఓ ఎరువులు, పురుగుమందుల దుకాణంలో నిషేధిత కలుపు మందును విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని లక్ష్మీ ఏజెన్సీలో నిల్వ ఉంచిన సుమారు 150 లీటర్ల స్పీడ్ పారాక్వాట్ (పారాకుట్) మందును అధికారులు తనిఖీల సందర్భంగా గుర్తించి పట్టుకున్నట్లు సమాచారం.భూమి సారంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు రైతుల ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉందన్న కారణాలతో ప్రభుత్వం ఈ మందు విక్రయాలు, వినియోగంపై నిషేధం విధించింది. అయినప్పటికీ కొందరు వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘిస్తూ రహస్యంగా విక్రయాలు కొనసాగిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలిసింది.పట్టణంలోని ఇతర ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లోనూ సమగ్ర తనిఖీలు చేపడితే మరింత పరిమాణంలో నిషేధిత మందులు బయటపడే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఘటనపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.</p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/global/possession-of-prohibited-weed/article-459</link>
                <guid>https://www.aksharadarbar.com/global/possession-of-prohibited-weed/article-459</guid>
                <pubDate>Sun, 14 Jun 2026 14:02:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-06/img-20260614-wa0006.jpg"                         length="162418"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గంజాయి చాక్లెట్ల కలకలం</title>
                                    <description><![CDATA[<p>- ఒడిశా కేటుగాడి అరెస్ట్<br />- ఎంజీఎం సర్కిల్ వద్ద పట్టుకున్న పోలీసులు..<br />- 72 'సెవెన్ మైనర్ వతి' చాక్లెట్లు స్వాధీనం</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/a-mix-of-cannabis-chocolates/article-455"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-06/img-20260607-wa0016.jpg" alt=""></a><br /><p>గంజాయి చాక్లెట్ల కలకలం<br />- ఒడిశా కేటుగాడి అరెస్ట్<br />- ఎంజీఎం సర్కిల్ వద్ద పట్టుకున్న పోలీసులు..<br />- 72 'సెవెన్ మైనర్ వతి' చాక్లెట్లు స్వాధీనం</p>
<p>అక్షరదర్బార్, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు గంజాయి చాక్లెట్ల అక్రమ రవాణాను రట్టు చేశారు. మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు భారీగా గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకొని, ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. మట్వాడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్‌ఐ) ఎస్ శివకృష్ణ తన సిబ్బంది డి నాగరాజు, బి సత్యనారాయణ, పి రవిలతో కలిసి స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎంజీఎం సర్కిల్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసుల కంటపడ్డాడు. సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద ఉన్న నలుపు రంగు బ్యాగును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ బ్యాగులో చాక్లెట్ల రూపంలో ఉన్న గంజాయి పదార్థం బయటపడటంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు.<br />- ఒడిశా టు మహారాష్ట్ర.. వరంగల్ మీదుగా స్మగ్లింగ్<br />పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు ఒడిశా రాష్ట్రం, భద్రక్ జిల్లా, కాన్పాడా గ్రామానికి చెందిన జనార్ధన్ మాలిక్ (వయస్సు 35 ఏళ్లు) గా గుర్తించారు. నిందితుడి వద్ద నిషేధిత పదార్థం దొరకడంతో మట్వాడ పోలీసులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారి ఆదేశాల మేరకు పంచులు (సాక్షులు), క్లూస్ టీంను సంఘటనా స్థలానికి రప్పించి చట్టపరమైన ప్రక్రియను చేపట్టారు.<br />పంచుల సమక్షంలో నిందితుడిని విచారించగా అసలు విషయం ఒప్పుకున్నాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన తన పరిచయస్తుడు అంకిత్ పాణిగ్రహి వద్ద నుండి ఈ గంజాయి మిశ్రమ చాక్లెట్లను తక్కువ ధరకు కొనుగోలు చేశానని.. వీటిని మహారాష్ట్రలోని సోలాపూర్ ప్రాంతానికి తరలించి అక్కడ అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోవాలనే దురాశతో తీసుకెళ్తున్నట్లు నిందితుడు స్వచ్ఛందంగా అంగీకరించాడు.<br />- ఘాటైన వాసన.. 'క్యానబిస్ సటైవా' గుర్తింపు<br />నిందితుడి వద్ద లభించిన గోల్డ్ కలర్ కవర్లపై “Seven Minor Vati” అని ముద్రించి ఉంది. పోలీసులు మొత్తం 72 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ కవర్లపై ఉన్న వివరాలను పరిశీలించగా.. అందులో ‘క్యానబిస్ సటైవా’ (గంజాయి) సహా పలు మత్తు పదార్థాలు కలిపి తయారు చేసినట్లు నిర్ధారణ అయింది. పంచులు, పోలీసుల సమక్షంలో వాటిని పరిశీలించగా చాక్లెట్ల నుండి గంజాయికి ఉండే ప్రత్యేకమైన ఘాటైన వాసన రావడంతో వాటిని సీజ్ చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న మట్వాడ ఎస్‌ఐ శివకృష్ణ, పీసీలు నాగరాజు, సత్యనారాయణ, రవిలను ఉన్నతాధికారులు అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/a-mix-of-cannabis-chocolates/article-455</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/a-mix-of-cannabis-chocolates/article-455</guid>
                <pubDate>Sun, 07 Jun 2026 22:13:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-06/img-20260607-wa0016.jpg"                         length="326068"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        