<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.aksharadarbar.com/rajeshwer/author-5" rel="self" type="application/rss+xml" />
                <generator>అక్షర దర్బార్ RSS Feed Generator</generator>
                <title>RV - అక్షర దర్బార్</title>
                <link>https://www.aksharadarbar.com/author/5/rss</link>
                <description>RV RSS Feed</description>
                
                            <item>
                <title>గంజాయి చాక్లెట్ల కలకలం</title>
                                    <description><![CDATA[<p>- ఒడిశా కేటుగాడి అరెస్ట్<br />- ఎంజీఎం సర్కిల్ వద్ద పట్టుకున్న పోలీసులు..<br />- 72 'సెవెన్ మైనర్ వతి' చాక్లెట్లు స్వాధీనం</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/a-mix-of-cannabis-chocolates/article-455"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-06/img-20260607-wa0016.jpg" alt=""></a><br /><p>గంజాయి చాక్లెట్ల కలకలం<br />- ఒడిశా కేటుగాడి అరెస్ట్<br />- ఎంజీఎం సర్కిల్ వద్ద పట్టుకున్న పోలీసులు..<br />- 72 'సెవెన్ మైనర్ వతి' చాక్లెట్లు స్వాధీనం</p>
<p>అక్షరదర్బార్, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు గంజాయి చాక్లెట్ల అక్రమ రవాణాను రట్టు చేశారు. మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు భారీగా గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకొని, ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. మట్వాడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్‌ఐ) ఎస్ శివకృష్ణ తన సిబ్బంది డి నాగరాజు, బి సత్యనారాయణ, పి రవిలతో కలిసి స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎంజీఎం సర్కిల్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసుల కంటపడ్డాడు. సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద ఉన్న నలుపు రంగు బ్యాగును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ బ్యాగులో చాక్లెట్ల రూపంలో ఉన్న గంజాయి పదార్థం బయటపడటంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు.<br />- ఒడిశా టు మహారాష్ట్ర.. వరంగల్ మీదుగా స్మగ్లింగ్<br />పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు ఒడిశా రాష్ట్రం, భద్రక్ జిల్లా, కాన్పాడా గ్రామానికి చెందిన జనార్ధన్ మాలిక్ (వయస్సు 35 ఏళ్లు) గా గుర్తించారు. నిందితుడి వద్ద నిషేధిత పదార్థం దొరకడంతో మట్వాడ పోలీసులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారి ఆదేశాల మేరకు పంచులు (సాక్షులు), క్లూస్ టీంను సంఘటనా స్థలానికి రప్పించి చట్టపరమైన ప్రక్రియను చేపట్టారు.<br />పంచుల సమక్షంలో నిందితుడిని విచారించగా అసలు విషయం ఒప్పుకున్నాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన తన పరిచయస్తుడు అంకిత్ పాణిగ్రహి వద్ద నుండి ఈ గంజాయి మిశ్రమ చాక్లెట్లను తక్కువ ధరకు కొనుగోలు చేశానని.. వీటిని మహారాష్ట్రలోని సోలాపూర్ ప్రాంతానికి తరలించి అక్కడ అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోవాలనే దురాశతో తీసుకెళ్తున్నట్లు నిందితుడు స్వచ్ఛందంగా అంగీకరించాడు.<br />- ఘాటైన వాసన.. 'క్యానబిస్ సటైవా' గుర్తింపు<br />నిందితుడి వద్ద లభించిన గోల్డ్ కలర్ కవర్లపై “Seven Minor Vati” అని ముద్రించి ఉంది. పోలీసులు మొత్తం 72 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ కవర్లపై ఉన్న వివరాలను పరిశీలించగా.. అందులో ‘క్యానబిస్ సటైవా’ (గంజాయి) సహా పలు మత్తు పదార్థాలు కలిపి తయారు చేసినట్లు నిర్ధారణ అయింది. పంచులు, పోలీసుల సమక్షంలో వాటిని పరిశీలించగా చాక్లెట్ల నుండి గంజాయికి ఉండే ప్రత్యేకమైన ఘాటైన వాసన రావడంతో వాటిని సీజ్ చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న మట్వాడ ఎస్‌ఐ శివకృష్ణ, పీసీలు నాగరాజు, సత్యనారాయణ, రవిలను ఉన్నతాధికారులు అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/a-mix-of-cannabis-chocolates/article-455</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/a-mix-of-cannabis-chocolates/article-455</guid>
                <pubDate>Sun, 07 Jun 2026 22:13:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-06/img-20260607-wa0016.jpg"                         length="326068"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం </title>
                                    <description><![CDATA[<p>- హనుమకొండ కాంగ్రెస్ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ ధర్నా <br />- బండి సంజయ్ తనయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/sanjay-is-an-effigy/article-448"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-05/img-20260510-wa0021.jpg" alt=""></a><br /><p>సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం <br />- హనుమకొండ కాంగ్రెస్ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ ధర్నా <br />- బండి సంజయ్ తనయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్</p>
<p>అక్షరదర్బార్, హనుమకొండ: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి సాయి భగీరథ్ ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనను నిరసిస్తూ, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ కాంగ్రెస్ భవన్ కూడలి వద్ద భారీ ధర్నా నిర్వహించారు. హనుమకొండ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని, బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ తన కుమారుడు చేసిన అకృత్యానికి నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ వెంటనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. లేనిపక్షంలో ప్రధాని మోదీ ఆయన్ను వెంటనే మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని అన్నారు. సాధారణ పౌరులపై పోక్సో కేసు నమోదైతే వెంటనే అరెస్టు చేసే పోలీసులు, కేంద్ర మంత్రి కుమారుడు కాబట్టే విచారణలో జాప్యం చేస్తున్నారా? అని ఆమె ప్రశ్నించారు. బండి సంజయ్ హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నంత కాలం పోలీసులపై ఒత్తిడి ఉంటుందని, బాధితురాలికి న్యాయం జరగదని ఆవేదన వ్యక్తం చేశారు.'బేటీ బచావో - బేటీ పడావో' అనేది బీజేపీకి కేవలం ఎన్నికల నినాదమే తప్ప, ఆచరణలో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా బీజేపీకి చెందిన 44 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై అత్యాచార, వేధింపుల కేసులు ఉన్నా పార్టీ వారికి రక్షణ కల్పిస్తోందని ధ్వజమెత్తారు. వేధింపులు తాళలేక బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసే స్థాయికి వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలని, నిందితుడు సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.<br />అధికారం అండతో చట్టాన్ని చుట్టంలా మార్చుకోవాలని చూస్తే మహిళా కాంగ్రెస్ ఊరుకోదని, బాధితురాలికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఎర్రబెల్లి స్వర్ణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలు, కార్యకర్తలు పాల్గొని ప్లకార్డులతో నిరసన తెలిపారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/sanjay-is-an-effigy/article-448</link>
                <guid>https://www.aksharadarbar.com/sanjay-is-an-effigy/article-448</guid>
                <pubDate>Sun, 10 May 2026 17:05:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-05/img-20260510-wa0021.jpg"                         length="242978"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రగిలిన కరీంనగర్ </title>
                                    <description><![CDATA[<ul>
<li>గంగుల క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత </li>
<li>ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం <br />- కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్ ధ్వంసం <br />- సంజయ్ పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తల దాడి<br />- బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులను చదరగొట్టిన పోలీసులు</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/global/tension-at-gangula-camp-office/article-446"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-05/img-20260507-wa0016.jpg" alt=""></a><br /><p>గంగుల క్యాంపు ఆఫీస్ వద్ద ఉద్రిక్తత <br />- ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం <br />- కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్ ధ్వంసం <br />- సంజయ్ పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తల దాడి<br />- బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులను చదరగొట్టిన పోలీసులు</p>
<p>అక్షరదర్బార్, కరీంనగర్: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. గంగుల క్యాంపు ఆఫీస్ ఆవరణలో ఉన్న కౌశిక్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కమలాకర్ క్యాంపు కార్యాలయంలోని ఫర్నిచర్ తో పాటు ఇతర వస్తువులను కూడా ధ్వంసం చేశారు. గంగుల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని, ఉమ్మడి గన్ కల్చర్ వ్యాపిస్తుందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నా పైనా దుండగులురెక్కి నిర్వహిస్తున్నారని, జిల్లాలో శాంతిభద్రతలపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు సమీక్ష నిర్వహించాలని అన్నారు. బండి సంజయ్ తంబాకుతో డ్రగ్స్ కలిపి తీసుకుంటున్నారని, కేటీఆర్ డ్రగ్స్ టెస్టుకు సిద్ధమని, సంజయ్ కూడా టెస్టులకు రావాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. బుఆర్ఎస్, బీజేపీ శ్రేణులు గంగుల క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే చర్యలు చేపట్టారు. బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు గంగుల క్యాంపు కార్యాలయం నుంచి భద్రత నడుమ తీసుకెళ్లారు. తనను చంపడానికే బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/global/tension-at-gangula-camp-office/article-446</link>
                <guid>https://www.aksharadarbar.com/global/tension-at-gangula-camp-office/article-446</guid>
                <pubDate>Thu, 07 May 2026 12:38:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-05/img-20260507-wa0016.jpg"                         length="60250"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>యాక్సిడెంట్ లో ఒకరి మృతి </title>
                                    <description><![CDATA[<p>- మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి.</p>
<p>- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/one-died-in-an-accident/article-443"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-05/img-20260506-wa0016.jpg" alt=""></a><br /><p>రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి</p>
<p>- మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి.</p>
<p>- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు.</p>
<p>అక్షరదర్బార్, మొగుళ్లపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన హుజురాబాద్ మండలం చిలుకూరు ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద బుధవారం సంభవించింది. హుజురాబాద్ పోలీసుల కథనం ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన కత్తి నరసయ్య గౌడ్ అనే వ్యక్తి తన సొంత వాహనంలో హుజురాబాద్ నుండి జమ్మికుంట వైపు వస్తున్న క్రమంలో చేల్పూరు ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద అతివేగంగా కారు ను  ఢీకొట్టడంతో కారు నడుపుతున్న నరసయ్య. అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న హుజురాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. రంగాపురం గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి,<img src="https://www.aksharadarbar.com/media/2026-05/img-20260506-wa00151.jpg" alt="IMG-20260506-WA0015" width="1200" height="1600"></img></p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/one-died-in-an-accident/article-443</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/one-died-in-an-accident/article-443</guid>
                <pubDate>Wed, 06 May 2026 16:13:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-05/img-20260506-wa0016.jpg"                         length="296360"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేటుగాళ్ల నల్ల దందా </title>
                                    <description><![CDATA[<p>- నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్టు<br />- 1:3 ఆశచూపి నల్ల కాగితాలతో మోసాలు<br />- కలర్ ప్రింటర్లతో రూ.100 నోట్ల ముద్రణ<br />- రూ. 28 లక్షల విలువైన సామాగ్రి, నగదు స్వాధీనం</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/the-black-danda-of-ketugala/article-432"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-05/img-20260504-wa0012.jpg" alt=""></a><br /><div>కేటుగాళ్ల నల్ల దందా </div>
<div> </div>
<div>- నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్టు</div>
<div>- 1:3 ఆశచూపి నల్ల కాగితాలతో మోసాలు</div>
<div>- కలర్ ప్రింటర్లతో రూ.100 నోట్ల ముద్రణ</div>
<div>- రూ. 28 లక్షల విలువైన సామాగ్రి, నగదు స్వాధీనం</div>
<div> </div>
<div>అక్షరదర్బార్, హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న, రసాయనాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న భారీ ముఠాను వరంగల్ టాస్క్‌ఫోర్స్, నర్సంపేట పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. మొత్తం ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిఊ వద్ద నుండి రూ.1,48,000 నగదు, రెండు కార్లు, 13 సెల్ ఫోన్లు, సుమారు రూ. 28 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలను ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ సోమవారం మీడియాకు వెల్లడించారు. నిందితులు రెండు గ్రూపులుగా విడిపోయి నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. నర్సంపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులు ల్యాప్‌టాప్, కలర్ ప్రింటర్లను ఉపయోగించి రూ.100 నోట్లను ముద్రించి మార్కెట్‌లో చలామణి చేస్తున్నారు. మిగిలిన ఐదుగురు వ్యక్తులు 1:3 నిష్పత్తిలో (ఒక్క రూపాయికి మూడు రూపాయలు) డబ్బు ఇస్తామని నమ్మిస్తారు. ఇందుకోసం వారు అసలైన రూ.500 నోటును అయోడిన్ టింక్చర్ ద్రావణంలో ముంచి నల్లగా మారుస్తారు. తిరిగి దానిపై 'హైపో' (సోడియం థయోసల్ఫేట్) పోయగానే అది పాత రూపానికి వస్తుంది. ఇది చూసి నమ్మిన బాధితులకు నల్ల కాగితాల కట్టలను ఇచ్చి, అసలు నగదుతో పరారవుతారు.</div>
<div>- నిందితుల వివరాలు</div>
<div>పోలీసుల కథనం ప్రకారం అరెస్టయిన వారిలో శాగంటి కిరణ్ (నర్సంపేట), నీరటి శివ (నర్సంపేట), నీరటి రంజిత్ (నర్సంపేట), గుడికందుల రవి (నర్సంపేట), పోరిక రాజ్‌కుమార్ @ రాజు (ఘన్‌పూర్, ములుగు), తనమాల రాజశేఖర్ (ఖమ్మం), ముదురుకోల యాకంబరం (భువనగిరి), చేను సాయికిరణ్ (కొత్తగూడెం) ఉన్నారు.</div>
<div>- పాత నేరస్థులే..</div>
<div>ఈ ముఠా గతంలో ఘన్‌పూర్, సికింద్రాబాద్ (మోండా మార్కెట్), ఖమ్మం, కొత్తగూడెం, కేయూసీ, సుబేదారీ పరిధిలో అనేక మోసాలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లు డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఛత్రినాక, నర్సంపేటలలోనూ ఇవే తరహా మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.</div>
<div>సాహసోపేతంగా ఈ ముఠాను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూధన్, నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు బాబులాల్, శ్రీనివాస్, ఇతర సిబ్బందిని పోలీస్ కమిషనర్ (సీపీ) ప్రత్యేకంగా అభినందించారు.<img src="https://www.aksharadarbar.com/media/2026-05/img-20260504-wa0012.jpg" alt="IMG-20260504-WA0012" width="1600" height="1066"></img></div>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/the-black-danda-of-ketugala/article-432</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/the-black-danda-of-ketugala/article-432</guid>
                <pubDate>Mon, 04 May 2026 17:45:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-05/img-20260504-wa0012.jpg"                         length="337357"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేటుగాళ్ల నల్ల దందా </title>
                                    <description><![CDATA[<p>- నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్టు<br />- 1:3 ఆశచూపి నల్ల కాగితాలతో మోసాలు<br />- కలర్ ప్రింటర్లతో రూ.100 నోట్ల ముద్రణ<br />- రూ. 28 లక్షల విలువైన సామాగ్రి, నగదు స్వాధీనం</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>కేటుగాళ్ల నల్ల దందా </p>
<p>- నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్టు<br />- 1:3 ఆశచూపి నల్ల కాగితాలతో మోసాలు<br />- కలర్ ప్రింటర్లతో రూ.100 నోట్ల ముద్రణ<br />- రూ. 28 లక్షల విలువైన సామాగ్రి, నగదు స్వాధీనం</p>
<p>అక్షరదర్బార్, హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న, రసాయనాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న భారీ ముఠాను వరంగల్ టాస్క్‌ఫోర్స్, నర్సంపేట పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. మొత్తం ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిఊ వద్ద నుండి రూ.1,48,000 నగదు, రెండు కార్లు, 13 సెల్ ఫోన్లు, సుమారు రూ. 28 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలను ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ సోమవారం మీడియాకు వెల్లడించారు. నిందితులు రెండు గ్రూపులుగా విడిపోయి నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. నర్సంపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులు ల్యాప్‌టాప్, కలర్ ప్రింటర్లను ఉపయోగించి రూ.100 నోట్లను ముద్రించి మార్కెట్‌లో చలామణి చేస్తున్నారు. మిగిలిన ఐదుగురు వ్యక్తులు 1:3 నిష్పత్తిలో (ఒక్క రూపాయికి మూడు రూపాయలు) డబ్బు ఇస్తామని నమ్మిస్తారు. ఇందుకోసం వారు అసలైన రూ.500 నోటును అయోడిన్ టింక్చర్ ద్రావణంలో ముంచి నల్లగా మారుస్తారు. తిరిగి దానిపై 'హైపో' (సోడియం థయోసల్ఫేట్) పోయగానే అది పాత రూపానికి వస్తుంది. ఇది చూసి నమ్మిన బాధితులకు నల్ల కాగితాల కట్టలను ఇచ్చి, అసలు నగదుతో పరారవుతారు.<br />- నిందితుల వివరాలు<br />పోలీసుల కథనం ప్రకారం అరెస్టయిన వారిలో శాగంటి కిరణ్ (నర్సంపేట), నీరటి శివ (నర్సంపేట), నీరటి రంజిత్ (నర్సంపేట), గుడికందుల రవి (నర్సంపేట), పోరిక రాజ్‌కుమార్ @ రాజు (ఘన్‌పూర్, ములుగు), తనమాల రాజశేఖర్ (ఖమ్మం), ముదురుకోల యాకంబరం (భువనగిరి), చేను సాయికిరణ్ (కొత్తగూడెం) ఉన్నారు.<br />- పాత నేరస్థులే..<br />ఈ ముఠా గతంలో ఘన్‌పూర్, సికింద్రాబాద్ (మోండా మార్కెట్), ఖమ్మం, కొత్తగూడెం, కేయూసీ, సుబేదారీ పరిధిలో అనేక మోసాలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లు డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఛత్రినాక, నర్సంపేటలలోనూ ఇవే తరహా మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.<br />సాహసోపేతంగా ఈ ముఠాను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూధన్, నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు బాబులాల్, శ్రీనివాస్, ఇతర సిబ్బందిని పోలీస్ కమిషనర్ (సీపీ) ప్రత్యేకంగా అభినందించారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/the-black-danda-of-ketugala/article-431</link>
                <guid>https://www.aksharadarbar.com/the-black-danda-of-ketugala/article-431</guid>
                <pubDate>Mon, 04 May 2026 17:41:28 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జ్యువెలరీ షాపులో కాల్పులు</title>
                                    <description><![CDATA[<p>- కస్టమర్స్ లా షాప్ లోకి ప్రవేశించిన ఐదుగురు దుండగులు <br />- జ్యువెలరీ చూపించిన షాపులోని సిబ్బందిపై కాల్పులు <br />- సిబ్బందిని కట్టేసి నగలను పట్టుకెళ్ళిన దుండగులు<br />- కాల్పుల్లో ముగ్గురికి గాయాలు.. ఆసుపత్రికి తరలింపు<br />- కరీంనగర్ లో కలకలం రేపిన దోపిడి </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/firing-in-jewelery-shop/article-421"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-05/360_f_686082852_saeqr0eeqewbmv61hsysnphopczvhxts.webp" alt=""></a><br /><p>జ్యువెలరీ షాపులో కాల్పులు<br />- కస్టమర్స్ లా షాప్ లోకి ప్రవేశించిన ఐదుగురు దుండగులు <br />- జ్యువెలరీ చూపించిన షాపులోని సిబ్బందిపై కాల్పులు <br />- సిబ్బందిని కట్టేసి నగలను పట్టుకెళ్ళిన దుండగులు<br />- కాల్పుల్లో ముగ్గురికి గాయాలు.. ఆసుపత్రికి తరలింపు<br />- కరీంనగర్ లో కలకలం రేపిన దోపిడి </p>
<p>అక్షరదర్బార్, కరీంనగర్</p>
<p>కరీంనగర్ నగరంలో ఈరోజు ఉదయం సుమారు 11 గంటల సమయంలో జరిగిన సాయుధ దోపిడీ ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. కరీంనగర్ లోని పీఎంజే జ్యువెలరీ షాప్ కు దుండగులు బైక్ పై వచ్చారు. కస్టమర్సులా ఐదుగురు జ్యువెలరీ షాపులోకి ప్రవేశించారు. సిబ్బందిని జ్యువెలరీ చూపాలని అడిగారు. దీంతో షాపులోని సిబ్బంది జ్యువెలరీ చూపించారు. ఈ క్రమంలో గన్ తో షాపులోని సిబ్బందిని బెదిరించారు. తర్వాత సిబ్బంది కట్టేశారు. జ్యువెలరీ చూపించిన సిబ్బందిపై కాల్పులు జరిపి ఆ సిబ్బంది తమకు చూపించిన నగలను పట్టుకెళ్లారు. దుండగుల కాల్పుల్లో షాపులోని ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందగానే పీఎంజే జ్యువెలరీ షాప్ వద్దకు చేరుకున్న పోలీసులు జరిగిన ఘటనపై సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.<br />- తనిఖీలు <br />నిందితులు తప్పించుకోకుండా నగరం అంతటా పోలీసులు నాకాబందీ నిర్వహించి, వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఘటనస్థలిలో బుల్లెట్లను గుర్తించారు. జువెలరీ షాప్ సమీపంలోని డ్రైనేజీలో కత్తెర, ప్లాస్టర్, తుపాకి మ్యాగ్జిన్ కనుగొన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఘటన స్థలం వద్దకు చేరుకుని విచారణ జరుపుతున్నారు. నగరం నడిబొడ్డున, అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి సాహసోపేత దోపిడీ జరగడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. డ్రైనేజీలో కత్తెర ప్లాస్టరు ఘటనస్థలిలో బుల్లెట్లను పోలీసులు గుర్తించారు పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/firing-in-jewelery-shop/article-421</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/firing-in-jewelery-shop/article-421</guid>
                <pubDate>Sun, 03 May 2026 13:09:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-05/360_f_686082852_saeqr0eeqewbmv61hsysnphopczvhxts.webp"                         length="17570"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం</title>
                                    <description><![CDATA[<ul>
<li>ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకున్న డ్రైవర్</li>
<li>వరంగల్ జిల్లా నర్సంపేట బస్ స్టేషన్ వద్ద ఘటన</li>
<li>సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆత్మహత్యాయత్నం</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/rtc-driver-suicide-attempt/article-417"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260423-wa0009.jpg" alt=""></a><br /><p>ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్<br /> ఆత్మహత్యాయత్నం!<br />-నర్సంపేట డిపో వద్ద ఉద్రిక్తత.<br />-రంగంలో దిగిన పోలీసులు.<br />అక్షరదర్బార్ ,నర్సంపేట; వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు గత రెండు రోజుల నుండి చేపట్టిన నిరసన ప్రదర్శన ఒక్కసారిగా నర్సంపేట డిపో వద్ద హింసాత్మకంగా మారింది. ఆర్టీసీ యాజమాన్యం మరియు అధికారుల మొండి వైఖరిని నిరసిస్తూ నర్సంపేట డిపోకు చెందిన శంకర్ గౌడ్ అనే డ్రైవర్ అందరూ చూస్తుండగానే తన ఒంటికి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం కలకలం రేపింది. గురువారం తమ డిమాండ్ల సాధన కోసం నర్సంపేట డిపో కార్మికులు సమ్మె చేప‌ట్టారు. ఇందులో భాగంగా  డిపో గేటు ముందు భారీ ధర్నా చేపట్టారు. నిరసన హోరెత్తుతున్న సమయంలో, తీవ్ర మనస్తాపానికి గురైన డ్రైవర్ శంకర్ గౌడ్ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. క్షణాల్లో మంటలు చెలరేగడంతో తోటి కార్మికులు హతాశులయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పివేసి, బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన కార్మికులు యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరసనకారులను నిలువరిస్తున్నారు. ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాయపడిన శంకర్ గౌడ్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.  అధికారుల వేధింపులు మరియు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ అఘాయిత్యం జరిగిందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/rtc-driver-suicide-attempt/article-417</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/rtc-driver-suicide-attempt/article-417</guid>
                <pubDate>Thu, 23 Apr 2026 16:29:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260423-wa0009.jpg"                         length="78397"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లిఫ్ట్ ఇచ్చి మహిళపై అఘాయిత్యం </title>
                                    <description><![CDATA[<p>- అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్<br />- దొంగిలించిన బైక్‌పై వచ్చి ఘాతుకం.. <br />- చురుగ్గా వ్యవహరించి పట్టుకున్న పోలీసులు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/violence-against-woman-by-giving-lift/article-416"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260423-wa0006.jpg" alt=""></a><br /><p>లిఫ్ట్ ఇచ్చి మహిళపై అఘాయిత్యం<br />- అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్<br />- దొంగిలించిన బైక్‌పై వచ్చి ఘాతుకం.. <br />- చురుగ్గా వ్యవహరించి పట్టుకున్న పోలీసులు</p>
<p>అక్షరదర్బార్, టేకుమట్ల: లిఫ్ట్ ఇచ్చే నెపంతో మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, ఆమెపై దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడిన కిరాతకుడిని భూపాలపల్లి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి దొంగిలించిన మోటార్ సైకిల్, బాధితురాలి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఘటన వివరాలను చిట్యాల సీఐ మల్లేష్ గురువారం మీడియాకు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కుషీనగర్ జిల్లాకు చెందిన అమర్జిత్ సింగ్ (33) వరికోత యంత్ర డ్రైవర్‌గా పనిచేస్తూ వివిధ ప్రాంతాల్లో సంచరిస్తుంటాడు. ఈ నెల 18న కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మద్యం సేవించిన నిందితుడు, అక్కడ నిలిపి ఉంచిన ఒక బైక్‌ను దొంగిలించి భూపాలపల్లి జిల్లా వైపు బయలుదేరాడు. అదే రోజు రాత్రి 7:30 గంటల సమయంలో భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రాఘవరెడ్డిపేట సెంటర్ వద్ద ఓ మహిళ లిఫ్ట్ కోసం ఎదురుచూస్తుండగా, ఆమెను తన బండిపై ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో ఆరేపల్లి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో బైక్ ఆపి, ఆమెను పొదల్లోకి ఈడ్చుకెళ్లి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించగా, బాధితురాలు గట్టిగా ప్రతిఘటించడంతో ఆమె బ్యాగ్‌ను లాక్కుని పరారయ్యాడు.<br />- నిందితుడి పట్టివేత<br />బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, డీఎస్పీ సంపత్ రావు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం చిట్యాల పరిధిలోని కైలాపూర్ సబ్ స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, పారిపోవడానికి ప్రయత్నించిన అమర్జిత్ సింగ్‌ను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన టేకుమట్ల ఎస్ఐ అమూల్య, సిబ్బంది మహేందర్, రామకృష్ణలను జిల్లా ఎస్పీ అభినందించారు. "మహిళా భద్రత మా ప్రథమ ప్రాధాన్యం. అపరిచిత వ్యక్తులను నమ్మి వాహనాలు ఎక్కవద్దు. ప్రయాణాల్లో సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలి. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై ఉక్కుపాదం మోపుతాం." అని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/violence-against-woman-by-giving-lift/article-416</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/violence-against-woman-by-giving-lift/article-416</guid>
                <pubDate>Thu, 23 Apr 2026 15:38:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260423-wa0006.jpg"                         length="154904"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భారీగా 'హాష్ ఆయిల్' పట్టివేత</title>
                                    <description><![CDATA[<p>- నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు<br />- రూ. 2.50 కోట్ల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్ స్వాధీనం<br />- నిందితులు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు <br />- వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడి</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/heavy-hash-oil-seizure/article-412"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260421-wa0001.jpg" alt=""></a><br /><p>భారీగా ‘హాష్ ఆయిల్’ పట్టివేత <br />- నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు<br />- రూ. 2.50 కోట్ల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్ స్వాధీనం<br />- నిందితులు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు <br />- వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడి</p>
<p>అక్షరదర్బార్, హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఖరీదైన ‘హాష్ ఆయిల్’ (గంజాయి నూనె) స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలోని నలుగురు సభ్యులను వరంగల్ డ్రగ్ కంట్రోల్, క్యాట్ పార్టీ, ఇంతేజార్‌గంజ్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.2 కోట్ల 50 లక్షల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్‌తో పాటు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.<br />- నిందితుల వివరాలు<br />పోలీసుల కథనం ప్రకారం అరెస్టు అయిన వారిలో..<br /> 1. హంటల్ సన్ను (23) - ఒడిశా<br /> 2. హంటల్ సన్యాసి (23) - ఒడిశా<br /> 3. కండెల చిన్నబాబు (56) - ఆంధ్రప్రదేశ్ (అల్లూరి జిల్లా)<br /> 4. కృష్ణ హంటల్ (56) - ఒడిశా<br />   ఈ కేసులో మరో నిందితుడు కిలో పాండు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.<br />- నేపథ్యం అరెస్టు జరిగిన తీరు<br />వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు హంటల్ సన్ను తన గ్రామంలో గంజాయి మొక్కలను పెంచేవాడు. కేవలం గంజాయి అమ్మితే వచ్చే డబ్బు జల్సాలకు సరిపోకపోవడంతో, పరారీలో ఉన్న కిలో పాండు అనే వ్యక్తి సలహాతో గంజాయి మొక్కల నుండి ‘హాష్ ఆయిల్’ తయారు చేయడం ప్రారంభించారు. సుమారు 40 కిలోల ఆయిల్‌ను సేకరించగా, అందులో 20 కిలోల ఆయిల్‌ను ఐదు కిలోల చొప్పున ప్యాక్ చేసి ముంబాయిలో విక్రయించేందుకు నిందితులు ప్లాన్ చేశారు.<br />ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్‌లోని తుని రైల్వే స్టేషన్ నుండి కోనార్క్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన ఈ ముఠా, వరంగల్ రైల్వే స్టేషన్‌లో పోలీసుల తనిఖీలు ఉంటాయన్న అనుమానంతో ఇక్కడే దిగిపోయారు. మంగళవారం ఉదయం ముంబాయి వెళ్లేందుకు వరంగల్ బస్టాండ్ సమీపంలోని రైల్వే గూడ్స్ షెడ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా, పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు.<br />- పోలీసు బృందానికి అభినందనలు<br />భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత, వరంగల్ ఏఎప్పీ శుభం, ఏసిపిలు జితేందర్ రెడ్డి, జానీ నర్సింహులు, డ్రగ్ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ సతీష్, ఇంతేజార్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ షూకూర్, వారి బృందాన్ని పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/heavy-hash-oil-seizure/article-412</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/heavy-hash-oil-seizure/article-412</guid>
                <pubDate>Tue, 21 Apr 2026 12:50:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260421-wa0001.jpg"                         length="137104"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దోషులను వదిలే ప్రసక్తే లేదు </title>
                                    <description><![CDATA[<p>- కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది? <br />- సీఎం రేవంత్ రెడ్డి నిలదీత"<br />- లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వని కాళేశ్వరం.. రిపేర్లు చేసి తీరుతామని ధీమా</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/global/there-is-no-question-of-letting-the-guilty-go/article-411"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260420-wa0016.jpg" alt=""></a><br /><p>దోషులను వదిలే ప్రసక్తే లేదు<br />- కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది? <br />- సీఎం రేవంత్ రెడ్డి నిలదీత"<br />- లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వని కాళేశ్వరం.. రిపేర్లు చేసి తీరుతామని ధీమా</p>
<p>అక్షరదర్బార్, మహదేవపూర్</p>
<p>కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడిందని, ఈ కుంభకోణంలో దోషులు ఎంతటి వారైనా శిక్షించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన మొదట మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని రూ.198 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి అధికారులతో సమీక్ష జరిపిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ నుంచి మేడిగడ్డ కుప్పకూలే వరకు జరిగిన పరిణామాలపై అగ్నిపరీక్ష లాంటి విమర్శలు చేశారు. 1975లో జలగం వెంగళరావు హయాంలోనే గోదావరి జలాల వినియోగంపై మహారాష్ట్రతో ఒప్పందం జరిగిందని రేవంత్ గుర్తు చేశారు. 2009లో వైఎస్సార్ హయాంలో రూ.38,063 కోట్లతో మొదలైన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును, కేసీఆర్ ప్రభుత్వం కేవలం ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం 'కాళేశ్వరం'గా రీడిజైన్ చేసిందని మండిపడ్డారు. అంచనాలను ఏకంగా రూ.1.50 లక్షల కోట్లకు పెంచి, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. "2018 ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు అద్భుతమంటూ భ్రమలు కల్పించారు. కానీ 2023లో మేడిగడ్డ కుప్పకూలడంతో వీరి పాపం పండింది. ఎన్నికల కోసమే నిజాలను దాచాలని చూసినా, ప్రకృతి వాస్తవాలను బయటపెట్టింది" అని సీఎం అన్నారు. నవంబర్ 2023లో ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చినప్పటికీ, కేసీఆర్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు.<br />- హరీశ్ రావు ఢిల్లీ పర్యటనపై అనుమానాలు<br />మాజీ మంత్రి హరీశ్ రావు రహస్యంగా ఢిల్లీ పర్యటించడంపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "విచారణ నుంచి తప్పించుకోవడానికి బీజేపీ నేతల కాళ్లు పట్టుకోవడానికే హరీశ్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఎవరెవరిని కలిశారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. న్యాయవాదులను కలవాల్సిన అవసరం ఏముంది?" అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీలు లోపాయికారీ ఒప్పందంతో ఉన్నాయని, అందుకే తాము పదే పదే లేఖలు రాసినా సీబీఐ విచారణపై కేంద్రం స్పందించడం లేదని విమర్శించారు.<br />- ప్రాజెక్టుకు రిపేర్లు.. రైతులకు నీరు<br />కాళేశ్వరం ద్వారా ఇప్పటివరకు కనీసం లక్ష ఎకరాలకు కూడా కొత్తగా నీరు ఇవ్వలేకపోయారని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. నిజానికి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వల్లే రాష్ట్రంలో పంటలు పండుతున్నాయని, అది హరీశ్ రావుకు రాజకీయం తెలియకముందే ఉందన్నారు. ప్రభుత్వం త్వరలోనే నిపుణుల సలహాతో కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు చేయించి రైతులకు నీరందిస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్ర మంత్రులు  ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డి శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ వంశీకృష్ణ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/global/there-is-no-question-of-letting-the-guilty-go/article-411</link>
                <guid>https://www.aksharadarbar.com/global/there-is-no-question-of-letting-the-guilty-go/article-411</guid>
                <pubDate>Mon, 20 Apr 2026 20:07:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260420-wa0016.jpg"                         length="1437845"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>4.45 గంటల పర్యటన </title>
                                    <description><![CDATA[<p><br />- మధ్యాహ్నం 3 మూడు గంటలకు కాళేశ్వరం చేరుకోనున్న సీఎం <br />- శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం అనంతరం మేడిగడ్డకు <br />- సాయంత్రం 6.30 గంటలకు నస్తురుపల్లి వద్ద సభలో రైతు భరోసా నిధుల విడుదల</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/global/445-hours-of-travel/article-409"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260419-wa0012.jpg" alt=""></a><br /><p>4.45 గంటల పర్యటన <br />- మధ్యాహ్నం 3 మూడు గంటలకు కాళేశ్వరం చేరుకోనున్న సీఎం <br />- శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం అనంతరం మేడిగడ్డకు <br />- సాయంత్రం 6.30 గంటలకు నస్తురుపల్లి వద్ద సభలో రైతు భరోసా నిధుల విడుదల</p>
<p>అక్షరదర్బార్, కాటారం: రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి 20వ తేదీ సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన జిల్లాలో 4.45 గంటల పాటు కొనసాగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లాలోని కాళేశ్వరం చేరుకునే సీఎం రేవంత్ రెడ్డి కాటారం మండలంలోని మస్తురిపల్లి వద్ద జరిగే బహిరంగ సభ ముగిసిన తర్వాత రాత్రి 7:45 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన షెడ్యూల్ ఆదివారం విడుదలైంది. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి..</p>
<p>మధ్యాహ్నం 1.45 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తమ నివాసం నుంచి బయలుదేరి 2.00 గంటలకు బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 3.00 గంటలకు కాళేశ్వరం ఆలయానికి చేరుకుంటారు.<br />3.05 నుండి 3.25 గంటల మధ్య శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం చేసి, ఆలయంలో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.<br />3.30 గంటలకు కాళేశ్వరం నుంచి బయలుదేరి 3.45 గంటలకు మహాదేవపూర్ మండలం మేడిగడ్డకు చేరుకుంటారు. అక్కడ 3.45 నుండి 4.30 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతాన్ని పరిశీలిస్తారు.<br />4.35 నుండి 5.30 గంటల వరకు అంబట్‌పల్లి గెస్ట్ హౌస్‌లో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం 5.35 నుండి 6.00 గంటల వరకు మీడియా సమావేశంలో పాల్గొంటారు.<br />6.00 గంటలకు మేడిగడ్డ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 6.30 గంటలకు కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ 6.30 నుండి 7.45 గంటల వరకు  రైతు భరోసా పథకం రెండో విడత నిధులను విడుదల చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ ముగిసిన తర్వాత రాత్రి 7.45 గంటలకు నస్తూరుపల్లి నుంచి బయలుదేరి రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుంటారు.<img src="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260419-wa0008.jpg" alt="IMG-20260419-WA0008" width="733" height="1447"></img></p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/global/445-hours-of-travel/article-409</link>
                <guid>https://www.aksharadarbar.com/global/445-hours-of-travel/article-409</guid>
                <pubDate>Sun, 19 Apr 2026 21:17:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260419-wa0012.jpg"                         length="71106"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        