<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.aksharadarbar.com/rajeshwer/author-5" rel="self" type="application/rss+xml" />
                <generator>అక్షర దర్బార్ RSS Feed Generator</generator>
                <title>RV - అక్షర దర్బార్</title>
                <link>https://www.aksharadarbar.com/author/5/rss</link>
                <description>RV RSS Feed</description>
                
                            <item>
                <title>ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం</title>
                                    <description><![CDATA[<ul>
<li>ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకున్న డ్రైవర్</li>
<li>వరంగల్ జిల్లా నర్సంపేట బస్ స్టేషన్ వద్ద ఘటన</li>
<li>సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆత్మహత్యాయత్నం</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/rtc-driver-suicide-attempt/article-417"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260423-wa0009.jpg" alt=""></a><br /><p>ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్<br /> ఆత్మహత్యాయత్నం!<br />-నర్సంపేట డిపో వద్ద ఉద్రిక్తత.<br />-రంగంలో దిగిన పోలీసులు.<br />అక్షరదర్బార్ ,నర్సంపేట; వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు గత రెండు రోజుల నుండి చేపట్టిన నిరసన ప్రదర్శన ఒక్కసారిగా నర్సంపేట డిపో వద్ద హింసాత్మకంగా మారింది. ఆర్టీసీ యాజమాన్యం మరియు అధికారుల మొండి వైఖరిని నిరసిస్తూ నర్సంపేట డిపోకు చెందిన శంకర్ గౌడ్ అనే డ్రైవర్ అందరూ చూస్తుండగానే తన ఒంటికి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం కలకలం రేపింది. గురువారం తమ డిమాండ్ల సాధన కోసం నర్సంపేట డిపో కార్మికులు సమ్మె చేప‌ట్టారు. ఇందులో భాగంగా  డిపో గేటు ముందు భారీ ధర్నా చేపట్టారు. నిరసన హోరెత్తుతున్న సమయంలో, తీవ్ర మనస్తాపానికి గురైన డ్రైవర్ శంకర్ గౌడ్ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. క్షణాల్లో మంటలు చెలరేగడంతో తోటి కార్మికులు హతాశులయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పివేసి, బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన కార్మికులు యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరసనకారులను నిలువరిస్తున్నారు. ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాయపడిన శంకర్ గౌడ్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.  అధికారుల వేధింపులు మరియు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ అఘాయిత్యం జరిగిందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/rtc-driver-suicide-attempt/article-417</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/rtc-driver-suicide-attempt/article-417</guid>
                <pubDate>Thu, 23 Apr 2026 16:29:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260423-wa0009.jpg"                         length="78397"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లిఫ్ట్ ఇచ్చి మహిళపై అఘాయిత్యం </title>
                                    <description><![CDATA[<p>- అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్<br />- దొంగిలించిన బైక్‌పై వచ్చి ఘాతుకం.. <br />- చురుగ్గా వ్యవహరించి పట్టుకున్న పోలీసులు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/violence-against-woman-by-giving-lift/article-416"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260423-wa0006.jpg" alt=""></a><br /><p>లిఫ్ట్ ఇచ్చి మహిళపై అఘాయిత్యం<br />- అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్<br />- దొంగిలించిన బైక్‌పై వచ్చి ఘాతుకం.. <br />- చురుగ్గా వ్యవహరించి పట్టుకున్న పోలీసులు</p>
<p>అక్షరదర్బార్, టేకుమట్ల: లిఫ్ట్ ఇచ్చే నెపంతో మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, ఆమెపై దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడిన కిరాతకుడిని భూపాలపల్లి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి దొంగిలించిన మోటార్ సైకిల్, బాధితురాలి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఘటన వివరాలను చిట్యాల సీఐ మల్లేష్ గురువారం మీడియాకు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కుషీనగర్ జిల్లాకు చెందిన అమర్జిత్ సింగ్ (33) వరికోత యంత్ర డ్రైవర్‌గా పనిచేస్తూ వివిధ ప్రాంతాల్లో సంచరిస్తుంటాడు. ఈ నెల 18న కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మద్యం సేవించిన నిందితుడు, అక్కడ నిలిపి ఉంచిన ఒక బైక్‌ను దొంగిలించి భూపాలపల్లి జిల్లా వైపు బయలుదేరాడు. అదే రోజు రాత్రి 7:30 గంటల సమయంలో భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రాఘవరెడ్డిపేట సెంటర్ వద్ద ఓ మహిళ లిఫ్ట్ కోసం ఎదురుచూస్తుండగా, ఆమెను తన బండిపై ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో ఆరేపల్లి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో బైక్ ఆపి, ఆమెను పొదల్లోకి ఈడ్చుకెళ్లి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించగా, బాధితురాలు గట్టిగా ప్రతిఘటించడంతో ఆమె బ్యాగ్‌ను లాక్కుని పరారయ్యాడు.<br />- నిందితుడి పట్టివేత<br />బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, డీఎస్పీ సంపత్ రావు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం చిట్యాల పరిధిలోని కైలాపూర్ సబ్ స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, పారిపోవడానికి ప్రయత్నించిన అమర్జిత్ సింగ్‌ను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన టేకుమట్ల ఎస్ఐ అమూల్య, సిబ్బంది మహేందర్, రామకృష్ణలను జిల్లా ఎస్పీ అభినందించారు. "మహిళా భద్రత మా ప్రథమ ప్రాధాన్యం. అపరిచిత వ్యక్తులను నమ్మి వాహనాలు ఎక్కవద్దు. ప్రయాణాల్లో సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలి. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై ఉక్కుపాదం మోపుతాం." అని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/violence-against-woman-by-giving-lift/article-416</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/violence-against-woman-by-giving-lift/article-416</guid>
                <pubDate>Thu, 23 Apr 2026 15:38:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260423-wa0006.jpg"                         length="154904"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భారీగా 'హాష్ ఆయిల్' పట్టివేత</title>
                                    <description><![CDATA[<p>- నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు<br />- రూ. 2.50 కోట్ల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్ స్వాధీనం<br />- నిందితులు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు <br />- వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడి</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/heavy-hash-oil-seizure/article-412"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260421-wa0001.jpg" alt=""></a><br /><p>భారీగా ‘హాష్ ఆయిల్’ పట్టివేత <br />- నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు<br />- రూ. 2.50 కోట్ల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్ స్వాధీనం<br />- నిందితులు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు <br />- వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడి</p>
<p>అక్షరదర్బార్, హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఖరీదైన ‘హాష్ ఆయిల్’ (గంజాయి నూనె) స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలోని నలుగురు సభ్యులను వరంగల్ డ్రగ్ కంట్రోల్, క్యాట్ పార్టీ, ఇంతేజార్‌గంజ్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.2 కోట్ల 50 లక్షల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్‌తో పాటు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.<br />- నిందితుల వివరాలు<br />పోలీసుల కథనం ప్రకారం అరెస్టు అయిన వారిలో..<br /> 1. హంటల్ సన్ను (23) - ఒడిశా<br /> 2. హంటల్ సన్యాసి (23) - ఒడిశా<br /> 3. కండెల చిన్నబాబు (56) - ఆంధ్రప్రదేశ్ (అల్లూరి జిల్లా)<br /> 4. కృష్ణ హంటల్ (56) - ఒడిశా<br />   ఈ కేసులో మరో నిందితుడు కిలో పాండు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.<br />- నేపథ్యం అరెస్టు జరిగిన తీరు<br />వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు హంటల్ సన్ను తన గ్రామంలో గంజాయి మొక్కలను పెంచేవాడు. కేవలం గంజాయి అమ్మితే వచ్చే డబ్బు జల్సాలకు సరిపోకపోవడంతో, పరారీలో ఉన్న కిలో పాండు అనే వ్యక్తి సలహాతో గంజాయి మొక్కల నుండి ‘హాష్ ఆయిల్’ తయారు చేయడం ప్రారంభించారు. సుమారు 40 కిలోల ఆయిల్‌ను సేకరించగా, అందులో 20 కిలోల ఆయిల్‌ను ఐదు కిలోల చొప్పున ప్యాక్ చేసి ముంబాయిలో విక్రయించేందుకు నిందితులు ప్లాన్ చేశారు.<br />ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్‌లోని తుని రైల్వే స్టేషన్ నుండి కోనార్క్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన ఈ ముఠా, వరంగల్ రైల్వే స్టేషన్‌లో పోలీసుల తనిఖీలు ఉంటాయన్న అనుమానంతో ఇక్కడే దిగిపోయారు. మంగళవారం ఉదయం ముంబాయి వెళ్లేందుకు వరంగల్ బస్టాండ్ సమీపంలోని రైల్వే గూడ్స్ షెడ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా, పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు.<br />- పోలీసు బృందానికి అభినందనలు<br />భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత, వరంగల్ ఏఎప్పీ శుభం, ఏసిపిలు జితేందర్ రెడ్డి, జానీ నర్సింహులు, డ్రగ్ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ సతీష్, ఇంతేజార్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ షూకూర్, వారి బృందాన్ని పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/heavy-hash-oil-seizure/article-412</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/heavy-hash-oil-seizure/article-412</guid>
                <pubDate>Tue, 21 Apr 2026 12:50:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260421-wa0001.jpg"                         length="137104"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దోషులను వదిలే ప్రసక్తే లేదు </title>
                                    <description><![CDATA[<p>- కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది? <br />- సీఎం రేవంత్ రెడ్డి నిలదీత"<br />- లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వని కాళేశ్వరం.. రిపేర్లు చేసి తీరుతామని ధీమా</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/global/there-is-no-question-of-letting-the-guilty-go/article-411"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260420-wa0016.jpg" alt=""></a><br /><p>దోషులను వదిలే ప్రసక్తే లేదు<br />- కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది? <br />- సీఎం రేవంత్ రెడ్డి నిలదీత"<br />- లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వని కాళేశ్వరం.. రిపేర్లు చేసి తీరుతామని ధీమా</p>
<p>అక్షరదర్బార్, మహదేవపూర్</p>
<p>కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడిందని, ఈ కుంభకోణంలో దోషులు ఎంతటి వారైనా శిక్షించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన మొదట మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని రూ.198 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి అధికారులతో సమీక్ష జరిపిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ నుంచి మేడిగడ్డ కుప్పకూలే వరకు జరిగిన పరిణామాలపై అగ్నిపరీక్ష లాంటి విమర్శలు చేశారు. 1975లో జలగం వెంగళరావు హయాంలోనే గోదావరి జలాల వినియోగంపై మహారాష్ట్రతో ఒప్పందం జరిగిందని రేవంత్ గుర్తు చేశారు. 2009లో వైఎస్సార్ హయాంలో రూ.38,063 కోట్లతో మొదలైన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును, కేసీఆర్ ప్రభుత్వం కేవలం ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం 'కాళేశ్వరం'గా రీడిజైన్ చేసిందని మండిపడ్డారు. అంచనాలను ఏకంగా రూ.1.50 లక్షల కోట్లకు పెంచి, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. "2018 ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు అద్భుతమంటూ భ్రమలు కల్పించారు. కానీ 2023లో మేడిగడ్డ కుప్పకూలడంతో వీరి పాపం పండింది. ఎన్నికల కోసమే నిజాలను దాచాలని చూసినా, ప్రకృతి వాస్తవాలను బయటపెట్టింది" అని సీఎం అన్నారు. నవంబర్ 2023లో ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చినప్పటికీ, కేసీఆర్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు.<br />- హరీశ్ రావు ఢిల్లీ పర్యటనపై అనుమానాలు<br />మాజీ మంత్రి హరీశ్ రావు రహస్యంగా ఢిల్లీ పర్యటించడంపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "విచారణ నుంచి తప్పించుకోవడానికి బీజేపీ నేతల కాళ్లు పట్టుకోవడానికే హరీశ్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఎవరెవరిని కలిశారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. న్యాయవాదులను కలవాల్సిన అవసరం ఏముంది?" అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీలు లోపాయికారీ ఒప్పందంతో ఉన్నాయని, అందుకే తాము పదే పదే లేఖలు రాసినా సీబీఐ విచారణపై కేంద్రం స్పందించడం లేదని విమర్శించారు.<br />- ప్రాజెక్టుకు రిపేర్లు.. రైతులకు నీరు<br />కాళేశ్వరం ద్వారా ఇప్పటివరకు కనీసం లక్ష ఎకరాలకు కూడా కొత్తగా నీరు ఇవ్వలేకపోయారని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. నిజానికి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వల్లే రాష్ట్రంలో పంటలు పండుతున్నాయని, అది హరీశ్ రావుకు రాజకీయం తెలియకముందే ఉందన్నారు. ప్రభుత్వం త్వరలోనే నిపుణుల సలహాతో కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు చేయించి రైతులకు నీరందిస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్ర మంత్రులు  ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డి శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ వంశీకృష్ణ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/global/there-is-no-question-of-letting-the-guilty-go/article-411</link>
                <guid>https://www.aksharadarbar.com/global/there-is-no-question-of-letting-the-guilty-go/article-411</guid>
                <pubDate>Mon, 20 Apr 2026 20:07:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260420-wa0016.jpg"                         length="1437845"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>4.45 గంటల పర్యటన </title>
                                    <description><![CDATA[<p><br />- మధ్యాహ్నం 3 మూడు గంటలకు కాళేశ్వరం చేరుకోనున్న సీఎం <br />- శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం అనంతరం మేడిగడ్డకు <br />- సాయంత్రం 6.30 గంటలకు నస్తురుపల్లి వద్ద సభలో రైతు భరోసా నిధుల విడుదల</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/global/445-hours-of-travel/article-409"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260419-wa0012.jpg" alt=""></a><br /><p>4.45 గంటల పర్యటన <br />- మధ్యాహ్నం 3 మూడు గంటలకు కాళేశ్వరం చేరుకోనున్న సీఎం <br />- శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం అనంతరం మేడిగడ్డకు <br />- సాయంత్రం 6.30 గంటలకు నస్తురుపల్లి వద్ద సభలో రైతు భరోసా నిధుల విడుదల</p>
<p>అక్షరదర్బార్, కాటారం: రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి 20వ తేదీ సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన జిల్లాలో 4.45 గంటల పాటు కొనసాగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లాలోని కాళేశ్వరం చేరుకునే సీఎం రేవంత్ రెడ్డి కాటారం మండలంలోని మస్తురిపల్లి వద్ద జరిగే బహిరంగ సభ ముగిసిన తర్వాత రాత్రి 7:45 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన షెడ్యూల్ ఆదివారం విడుదలైంది. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి..</p>
<p>మధ్యాహ్నం 1.45 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తమ నివాసం నుంచి బయలుదేరి 2.00 గంటలకు బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 3.00 గంటలకు కాళేశ్వరం ఆలయానికి చేరుకుంటారు.<br />3.05 నుండి 3.25 గంటల మధ్య శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం చేసి, ఆలయంలో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.<br />3.30 గంటలకు కాళేశ్వరం నుంచి బయలుదేరి 3.45 గంటలకు మహాదేవపూర్ మండలం మేడిగడ్డకు చేరుకుంటారు. అక్కడ 3.45 నుండి 4.30 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతాన్ని పరిశీలిస్తారు.<br />4.35 నుండి 5.30 గంటల వరకు అంబట్‌పల్లి గెస్ట్ హౌస్‌లో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం 5.35 నుండి 6.00 గంటల వరకు మీడియా సమావేశంలో పాల్గొంటారు.<br />6.00 గంటలకు మేడిగడ్డ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 6.30 గంటలకు కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ 6.30 నుండి 7.45 గంటల వరకు  రైతు భరోసా పథకం రెండో విడత నిధులను విడుదల చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ ముగిసిన తర్వాత రాత్రి 7.45 గంటలకు నస్తూరుపల్లి నుంచి బయలుదేరి రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుంటారు.<img src="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260419-wa0008.jpg" alt="IMG-20260419-WA0008" width="733" height="1447"></img></p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/global/445-hours-of-travel/article-409</link>
                <guid>https://www.aksharadarbar.com/global/445-hours-of-travel/article-409</guid>
                <pubDate>Sun, 19 Apr 2026 21:17:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260419-wa0012.jpg"                         length="71106"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు</title>
                                    <description><![CDATA[<p>- ఐదుగురి అరెస్ట్, రూ.లక్షకుపైగా నగదు సీజ్<br />- ముగ్గురు పరారీ </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/ipl-betting-gang-gutturattu/article-406"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260418-wa0013.jpg" alt=""></a><br /><p>ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు<br />- ఐదుగురి అరెస్ట్, రూ.లక్షకుపైగా నగదు సీజ్<br />- ముగ్గురు పరారీ </p>
<p>అక్షరదర్బార్, వరంగల్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో సాగుతున్న ఆన్‌లైన్ బెట్టింగ్‌లపై వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఒక నిర్వాహకుడితో పాటు నలుగురు పందెం రాయుళ్లను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఏ. మధుసూదన్ నేతృత్వంలోని బృందం దాడులు నిర్వహించింది. *Cricxbet.99.win* మరియు *Bsf2020.com* వంటి వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక నిర్వాహకుడు, 4 గురు పందెం రాయుళ్లు మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు. ముగ్గురు పరారీలో ఉన్నారు. రూ.1,02,000 నగదు, 5 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.<br />- అరెస్టయిన నిందితుల వివరాలు<br />నిర్వాహకుడు తాడెం భరత్  వరంగల్ మధ్యకోట నివాసి. ఇతను ప్రధానంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లౌడ్యా వెంకన్నది వరంగల్ ఎస్.ఆర్ నగర్. పైడి శ్రీధర్ వరంగల్ కొత్థవాడ వాసి.‌ వంగ రమేష్ ది వరంగల్ కరీమాబాద్.ములుక శ్రీనివాస్ ది వరంగల్ ఎస్.ఆర్.ఆర్ తోట. ఈ కేసులో సంతోష్ కుమార్ (హన్మకొండ), పూల శ్రీకాంత్ (శంభునిపేట), రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్‌కు చెందిన మరో నిర్వాహకుడు రావుల దిలీప్ కుమార్ పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.<br />- పోలీసుల హెచ్చరిక<br />పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదు, ఫోన్లను తదుపరి చర్యల నిమిత్తం మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఏ. మధుసూదన్, ఇన్ స్పెక్టర్ సర్ల రాజు, ఆర్.ఎస్.ఐ భాను ప్రకాష్, సిబ్బంది పాల్గొన్నారు. యువత క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/ipl-betting-gang-gutturattu/article-406</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/ipl-betting-gang-gutturattu/article-406</guid>
                <pubDate>Sat, 18 Apr 2026 14:25:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260418-wa0013.jpg"                         length="223055"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భర్త హత్యకు రూ.5 లక్షల సుపారీ</title>
                                    <description><![CDATA[<p>- హత్య చేసి వీడియో తీసిన కిరాయి హంతకులు <br />- ప్రియుడు తమ్ముడు తో కలిసి భర్తను అంతం చేసిన ఇల్లాలు<br />- భర్తను చంపాక తగులబెట్టి.. బొక్కలను వాగులో పారేసిన భార్య<br />- వివాహేతర సంబంధంతో భర్త హత్యకు భార్య స్కెచ్<br />- మిస్సింగ్ కేసులో విస్తుపోయే నిజాలు<br />- భార్య సహా ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/supari-rs-5-lakh-for-murder-of-husband/article-405"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260417-wa0015.jpg" alt=""></a><br /><p>భర్త హత్యకు రూ.5 లక్షల సుపారీ<br />- హత్య చేసి వీడియో తీసిన కిరాయి హంతకులు <br />- ప్రియుడు తమ్ముడు తో కలిసి భర్తను అంతం చేసిన ఇల్లాలు<br />- భర్తను చంపాక తగులబెట్టి.. బొక్కలను వాగులో పారేసిన భార్య<br />- వివాహేతర సంబంధంతో భర్త హత్యకు భార్య స్కెచ్<br />- మిస్సింగ్ కేసులో విస్తుపోయే నిజాలు<br />- భార్య సహా ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు</p>
<p><br />అక్షరదర్బార్, పరకాల:</p>
<p>హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ఇటీవల అదృశ్యమైన మడికొండ సుమన్ భరత్ (38) ఉదంతం విషాదాంతమైంది. తన భర్తను అడ్డుతొలగించుకోవాలని భార్య, తన ప్రియుడు, తమ్ముడితో కలిసి కిరాయి హంతకులతో చేయించిన పక్కా ప్లాన్ హత్యగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో మృతుడి హత్యకు గురైన సుమన్ భరత్ భార్య ను సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు శుక్రవారం ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ మీడియాకు వివరాలను వెల్లడించారు. పరకాల ఏసీప సతీష్ బాబు,- సీఐ క్రాంతి కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.</p>
<p>వివాహేతర సంబంధమే కారణం<br />పోలీసుల కథనం ప్రకారం.. పరకాలకు చెందిన సుమన్ భరత్‌కు 2012లో లావణ్యతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, లావణ్యకు అదే పట్టణానికి చెందిన ఇమ్మడి నరేష్‌తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయంలో సుమన్ భరత్ తరచూ భార్యను వేధించేవాడు. దీంతో భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకున్న లావణ్య, తన తమ్ముడు పెండల రాజు, ప్రియుడు నరేష్‌తో కలిసి కుట్ర పన్నింది.<br />- 5 లక్షల సుపారీ.. మద్యం తాగించి హత్య<br />ములుగు జిల్లా గోవిందరావుపేటకు చెందిన చిరంశెట్టి వెంకటేశ్వర్లుకు సుమన్ భరత్‌ను చంపేందుకు రూ. 5 లక్షల సుపారీ ఇచ్చారు. ఇందుకోసం లావణ్య తన బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు సమకూర్చింది. పథకం ప్రకారం ఈనెల 3వ తేదీన సుమన్ భరత్‌ను మద్యం ఆశచూపి ములుగుకు పిలిపించారు. అక్కడ వెంకటేశ్వర్లు, భూక్యా రాకేష్ కలిసి మద్యం తాగించి, సుమన్ మత్తులో ఉన్నప్పుడు బీర్ బాటిల్‌తో తలపై కొట్టి చంపేశారు. అనంతరం పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగులబెట్టారు. భయానక విషయం ఏంటంటే.. నిందితులు సుమన్‌ను చంపుతున్నప్పుడు, తగులబెడుతున్నప్పుడు వీడియోలు తీసి లావణ్యకు చూపించారు.<br />- ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం<br />హత్య జరిగిన మరుసటి రోజు నిందితుడు వెంకటేశ్వర్లు కాలిపోయిన సుమన్ అస్థికలను (బొక్కలను) ఒక సంచిలో వేసి సమీపంలోని దయ్యాల వాగులో పారేశాడు. అటు లావణ్య ఏమీ తెలియనట్లు పరకాలలోని తన అత్తగారి ఇంటికి చేరుకుంది. ఏప్రిల్ 8న సుమన్ తండ్రి సాంబయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసుగా దర్యాప్తు ప్రారంభించిన పరకాల పోలీసులు, సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను పట్టుకున్నారు.<br />- నిందితుల అరెస్ట్ - సామాగ్రి స్వాధీనం<br />పోలీసులు నిందితులు చూపిన ఘటనా స్థలంలో కాలిపోయిన సిగరెట్ పీకలు, బూడిద, అస్థికలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద నుంచి వివిధ కంపెనీలకు చెందిన 6 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు.<br />- అరెస్టయిన నిందితులు<br /> 1. మడికొండ లావణ్య (భార్య)<br /> 2. ఇమ్మడి నరేష్ (ప్రియుడు)<br /> 3. పెండల రాజు (లావణ్య తమ్ముడు)<br /> 4. చిరంశెట్టి వెంకటేశ్వర్లు (కిరాయి హంతకుడు)<br /> 5. భూక్యా రాకేష్ (సహకరించిన వ్యక్తి)<br />నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/supari-rs-5-lakh-for-murder-of-husband/article-405</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/supari-rs-5-lakh-for-murder-of-husband/article-405</guid>
                <pubDate>Fri, 17 Apr 2026 18:07:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260417-wa0015.jpg"                         length="462830"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎల్కతుర్తి ఎస్సైపై వేటు </title>
                                    <description><![CDATA[<ul>
<li>ఏఆర్ కు అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు</li>
<li>విచారణలో ఆరోపణలు నిర్ధారణ </li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/elkaturthy-essay-on/article-404"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260416-wa0015.jpg" alt=""></a><br /><p>ఎల్కతుర్తి ఎస్సైపై వేటు<br />- ఏఆర్‌కు అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు</p>
<p>అక్షరదర్బార్, ఎల్కతుర్తి: అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఎల్కతుర్తి సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) ప్రవీణ్ కుమార్ పై బదిలీ వేటు పడింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు ప్రాథమిక విచారణలో నిజమని తేలడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎస్సై ప్రవీణ్ కుమార్‌ను సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంతకాలంగా ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణా, భూ వివాదాలు, ఇతర సివిల్ పంచాయితీల్లో ఎస్సై ప్రవీణ్ కుమార్ తలదూరుస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని ఉన్నతాధికారులకు వరుసగా ఫిర్యాదులు అందాయి. దీనిపై అంతర్గత విచారణ జరిపిన ఉన్నతాధికారులు, ఎస్సై తీరుపై ఒక సమగ్ర నివేదికను కమిషనర్‌కు సమర్పించారు.<br />- విచారణ నివేదిక ఆధారంగా చర్యలు<br />అధికారులు సమర్పించిన నివేదికలో ఎస్సైపై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో, శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయనను తక్షణమే విధుల్లో నుంచి తొలగించి ఏఆర్‌కు బదిలీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా సహించేది లేదని ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరించారు. ప్రవీణ్ కుమార్ బదిలీతో ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్‌కు కొత్త ఎస్సైగా ఎవరిని నియమిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం స్టేషన్ బాధ్యతలను స్థానిక సీఐ పర్యవేక్షిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/elkaturthy-essay-on/article-404</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/elkaturthy-essay-on/article-404</guid>
                <pubDate>Thu, 16 Apr 2026 22:40:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260416-wa0015.jpg"                         length="57829"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భర్తను హత్య చేసిన భార్య!</title>
                                    <description><![CDATA[<ul>
<li>పరకాలలో సినీ పక్కిని తలపించే రీతిలో ఘోరం</li>
<li>వివాహేతర సంబంధంతో ఓ వ్యక్తితో కలిసి దారుణం </li>
<li>పోలీసు స్టేషన్ కు చేరుకున్న మృతుడి బంధువులు</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/a-wife-who-killed-her-husband/article-402"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260415-wa0026.jpg" alt=""></a><br /><p>భర్త హత్యకు భార్య పన్నాగం</p>
<p>- పరకాలలో సినీ పక్కిని తలపించే ఘోరం </p>
<p>- వివాహేతర సంబంధం నేపథ్యంలో నరేష్‌తో కలిసి దారుణం చేసినట్లు ఆరోపణలు</p>
<p>అక్షరదర్బార్, పరకాల:<br />పరకాల పట్టణంలో సినీ కథను తలపించే విధంగా భార్య చేత భర్త హత్యకు గురైనట్టు వెలుగులోకి వచ్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సీఎస్ఐ కాలనీకి చెందిన మడికొండ సుమన్ (30), ట్రాక్టర్ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య లావణ్యకు నరేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.<br />ఈ నేపథ్యంలో మార్చి 3న సుమన్‌ను నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లిన లావణ్య, తదుపరి రోజు అతని సెల్‌ఫోన్‌లో బ్రతికున్నట్లుగా స్టేటస్ పెట్టినట్లు తెలిసింది. అయితే మార్చి 6న ఏమి తెలియనట్లుగా ఇంటికి చేరుకోవడంతో మృతుడి తండ్రి సాంబయ్యకు అనుమానం కలిగింది. దీంతో మార్చి 8న పరకాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.<br />కేసును నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టగా, బుధవారం లావణ్య తన భర్తను హత్య చేసినట్లు ఒప్పుకున్నట్టు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ హత్యలో ఆమె ప్రియుడు నరేష్, తమ్ముడు రాజు కూడా సహకరించినట్లు ఆరోపిస్తున్నారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని చల్వాయి ప్రాంతంలో ఈ హత్య జరిగినట్లు సమాచారం.<br />ఈ ఘటన పరకాలలో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారగా, మృతుడి బంధువులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు.<img src="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260415-wa0025.jpg" alt="IMG-20260415-WA0025" width="720" height="540"></img><img src="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260415-wa0026.jpg" alt="IMG-20260415-WA0026" width="720" height="541"></img></p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/a-wife-who-killed-her-husband/article-402</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/a-wife-who-killed-her-husband/article-402</guid>
                <pubDate>Wed, 15 Apr 2026 20:47:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260415-wa0026.jpg"                         length="59470"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏసీబీ పంజా </title>
                                    <description><![CDATA[<ul>
<li>లంచం తీసుకుంటూ  పట్టుపడిన ఎంఈవో, స్కూల్ అసిస్టెంట్</li>
<li>అరెస్టు, విచారణ</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/acb-claw/article-400"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260408-wa0012.jpg" alt=""></a><br /><p>ఏసీబీ పంజా<br />- లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎంఈఓ, స్కూల్ అసిస్టెంట్</p>
<p>అక్షరదర్బార్, మహబూబాబాద్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జిల్లాలో మరో భారీ ట్రాప్ నిర్వహించారు. గూడూరు మండలం అయోధ్యపురంలోని ఒక పాఠశాలలో పదవీ విరమణ పొందనున్న ఉపాధ్యాయుడి నుండి లంచం డిమాండ్ చేసిన ఇంచార్జ్ ఎంఈఓ, స్కూల్ అసిస్టెంట్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అయోధ్యపురం పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. ఆయనకు సంబంధించిన అధికారిక పనులను పూర్తి చేసేందుకు ఇంచార్జ్ ఎంఈఓ రవికుమార్, ఆయనకు సహకరిస్తున్న స్కూల్ అసిస్టెంట్ చంద్రమౌళి రూ.15,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పథకం ప్రకారం ఈరోజు దాడి నిర్వహించారు.<br />- అరెస్ట్, విచారణ<br />లంచం డబ్బులు తీసుకుంటుండగా రవికుమార్, చంద్రమౌళిలను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ధృవీకరించారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/acb-claw/article-400</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/acb-claw/article-400</guid>
                <pubDate>Wed, 08 Apr 2026 14:38:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260408-wa0012.jpg"                         length="96386"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తహసిల్దార్ల బదిలీ </title>
                                    <description><![CDATA[<ul>
<li>పదిమంది తహసిల్దార్లు, ముగ్గురు నాయబ్ తహసిల్దార్లకు స్థాన చలనం</li>
<li>జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/global/transfer-of-tehsildars/article-396"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260404-wa0023.jpg" alt=""></a><br /><p>తహసిల్దార్ల బదిలీ </p>
<p>- పది మంది తహసీల్దార్లు, ముగ్గురు నాయబ్ తహసిల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు </p>
<p>అక్షరదర్బార్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పది మంది తహసీల్దార్లు, ముగ్గురు నాయబ్ తహసీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్  రాహుల్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.  బదిలీ అయిన తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు తమకు కేటాయించిన కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. విధుల్లో చేరిన వెంటనే సంబంధిత చేరిక నివేదికలను సమర్పించాలని స్పష్టంచేశారు. అధికారులు విధుల్లో చేరడంలో ఆలస్యం చేయకుండా, ప్రభుత్వ పరిపాలనా పనులు నిరంతరంగా సాగేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.<img src="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260404-wa00261.jpg" alt="IMG-20260404-WA0026" width="738" height="1031"></img><img src="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260404-wa0027.jpg" alt="IMG-20260404-WA0027" width="738" height="1131"></img></p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/global/transfer-of-tehsildars/article-396</link>
                <guid>https://www.aksharadarbar.com/global/transfer-of-tehsildars/article-396</guid>
                <pubDate>Sat, 04 Apr 2026 19:29:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260404-wa0023.jpg"                         length="55236"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎస్ఆర్ఓల ఇళ్లలో కనకవర్షం </title>
                                    <description><![CDATA[<ul>
<li dir="ltr">నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్న ఏసీబీ</li>
<li dir="ltr">బహిర్గతమైన వాట్సాప్ చాటింగ్.. అధికారుల అవినీతి గుట్టురట్టు</li>
<li dir="ltr">ఫోన్ పే ద్వారానే రూ.42 లక్షల లావాదేవీలు</li>
<li dir="ltr">వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కళ్లు చెదిరే అక్రమాలు</li>
<li dir="ltr">ఏసీబీ సోదాలతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/kanakavarasham-in-the-houses-of-sros/article-394"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260403-wa0009.jpg" alt=""></a><br /><p>ఎస్ఆర్ఓల ఇళ్లలో కనక వర్షం<br />- నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్న ఏసీబీ <br />- బహిర్గతమైన వాట్సాప్ చాటింగ్.. అధికారుల అవినీతి గుట్టురట్టు <br />- ఫోన్ పే ద్వారానే రూ.42 లక్షల లావాదేవీలు<br />- వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కళ్లు చెదిరే అక్రమాలు<br />- ఏసీబీ సోదాలతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి</p>
<p>అక్షరదర్బార్, హనుమకొండ: హనుమకొండ వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని ఏసీబీ సోదాల్లో తేలిపోయింది. నిన్న నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అధికారులు, ప్రైవేటు వ్యక్తుల మధ్య సాగుతున్న చీకటి దందా బట్టబయలైంది. తనిఖీల సమయంలో కార్యాలయంలో ఏకంగా 20 మంది అనధికార ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లు తిష్టవేసి ఉండటం అధికారులను ఆశ్చర్యపరిచింది. వారి సెల్ ఫోన్లను పరిశీలించగా డిజిటల్ మాఫియా వెలుగుచూసింది. కేవలం ఏడాది కాలంలోనే రూ.42 లక్షల మేర 'ఫోన్ పే' లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ నిర్ధారించింది. ఎస్ఆర్వోలు వాట్సాప్ చాటింగ్ ద్వారా చిక్కారు. ఎస్ఆర్ఓలు రామనర్సింహారావు, ఆనంద్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు వారి అక్రమాలకు సాక్ష్యంగా నిలిచాయి. ఆఫీసులో 204 డెలివరీ కాని డాక్యుమెంట్లు ఎస్ఆర్ఓల వద్దే పెండింగ్‌లో ఉండటం గమనార్హం.<br />- ఇళ్లలో భారీగా ఆస్తులు<br />ఎస్ఆర్ఓల నివాసాల్లో ఏసీబీ నిర్వహించిన సోదాల్లో కళ్లు చెదిరే రీతిలో అక్రమాస్తులు దొరికాయి. నగదు రూ.24.61 లక్షలు, బంగారం 820 గ్రాములు, వెండి 2.60 కిలోలు, ఎస్ఆర్ఓ ఆనంద్ పేరిట కపిల్ చిట్స్‌లో రూ. 30 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కార్యాలయంలో లెక్కల్లో చూపని మరో రూ. 47,450 నగదుతో పాటు 70 కీలక దస్త్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం అధికారులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/kanakavarasham-in-the-houses-of-sros/article-394</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/kanakavarasham-in-the-houses-of-sros/article-394</guid>
                <pubDate>Fri, 03 Apr 2026 15:21:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260403-wa0009.jpg"                         length="269344"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        