<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.aksharadarbar.com/av/author-9" rel="self" type="application/rss+xml" />
                <generator>అక్షర దర్బార్ RSS Feed Generator</generator>
                <title>AV - అక్షర దర్బార్</title>
                <link>https://www.aksharadarbar.com/author/9/rss</link>
                <description>AV RSS Feed</description>
                
                            <item>
                <title>ఓటరు జాబితా సవరణపై బీజేపీ కార్యశాల</title>
                                    <description><![CDATA[<p>ఓటరు జాబితా సవరణపై బీజేపీ కార్యశాల</p>
<p>హడావుడిగా ఆసుపత్రి ప్రారంభం..</p>
<p>  తెరుచుకోని హాస్పిటల్‌</p>
<p>డాక్టర్‌ పగడాల కాళీప్రసాద్‌రావు</p>
<p>అక్షరదర్బార్,పరకాల: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) రెండో దశ కార్యక్రమంలో భాగంగా పరకాల బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి కార్యశాల నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల కాంటెస్టెడ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ పగడాల కాళీప్రసాద్‌రావు, ఎస్‌ఐఆర్‌ జిల్లా ప్రముఖ్‌ రావు అమరేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు సిరంగి సంతోష్‌కుమార్‌ హాజరయ్యారు.</p>
<p>ఈ సందర్భంగా డాక్టర్‌ కాళీప్రసాద్‌రావు మాట్లాడుతూ పరకాల ప్రభుత్వ ఆసుపత్రిని హడావుడిగా ప్రారంభించారని, ప్రస్తుతం అది మూతపడే పరిస్థితిలో ఉందని ఆరోపించారు. ఆసుపత్రి పరిస్థితిపై ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలను వెల్లడించాలని, ప్రారంభోత్సవ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని కోరారు.</p>
<p>సిరంగి సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/bjp-workshop-on-revision-of-voter-list/article-496"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-08/img-20260824-wa0758.jpg" alt=""></a><br /><p>ఓటరు జాబితా సవరణపై బీజేపీ కార్యశాల</p>
<p>హడావుడిగా ఆసుపత్రి ప్రారంభం..</p>
<p> తెరుచుకోని హాస్పిటల్‌</p>
<p>డాక్టర్‌ పగడాల కాళీప్రసాద్‌రావు</p>
<p>అక్షరదర్బార్,పరకాల: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) రెండో దశ కార్యక్రమంలో భాగంగా పరకాల బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి కార్యశాల నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల కాంటెస్టెడ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ పగడాల కాళీప్రసాద్‌రావు, ఎస్‌ఐఆర్‌ జిల్లా ప్రముఖ్‌ రావు అమరేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు సిరంగి సంతోష్‌కుమార్‌ హాజరయ్యారు.</p>
<p>ఈ సందర్భంగా డాక్టర్‌ కాళీప్రసాద్‌రావు మాట్లాడుతూ పరకాల ప్రభుత్వ ఆసుపత్రిని హడావుడిగా ప్రారంభించారని, ప్రస్తుతం అది మూతపడే పరిస్థితిలో ఉందని ఆరోపించారు. ఆసుపత్రి పరిస్థితిపై ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలను వెల్లడించాలని, ప్రారంభోత్సవ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని కోరారు.</p>
<p>సిరంగి సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలను కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు పరకాల బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్‌ ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.<br />కార్యశాలలో బీజేపీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్‌.పీ. జయంత్‌లాల్‌, దేవునూరి మేఘనాథ్‌, పరకాల కౌన్సిలర్లు బెజ్జంకి పునాచారి, ఆకుల లావణ్య శ్రీధర్‌, మండల అధ్యక్షులు కాసగాని రాజ్‌కుమార్‌, ఉప్పుగల శ్రీకాంత్‌రెడ్డి, వేల్పుల రాజ్‌కుమార్‌, మాజీ చైర్‌పర్సన్‌ మార్త రాజభద్రయ్య ఓబీసీ, ఎస్సీ మోర్చా నాయకులు, మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/bjp-workshop-on-revision-of-voter-list/article-496</link>
                <guid>https://www.aksharadarbar.com/bjp-workshop-on-revision-of-voter-list/article-496</guid>
                <pubDate>Tue, 25 Aug 2026 10:51:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/img-20260824-wa0758.jpg"                         length="494767"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రేవూరి, సీఎంపై వ్యాఖ్యలు సరికాదు</title>
                                    <description><![CDATA[<p>రేవూరి, సీఎంపై వ్యాఖ్యలు సరికాదు</p>
<p>- కొండా సుస్మిత పటేల్‌ తీరుపై కాంగ్రెస్‌ నేతల మండిపాటు..</p>
<p>- క్షమాపణ చెప్పాలని డిమాండ్</p>
<p>- ఇక్కడ మంత్రి సుష్మతనా ...సురేఖా.!</p>
<p>- ధర్మారెడ్డికి భయపడి వరంగల్ పారిపోయారు</p>
<p>- గీసుకొండ మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు భీమగాని సౌజన్య </p>
<p>అక్షరదర్బార్, పరకాల: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై కొండ సుస్మిత పటేల్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. బుధవారం గీసుకొండ మండల కేంద్రంలో మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మిత పటేల్‌ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. గురువారం పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడారు.<br />నాగారం మాజీ సర్పంచ్‌ కట్కూరి స్రవంతి మాట్లాడుతూ.. అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో పాటు మహిళలకు అండగా నిలుస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/the-comments-on-revuri-cm-are-not-correct/article-493"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-08/img-20260820-wa1237(1).jpg" alt=""></a><br /><p>రేవూరి, సీఎంపై వ్యాఖ్యలు సరికాదు</p>
<p>- కొండా సుస్మిత పటేల్‌ తీరుపై కాంగ్రెస్‌ నేతల మండిపాటు..</p>
<p>- క్షమాపణ చెప్పాలని డిమాండ్</p>
<p>- ఇక్కడ మంత్రి సుష్మతనా ...సురేఖా.!</p>
<p>- ధర్మారెడ్డికి భయపడి వరంగల్ పారిపోయారు</p>
<p>- గీసుకొండ మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు భీమగాని సౌజన్య </p>
<p>అక్షరదర్బార్, పరకాల: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై కొండ సుస్మిత పటేల్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. బుధవారం గీసుకొండ మండల కేంద్రంలో మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మిత పటేల్‌ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. గురువారం పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడారు.<br />నాగారం మాజీ సర్పంచ్‌ కట్కూరి స్రవంతి మాట్లాడుతూ.. అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో పాటు మహిళలకు అండగా నిలుస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గతంలో చేసిన వ్యాఖ్యలను క్షమించినప్పటికీ, మరోసారి మాట్లాడటం ద్వారా ఆమెపై ఉన్న గౌరవాన్ని తగ్గించుకున్నారని అన్నారు. సుస్మిత పటేల్‌కు కాంగ్రెస్‌ పార్టీలో సభ్యత్వం లేదని పేర్కొన్నారు.</p>
<p>పరకాల మాజీ జెడ్పీటీసీ పాడి కల్పన మాట్లాడుతూ.. “పరకాల ఎవరి అడ్డా కాదు.. ప్రజల అడ్డా” అని అన్నారు. 2012లోనే కొండా సురేఖ పరకాలకు దూరమయ్యారని, అలాంటి కుటుంబం నుంచి సుస్మిత పటేల్‌ సీఎం, ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం తగదన్నారు. భాషను మార్చుకుని నాయకురాలిగా ఎదగాలని హితవు పలికారు.</p>
<p>గీసుకొండ మాజీ ఎంపీపీ, కాంగ్రెస్‌ నాయకురాలు భీమగాని సౌజన్య మాట్లాడుతూ.. “ఇక్కడ మంత్రి సురేఖనా.. సుస్మితనా?” అని ప్రశ్నించారు. పరకాలలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్న సభకు భారీగా ప్రజలు తరలిరావడం, పరకాల అభివృద్ధికి సీఎం ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమన్నారు. పరకాల అభివృద్ధి కోసం రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని సీఎం కోరడాన్ని సుస్మిత పటేల్‌ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.<br />చల్లా ధర్మారెడ్డికి భయపడి కొండా సురేఖ కుటుంబం పరకాల నుంచి దూరంగా వెళ్లిందంటూ సౌజన్య వ్యాఖ్యానించారు. గీసుకొండలో జరిగే జన్మదిన వేడుకలు, బోనాలు, కొమ్మాల జాతర వంటి కార్యక్రమాలకు వచ్చి సుస్మిత పటేల్‌ ఏదో ఒకటి మాట్లాడటం ద్వారా మంత్రి కొండా సురేఖకు రాజకీయంగా నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రులతో వివాదాలకు దారితీసేలా వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.<br />కాంగ్రెస్‌ అధిష్ఠానం రేవూరి ప్రకాశ్‌రెడ్డికి టికెట్‌ ఇస్తే పార్టీ శ్రేణులంతా ఆయన విజయానికి కృషి చేస్తారని సౌజన్య అన్నారు. స్వతంత్రంగా పోటీ చేయాలని భావిస్తున్న సుస్మిత పటేల్‌ ఇకపై కాంగ్రెస్‌ నాయకుల ఫొటోలను ఉపయోగించుకోవద్దని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్‌ పార్టీకి నష్టం కలిగించవద్దని హితవు పలికారు. చేసిన వ్యాఖ్యలకు సీఎం, కాంగ్రెస్‌ పార్టీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.<br />కాంగ్రెస్‌ పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే కార్యకర్తలు సహించబోరని నాయకులు హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/the-comments-on-revuri-cm-are-not-correct/article-493</link>
                <guid>https://www.aksharadarbar.com/the-comments-on-revuri-cm-are-not-correct/article-493</guid>
                <pubDate>Thu, 20 Aug 2026 12:28:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/img-20260820-wa1237%281%29.jpg"                         length="232121"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పరకాలకు పారిశుధ్య ముప్పు</title>
                                    <description><![CDATA[<p>  పరకాలకు పారిశుధ్య ముప్పు</p>
<p>వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త.. </p>
<p>స్వైర విహారం చేస్తున్న పందులు.. </p>
<p>దుర్వాసనతో ప్రజల అవస్థలు.. </p>
<p>అక్షరదర్బార్,పరకాల:<br />వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని 22 వార్డుల్లో అనేక ప్రాంతాల్లో చెత్త కుప్పలు పేరుకుపోవడంతో పందులు స్వైర విహారం చేస్తున్నాయని, దీంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.<br />ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల సమీపంలో చెత్త పేరుకుపోవడంతో పందులు గుంపులుగా తిరుగుతున్నాయని, అక్కడి నుంచి వెళ్లే విద్యార్థులు, ప్రజలు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. వర్షాల కారణంగా చెత్త నుంచి దుర్గంధం వెదజల్లుతుండడంతో పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.<br />పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, చెత్తను సకాలంలో తొలగించడం, కాలువలను శుభ్రం చేయడం వంటి చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పట్టణవాసులు కోరుతున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/sanitation-threat-to-parakalas/article-487"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img-20260721-wa0541.jpg" alt=""></a><br /><p> పరకాలకు పారిశుధ్య ముప్పు</p>
<p>వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త.. </p>
<p>స్వైర విహారం చేస్తున్న పందులు.. </p>
<p>దుర్వాసనతో ప్రజల అవస్థలు.. </p>
<p>అక్షరదర్బార్,పరకాల:<br />వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని 22 వార్డుల్లో అనేక ప్రాంతాల్లో చెత్త కుప్పలు పేరుకుపోవడంతో పందులు స్వైర విహారం చేస్తున్నాయని, దీంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.<br />ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల సమీపంలో చెత్త పేరుకుపోవడంతో పందులు గుంపులుగా తిరుగుతున్నాయని, అక్కడి నుంచి వెళ్లే విద్యార్థులు, ప్రజలు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. వర్షాల కారణంగా చెత్త నుంచి దుర్గంధం వెదజల్లుతుండడంతో పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.<br />పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, చెత్తను సకాలంలో తొలగించడం, కాలువలను శుభ్రం చేయడం వంటి చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పట్టణవాసులు కోరుతున్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/sanitation-threat-to-parakalas/article-487</link>
                <guid>https://www.aksharadarbar.com/sanitation-threat-to-parakalas/article-487</guid>
                <pubDate>Tue, 21 Jul 2026 08:23:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260721-wa0541.jpg"                         length="129890"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ</title>
                                    <description><![CDATA[<p>నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ</p>
<p>అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు</p>
<p>అక్షరదర్బార్,నడికూడ: <br />నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల సమావేశంలో నూతన ప్రెస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జర్నలిస్టుల అభిప్రాయాలు, సూచనల మేరకు కమిటీని ఏర్పాటు చేశారు.నూతన కమిటీలో అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా గడ్డం బాలరాజు, ఉపాధ్యక్షుడిగా ముక్కెర చిరంజీవి, సహాయ కార్యదర్శులుగా ఐలి విజయ్, బొమ్మ అశోక్, భైరి సుధీర్ కుమార్, కోశాధికారిగా ఎం.డి. జమాలుద్దీన్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా బెజ్జంకి రాజేందర్, రజనీకాంత్, తాళ్ల రవి, చుక్క సతీష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.<br />ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శి పంచమనేని భాస్కరరావు మాట్లాడుతూ తమపై విశ్వాసం ఉంచి ఎన్నుకున్న జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తామని,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/new-committee-for-nadikooda-press-club/article-481"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img-20260705-wa1244.jpg" alt=""></a><br /><p>నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ</p>
<p>అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు</p>
<p>అక్షరదర్బార్,నడికూడ: <br />నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల సమావేశంలో నూతన ప్రెస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జర్నలిస్టుల అభిప్రాయాలు, సూచనల మేరకు కమిటీని ఏర్పాటు చేశారు.నూతన కమిటీలో అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా గడ్డం బాలరాజు, ఉపాధ్యక్షుడిగా ముక్కెర చిరంజీవి, సహాయ కార్యదర్శులుగా ఐలి విజయ్, బొమ్మ అశోక్, భైరి సుధీర్ కుమార్, కోశాధికారిగా ఎం.డి. జమాలుద్దీన్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా బెజ్జంకి రాజేందర్, రజనీకాంత్, తాళ్ల రవి, చుక్క సతీష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.<br />ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శి పంచమనేని భాస్కరరావు మాట్లాడుతూ తమపై విశ్వాసం ఉంచి ఎన్నుకున్న జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తామని, మండలంలోని పాత్రికేయులు ఎదుర్కొనే సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావాలని కోరారు. వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. అలాగే మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు నూతన ప్రెస్ క్లబ్ కమిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/new-committee-for-nadikooda-press-club/article-481</link>
                <guid>https://www.aksharadarbar.com/new-committee-for-nadikooda-press-club/article-481</guid>
                <pubDate>Sun, 05 Jul 2026 15:41:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260705-wa1244.jpg"                         length="173709"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దొంగతనం కేసు ఛేదన</title>
                                    <description><![CDATA[<p dir="ltr">దొంగతనం కేసు ఛేదన</p>
<p dir="ltr">ఆరుగురు నిందితుల అరెస్టు..</p>
<p dir="ltr">రూ.1.50 లక్షల నగదు స్వాధీనం</p>
<p dir="ltr">అక్షరదర్బార్, కాళేశ్వరం: <br />గత ఏడాది నిర్వహించిన సరస్వతీ పుష్కరాల సందర్భంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన టెంట్ సిటీలోని ఎనిమిది ఏసీ ఔటర్ యూనిట్లు దొంగిలించిన కేసును కాళేశ్వరం పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. టెంట్ సిటీ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ <a href="tel:592025">59/2025</a> కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా కాళేశ్వరం గ్రామానికి చెందిన మహేందర్, నారాయణ, జావేద్, సమ్మయ్య, సృజన్, సాయిలను అదుపులోకి తీసుకుని విచారించగా, టెంట్ సిటీలో ఏర్పాటు చేసిన ఎనిమిది ఏసీ ఔటర్ యూనిట్లను దొంగిలించినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దొంగిలించిన ఏసీ ఔటర్ యూనిట్లను గుర్తు తెలియని వ్యక్తికి విక్రయించి పొందిన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p dir="ltr">దొంగతనం కేసు ఛేదన</p>
<p dir="ltr">ఆరుగురు నిందితుల అరెస్టు..</p>
<p dir="ltr">రూ.1.50 లక్షల నగదు స్వాధీనం</p>
<p dir="ltr">అక్షరదర్బార్, కాళేశ్వరం: <br />గత ఏడాది నిర్వహించిన సరస్వతీ పుష్కరాల సందర్భంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన టెంట్ సిటీలోని ఎనిమిది ఏసీ ఔటర్ యూనిట్లు దొంగిలించిన కేసును కాళేశ్వరం పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. టెంట్ సిటీ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ <a href="tel:592025">59/2025</a> కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా కాళేశ్వరం గ్రామానికి చెందిన మహేందర్, నారాయణ, జావేద్, సమ్మయ్య, సృజన్, సాయిలను అదుపులోకి తీసుకుని విచారించగా, టెంట్ సిటీలో ఏర్పాటు చేసిన ఎనిమిది ఏసీ ఔటర్ యూనిట్లను దొంగిలించినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దొంగిలించిన ఏసీ ఔటర్ యూనిట్లను గుర్తు తెలియని వ్యక్తికి విక్రయించి పొందిన రూ.1.50 లక్షల నగదును నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.</p>
<p dir="ltr">ఎస్‌ఐ, సిబ్బందికి అభినందనలు</p>
<p dir="ltr">కేసును వేగంగా ఛేదించి నిందితులను గుర్తించి అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన కాళేశ్వరం ఎస్‌ఐ తమాషా రెడ్డి, పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/solving-the-theft-case/article-475</link>
                <guid>https://www.aksharadarbar.com/solving-the-theft-case/article-475</guid>
                <pubDate>Sat, 04 Jul 2026 18:27:39 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ</title>
                                    <description><![CDATA[<p>27 మందికి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ</p>
<p>పేద ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు సీఎం సహాయ నిధి</p>
<p>భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు</p>
<p><br />అక్షరదర్బార్, శాయంపేట: <br />శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం నిర్వహించిన సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) 30వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 27 మంది లబ్ధిదారులకు రూ.6,85,500 విలువైన చెక్కులను అందజేశారు.<br />ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో కవర్ కాని వైద్య చికిత్సలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు.<br />నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద రోగులు ఆసుపత్రి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/distribution-of-cm-relief-fund-cheques/article-473"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img-20260704-wa2056.jpg" alt=""></a><br /><p>27 మందికి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ</p>
<p>పేద ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు సీఎం సహాయ నిధి</p>
<p>భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు</p>
<p><br />అక్షరదర్బార్, శాయంపేట: <br />శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం నిర్వహించిన సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) 30వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 27 మంది లబ్ధిదారులకు రూ.6,85,500 విలువైన చెక్కులను అందజేశారు.<br />ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో కవర్ కాని వైద్య చికిత్సలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు.<br />నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద రోగులు ఆసుపత్రి నుంచి ఎస్టిమేషన్ కాపీ సమర్పిస్తే ప్రభుత్వం ఎల్‌ఓసీ మంజూరు చేసి చికిత్సకు అవసరమైన సహాయాన్ని అందిస్తోందని చెప్పారు. పేద ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు.<br />కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/distribution-of-cm-relief-fund-cheques/article-473</link>
                <guid>https://www.aksharadarbar.com/distribution-of-cm-relief-fund-cheques/article-473</guid>
                <pubDate>Sat, 04 Jul 2026 17:55:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260704-wa2056.jpg"                         length="183046"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి దారుణ హత్య</title>
                                    <description><![CDATA[<p>ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి దారుణ హత్య</p>
<p>షాప్ మూసి ఇంటికి వెళ్తుండగా ఘటన.. <br />పరారీలో నిందితుడు </p>
<p>అక్షరదర్బార్, రేగొండ: <br />జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని రంగయ్యపల్లి గ్రామానికి చెందిన జట్టి శ్రావణ్ (35) మండల కేంద్రంలో వైన్స్ షాప్ ఎదుట ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి సుమారు 10 గంటలకు షాప్ మూసి ఇంటికి వెళ్తుండగా మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు అతనిపై దాడి చేసి హత్య చేసినట్లు ఎస్సై దాసరి సుధాకర్ తెలిపారు. హత్యకు గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు ఘటన అనంతరం పరారైనట్లు తెలిపారు. మృతుడు శ్రావణ్‌కు భార్య మౌనిక, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/a-brutal-murder-of-a-fast-food-center-manager/article-472"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img_20260704_082456.jpg" alt=""></a><br /><p>ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి దారుణ హత్య</p>
<p>షాప్ మూసి ఇంటికి వెళ్తుండగా ఘటన.. <br />పరారీలో నిందితుడు </p>
<p>అక్షరదర్బార్, రేగొండ: <br />జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని రంగయ్యపల్లి గ్రామానికి చెందిన జట్టి శ్రావణ్ (35) మండల కేంద్రంలో వైన్స్ షాప్ ఎదుట ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి సుమారు 10 గంటలకు షాప్ మూసి ఇంటికి వెళ్తుండగా మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు అతనిపై దాడి చేసి హత్య చేసినట్లు ఎస్సై దాసరి సుధాకర్ తెలిపారు. హత్యకు గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు ఘటన అనంతరం పరారైనట్లు తెలిపారు. మృతుడు శ్రావణ్‌కు భార్య మౌనిక, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/a-brutal-murder-of-a-fast-food-center-manager/article-472</link>
                <guid>https://www.aksharadarbar.com/a-brutal-murder-of-a-fast-food-center-manager/article-472</guid>
                <pubDate>Sat, 04 Jul 2026 08:25:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img_20260704_082456.jpg"                         length="188304"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మహిళా ఉద్యోగులకు వేధింపులు</title>
                                    <description><![CDATA[<p>మహిళా ఉద్యోగులకు వేధింపులు<br />  <br />- ఓ ప్రభుత్వ కార్యాలయంలో కలకలం</p>
<p>- ఉన్నతాధికారిపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం</p>
<p>అక్షరదర్బార్, హనుమకొండ: హనుమకొండ జిల్లా డివిజన్‌లోని ఓ ఉన్నతాధికారిపై మహిళా ఉద్యోగులు వేధింపుల ఆరోపణలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన కింద పనిచేసే మహిళా సిబ్బందితో సదరు ఉన్నతాధికారి అనుచితంగా ప్రవర్తిస్తూ మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.<br />ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యేకు కూడా కొందరు మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తాము పనిచేస్తున్న కార్యాలయంలో విధులు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయని, ఇక్కడ పనిచేయడం కంటే సెలవులు తీసుకోవడమే మేలని కొందరు మహిళా ఉద్యోగులు తమ సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.<br />సదరు అధికారి వద్ద పనిచేయడానికి భద్రతాభావం లేకపోవడంతో పలువురు మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/harassment-of-women-employees/article-471"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img_20260703_131450.jpg" alt=""></a><br /><p>మహిళా ఉద్యోగులకు వేధింపులు<br /> <br />- ఓ ప్రభుత్వ కార్యాలయంలో కలకలం</p>
<p>- ఉన్నతాధికారిపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం</p>
<p>అక్షరదర్బార్, హనుమకొండ: హనుమకొండ జిల్లా డివిజన్‌లోని ఓ ఉన్నతాధికారిపై మహిళా ఉద్యోగులు వేధింపుల ఆరోపణలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన కింద పనిచేసే మహిళా సిబ్బందితో సదరు ఉన్నతాధికారి అనుచితంగా ప్రవర్తిస్తూ మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.<br />ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యేకు కూడా కొందరు మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తాము పనిచేస్తున్న కార్యాలయంలో విధులు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయని, ఇక్కడ పనిచేయడం కంటే సెలవులు తీసుకోవడమే మేలని కొందరు మహిళా ఉద్యోగులు తమ సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.<br />సదరు అధికారి వద్ద పనిచేయడానికి భద్రతాభావం లేకపోవడంతో పలువురు మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. అవసరమైతే సంబంధిత అధికారిని బదిలీ చేయాలని, లేదంటే మహిళా ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా బదిలీలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/harassment-of-women-employees/article-471</link>
                <guid>https://www.aksharadarbar.com/harassment-of-women-employees/article-471</guid>
                <pubDate>Fri, 03 Jul 2026 13:19:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img_20260703_131450.jpg"                         length="189386"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తీర్మానం లేకుండా నిధుల డ్రా.. </title>
                                    <description><![CDATA[<p>తీర్మానం లేకుండా నిధుల డ్రా.. <br />వార్డు సభ్యుల ఆగ్రహం</p>
<p>అక్షర దర్బార్, శాయంపేట: <br />గ్రామపంచాయతీలో తీర్మానం చేసి వార్డు సభ్యుల అనుమతితోనే నిధులు డ్రా చేయాలని కోరుతూ శాయంపేట గ్రామపంచాయతీ వార్డు సభ్యులు శాయంపేట ఎంపీడీవోతో పాటు హనుమకొండ జిల్లా డీపీఓకు సోమవారం వినతిపత్రం అందజేశారు.<br />ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీలో నిధుల వినియోగంపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. గ్రామపంచాయతీ సమావేశంలో తీర్మానం చేయకుండా, వార్డు సభ్యుల సంతకాలు లేకుండానే సర్పంచి, ఉపసర్పంచి, కార్యదర్శి ఆధ్వర్యంలో నిధులు డ్రా చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న వార్డు సభ్యులుగా ఉన్నప్పటికీ పంచాయతీలో జరుగుతున్న వ్యవహారాలపై తమకు సమాచారం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. నిధులు ఏ పనుల కోసం ఖర్చు చేశారనే వివరాలు అడిగినా స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.<br />ఇకపై గ్రామపంచాయతీ తీర్మానం అనంతరం సభ్యుల అనుమతితోనే నిధులు డ్రా చేసేలా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/draw-funds-without-resolution/article-467"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img-20260630-wa1668.jpg" alt=""></a><br /><p>తీర్మానం లేకుండా నిధుల డ్రా.. <br />వార్డు సభ్యుల ఆగ్రహం</p>
<p>అక్షర దర్బార్, శాయంపేట: <br />గ్రామపంచాయతీలో తీర్మానం చేసి వార్డు సభ్యుల అనుమతితోనే నిధులు డ్రా చేయాలని కోరుతూ శాయంపేట గ్రామపంచాయతీ వార్డు సభ్యులు శాయంపేట ఎంపీడీవోతో పాటు హనుమకొండ జిల్లా డీపీఓకు సోమవారం వినతిపత్రం అందజేశారు.<br />ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీలో నిధుల వినియోగంపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. గ్రామపంచాయతీ సమావేశంలో తీర్మానం చేయకుండా, వార్డు సభ్యుల సంతకాలు లేకుండానే సర్పంచి, ఉపసర్పంచి, కార్యదర్శి ఆధ్వర్యంలో నిధులు డ్రా చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న వార్డు సభ్యులుగా ఉన్నప్పటికీ పంచాయతీలో జరుగుతున్న వ్యవహారాలపై తమకు సమాచారం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. నిధులు ఏ పనుల కోసం ఖర్చు చేశారనే వివరాలు అడిగినా స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.<br />ఇకపై గ్రామపంచాయతీ తీర్మానం అనంతరం సభ్యుల అనుమతితోనే నిధులు డ్రా చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో కూడా సర్పంచి ఏకపక్షంగా వ్యవహరించారని, తమ వార్డుల్లో అర్హులు ఉన్నప్పటికీ వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండా లబ్ధిదారులను ఎంపిక చేశారని ఆరోపించారు. ఈ విషయంపై ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వలేదని తెలిపారు.<br />ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/draw-funds-without-resolution/article-467</link>
                <guid>https://www.aksharadarbar.com/draw-funds-without-resolution/article-467</guid>
                <pubDate>Wed, 01 Jul 2026 11:06:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260630-wa1668.jpg"                         length="246117"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు</title>
                                    <description><![CDATA[<p>ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు</p>
<p>- రేవూరి గొప్పతనం పరకాల ప్రజలకు తెలుసు </p>
<p>మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్</p>
<p>అక్షరదర్బార్, పరకాల :<br />పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదని పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ అన్నారు. ఆదివారం పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యఅతిథిగా సునీల్ కుమార్ పాల్గొని మాట్లాడారు.<br />రేవూరి ప్రకాష్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించిన నాయకుడని, పార్టీలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన సేవలను పరకాల ప్రజలు బాగా గుర్తించారని అన్నారు. అలాంటి నాయకుడిపై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం, దిష్టిబొమ్మ దహనం వంటి చర్యలకు పాల్పడటం సరికాదని విమర్శించారు.ప్రజా సమస్యల పరిష్కారంలో, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/brs-has-no-right-to-criticize-mla/article-462"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-06/img_20260621_174332.jpg" alt=""></a><br /><p>ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు</p>
<p>- రేవూరి గొప్పతనం పరకాల ప్రజలకు తెలుసు </p>
<p>మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్</p>
<p>అక్షరదర్బార్, పరకాల :<br />పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదని పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ అన్నారు. ఆదివారం పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యఅతిథిగా సునీల్ కుమార్ పాల్గొని మాట్లాడారు.<br />రేవూరి ప్రకాష్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించిన నాయకుడని, పార్టీలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన సేవలను పరకాల ప్రజలు బాగా గుర్తించారని అన్నారు. అలాంటి నాయకుడిపై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం, దిష్టిబొమ్మ దహనం వంటి చర్యలకు పాల్పడటం సరికాదని విమర్శించారు.ప్రజా సమస్యల పరిష్కారంలో, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నిరంతరం ముందుంటున్నారని తెలిపారు. ప్రజాదరణ కలిగిన నాయకుడిని విమర్శించడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు తమ రాజకీయ అసహనాన్ని బయటపెడుతున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, తగిన విధంగా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో కౌన్సిలర్లు బండి శ్రీధర్, కోయ్యడ శ్రీనివాస్ , దశరథం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/brs-has-no-right-to-criticize-mla/article-462</link>
                <guid>https://www.aksharadarbar.com/brs-has-no-right-to-criticize-mla/article-462</guid>
                <pubDate>Sun, 21 Jun 2026 17:48:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-06/img_20260621_174332.jpg"                         length="1960574"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు</title>
                                    <description><![CDATA[<p>వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు</p>
<p>కాంట వేసి 10 రోజులు దాటినా ఖాతాల్లో జమ కాని చెల్లింపులు</p>
<p>ట్యాబ్‌లో నమోదు ఆలస్యం, ఒటీపీ సమాచారం లేక రైతుల ఆందోళన</p>
<p>ఎరువులు, విత్తనాల కొనుగోలుకు ఇబ్బందులు</p>
<p>అక్షరదర్బార్, శాయంపేట:<br />వరిధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపుల జాప్యం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. శాయంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మి 9 నుంచి 10 రోజులు గడిచినా ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.రైతుల వివరాల ప్రకారం, ధాన్యం కొనుగోలు అనంతరం కేంద్రాల ఇన్‌చార్జీలు ట్యాబ్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉండగా, కొన్ని కేంద్రాల్లో ఈ ప్రక్రియ పూర్తికాలేదని చెబుతున్నారు. వివరాలు నమోదు చేసినా ఒటీపీ సంబంధిత సమాచారాన్ని రైతులకు తెలియజేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో చెల్లింపుల ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. మరోవైపు, రుతుపవనాల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/expectations-of-farmers-for-wood-money/article-456"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-06/img_20260611_075757.jpg" alt=""></a><br /><p>వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు</p>
<p>కాంట వేసి 10 రోజులు దాటినా ఖాతాల్లో జమ కాని చెల్లింపులు</p>
<p>ట్యాబ్‌లో నమోదు ఆలస్యం, ఒటీపీ సమాచారం లేక రైతుల ఆందోళన</p>
<p>ఎరువులు, విత్తనాల కొనుగోలుకు ఇబ్బందులు</p>
<p>అక్షరదర్బార్, శాయంపేట:<br />వరిధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపుల జాప్యం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. శాయంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మి 9 నుంచి 10 రోజులు గడిచినా ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.రైతుల వివరాల ప్రకారం, ధాన్యం కొనుగోలు అనంతరం కేంద్రాల ఇన్‌చార్జీలు ట్యాబ్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉండగా, కొన్ని కేంద్రాల్లో ఈ ప్రక్రియ పూర్తికాలేదని చెబుతున్నారు. వివరాలు నమోదు చేసినా ఒటీపీ సంబంధిత సమాచారాన్ని రైతులకు తెలియజేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో చెల్లింపుల ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. మరోవైపు, రుతుపవనాల రాక సమీపిస్తున్న నేపథ్యంలో సాగు సన్నాహకాలకు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాల్సి ఉన్నా చేతిలో నగదు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం అమ్మిన సొమ్ము సమయానికి అందకపోవడం వల్ల వ్యవసాయ పనులు ప్రభావితమవుతున్నాయని వాపోతున్నారు.</p>
<p>అధికారులు స్పందించాలంటున్న రైతులు</p>
<p>ఐకేపీ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల రికార్డులను ఉన్నతాధికారులు తనిఖీ చేసి, ధాన్యం కొనుగోలు వివరాల నమోదులో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/expectations-of-farmers-for-wood-money/article-456</link>
                <guid>https://www.aksharadarbar.com/expectations-of-farmers-for-wood-money/article-456</guid>
                <pubDate>Thu, 11 Jun 2026 07:59:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-06/img_20260611_075757.jpg"                         length="393153"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!</title>
                                    <description><![CDATA[<p>ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!</p>
<p>అక్షరదర్బార్,శాయంపేట:<br />  గ్రామంలో తరచూ ఎదురవుతున్న విద్యుత్‌ సమస్యలను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో ఉపసర్పంచ్‌ సాయికృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు. శుక్రవారం కొత్తగట్టు సింగారం గ్రామంలో విద్యుత్‌ అంతరాయం ఏర్పడగా, పంచాయతీ సిబ్బందితో కలిసి కరెంట్‌ పోల్‌ ఎక్కి 11 కేవీ తీగకు జాయింట్‌ చేసి సరఫరా పునరుద్ధరించారు. అధికారుల నిర్లక్ష్యంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపసర్పంచ్‌ చొరవతో విద్యుత్‌ సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్తులు ఆయన సేవాభావాన్ని అభినందించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/upasarpanch-is-the-lineman/article-454"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-06/img_20260605_125710.jpg" alt=""></a><br /><p>ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!</p>
<p>అక్షరదర్బార్,శాయంపేట:<br /> గ్రామంలో తరచూ ఎదురవుతున్న విద్యుత్‌ సమస్యలను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో ఉపసర్పంచ్‌ సాయికృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు. శుక్రవారం కొత్తగట్టు సింగారం గ్రామంలో విద్యుత్‌ అంతరాయం ఏర్పడగా, పంచాయతీ సిబ్బందితో కలిసి కరెంట్‌ పోల్‌ ఎక్కి 11 కేవీ తీగకు జాయింట్‌ చేసి సరఫరా పునరుద్ధరించారు. అధికారుల నిర్లక్ష్యంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపసర్పంచ్‌ చొరవతో విద్యుత్‌ సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్తులు ఆయన సేవాభావాన్ని అభినందించారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/upasarpanch-is-the-lineman/article-454</link>
                <guid>https://www.aksharadarbar.com/upasarpanch-is-the-lineman/article-454</guid>
                <pubDate>Fri, 05 Jun 2026 13:02:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-06/img_20260605_125710.jpg"                         length="576428"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        