<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.aksharadarbar.com/av/author-9" rel="self" type="application/rss+xml" />
                <generator>అక్షర దర్బార్ RSS Feed Generator</generator>
                <title>AV - అక్షర దర్బార్</title>
                <link>https://www.aksharadarbar.com/author/9/rss</link>
                <description>AV RSS Feed</description>
                
                            <item>
                <title>నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ</title>
                                    <description><![CDATA[<p>నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ</p>
<p>అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు</p>
<p>అక్షరదర్బార్,నడికూడ: <br />నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల సమావేశంలో నూతన ప్రెస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జర్నలిస్టుల అభిప్రాయాలు, సూచనల మేరకు కమిటీని ఏర్పాటు చేశారు.నూతన కమిటీలో అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా గడ్డం బాలరాజు, ఉపాధ్యక్షుడిగా ముక్కెర చిరంజీవి, సహాయ కార్యదర్శులుగా ఐలి విజయ్, బొమ్మ అశోక్, భైరి సుధీర్ కుమార్, కోశాధికారిగా ఎం.డి. జమాలుద్దీన్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా బెజ్జంకి రాజేందర్, రజనీకాంత్, తాళ్ల రవి, చుక్క సతీష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.<br />ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శి పంచమనేని భాస్కరరావు మాట్లాడుతూ తమపై విశ్వాసం ఉంచి ఎన్నుకున్న జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తామని,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/new-committee-for-nadikooda-press-club/article-481"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img-20260705-wa1244.jpg" alt=""></a><br /><p>నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ</p>
<p>అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు</p>
<p>అక్షరదర్బార్,నడికూడ: <br />నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల సమావేశంలో నూతన ప్రెస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జర్నలిస్టుల అభిప్రాయాలు, సూచనల మేరకు కమిటీని ఏర్పాటు చేశారు.నూతన కమిటీలో అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా గడ్డం బాలరాజు, ఉపాధ్యక్షుడిగా ముక్కెర చిరంజీవి, సహాయ కార్యదర్శులుగా ఐలి విజయ్, బొమ్మ అశోక్, భైరి సుధీర్ కుమార్, కోశాధికారిగా ఎం.డి. జమాలుద్దీన్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా బెజ్జంకి రాజేందర్, రజనీకాంత్, తాళ్ల రవి, చుక్క సతీష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.<br />ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శి పంచమనేని భాస్కరరావు మాట్లాడుతూ తమపై విశ్వాసం ఉంచి ఎన్నుకున్న జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తామని, మండలంలోని పాత్రికేయులు ఎదుర్కొనే సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావాలని కోరారు. వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. అలాగే మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు నూతన ప్రెస్ క్లబ్ కమిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/new-committee-for-nadikooda-press-club/article-481</link>
                <guid>https://www.aksharadarbar.com/new-committee-for-nadikooda-press-club/article-481</guid>
                <pubDate>Sun, 05 Jul 2026 15:41:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260705-wa1244.jpg"                         length="173709"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దొంగతనం కేసు ఛేదన</title>
                                    <description><![CDATA[<p dir="ltr">దొంగతనం కేసు ఛేదన</p>
<p dir="ltr">ఆరుగురు నిందితుల అరెస్టు..</p>
<p dir="ltr">రూ.1.50 లక్షల నగదు స్వాధీనం</p>
<p dir="ltr">అక్షరదర్బార్, కాళేశ్వరం: <br />గత ఏడాది నిర్వహించిన సరస్వతీ పుష్కరాల సందర్భంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన టెంట్ సిటీలోని ఎనిమిది ఏసీ ఔటర్ యూనిట్లు దొంగిలించిన కేసును కాళేశ్వరం పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. టెంట్ సిటీ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ <a href="tel:592025">59/2025</a> కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా కాళేశ్వరం గ్రామానికి చెందిన మహేందర్, నారాయణ, జావేద్, సమ్మయ్య, సృజన్, సాయిలను అదుపులోకి తీసుకుని విచారించగా, టెంట్ సిటీలో ఏర్పాటు చేసిన ఎనిమిది ఏసీ ఔటర్ యూనిట్లను దొంగిలించినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దొంగిలించిన ఏసీ ఔటర్ యూనిట్లను గుర్తు తెలియని వ్యక్తికి విక్రయించి పొందిన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p dir="ltr">దొంగతనం కేసు ఛేదన</p>
<p dir="ltr">ఆరుగురు నిందితుల అరెస్టు..</p>
<p dir="ltr">రూ.1.50 లక్షల నగదు స్వాధీనం</p>
<p dir="ltr">అక్షరదర్బార్, కాళేశ్వరం: <br />గత ఏడాది నిర్వహించిన సరస్వతీ పుష్కరాల సందర్భంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన టెంట్ సిటీలోని ఎనిమిది ఏసీ ఔటర్ యూనిట్లు దొంగిలించిన కేసును కాళేశ్వరం పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. టెంట్ సిటీ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ <a href="tel:592025">59/2025</a> కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా కాళేశ్వరం గ్రామానికి చెందిన మహేందర్, నారాయణ, జావేద్, సమ్మయ్య, సృజన్, సాయిలను అదుపులోకి తీసుకుని విచారించగా, టెంట్ సిటీలో ఏర్పాటు చేసిన ఎనిమిది ఏసీ ఔటర్ యూనిట్లను దొంగిలించినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దొంగిలించిన ఏసీ ఔటర్ యూనిట్లను గుర్తు తెలియని వ్యక్తికి విక్రయించి పొందిన రూ.1.50 లక్షల నగదును నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.</p>
<p dir="ltr">ఎస్‌ఐ, సిబ్బందికి అభినందనలు</p>
<p dir="ltr">కేసును వేగంగా ఛేదించి నిందితులను గుర్తించి అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన కాళేశ్వరం ఎస్‌ఐ తమాషా రెడ్డి, పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/solving-the-theft-case/article-475</link>
                <guid>https://www.aksharadarbar.com/solving-the-theft-case/article-475</guid>
                <pubDate>Sat, 04 Jul 2026 18:27:39 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ</title>
                                    <description><![CDATA[<p>27 మందికి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ</p>
<p>పేద ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు సీఎం సహాయ నిధి</p>
<p>భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు</p>
<p><br />అక్షరదర్బార్, శాయంపేట: <br />శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం నిర్వహించిన సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) 30వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 27 మంది లబ్ధిదారులకు రూ.6,85,500 విలువైన చెక్కులను అందజేశారు.<br />ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో కవర్ కాని వైద్య చికిత్సలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు.<br />నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద రోగులు ఆసుపత్రి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/distribution-of-cm-relief-fund-cheques/article-473"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img-20260704-wa2056.jpg" alt=""></a><br /><p>27 మందికి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ</p>
<p>పేద ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు సీఎం సహాయ నిధి</p>
<p>భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు</p>
<p><br />అక్షరదర్బార్, శాయంపేట: <br />శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం నిర్వహించిన సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) 30వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 27 మంది లబ్ధిదారులకు రూ.6,85,500 విలువైన చెక్కులను అందజేశారు.<br />ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో కవర్ కాని వైద్య చికిత్సలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు.<br />నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద రోగులు ఆసుపత్రి నుంచి ఎస్టిమేషన్ కాపీ సమర్పిస్తే ప్రభుత్వం ఎల్‌ఓసీ మంజూరు చేసి చికిత్సకు అవసరమైన సహాయాన్ని అందిస్తోందని చెప్పారు. పేద ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు.<br />కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/distribution-of-cm-relief-fund-cheques/article-473</link>
                <guid>https://www.aksharadarbar.com/distribution-of-cm-relief-fund-cheques/article-473</guid>
                <pubDate>Sat, 04 Jul 2026 17:55:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260704-wa2056.jpg"                         length="183046"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి దారుణ హత్య</title>
                                    <description><![CDATA[<p>ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి దారుణ హత్య</p>
<p>షాప్ మూసి ఇంటికి వెళ్తుండగా ఘటన.. <br />పరారీలో నిందితుడు </p>
<p>అక్షరదర్బార్, రేగొండ: <br />జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని రంగయ్యపల్లి గ్రామానికి చెందిన జట్టి శ్రావణ్ (35) మండల కేంద్రంలో వైన్స్ షాప్ ఎదుట ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి సుమారు 10 గంటలకు షాప్ మూసి ఇంటికి వెళ్తుండగా మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు అతనిపై దాడి చేసి హత్య చేసినట్లు ఎస్సై దాసరి సుధాకర్ తెలిపారు. హత్యకు గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు ఘటన అనంతరం పరారైనట్లు తెలిపారు. మృతుడు శ్రావణ్‌కు భార్య మౌనిక, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/a-brutal-murder-of-a-fast-food-center-manager/article-472"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img_20260704_082456.jpg" alt=""></a><br /><p>ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి దారుణ హత్య</p>
<p>షాప్ మూసి ఇంటికి వెళ్తుండగా ఘటన.. <br />పరారీలో నిందితుడు </p>
<p>అక్షరదర్బార్, రేగొండ: <br />జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని రంగయ్యపల్లి గ్రామానికి చెందిన జట్టి శ్రావణ్ (35) మండల కేంద్రంలో వైన్స్ షాప్ ఎదుట ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి సుమారు 10 గంటలకు షాప్ మూసి ఇంటికి వెళ్తుండగా మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు అతనిపై దాడి చేసి హత్య చేసినట్లు ఎస్సై దాసరి సుధాకర్ తెలిపారు. హత్యకు గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు ఘటన అనంతరం పరారైనట్లు తెలిపారు. మృతుడు శ్రావణ్‌కు భార్య మౌనిక, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/a-brutal-murder-of-a-fast-food-center-manager/article-472</link>
                <guid>https://www.aksharadarbar.com/a-brutal-murder-of-a-fast-food-center-manager/article-472</guid>
                <pubDate>Sat, 04 Jul 2026 08:25:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img_20260704_082456.jpg"                         length="188304"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మహిళా ఉద్యోగులకు వేధింపులు</title>
                                    <description><![CDATA[<p>మహిళా ఉద్యోగులకు వేధింపులు<br />  <br />- ఓ ప్రభుత్వ కార్యాలయంలో కలకలం</p>
<p>- ఉన్నతాధికారిపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం</p>
<p>అక్షరదర్బార్, హనుమకొండ: హనుమకొండ జిల్లా డివిజన్‌లోని ఓ ఉన్నతాధికారిపై మహిళా ఉద్యోగులు వేధింపుల ఆరోపణలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన కింద పనిచేసే మహిళా సిబ్బందితో సదరు ఉన్నతాధికారి అనుచితంగా ప్రవర్తిస్తూ మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.<br />ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యేకు కూడా కొందరు మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తాము పనిచేస్తున్న కార్యాలయంలో విధులు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయని, ఇక్కడ పనిచేయడం కంటే సెలవులు తీసుకోవడమే మేలని కొందరు మహిళా ఉద్యోగులు తమ సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.<br />సదరు అధికారి వద్ద పనిచేయడానికి భద్రతాభావం లేకపోవడంతో పలువురు మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/harassment-of-women-employees/article-471"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img_20260703_131450.jpg" alt=""></a><br /><p>మహిళా ఉద్యోగులకు వేధింపులు<br /> <br />- ఓ ప్రభుత్వ కార్యాలయంలో కలకలం</p>
<p>- ఉన్నతాధికారిపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం</p>
<p>అక్షరదర్బార్, హనుమకొండ: హనుమకొండ జిల్లా డివిజన్‌లోని ఓ ఉన్నతాధికారిపై మహిళా ఉద్యోగులు వేధింపుల ఆరోపణలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన కింద పనిచేసే మహిళా సిబ్బందితో సదరు ఉన్నతాధికారి అనుచితంగా ప్రవర్తిస్తూ మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.<br />ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యేకు కూడా కొందరు మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తాము పనిచేస్తున్న కార్యాలయంలో విధులు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయని, ఇక్కడ పనిచేయడం కంటే సెలవులు తీసుకోవడమే మేలని కొందరు మహిళా ఉద్యోగులు తమ సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.<br />సదరు అధికారి వద్ద పనిచేయడానికి భద్రతాభావం లేకపోవడంతో పలువురు మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. అవసరమైతే సంబంధిత అధికారిని బదిలీ చేయాలని, లేదంటే మహిళా ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా బదిలీలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/harassment-of-women-employees/article-471</link>
                <guid>https://www.aksharadarbar.com/harassment-of-women-employees/article-471</guid>
                <pubDate>Fri, 03 Jul 2026 13:19:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img_20260703_131450.jpg"                         length="189386"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తీర్మానం లేకుండా నిధుల డ్రా.. </title>
                                    <description><![CDATA[<p>తీర్మానం లేకుండా నిధుల డ్రా.. <br />వార్డు సభ్యుల ఆగ్రహం</p>
<p>అక్షర దర్బార్, శాయంపేట: <br />గ్రామపంచాయతీలో తీర్మానం చేసి వార్డు సభ్యుల అనుమతితోనే నిధులు డ్రా చేయాలని కోరుతూ శాయంపేట గ్రామపంచాయతీ వార్డు సభ్యులు శాయంపేట ఎంపీడీవోతో పాటు హనుమకొండ జిల్లా డీపీఓకు సోమవారం వినతిపత్రం అందజేశారు.<br />ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీలో నిధుల వినియోగంపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. గ్రామపంచాయతీ సమావేశంలో తీర్మానం చేయకుండా, వార్డు సభ్యుల సంతకాలు లేకుండానే సర్పంచి, ఉపసర్పంచి, కార్యదర్శి ఆధ్వర్యంలో నిధులు డ్రా చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న వార్డు సభ్యులుగా ఉన్నప్పటికీ పంచాయతీలో జరుగుతున్న వ్యవహారాలపై తమకు సమాచారం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. నిధులు ఏ పనుల కోసం ఖర్చు చేశారనే వివరాలు అడిగినా స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.<br />ఇకపై గ్రామపంచాయతీ తీర్మానం అనంతరం సభ్యుల అనుమతితోనే నిధులు డ్రా చేసేలా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/draw-funds-without-resolution/article-467"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img-20260630-wa1668.jpg" alt=""></a><br /><p>తీర్మానం లేకుండా నిధుల డ్రా.. <br />వార్డు సభ్యుల ఆగ్రహం</p>
<p>అక్షర దర్బార్, శాయంపేట: <br />గ్రామపంచాయతీలో తీర్మానం చేసి వార్డు సభ్యుల అనుమతితోనే నిధులు డ్రా చేయాలని కోరుతూ శాయంపేట గ్రామపంచాయతీ వార్డు సభ్యులు శాయంపేట ఎంపీడీవోతో పాటు హనుమకొండ జిల్లా డీపీఓకు సోమవారం వినతిపత్రం అందజేశారు.<br />ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీలో నిధుల వినియోగంపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. గ్రామపంచాయతీ సమావేశంలో తీర్మానం చేయకుండా, వార్డు సభ్యుల సంతకాలు లేకుండానే సర్పంచి, ఉపసర్పంచి, కార్యదర్శి ఆధ్వర్యంలో నిధులు డ్రా చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న వార్డు సభ్యులుగా ఉన్నప్పటికీ పంచాయతీలో జరుగుతున్న వ్యవహారాలపై తమకు సమాచారం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. నిధులు ఏ పనుల కోసం ఖర్చు చేశారనే వివరాలు అడిగినా స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.<br />ఇకపై గ్రామపంచాయతీ తీర్మానం అనంతరం సభ్యుల అనుమతితోనే నిధులు డ్రా చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో కూడా సర్పంచి ఏకపక్షంగా వ్యవహరించారని, తమ వార్డుల్లో అర్హులు ఉన్నప్పటికీ వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండా లబ్ధిదారులను ఎంపిక చేశారని ఆరోపించారు. ఈ విషయంపై ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వలేదని తెలిపారు.<br />ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/draw-funds-without-resolution/article-467</link>
                <guid>https://www.aksharadarbar.com/draw-funds-without-resolution/article-467</guid>
                <pubDate>Wed, 01 Jul 2026 11:06:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260630-wa1668.jpg"                         length="246117"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు</title>
                                    <description><![CDATA[<p>ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు</p>
<p>- రేవూరి గొప్పతనం పరకాల ప్రజలకు తెలుసు </p>
<p>మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్</p>
<p>అక్షరదర్బార్, పరకాల :<br />పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదని పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ అన్నారు. ఆదివారం పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యఅతిథిగా సునీల్ కుమార్ పాల్గొని మాట్లాడారు.<br />రేవూరి ప్రకాష్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించిన నాయకుడని, పార్టీలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన సేవలను పరకాల ప్రజలు బాగా గుర్తించారని అన్నారు. అలాంటి నాయకుడిపై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం, దిష్టిబొమ్మ దహనం వంటి చర్యలకు పాల్పడటం సరికాదని విమర్శించారు.ప్రజా సమస్యల పరిష్కారంలో, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/brs-has-no-right-to-criticize-mla/article-462"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-06/img_20260621_174332.jpg" alt=""></a><br /><p>ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు</p>
<p>- రేవూరి గొప్పతనం పరకాల ప్రజలకు తెలుసు </p>
<p>మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్</p>
<p>అక్షరదర్బార్, పరకాల :<br />పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదని పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ అన్నారు. ఆదివారం పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యఅతిథిగా సునీల్ కుమార్ పాల్గొని మాట్లాడారు.<br />రేవూరి ప్రకాష్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించిన నాయకుడని, పార్టీలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన సేవలను పరకాల ప్రజలు బాగా గుర్తించారని అన్నారు. అలాంటి నాయకుడిపై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం, దిష్టిబొమ్మ దహనం వంటి చర్యలకు పాల్పడటం సరికాదని విమర్శించారు.ప్రజా సమస్యల పరిష్కారంలో, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నిరంతరం ముందుంటున్నారని తెలిపారు. ప్రజాదరణ కలిగిన నాయకుడిని విమర్శించడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు తమ రాజకీయ అసహనాన్ని బయటపెడుతున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, తగిన విధంగా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో కౌన్సిలర్లు బండి శ్రీధర్, కోయ్యడ శ్రీనివాస్ , దశరథం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/brs-has-no-right-to-criticize-mla/article-462</link>
                <guid>https://www.aksharadarbar.com/brs-has-no-right-to-criticize-mla/article-462</guid>
                <pubDate>Sun, 21 Jun 2026 17:48:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-06/img_20260621_174332.jpg"                         length="1960574"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు</title>
                                    <description><![CDATA[<p>వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు</p>
<p>కాంట వేసి 10 రోజులు దాటినా ఖాతాల్లో జమ కాని చెల్లింపులు</p>
<p>ట్యాబ్‌లో నమోదు ఆలస్యం, ఒటీపీ సమాచారం లేక రైతుల ఆందోళన</p>
<p>ఎరువులు, విత్తనాల కొనుగోలుకు ఇబ్బందులు</p>
<p>అక్షరదర్బార్, శాయంపేట:<br />వరిధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపుల జాప్యం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. శాయంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మి 9 నుంచి 10 రోజులు గడిచినా ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.రైతుల వివరాల ప్రకారం, ధాన్యం కొనుగోలు అనంతరం కేంద్రాల ఇన్‌చార్జీలు ట్యాబ్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉండగా, కొన్ని కేంద్రాల్లో ఈ ప్రక్రియ పూర్తికాలేదని చెబుతున్నారు. వివరాలు నమోదు చేసినా ఒటీపీ సంబంధిత సమాచారాన్ని రైతులకు తెలియజేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో చెల్లింపుల ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. మరోవైపు, రుతుపవనాల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/expectations-of-farmers-for-wood-money/article-456"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-06/img_20260611_075757.jpg" alt=""></a><br /><p>వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు</p>
<p>కాంట వేసి 10 రోజులు దాటినా ఖాతాల్లో జమ కాని చెల్లింపులు</p>
<p>ట్యాబ్‌లో నమోదు ఆలస్యం, ఒటీపీ సమాచారం లేక రైతుల ఆందోళన</p>
<p>ఎరువులు, విత్తనాల కొనుగోలుకు ఇబ్బందులు</p>
<p>అక్షరదర్బార్, శాయంపేట:<br />వరిధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపుల జాప్యం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. శాయంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మి 9 నుంచి 10 రోజులు గడిచినా ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.రైతుల వివరాల ప్రకారం, ధాన్యం కొనుగోలు అనంతరం కేంద్రాల ఇన్‌చార్జీలు ట్యాబ్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉండగా, కొన్ని కేంద్రాల్లో ఈ ప్రక్రియ పూర్తికాలేదని చెబుతున్నారు. వివరాలు నమోదు చేసినా ఒటీపీ సంబంధిత సమాచారాన్ని రైతులకు తెలియజేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో చెల్లింపుల ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. మరోవైపు, రుతుపవనాల రాక సమీపిస్తున్న నేపథ్యంలో సాగు సన్నాహకాలకు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాల్సి ఉన్నా చేతిలో నగదు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం అమ్మిన సొమ్ము సమయానికి అందకపోవడం వల్ల వ్యవసాయ పనులు ప్రభావితమవుతున్నాయని వాపోతున్నారు.</p>
<p>అధికారులు స్పందించాలంటున్న రైతులు</p>
<p>ఐకేపీ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల రికార్డులను ఉన్నతాధికారులు తనిఖీ చేసి, ధాన్యం కొనుగోలు వివరాల నమోదులో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/expectations-of-farmers-for-wood-money/article-456</link>
                <guid>https://www.aksharadarbar.com/expectations-of-farmers-for-wood-money/article-456</guid>
                <pubDate>Thu, 11 Jun 2026 07:59:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-06/img_20260611_075757.jpg"                         length="393153"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!</title>
                                    <description><![CDATA[<p>ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!</p>
<p>అక్షరదర్బార్,శాయంపేట:<br />  గ్రామంలో తరచూ ఎదురవుతున్న విద్యుత్‌ సమస్యలను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో ఉపసర్పంచ్‌ సాయికృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు. శుక్రవారం కొత్తగట్టు సింగారం గ్రామంలో విద్యుత్‌ అంతరాయం ఏర్పడగా, పంచాయతీ సిబ్బందితో కలిసి కరెంట్‌ పోల్‌ ఎక్కి 11 కేవీ తీగకు జాయింట్‌ చేసి సరఫరా పునరుద్ధరించారు. అధికారుల నిర్లక్ష్యంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపసర్పంచ్‌ చొరవతో విద్యుత్‌ సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్తులు ఆయన సేవాభావాన్ని అభినందించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/upasarpanch-is-the-lineman/article-454"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-06/img_20260605_125710.jpg" alt=""></a><br /><p>ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!</p>
<p>అక్షరదర్బార్,శాయంపేట:<br /> గ్రామంలో తరచూ ఎదురవుతున్న విద్యుత్‌ సమస్యలను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో ఉపసర్పంచ్‌ సాయికృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు. శుక్రవారం కొత్తగట్టు సింగారం గ్రామంలో విద్యుత్‌ అంతరాయం ఏర్పడగా, పంచాయతీ సిబ్బందితో కలిసి కరెంట్‌ పోల్‌ ఎక్కి 11 కేవీ తీగకు జాయింట్‌ చేసి సరఫరా పునరుద్ధరించారు. అధికారుల నిర్లక్ష్యంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపసర్పంచ్‌ చొరవతో విద్యుత్‌ సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్తులు ఆయన సేవాభావాన్ని అభినందించారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/upasarpanch-is-the-lineman/article-454</link>
                <guid>https://www.aksharadarbar.com/upasarpanch-is-the-lineman/article-454</guid>
                <pubDate>Fri, 05 Jun 2026 13:02:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-06/img_20260605_125710.jpg"                         length="576428"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఫోన్ కాల్.. ఆపై మృతి!</title>
                                    <description><![CDATA[<p>ఫోన్ కాల్.. ఆపై మృతి!</p>
<p>పరకాలలో యువకుడి అనుమానాస్పద మరణం.. <br />హత్యేనని కుటుంబ సభ్యుల ఆరోపణ</p>
<p>అక్షరదర్బార్, పరకాల: <br />నడికూడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మమ్మద్ షరీఫుద్దీన్‌ (35) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం పరకాల పట్టణంలో కలకలం రేపింది. మంగళవారం రాత్రి వచ్చిన ఫోన్ కాల్ అనంతరం బయటకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి చేరకపోగా, కొద్దిసేపటికే వెల్లంపల్లి రోడ్డులో మృతదేహంగా లభ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఉద్యోగ రీత్యా పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న భార్యతో కలిసి పరకాలలో నివాసం ఉంటున్న షరీఫుద్దీన్‌కు ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వాలు లేవని భార్య  పేర్కొన్నారు. ఫోన్ కాల్ వచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.<br />షరీఫుద్దీన్‌ను రేకుల షెడ్డులో హత్య చేసి అనంతరం రోడ్డుపై పడేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆయనకు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? ఎక్కడికి పిలిచారు? చివరిసారిగా ఎవరిని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/phone-call-and-then-death/article-452"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-06/img_20260603_085210.jpg" alt=""></a><br /><p>ఫోన్ కాల్.. ఆపై మృతి!</p>
<p>పరకాలలో యువకుడి అనుమానాస్పద మరణం.. <br />హత్యేనని కుటుంబ సభ్యుల ఆరోపణ</p>
<p>అక్షరదర్బార్, పరకాల: <br />నడికూడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మమ్మద్ షరీఫుద్దీన్‌ (35) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం పరకాల పట్టణంలో కలకలం రేపింది. మంగళవారం రాత్రి వచ్చిన ఫోన్ కాల్ అనంతరం బయటకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి చేరకపోగా, కొద్దిసేపటికే వెల్లంపల్లి రోడ్డులో మృతదేహంగా లభ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఉద్యోగ రీత్యా పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న భార్యతో కలిసి పరకాలలో నివాసం ఉంటున్న షరీఫుద్దీన్‌కు ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వాలు లేవని భార్య  పేర్కొన్నారు. ఫోన్ కాల్ వచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.<br />షరీఫుద్దీన్‌ను రేకుల షెడ్డులో హత్య చేసి అనంతరం రోడ్డుపై పడేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆయనకు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? ఎక్కడికి పిలిచారు? చివరిసారిగా ఎవరిని కలిశారు? అనే అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతున్నారు.<br />కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించి మృతి వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీయాలని పోలీసు ఉన్నతాధికారులను కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/phone-call-and-then-death/article-452</link>
                <guid>https://www.aksharadarbar.com/phone-call-and-then-death/article-452</guid>
                <pubDate>Wed, 03 Jun 2026 08:57:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-06/img_20260603_085210.jpg"                         length="922717"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్</title>
                                    <description><![CDATA[<p>పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్</p>
<p>అంజయ్య బదిలీ.. </p>
<p>అక్షరదర్బార్,పరకాల:<br />పరకాల మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా గ్రూప్-1 అధికారి పోతరాజు పవన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు కమిషనర్‌గా పనిచేసిన అంజయ్య దీర్ఘకాలిక సెలవులో ఉండటంతో గత కొన్ని రోజులుగా కమిషనర్ లేకపోవడంతో మున్సిపాలిటీలో పలు పరిపాలనా పనులు పెండింగ్‌లో ఉండిపోయాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పరకాలకు కొత్త కమిషనర్‌ను నియమించనున్నట్లు అక్షర దర్బార్ పత్రిక కథనం వెలువడగా, శనివారం పోతరాజు పవన్ కమిషనర్‌గా నియమించడం జరిగింది. అంజయ్య అసిఫాబాద్ కమిషనర్ గా బదిలీ అయ్యారు.</p>
<p>  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/potaraju-pawan-as-municipal-commissioner-of-parakala/article-451"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-05/img-20260524-wa1419.jpg" alt=""></a><br /><p>పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్</p>
<p>అంజయ్య బదిలీ.. </p>
<p>అక్షరదర్బార్,పరకాల:<br />పరకాల మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా గ్రూప్-1 అధికారి పోతరాజు పవన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు కమిషనర్‌గా పనిచేసిన అంజయ్య దీర్ఘకాలిక సెలవులో ఉండటంతో గత కొన్ని రోజులుగా కమిషనర్ లేకపోవడంతో మున్సిపాలిటీలో పలు పరిపాలనా పనులు పెండింగ్‌లో ఉండిపోయాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పరకాలకు కొత్త కమిషనర్‌ను నియమించనున్నట్లు అక్షర దర్బార్ పత్రిక కథనం వెలువడగా, శనివారం పోతరాజు పవన్ కమిషనర్‌గా నియమించడం జరిగింది. అంజయ్య అసిఫాబాద్ కమిషనర్ గా బదిలీ అయ్యారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/potaraju-pawan-as-municipal-commissioner-of-parakala/article-451</link>
                <guid>https://www.aksharadarbar.com/potaraju-pawan-as-municipal-commissioner-of-parakala/article-451</guid>
                <pubDate>Sat, 30 May 2026 20:24:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-05/img-20260524-wa1419.jpg"                         length="373785"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పరకాలలో ఒక్కసారిగా మంటలు</title>
                                    <description><![CDATA[<p>పరకాలలో ఒక్కసారిగా మంటలు</p>
<p>సీఐ క్రాంతికుమార్ చొరవతో తప్పిన పేను ప్రమాదం</p>
<p>అక్షరదర్బార్, పరకాల:<br />పరకాల పట్టణంలోని ఇండియన్ గ్యాస్ గోదాం వెనుక ఉన్న పంట పొలాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు కోసిన వరి గడ్డి, మొక్కజొన్న పంట అవశేషాలకు నిప్పంటించడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న సీఐ క్రాంతికుమార్ వెంటనే తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు.</p>
<p>అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో మంటలు వ్యాపించడంతో వ్యవసాయ బావుల వద్ద ఉన్న కరెంటు మోటార్లు, పైపులు, బట్ట పైపులు దగ్ధమయ్యాయి. మంటలు సమీపంలోని మామిడి తోటతో పాటు ఇండియన్ గ్యాస్ గోదాం వరకు వ్యాపించే ప్రమాదం నెలకొనగా సీఐ క్రాంతికుమార్ సమయస్ఫూర్తితో వ్యవహరించి భారీ నష్టం తప్పించారు.దీంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/all-of-a-sudden-there-was-a-fire/article-450"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-05/img-20260521-wa1927.jpg" alt=""></a><br /><p>పరకాలలో ఒక్కసారిగా మంటలు</p>
<p>సీఐ క్రాంతికుమార్ చొరవతో తప్పిన పేను ప్రమాదం</p>
<p>అక్షరదర్బార్, పరకాల:<br />పరకాల పట్టణంలోని ఇండియన్ గ్యాస్ గోదాం వెనుక ఉన్న పంట పొలాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు కోసిన వరి గడ్డి, మొక్కజొన్న పంట అవశేషాలకు నిప్పంటించడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న సీఐ క్రాంతికుమార్ వెంటనే తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు.</p>
<p>అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో మంటలు వ్యాపించడంతో వ్యవసాయ బావుల వద్ద ఉన్న కరెంటు మోటార్లు, పైపులు, బట్ట పైపులు దగ్ధమయ్యాయి. మంటలు సమీపంలోని మామిడి తోటతో పాటు ఇండియన్ గ్యాస్ గోదాం వరకు వ్యాపించే ప్రమాదం నెలకొనగా సీఐ క్రాంతికుమార్ సమయస్ఫూర్తితో వ్యవహరించి భారీ నష్టం తప్పించారు.దీంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన అనంతరం ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుపోయింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ తీవ్ర ఎండల కారణంగా గడ్డి పూర్తిగా ఎండిపోయి ఉంటుందని, రైతులు పంట అవశేషాలను కాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/all-of-a-sudden-there-was-a-fire/article-450</link>
                <guid>https://www.aksharadarbar.com/all-of-a-sudden-there-was-a-fire/article-450</guid>
                <pubDate>Thu, 21 May 2026 21:11:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-05/img-20260521-wa1927.jpg"                         length="405409"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        