<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.aksharadarbar.com/global/category-1" rel="self" type="application/rss+xml" />
                <generator>అక్షర దర్బార్ RSS Feed Generator</generator>
                <title>వార్తలు - అక్షర దర్బార్</title>
                <link>https://www.aksharadarbar.com/category/1/rss</link>
                <description>వార్తలు RSS Feed</description>
                
                            <item>
                <title>రగిలిన కరీంనగర్ </title>
                                    <description><![CDATA[<ul>
<li>గంగుల క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత </li>
<li>ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం <br />- కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్ ధ్వంసం <br />- సంజయ్ పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తల దాడి<br />- బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులను చదరగొట్టిన పోలీసులు</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/global/tension-at-gangula-camp-office/article-446"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-05/img-20260507-wa0016.jpg" alt=""></a><br /><p>గంగుల క్యాంపు ఆఫీస్ వద్ద ఉద్రిక్తత <br />- ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం <br />- కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్ ధ్వంసం <br />- సంజయ్ పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తల దాడి<br />- బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులను చదరగొట్టిన పోలీసులు</p>
<p>అక్షరదర్బార్, కరీంనగర్: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. గంగుల క్యాంపు ఆఫీస్ ఆవరణలో ఉన్న కౌశిక్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కమలాకర్ క్యాంపు కార్యాలయంలోని ఫర్నిచర్ తో పాటు ఇతర వస్తువులను కూడా ధ్వంసం చేశారు. గంగుల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని, ఉమ్మడి గన్ కల్చర్ వ్యాపిస్తుందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నా పైనా దుండగులురెక్కి నిర్వహిస్తున్నారని, జిల్లాలో శాంతిభద్రతలపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు సమీక్ష నిర్వహించాలని అన్నారు. బండి సంజయ్ తంబాకుతో డ్రగ్స్ కలిపి తీసుకుంటున్నారని, కేటీఆర్ డ్రగ్స్ టెస్టుకు సిద్ధమని, సంజయ్ కూడా టెస్టులకు రావాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. బుఆర్ఎస్, బీజేపీ శ్రేణులు గంగుల క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే చర్యలు చేపట్టారు. బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు గంగుల క్యాంపు కార్యాలయం నుంచి భద్రత నడుమ తీసుకెళ్లారు. తనను చంపడానికే బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/global/tension-at-gangula-camp-office/article-446</link>
                <guid>https://www.aksharadarbar.com/global/tension-at-gangula-camp-office/article-446</guid>
                <pubDate>Thu, 07 May 2026 12:38:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-05/img-20260507-wa0016.jpg"                         length="60250"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దోషులను వదిలే ప్రసక్తే లేదు </title>
                                    <description><![CDATA[<p>- కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది? <br />- సీఎం రేవంత్ రెడ్డి నిలదీత"<br />- లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వని కాళేశ్వరం.. రిపేర్లు చేసి తీరుతామని ధీమా</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/global/there-is-no-question-of-letting-the-guilty-go/article-411"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260420-wa0016.jpg" alt=""></a><br /><p>దోషులను వదిలే ప్రసక్తే లేదు<br />- కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది? <br />- సీఎం రేవంత్ రెడ్డి నిలదీత"<br />- లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వని కాళేశ్వరం.. రిపేర్లు చేసి తీరుతామని ధీమా</p>
<p>అక్షరదర్బార్, మహదేవపూర్</p>
<p>కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడిందని, ఈ కుంభకోణంలో దోషులు ఎంతటి వారైనా శిక్షించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన మొదట మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని రూ.198 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి అధికారులతో సమీక్ష జరిపిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ నుంచి మేడిగడ్డ కుప్పకూలే వరకు జరిగిన పరిణామాలపై అగ్నిపరీక్ష లాంటి విమర్శలు చేశారు. 1975లో జలగం వెంగళరావు హయాంలోనే గోదావరి జలాల వినియోగంపై మహారాష్ట్రతో ఒప్పందం జరిగిందని రేవంత్ గుర్తు చేశారు. 2009లో వైఎస్సార్ హయాంలో రూ.38,063 కోట్లతో మొదలైన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును, కేసీఆర్ ప్రభుత్వం కేవలం ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం 'కాళేశ్వరం'గా రీడిజైన్ చేసిందని మండిపడ్డారు. అంచనాలను ఏకంగా రూ.1.50 లక్షల కోట్లకు పెంచి, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. "2018 ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు అద్భుతమంటూ భ్రమలు కల్పించారు. కానీ 2023లో మేడిగడ్డ కుప్పకూలడంతో వీరి పాపం పండింది. ఎన్నికల కోసమే నిజాలను దాచాలని చూసినా, ప్రకృతి వాస్తవాలను బయటపెట్టింది" అని సీఎం అన్నారు. నవంబర్ 2023లో ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చినప్పటికీ, కేసీఆర్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు.<br />- హరీశ్ రావు ఢిల్లీ పర్యటనపై అనుమానాలు<br />మాజీ మంత్రి హరీశ్ రావు రహస్యంగా ఢిల్లీ పర్యటించడంపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "విచారణ నుంచి తప్పించుకోవడానికి బీజేపీ నేతల కాళ్లు పట్టుకోవడానికే హరీశ్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఎవరెవరిని కలిశారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. న్యాయవాదులను కలవాల్సిన అవసరం ఏముంది?" అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీలు లోపాయికారీ ఒప్పందంతో ఉన్నాయని, అందుకే తాము పదే పదే లేఖలు రాసినా సీబీఐ విచారణపై కేంద్రం స్పందించడం లేదని విమర్శించారు.<br />- ప్రాజెక్టుకు రిపేర్లు.. రైతులకు నీరు<br />కాళేశ్వరం ద్వారా ఇప్పటివరకు కనీసం లక్ష ఎకరాలకు కూడా కొత్తగా నీరు ఇవ్వలేకపోయారని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. నిజానికి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వల్లే రాష్ట్రంలో పంటలు పండుతున్నాయని, అది హరీశ్ రావుకు రాజకీయం తెలియకముందే ఉందన్నారు. ప్రభుత్వం త్వరలోనే నిపుణుల సలహాతో కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు చేయించి రైతులకు నీరందిస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్ర మంత్రులు  ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డి శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ వంశీకృష్ణ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/global/there-is-no-question-of-letting-the-guilty-go/article-411</link>
                <guid>https://www.aksharadarbar.com/global/there-is-no-question-of-letting-the-guilty-go/article-411</guid>
                <pubDate>Mon, 20 Apr 2026 20:07:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260420-wa0016.jpg"                         length="1437845"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>4.45 గంటల పర్యటన </title>
                                    <description><![CDATA[<p><br />- మధ్యాహ్నం 3 మూడు గంటలకు కాళేశ్వరం చేరుకోనున్న సీఎం <br />- శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం అనంతరం మేడిగడ్డకు <br />- సాయంత్రం 6.30 గంటలకు నస్తురుపల్లి వద్ద సభలో రైతు భరోసా నిధుల విడుదల</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/global/445-hours-of-travel/article-409"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260419-wa0012.jpg" alt=""></a><br /><p>4.45 గంటల పర్యటన <br />- మధ్యాహ్నం 3 మూడు గంటలకు కాళేశ్వరం చేరుకోనున్న సీఎం <br />- శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం అనంతరం మేడిగడ్డకు <br />- సాయంత్రం 6.30 గంటలకు నస్తురుపల్లి వద్ద సభలో రైతు భరోసా నిధుల విడుదల</p>
<p>అక్షరదర్బార్, కాటారం: రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి 20వ తేదీ సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన జిల్లాలో 4.45 గంటల పాటు కొనసాగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లాలోని కాళేశ్వరం చేరుకునే సీఎం రేవంత్ రెడ్డి కాటారం మండలంలోని మస్తురిపల్లి వద్ద జరిగే బహిరంగ సభ ముగిసిన తర్వాత రాత్రి 7:45 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన షెడ్యూల్ ఆదివారం విడుదలైంది. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి..</p>
<p>మధ్యాహ్నం 1.45 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తమ నివాసం నుంచి బయలుదేరి 2.00 గంటలకు బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 3.00 గంటలకు కాళేశ్వరం ఆలయానికి చేరుకుంటారు.<br />3.05 నుండి 3.25 గంటల మధ్య శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం చేసి, ఆలయంలో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.<br />3.30 గంటలకు కాళేశ్వరం నుంచి బయలుదేరి 3.45 గంటలకు మహాదేవపూర్ మండలం మేడిగడ్డకు చేరుకుంటారు. అక్కడ 3.45 నుండి 4.30 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతాన్ని పరిశీలిస్తారు.<br />4.35 నుండి 5.30 గంటల వరకు అంబట్‌పల్లి గెస్ట్ హౌస్‌లో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం 5.35 నుండి 6.00 గంటల వరకు మీడియా సమావేశంలో పాల్గొంటారు.<br />6.00 గంటలకు మేడిగడ్డ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 6.30 గంటలకు కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ 6.30 నుండి 7.45 గంటల వరకు  రైతు భరోసా పథకం రెండో విడత నిధులను విడుదల చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ ముగిసిన తర్వాత రాత్రి 7.45 గంటలకు నస్తూరుపల్లి నుంచి బయలుదేరి రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుంటారు.<img src="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260419-wa0008.jpg" alt="IMG-20260419-WA0008" width="733" height="1447"></img></p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/global/445-hours-of-travel/article-409</link>
                <guid>https://www.aksharadarbar.com/global/445-hours-of-travel/article-409</guid>
                <pubDate>Sun, 19 Apr 2026 21:17:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260419-wa0012.jpg"                         length="71106"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తహసిల్దార్ల బదిలీ </title>
                                    <description><![CDATA[<ul>
<li>పదిమంది తహసిల్దార్లు, ముగ్గురు నాయబ్ తహసిల్దార్లకు స్థాన చలనం</li>
<li>జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/global/transfer-of-tehsildars/article-396"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260404-wa0023.jpg" alt=""></a><br /><p>తహసిల్దార్ల బదిలీ </p>
<p>- పది మంది తహసీల్దార్లు, ముగ్గురు నాయబ్ తహసిల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు </p>
<p>అక్షరదర్బార్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పది మంది తహసీల్దార్లు, ముగ్గురు నాయబ్ తహసీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్  రాహుల్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.  బదిలీ అయిన తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు తమకు కేటాయించిన కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. విధుల్లో చేరిన వెంటనే సంబంధిత చేరిక నివేదికలను సమర్పించాలని స్పష్టంచేశారు. అధికారులు విధుల్లో చేరడంలో ఆలస్యం చేయకుండా, ప్రభుత్వ పరిపాలనా పనులు నిరంతరంగా సాగేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.<img src="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260404-wa00261.jpg" alt="IMG-20260404-WA0026" width="738" height="1031"></img><img src="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260404-wa0027.jpg" alt="IMG-20260404-WA0027" width="738" height="1131"></img></p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/global/transfer-of-tehsildars/article-396</link>
                <guid>https://www.aksharadarbar.com/global/transfer-of-tehsildars/article-396</guid>
                <pubDate>Sat, 04 Apr 2026 19:29:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260404-wa0023.jpg"                         length="55236"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏసీబీ అధికారుల సోదాలు </title>
                                    <description><![CDATA[<ul>
<li>సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు</li>
<li>కీలక పత్రాలు, డాక్యుమెంట్లు పరిశీలన </li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/global/acb-officials-search/article-393"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260402-wa0012.jpg" alt=""></a><br /><p>ఏసీబీ కలకలం </p>
<p>- సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు </p>
<p>అక్షరదర్బార్, హనుమకొండ: <br />హనుమకొండ వడ్డేపల్లి వద్ద ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులకు దిగడం సంచలనం సృష్టిస్తుంది. ఈ కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు ఆఫీస్ లో నుంచి ఎవరు బయటకు వెళ్లకుండా తలుపులు మూసివేసి సోదాలు నిర్వహిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఛాంబర్ లోని కీలక పత్రాలు, రిజిస్ట్రేషన్ ఫైళ్ళు, నగదు నిల్వలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అక్రమ వసూళ్లు లేదా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరుగుతున్నాయనే  సమాచారంతో ఏసీబీ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తుంది. ఈ దాడుల్లో ఎంత నగదు దొరికింది? ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? అనే పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మొత్తానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండటం ఇక్కడ కలకలం రేపింది.</p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/global/acb-officials-search/article-393</link>
                <guid>https://www.aksharadarbar.com/global/acb-officials-search/article-393</guid>
                <pubDate>Thu, 02 Apr 2026 17:19:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260402-wa0012.jpg"                         length="40986"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆరబెట్టిన మిర్చి చోరీ </title>
                                    <description><![CDATA[<ul>
<li>5 క్వింటాళ్ల మిర్చి అపహరణ</li>
<li>విలువ రూ.లక్ష.. పోలీసులకు ఫిర్యాదు</li>
<li>హనుమకొండ జిల్లాలో ఘటన</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/global/stealing-dried-chillies/article-382"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-03/img-20260307-wa0009.jpg" alt=""></a><br /><p>బావి వద్ద అరబెట్టిన మిర్చి మాయం..</p>
<p>మల్లక్కపేట–నాగారం శివారులో చోరీ…</p>
<p> పరకాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు</p>
<p>అక్షరదర్బార్, పరకాల:<br />హన్మకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట–నాగారం గ్రామాల శివారులో రైతు అరబెట్టిన మిర్చిని గుర్తు తెలియని దొంగలు అపహరించిన ఘటన చోటుచేసుకుంది. మల్లక్కపేట గ్రామానికి చెందిన దొమ్మటి బాబు అనే రైతు తన మిర్చిని బావి వద్ద అరబెట్టగా, అక్కడి నుంచి సుమారు 5 క్వింటాళ్ల మిర్చిని దొంగలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం.<br />అపహరణకు గురైన మిర్చి విలువ లక్ష రూపాయలకు పైగా ఉంటుందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై బాధితుడు పరకాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఇటీవల మిర్చికి మార్కెట్లో డిమాండ్ పెరగడంతో కొంతమంది ముఠాలు చోరీలకు పాల్పడుతున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా పుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.<br />మిర్చి నిల్వలను పొలాల్లో లేదా బావుల వద్ద అరబెట్టే రైతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ ఘటనతో పరిసర గ్రామాల రైతుల్లో ఆందోళన నెలకొంది.</p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/global/stealing-dried-chillies/article-382</link>
                <guid>https://www.aksharadarbar.com/global/stealing-dried-chillies/article-382</guid>
                <pubDate>Sat, 07 Mar 2026 11:34:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-03/img-20260307-wa0009.jpg"                         length="102092"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మేడారం.. ట్రాఫిక్ నరకం</title>
                                    <description><![CDATA[<ul>
<li>టెక్నాలజీ తుస్సు.. యంత్రాంగం ఫస్సు!</li>
<li>మేడారం - హనుమకొండ 11 గంటల జర్నీ </li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/global/medaram-traffic-is-hell/article-369"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-01/img-20260131-wa0010.jpg" alt=""></a><br /><p>మేడారంలో 'ట్రాఫిక్' నరకం<br />- టెక్నాలజీ తుస్సు.. యంత్రాంగం ఫస్సు!</p>
<p>అక్షరదర్బార్, మేడారం: తెలంగాణ కుంభమేళా, మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరలో భక్తుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. సర్కారు ఆర్భాటంగా చేసిన ప్రకటనలు క్షేత్రస్థాయిలో నీటి మూటలుగానే మిగిలాయి. కోట్లాది రూపాయల ఖర్చు, హైటెక్ హంగులు, ఏఐ (ఏఐ) నిఘా అంటూ గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వ యంత్రాంగం.. ట్రాఫిక్ నియంత్రణలో ఘోరంగా విఫలమై చేతులెత్తేసింది.<br />- గంటల కొద్దీ ‘చక్రబంధం’.. నరకప్రాయం ప్రయాణం!<br />మేడారం వెళ్లే దారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయి భారీ నరకాన్ని తలపిస్తున్నాయి. పస్రా నుంచి మేడారం చేరుకోవడానికి భక్తులకు ఏకంగా 10 గంటల సమయం పడుతుండటం అధికారుల వైఫల్యానికి పరాకాష్ట.  పస్రా - తాడ్వాయి మధ్య ఈ స్వల్ప దూరానికే 4 గంటల సమయం పడుతోంది. తాడ్వాయి - మేడారం మధ్య మరో 4 గంటల పాటు వాహనాలు అంగుళం కూడా కదలని పరిస్థితి. మేడారం నుంచి హనుమకొండ చేరుకోవడానికి 11 గంటల సమయం పట్టింది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు మేడారం నుంచి బయలుదేరిన భక్తులు శనివారం తెల్లవారుజామున ఐదు గంటలకు హనుమకొండలో దిగారు. చిన్నారులు, వృద్ధులు ఆకలి దప్పులతో వాహనాల్లోనే అలమటిస్తుంటే, పోలీస్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.<br />- ఏఐ అంటే ‘అంతే సంగతులా’?<br />ఈసారి జాతరలో ట్రాఫిక్ కష్టాలు ఉండవని, ఆధునిక సాంకేతికత మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పర్యవేక్షిస్తున్నామని చెప్పిన మాటలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. వేల సంఖ్యలో సీసీ కెమెరాలు, డ్రోన్లు ఉన్నా.. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో పసిగట్టి క్లియర్ చేయడంలో పోలీస్ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది.<br />- రోడ్లపై రద్దీ.. క్యూలైన్లలో ఖాళీ!<br />విచిత్రమేమిటంటే, ఒకవైపు కిలోమీటర్ల మేర రోడ్లపై భక్తులు చిక్కుకుపోగా, మేడారంలో క్యూలైన్లు మాత్రం వెలవెలబోతున్నాయి. భక్తులు గమ్యస్థానానికి చేరుకోలేక అడవి బాటలోనే ఆగిపోవడంతో గద్దెల వద్ద రద్దీ తగ్గింది. యంత్రాంగం మధ్య సమన్వయ లోపం భక్తుల పాలిట శాపంగా మారింది.<br />- నిట్టూరుస్తున్న భక్తులు<br />"మేము మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చామా లేక రోడ్లపై శిక్ష అనుభవించడానికి వచ్చామా?" అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన ట్రాఫిక్ క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/global/medaram-traffic-is-hell/article-369</link>
                <guid>https://www.aksharadarbar.com/global/medaram-traffic-is-hell/article-369</guid>
                <pubDate>Sat, 31 Jan 2026 10:04:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-01/img-20260131-wa0010.jpg"                         length="29153"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన</title>
                                    <description><![CDATA[<p> అంతర్జాతీయ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా వచ్చిన స్వదేశీ యాప్ 'అరట్టై' (Arattai) పేరు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ వినిపించింది. తన వాట్సాప్ ఖాతాను నిలిపివేశారని, దాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/warangal/what-is-the-indigenous-arattai-if-whatsapp-supreme-court/article-348"><img src="https://www.aksharadarbar.com/media/400/2025-10/arratai.jpg" alt=""></a><br /><p>అక్షర దర్బార్​, ప్రధాన ప్రతినిధి : అంతర్జాతీయ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా వచ్చిన స్వదేశీ యాప్ 'అరట్టై' (Arattai) పేరు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ వినిపించింది. తన వాట్సాప్ ఖాతాను నిలిపివేశారని, దాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి.</p>
<h6><strong>అసలేం జరిగింది?</strong></h6>
<p>తన వాట్సాప్ ఖాతాను సంస్థ ఉన్నపళంగా బ్లాక్ చేసిందని, దీనిని పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ కాలంగా తాను ఈ యాప్‌ ద్వారానే క్లయింట్‌లతో సంప్రదింపులు జరుపుతున్నానని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.</p>
<p>దీనిపై స్పందించిన ధర్మాసనం (జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా), పిటిషనర్‌ను ప్రశ్నిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.</p>
<h6><strong>ధర్మాసనం వ్యాఖ్యలు:</strong></h6>
<p>"వాట్సాప్‌ను వినియోగించుకోవడం అనేది మీ ప్రాథమిక హక్కు ఎలా అవుతుంది?"</p>
<p>"మీరు సమాచారం పంపడానికి, కమ్యూనికేట్ చేయడానికి ఇతర అప్లికేషన్‌లను ఉపయోగించవచ్చు కదా!"</p>
<p>"వాట్సాప్‌ లేకపోతే ఏమైంది? ఇటీవల కొత్తగా వచ్చిన స్వదేశీ యాప్ 'అరట్టై'ని వాడండి. మేక్ ఇన్ ఇండియా (Made in India)!" అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.</p>
<p>అయితే, ఈ పిటిషన్‌పై ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించిన కోర్టు, పిటిషనర్‌ను తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతించింది.</p>
<img src="https://www.aksharadarbar.com/media/2025-10/arratai.jpg" alt="arratai" width="545" height="307"></img>
arratai

<p>'అరట్టై' అనేది దేశీయ సంస్థ జోహో కార్పొరేషన్ రూపొందించిన మెసేజింగ్ యాప్. ఇటీవల కేంద్ర మంత్రులు సహా పలువురు ప్రముఖులు ఈ యాప్‌ను ప్రమోట్ చేయడంతో దీనికి విపరీతమైన ఆదరణ లభించింది. తమిళంలో 'అరట్టై' అంటే 'సాదాసీదా సంభాషణ' అని అర్థం. స్వదేశీ యాప్‌లకు మద్దతు ఇవ్వాలనే 'ఆత్మనిర్భర్ భారత్' పిలుపు నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                            <category>వరంగల్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/warangal/what-is-the-indigenous-arattai-if-whatsapp-supreme-court/article-348</link>
                <guid>https://www.aksharadarbar.com/warangal/what-is-the-indigenous-arattai-if-whatsapp-supreme-court/article-348</guid>
                <pubDate>Sat, 11 Oct 2025 17:35:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2025-10/arratai.jpg"                         length="55426"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[SL]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కొడితే మాములుగా ఉండదు..  రేవంత్ స‌ర్కార్‌కు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్‌</title>
                                    <description><![CDATA[<ul>
<li>నమ్మి ఓటేస్తే మంచి గుణపాఠం లభించింది </li>
<li>గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా..</li>
<li>ఇక లాభంలేదు.. ప్రత్యక్ష పోరాటాలే..</li>
<li>ఫిబ్రవరి చివరిలో భారీ బహిరంగ సభ </li>
</ul>
<p>అక్ష‌ర‌ద‌ర్బార్‌, ఎర్ర‌వెల్లి : రేవంత్ స‌ర్కార్‌కు బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాను కొడితే మామూలుగా ఉండదని, గట్టిగా కొట్టడం తనకు ఉన్న అలవాటు అని చెప్పారు. తాను గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని అన్నారు. ఫిబ్రవరి నెల చివరిలో తెలంగాణలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇవాళ (శుక్రవారం) జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కోహీర్ , జహీరాబాద్, ఝారసంఘం, మొగుడాంపల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. మన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/politics/it-is-not-normal-%C2%A0/article-259"><img src="https://www.aksharadarbar.com/media/400/2025-01/whatsapp-image-2025-01-31-at-4.08.22-pm.jpeg" alt=""></a><br /><ul>
<li>నమ్మి ఓటేస్తే మంచి గుణపాఠం లభించింది </li>
<li>గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా..</li>
<li>ఇక లాభంలేదు.. ప్రత్యక్ష పోరాటాలే..</li>
<li>ఫిబ్రవరి చివరిలో భారీ బహిరంగ సభ </li>
</ul>
<p>అక్ష‌ర‌ద‌ర్బార్‌, ఎర్ర‌వెల్లి : రేవంత్ స‌ర్కార్‌కు బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాను కొడితే మామూలుగా ఉండదని, గట్టిగా కొట్టడం తనకు ఉన్న అలవాటు అని చెప్పారు. తాను గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని అన్నారు. ఫిబ్రవరి నెల చివరిలో తెలంగాణలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇవాళ (శుక్రవారం) జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కోహీర్ , జహీరాబాద్, ఝారసంఘం, మొగుడాంపల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. మన విజయం తెలంగాణ ప్రజల విజయం. రాబోయే రోజుల్లో విజయం మనదే. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కండి అంటూ గులాబీ ద‌ళ‌ప‌తి శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.</p>
<p>ప్రాజెక్టులు పడుకున్నాయి </p>
<p>సంగమేశ్వరం, బసవేశ్వరం, కాళేశ్వరం ఎండబెడుతున్నారు. భూములు ధరలు అమాంతం పడిపోతున్నాయి. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్ట్ టెండర్లను.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆపింది. కరోనాలో కూడా రైతుబంధు ఇచ్చి.. రైతుల కోసం మంచి పథకాలు తెస్తే అంతా గంగలో కలిసిపోయింది. గురుకుల హాస్టల్లో తిండి బాగా లేక.. పిల్లలు అనారోగ్యం బారినపడుతున్నారు. బీఆర్ఎస్ రాజకీయాల కోసం పుట్టింది కాదు. ఇక లాభంలేదు.. ప్రత్యక్ష పోరాటాలే. కాంగ్రెస్ పాలనలో రైతుబంధుకి రాంరాం. దళితబంధుకి జైభీమ్‌ చెప్పేశారు. తులం బంగారం పథకం గోవిందా. కాంగ్రెస్‌ పాలనపై అంతటా అసంతృప్తి. అన్నివర్గాలను ముంచిన పార్టీ కాంగ్రెస్. కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లైంది. కాంగ్రెస్ పాలనపై దండయాత్ర చేద్దాం. తెలంగాణలో ఏ ఒక్క పథకం సరిగ్గా అమలుకావడం లేదు. ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుంది.  అని రేవంత్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. </p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                            <category>రాజకీయం</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/politics/it-is-not-normal-%C2%A0/article-259</link>
                <guid>https://www.aksharadarbar.com/politics/it-is-not-normal-%C2%A0/article-259</guid>
                <pubDate>Fri, 31 Jan 2025 16:09:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2025-01/whatsapp-image-2025-01-31-at-4.08.22-pm.jpeg"                         length="42820"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RK]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పునర్నిర్మాణంలో భాగస్వాములం అవుదాం</title>
                                    <description><![CDATA[<ul>
<li>రెవెన్యూ వ్యవస్థపై డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్</li>
<li>గత ప్రభుత్వ విధానాలతో రెవెన్యూ వ్యవస్థ ధ్వంసమైందని ఆవేదన</li>
<li>వరంగల్ లో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/global/lets-be-partners-in-rebuilding/article-246"><img src="https://www.aksharadarbar.com/media/400/2024-12/img-20241229-wa0020.jpg" alt=""></a><br /><p>పునర్నిర్మాణంలో భాగస్వాములం అవుదాం</p>
<p>- రెవెన్యూ వ్యవస్థపై తెలంగాణా డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్, టీజీటీఏ అధ్యక్షుడు లచ్చిరెడ్డి<br />- గత ప్రభుత్వ విధానాలతో రెవెన్యూ వ్యవస్థ ధ్వంసమైందని ఆవేదన<br />- వరంగల్ లో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం</p>
<p>అక్షరదర్బార్, వరంగల్:<br />తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థ పునర్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్, తెలంగాణ తహసిల్దార్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం వరంగల్ లోని ఐశ్వర్య గార్డెన్ లో జరిగిన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైన లచ్చి రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలతో ఎలా రెవెన్యూ వ్యవస్థ ను ధ్వంసం చేశారు, రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొన్న అవమానాలను, మన తోటి ఉద్యోగులు రాత్రికి రాత్రి ఎలాంటి సర్వీస్ కాని వయసు గానీ అర్హతలను తీసుకోకుండా 5200 మంది వీఆర్వోలను వేరే శాఖలోకి నిరంకుశ ధోరణితో పంపించడం జరిగిందని అన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులు వేరే శాఖలోకి వెళ్ళిన సందర్భంలో రెవెన్యూ శాఖలో గ్రామస్థాయిలో పనిచేసే అధికారులు లేక రెవెన్యూ ఉద్యోగులు అనగా తహసీల్దార్ నుంచి జిల్లా కలెక్టర్ స్థాయి వరకు నానా రకాలుగా ఇబ్బందులకు గురైనారని, వరదలు, కరువు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రాథమిక విచారణ చేసి నివేదిక సమర్పించే అధికారులు లేకపోవడం, ప్రభుత్వ భూముల ఆక్రమణలను పసిగట్టడంలో వైఫల్యం పొందిందని, ప్రజా శ్రేయస్సు కోసం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించి నిర్ణయం తీసుకుందని, అందుకు అనుగుణంగా రెవెన్యూ వ్యవస్థను తిరిగి బలోపేతం చేసేలా రెవెన్యూ వ్యవస్థ పునర్ వైభవంలో ప్రతి ఒక రెవెన్యూ ఉద్యోగి భాగస్వామి కావాలని లచ్చిరెడ్డి కోరారు.</p>
<p>- ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత రెవెన్యూ ఉద్యోగుల మీద ఉంది</p>
<p>- టీజీటీఏ స్టేట్ జనరల్ ప్రెసిడెంట్ రమేష్ పాక</p>
<p>రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అమలుపరిచే ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసే బాధ్యత రెవెన్యూ ఉద్యోగుల మీద ఉందని, అలాంటి రెవెన్యూ వ్యవస్థ పునర్ నిర్మాణం, పునర్ వైభవం తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నం చేసి ధరణి 2020 మూలంగా సామాన్య రైతు తను కోల్పోయిన భూములను పొందాలంటే కోర్టుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగారని, కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించి కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి పట్టాదార్ పాస్ బుక్కులు జారీ చేసే అధికారం తాసిల్దార్ కు, ఆర్ డిఓకు కల్పించడం చాలా శుభ పరిణామమని రమేష్ పాక అన్నారు.</p>
<p>- టీజీటీఏ స్టెట్ జనరల్ సెక్రటరీ: ఫూల్ సింగ్ చౌహాన్:</p>
<p>దేశంలోనే పలు రాష్ట్రాల రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేసి తెలంగాణ ప్రజల భౌగోళిక స్వరూపాన్ని బట్టి దానికి అనుకూలమైనటువంటి నూతన రెవెన్యూ చట్టం భూభారతి అవసరం ఎంతైనా ఉన్నదని, తెలంగాణ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాాలు జారీ చేయుటకు ఎలాంటి సమస్య అయినా మండల స్థాయిలో పరిష్కరించుటకు భూభారతి చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని ఫూల్ సింగ్ చౌహాన్ అన్నారు.</p>
<p>- తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ సభ్యత్వం కొరకు ఆప్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రారంభం</p>
<p>- టీజీటీఏ స్టేట్ ప్రెసిడెంట్ : రాములు</p>
<p>మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ TGRSA సభ్యత్వ నమోదు యాప్ కార్యక్రమాన్ని లచ్చిరెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా ప్రారంభించారు. ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి రెవెన్యూ సంక్షేమం కొరకు రెవెన్యూ సమస్యలు పరిష్కారం కొరకు ఆప్ లో సభ్యత్వ నమోదు చేసుకోవాలని కోరారు.</p>
<p>- టీజీటీఏ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్: మొహ్మద్ ఇక్బాల్</p>
<p> గతి ప్రభుత్వ హయాంలో వీఆర్ఏలను రెండు వర్గాలుగా విభజించి 60 సంవత్సరాల లోపల ఉన్న వారికి జూనియర్ అసిస్టెంట్ లుగా  పోస్టింగ్ లు ఇచ్చారని, 61 సంవత్సరాలు దాటిన వారికి ఇంకా పోస్టులు ఇవ్వకుండా పెండింగ్లో ఉన్నందున వారి సమస్యను సానుకూలంగా  స్పందించి పెండింగ్ లో ఉన్న 3,797 మంది వీఆర్ఏలకి పోస్టింగ్ లు ఇప్పించాలని TGTA స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ మొహ్మద్ ఇక్బాల్ కోరారు.</p>
<p>- టీజీటీఏ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ: విక్రమ్ కుమార్</p>
<p>అదే విధంగా ఇంకా పెండింగ్ లో ఉన్న 61 సంవత్సరాలు దాటిన వీఆర్ఏ, చనిపోయిన వీఆర్ఏల కుటుంబాలకు న్యాయం చేయాలని TGTA ఆర్గనైజింగ్ సెక్రెటరీ విక్రమ్ కుమార్  కోరారు. వీఆర్ఏ ఉద్యోగం చేస్తూ CCLA కార్యాలయం నుంచి జారీ చేసిన సర్కులర్ కంటే ముందు చనిపోయిన వీఆర్ఏలందరికి కూడా వారి వారసులకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కారణంగా నియమాకాలు చేపట్టి వారి కుటుంబాలను ఆదుకోవాలని, ఇట్టి విషయంలో లచ్చి రెడ్డి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్య, రేణుక తదితరులు పాల్గొన్నారు. </p>
<p>- వరంగల్, హనుమకొండ మండలాల నూతన TGRSA కమిటీ ఏర్పాటు</p>
<p>జిల్లా అధ్యక్షుడిగా ముత్తినేని రంజిత్ కుమార్, జనరల్ సెక్రటరీగా ప్రసాద్ జేఏసీ చైర్మన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి హనుమకొండ జిల్లా TGRSA సెక్రటరీగా రంజిత్ కుమార్, జనరల్ సెక్రటరీగా జి నాగేంద్రప్రసాద్, వరంగల్ జిల్లా అధ్యక్షుడుగా నాగేంద్రప్రసాద్, జనరల్ సెక్రటరీగా కీర్తన్ ఎంపికయ్యారు. ఇదే కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ గా సుభాన్, సుమన్, జలపతి ఎన్నికయ్యారు.<img src="https://www.aksharadarbar.com/media/2024-12/img-20241229-wa0019.jpg" alt="IMG-20241229-WA0019" width="1600" height="1064"></img></p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/global/lets-be-partners-in-rebuilding/article-246</link>
                <guid>https://www.aksharadarbar.com/global/lets-be-partners-in-rebuilding/article-246</guid>
                <pubDate>Sun, 29 Dec 2024 17:52:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2024-12/img-20241229-wa0020.jpg"                         length="469185"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎస్పీ, జ‌డ్జి చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకం.. ఎందుకంటే ?</title>
                                    <description><![CDATA[<p>అక్ష‌ర‌ద‌ర్బార్‌, మహబూబాబాద్ : జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్, న్యాయమూర్తి తిరుపతి చిత్రపటాలకు ఓ వ్య‌క్తి పాలాభిషేకం చేసి త‌న అభిమానం చాటుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సీటు ఇప్పిస్తానంటూ దళారి తీసుకున్న రెండు లక్షల  రూపాయలను తిరిగి ఇప్పించి లోక్ అదాలత్ లో ఇరువురి కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించినందుకు కృత‌జ్ఞ‌త‌గా మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఎదుట చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే..  కురవి మండలం గుండ్రాతి మడుగు (విలేజ్)కు చెందిన పత్తి  వెంకన్న తన కుమారుడికి హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సీటు కోసం మేడ్చల్‌కు చెందిన ఓ వ్య‌క్తికి రూ. 2 లక్షలు ఇచ్చాడు. సీటు ఇప్పించకపోగా తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో బాధితుడు కురవి పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేశారు. కురవి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/warangal/because-sp-judges-pictures-are-anointed/article-234"><img src="https://www.aksharadarbar.com/media/400/2024-12/whatsapp-image-2024-12-14-at-7.05.34-pm.jpeg" alt=""></a><br /><p>అక్ష‌ర‌ద‌ర్బార్‌, మహబూబాబాద్ : జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్, న్యాయమూర్తి తిరుపతి చిత్రపటాలకు ఓ వ్య‌క్తి పాలాభిషేకం చేసి త‌న అభిమానం చాటుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సీటు ఇప్పిస్తానంటూ దళారి తీసుకున్న రెండు లక్షల  రూపాయలను తిరిగి ఇప్పించి లోక్ అదాలత్ లో ఇరువురి కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించినందుకు కృత‌జ్ఞ‌త‌గా మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఎదుట చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే..  కురవి మండలం గుండ్రాతి మడుగు (విలేజ్)కు చెందిన పత్తి  వెంకన్న తన కుమారుడికి హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సీటు కోసం మేడ్చల్‌కు చెందిన ఓ వ్య‌క్తికి రూ. 2 లక్షలు ఇచ్చాడు. సీటు ఇప్పించకపోగా తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో బాధితుడు కురవి పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేశారు. కురవి ఎస్ఐ సతీష్ బాధ్యతాయుతంగా స్పందించి దళారిని పోలీస్  స్టేషన్‌కు తీసుకువచ్చి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేశాడు. ఈమేర‌కు జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో ఇరువురి కక్షిదారుల మధ్య రాజీ కుదుర్చి డబ్బులను ఇప్పించి కేసు పరిష్కరించారు. పోయాయనుకున్న రెండు లక్షల రూపాయలను తిరిగి తనకు అందేలా చేసిన జిల్లా ఎస్పీ, న్యాయమూర్తిల చిత్రపటాలకు మహబూబాబాద్‌లోని కోర్టు ఎదుట బాధితుడు పత్తి వెంకన్న పాలాభిషేకం నిర్వహించి తన కృతజ్ఞత చాటుకున్నారు. </p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                            <category>వరంగల్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/warangal/because-sp-judges-pictures-are-anointed/article-234</link>
                <guid>https://www.aksharadarbar.com/warangal/because-sp-judges-pictures-are-anointed/article-234</guid>
                <pubDate>Sat, 14 Dec 2024 19:20:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2024-12/whatsapp-image-2024-12-14-at-7.05.34-pm.jpeg"                         length="102878"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RK]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మకాం మార్చిన ఇసుక మాఫియా</title>
                                    <description><![CDATA[<ul>
<li>అక్రమ సంపాదనకై మహదేవపూర్ కు షిఫ్ట్</li>
<li>ఓం ఇసుక ట్రాక్టర్ పట్టివేత </li>
<li>మూడు రోజుల నుంచి జోరుగా రవాణా?</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/global/relocated-sand-mafia/article-230"><img src="https://www.aksharadarbar.com/media/400/2024-12/img-20241208-wa0009.jpg" alt=""></a><br /><p>మకాం మార్చిన ఇసుక మాఫియా...!!!</p>
<p>* అక్రమ సంపాదనకై మహదేవపూర్​ కు షిఫ్ట్<br />​ <br />* మహదేవపూర్​ లో ఇసుక ట్రాక్టర్​ పట్టివేత<br /> <br />* మూడు రోజులుగా కుదురుపల్లి నుండి జోరుగా అక్రమ ఇసుక రవాణా...?</p>
<p> * కేసు నుండీ తప్పించాలంటూ అధికారులతో మంతనాలు </p>
<p>అక్షర దర్బార్​, కాటారంః<br />భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని విలాసాగర్​ నుండి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తూ అక్రమార్జనకు తెగపడ్డారు. ఈ విషయమై 'అక్షర దర్బార్'​ పత్రికలో వరుస కథనాలు వెలువడగా స్పందించిన పోలీస్​ యంత్రాంగం విలాసాగర్​ నుండీ అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని కేసులు నమోదు చేశారు. కొందరు అక్రమార్కులు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంపులుగా ఏర్పాటుచేసుకుని వరంగల్​,హైదరాబాద్​ లాంటి నగరాలకు లారీల్లో తరలిస్తూ సొమ్ముచేసుకున్నారు.ఈ నేపథ్యంలో స్పందించిన కాటారం పోలీసులు అక్రమ ఇసుక రవాణా ఉక్కుపాదం మోపి కేసులు నమోదు చేయగా సదరు ఇసుక స్మగ్లర్లు మకాం మార్చారు.మహదేవపూర్​ మండలం కేంద్రంగా అర్థరాత్రుల్లో ఇసుక తరలింపుకై పన్నాగం పన్ని అక్రమార్గంలో ఇసుకను తరలిస్తుండగా ఆదివారం రెండ్​ హ్యాండెడ్​ గా ఓ ట్రాక్టర్​ పట్టుబడింది.కాగా ఆ ట్రాక్టర్​ కాటారం మండలంలోని గంగారం గ్రామానికి చెందిన వ్యక్తిదిగా తెలుస్తోంది.</p>
<p><br />సండే కలిసొస్తుందనే పక్కా ప్లాన్ </p>
<p> <br /> ఆదివారం అధికారులు అందుబాటులో ఉండరనే పక్కా ప్రణాళికతో కాటారం మండలానికి చెందిన కొందరు వ్యక్తులు తమ ట్రాక్టర్లను కుదురుపల్లిలోని ఇసుకను  అర్థరాత్రి నుండి అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం. అక్రమార్జనకై బానిసైన సదరు వ్యక్తులు కాటారం మండలంలో  ఇసుక రవాణాను బంద్​ చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు.దీంతో ఏమైనా సరే తగ్గేదెలే అంటూ మహదేవపూర్​ మండలమే తమ అక్రమార్జనకు అనువైన ప్రాంతమని భావించి సంబంధిత అధికారులకు ముందుగానే సమాచారం అందించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో  ఆదివారం అనువైన సమయమైన మేం ఆఫ్​ డ్యూటి అని చెప్పుకోవచ్చనీ మీ పని మీరు చేసుకోండి మాకేమైనా ఉంటే చూసుకోండంటూ సదరు అక్రమ ఇసుక రవాణా వ్యక్తులకు ముందస్తూ సంకేతాలు కింది స్థాయి ఉద్యోగుల తో సంబంధిత అధికారులు చెప్పించినట్లు తెలుస్తోంది.అయితే విషయం కాస్తా స్థానిక మీడియాకు తెలియడంతో స్వయంగా ఆ రిపోర్టర్లు అధికారులకు సమాచారం అందించగా ఏం చేయలేని స్థితిలో ట్రాక్టర్​ ను పట్టుకున్నట్లుగా తెలుస్తున్నది.కాగా పట్టుబడిన ట్రాక్టర్​ యజమాని తన బంధువులైన రాజకీయ నాయకుల అండదండలతో కేసు నుండీ తప్పించుకునేందుకు మంతనాలు జరిపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.</p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/global/relocated-sand-mafia/article-230</link>
                <guid>https://www.aksharadarbar.com/global/relocated-sand-mafia/article-230</guid>
                <pubDate>Sun, 08 Dec 2024 18:34:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2024-12/img-20241208-wa0009.jpg"                         length="200752"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        