<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.aksharadarbar.com/crime/category-2" rel="self" type="application/rss+xml" />
                <generator>అక్షర దర్బార్ RSS Feed Generator</generator>
                <title>క్రైమ్ - అక్షర దర్బార్</title>
                <link>https://www.aksharadarbar.com/category/2/rss</link>
                <description>క్రైమ్ RSS Feed</description>
                
                            <item>
                <title>ఏసీబీ వలలో తహశీల్దార్ </title>
                                    <description><![CDATA[<p>- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు</p>
<p>- రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/tehsildar-in-acb-network/article-483"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img-20260706-wa0019.jpg" alt=""></a><br /><p>ఏసీబీ వలలో తహశీల్దార్ </p>
<p>- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు</p>
<p>- రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ </p>
<p>సిద్దిపేట జిల్లా చేర్యాల మండల తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. భూమి సంబంధిత పని కోసం వచ్చిన వ్యక్తి నుంచి రూ.70 వేల లంచం తీసుకుంటుండగా తహశీల్దార్ దిలీప్ నాయక్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.<br />ఫిర్యాదు మేరకు ముందస్తు ప్రణాళికతో ట్రాప్ నిర్వహించిన ఏసీబీ అధికారులు, అనంతరం కార్యాలయంలో సోదాలు చేపట్టి పలు రికార్డులు, పత్రాలను పరిశీలించారు. లంచం వ్యవహారానికి సంబంధించిన మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. తహశీల్దార్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలపై ఏసీబీ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ ఘటనతో చేర్యాల మండలంలో కలకలం రేగింది.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/tehsildar-in-acb-network/article-483</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/tehsildar-in-acb-network/article-483</guid>
                <pubDate>Mon, 06 Jul 2026 18:33:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260706-wa0019.jpg"                         length="132889"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భర్త హత్యకు భార్య స్కెచ్ </title>
                                    <description><![CDATA[<p>- రూ.4 లక్షల సుపారీ<br />- సింగారం మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేధన<br />- యాకయ్య మృతి వెనుక అసలు నిజాలు బయటపెట్టిన ఎస్పీ <br />- భార్యతో సహా ఏడుగురు అరెస్ట్</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/a-sketch-of-a-wife-for-murdering-her-husband/article-476"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img-20260704-wa0019.jpg" alt=""></a><br /><p>భర్త హత్యకు భార్య స్కెచ్ <br />- రూ.4 లక్షల సుపారీ<br />- సింగారం మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేధన<br />- యాకయ్య మృతి వెనుక అసలు నిజాలు బయటపెట్టిన ఎస్పీ <br />- భార్యతో సహా ఏడుగురు అరెస్ట్</p>
<p>అక్షరదర్బార్, మహబూబాబాద్:<br />మహబూబాబాద్ మండలం సింగారం గ్రామంలో ఈ నెల 1వ తేదీ తెల్లవారుజామున జరిగిన మాజీ ఉప సర్పంచ్ యాకయ్య (57) హత్య కేసును మహబూబాబాద్ టౌన్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. వివాహేతర సంబంధం, ఆస్తి గొడవలే ఈ దారుణ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. భర్తను అంతమొందించేందుకు రూ.4 లక్షల సుపారీ మాట్లాడిన భార్య యశోద (53)తో పాటు హత్యకు పాల్పడిన మరో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శబరిష్ ఈ సంచలన హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.<br />- పరాయి మహిళకు ఆస్తి ఇస్తాడనే భయంతోనే..<br />పోలీసుల కథనం ప్రకారం.. మృతుడు యాకయ్యకు గ్రామంలోని మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో తన ఆస్తిని ఆ మహిళకు ఎక్కడ రాసిస్తాడోననే భయం భార్య యశోదలో మొదలైంది. దీంతో భర్తను పూర్తిగా వదిలించుకోవాలని నిర్ణయించుకున్న ఆమె, యాకయ్యను హత్య చేసేందుకు రూ.4 లక్షల సుపారీని మాట్లాడి నిందితులతో ఒప్పందం కుదుర్చుకుంది.<br />- దోపిడీగా చిత్రీకరించే ప్రయత్నం ఫెయిల్..<br />పథకం ప్రకారం.. ఈ నెల 1వ తేదీ తెల్లవారుజామున దుండగులు యాకయ్యపై ఇనుప రాడ్‌తో దాడి చేసి దారుణంగా కొట్టి చంపారు. అనంతరం ఇదంతా దొంగల పనిగా చిత్రీకరించేందుకు యాకయ్య మెడలోని బంగారు గొలుసును తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. అయితే రంగంలోకి దిగిన టౌన్ పోలీసులు సాంకేతిక ఆధారాలు, పక్కా సమాచారంతో దర్యాప్తు చేపట్టి అసలు సూత్రధారి భార్య యశోదనే అని గుర్తించారు.<br />- సామగ్రి సీజ్.. పోలీసులకు అభినందనలు<br />ఈ కేసులో ప్రధాన నిందితురాలైన భార్య యశోదతో పాటు మరో ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి 7 సెల్‌ఫోన్లు, ఒక ఐరన్ రాడ్, 2 ద్విచక్ర వాహనాలు, మృతుడి మెడ నుంచి దొంగిలించిన 1 బంగారు గొలుసును పోలీసులు సీజ్ చేశారు. కేసును చాకచక్యంగా ఛేదించిన టౌన్ పోలీస్ సిబ్బందిని ఎస్పీ శబరిష్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.<img src="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260704-wa0020.jpg" alt="IMG-20260704-WA0020" width="540" height="1200"></img></p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/a-sketch-of-a-wife-for-murdering-her-husband/article-476</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/a-sketch-of-a-wife-for-murdering-her-husband/article-476</guid>
                <pubDate>Sat, 04 Jul 2026 19:11:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260704-wa0019.jpg"                         length="75850"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సీఐ, ఎస్సై సస్పెన్షన్ </title>
                                    <description><![CDATA[<p>- ఒకే కేసులో సీఐ, ఎస్ఐలను సస్పెన్షన్ చేసిన వరంగల్ సీపీ <br />- విచారణలో అవినీతి ఆరోపణలు నిజమని తేలటంతో నిర్ణయం</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/suspension-of-ci-sci/article-466"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-06/546-5467892_telangana-police-logo-png-telangana-police-logo-transparent.png" alt=""></a><br /><p>సీఐ, ఎస్సై సస్పెన్షన్ </p>
<p>- ఒకే కేసులో సీఐ, ఎస్ఐలను సస్పెన్షన్ చేసిన వరంగల్ సీపీ <br />- విచారణలో అవినీతి ఆరోపణలు నిజమని తేలటంతో నిర్ణయం </p>
<p>అక్షరదర్బార్, హనుమకొండ: వరంగల్ కమిషనరేట్ పరిధిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారులపై కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కొరడా ఝలిపిస్తున్నారు. తాజాగా మరో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు. వెస్ట్ జోన్ పరిధిలోని నర్మెట్ట సర్కిల్ ఇన్ స్పెక్టర్ యం అబ్బయ్య, గతంలో బచ్చన్నపేట ఎస్ఐగా పని చేసి ప్రస్తుతం ఏఆర్ అటాచ్డ్ లో ఉన్న ఎస్ఐ షేక్ హమీద్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఇరువురు అధికారులను సస్పెండ్ చేస్తునట్లు సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే కేసులో సీఐ, ఎస్సైపై సీపీ సస్పెన్షన్ వేటు వేయడం కమిషనరేట్ పరిధిలో కలకలం రేపింది.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/suspension-of-ci-sci/article-466</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/suspension-of-ci-sci/article-466</guid>
                <pubDate>Sun, 28 Jun 2026 13:12:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-06/546-5467892_telangana-police-logo-png-telangana-police-logo-transparent.png"                         length="245806"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రం గుట్టురట్టు</title>
                                    <description><![CDATA[<p>- టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి.. ఒకరి అరెస్ట్</p>
<p>- రూ. 2.25 లక్షల విలువైన నిల్వలు స్వాధీనం</p>
<p> </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/the-adulterated-greens-manufacturing-center-is-gutturattu/article-464"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-06/img-20260625-wa0003.jpg" alt=""></a><br /><p> </p>
<p>కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రం గుట్టురట్టు</p>
<p>- టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి.. ఒకరి అరెస్ట్</p>
<p>- రూ. 2.25 లక్షల విలువైన నిల్వలు స్వాధీనం</p>
<p> </p>
<p>అక్షరదర్బార్, వరంగల్: వరంగల్ నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఒక అక్రమ, కల్తీ పచ్చడి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ నకిలీ పచ్చళ్ల దందాను మట్టుబెట్టి, ఒకరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 2.25 లక్షల విలువైన కుళ్లిపోయిన ఆహార నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.</p>
<p>- ఇల్లే కేంద్రంగా అక్రమ వ్యాపారం</p>
<p>టాస్క్ ఫోర్స్ అధికారుల కథనం ప్రకారం... ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశీబుగ్గ సాయి వీధిలో ఉన్న ఓ నివాస గృహంలో అక్రమంగా పచ్చళ్లు తయారు చేస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఎ మధుసూదన్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ బండారి రాజు, ఆర్‌ఎస్‌ఐ ఓ. భాను ప్రకాష్ మరియు సిబ్బంది ఆ గృహంపై ఆకస్మిక దాడి జరిపారు. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున కుళ్లిపోయిన పచ్చడి ముడిసరుకులు, ప్రమాదకర రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ కుళ్లిపోయిన నిల్వలను చిన్న చిన్న ఆకర్షణీయమైన ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి, స్థానిక కిరాణా దుకాణాలు, హోటళ్లు, ఇతర చిన్న వ్యాపార కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.</p>
<p>- భారీగా కుళ్లిపోయిన సరుకు స్వాధీనం</p>
<p>ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన కాశీబుగ్గ నివాసి అరికెల శ్రీనివాస్ (51) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తయారీ కేంద్రం నుండి దాదాపు 2,100 కిలోల కల్తీ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 750 కిలోల టమోటా ముడిసరుకు, 900 కిలోల మామిడి ముక్కలు, 200 కిలోల నిమ్మకాయలు, 100 కిలోల ఉసిరికాయలు, 150 కిలోల అల్లం-వెల్లుల్లి పేస్ట్ ఉన్నాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ.2,25,000 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పట్టుబడిన నిందితుడిని, స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.</p>
<p>- ప్రజలు అప్రమత్తంగా ఉండాలి</p>
<p>"మార్కెట్లో లభించే బ్రాండ్ లేని, అనుమానాస్పద ఆహార పదార్థాలు, పచ్చళ్లను కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తక్కువ ధరకు వస్తున్నాయని కొని ఆరోగ్యాలను పాడుచేసుకోవద్దు. నగరంలో ఎక్కడైనా ఇలాంటి అక్రమ నిల్వ కేంద్రాలు లేదా కల్తీ ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలి, సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతాం." అని టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎ. మధుసూదన్ అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/the-adulterated-greens-manufacturing-center-is-gutturattu/article-464</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/the-adulterated-greens-manufacturing-center-is-gutturattu/article-464</guid>
                <pubDate>Thu, 25 Jun 2026 16:48:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-06/img-20260625-wa0003.jpg"                         length="223228"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లారీ బీభత్సం.. ఆర్టీవో మృతి </title>
                                    <description><![CDATA[<ul>
<li>భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు ఘోర ప్రమాదం</li>
<li>దూసుకెళ్లిన లారీ.. ఆర్టీవో వెంకన్న దుర్మరణం </li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/larry-bibhatsam-rto-died/article-463"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-06/img-20260622-wa0005.jpg" alt=""></a><br /><p>లారీ బీభత్సం.. ఆర్టీవో మృతి </p>
<p>- భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు ఘోర ప్రమాదం</p>
<p><br />అక్షరదర్బార్, భూపాలపల్లిక్రైమ్:</p>
<p>గణపురం మండలం చెల్పూర్ వద్ద భూపాలపల్లి - పరకాల ప్రధాన రహదారిపై గల జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా అధికారి (ఆర్టీవో) కార్యాలయం ముందు సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీవో వెంకన్న బొగ్గు లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఓ బొగ్గు లారీ ఆర్టీవో వెంకన్న పైనుంచి దూసుకు వెళ్లింది. నడుముపై నుంచి వెళ్లటం వల్ల తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే సంఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయారు. </p>
<p>సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్టీవో సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని భూపాలపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే అధికారిగా పేరున్న వెంకన్న మృతి పట్ల జిల్లా యంత్రాంగం, రవాణా శాఖ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీవో కార్యాలయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. వెంకన్న ఇటీవలే ఈనెల 4న జగిత్యాల నుంచి బదిలీపై భూపాలపల్లి జిల్లా రవాణా అధికారిగా వచ్చారు. వెంకన్న స్వస్థలం మహబూబాబాద్ జిల్లా. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు.<img src="https://www.aksharadarbar.com/media/2026-06/img-20260622-wa0008.jpg" alt="IMG-20260622-WA0008" width="1072" height="712"></img></p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/larry-bibhatsam-rto-died/article-463</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/larry-bibhatsam-rto-died/article-463</guid>
                <pubDate>Mon, 22 Jun 2026 10:29:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-06/img-20260622-wa0005.jpg"                         length="187354"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గంజాయి చాక్లెట్ల కలకలం</title>
                                    <description><![CDATA[<p>- ఒడిశా కేటుగాడి అరెస్ట్<br />- ఎంజీఎం సర్కిల్ వద్ద పట్టుకున్న పోలీసులు..<br />- 72 'సెవెన్ మైనర్ వతి' చాక్లెట్లు స్వాధీనం</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/a-mix-of-cannabis-chocolates/article-455"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-06/img-20260607-wa0016.jpg" alt=""></a><br /><p>గంజాయి చాక్లెట్ల కలకలం<br />- ఒడిశా కేటుగాడి అరెస్ట్<br />- ఎంజీఎం సర్కిల్ వద్ద పట్టుకున్న పోలీసులు..<br />- 72 'సెవెన్ మైనర్ వతి' చాక్లెట్లు స్వాధీనం</p>
<p>అక్షరదర్బార్, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు గంజాయి చాక్లెట్ల అక్రమ రవాణాను రట్టు చేశారు. మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు భారీగా గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకొని, ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. మట్వాడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్‌ఐ) ఎస్ శివకృష్ణ తన సిబ్బంది డి నాగరాజు, బి సత్యనారాయణ, పి రవిలతో కలిసి స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎంజీఎం సర్కిల్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసుల కంటపడ్డాడు. సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద ఉన్న నలుపు రంగు బ్యాగును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ బ్యాగులో చాక్లెట్ల రూపంలో ఉన్న గంజాయి పదార్థం బయటపడటంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు.<br />- ఒడిశా టు మహారాష్ట్ర.. వరంగల్ మీదుగా స్మగ్లింగ్<br />పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు ఒడిశా రాష్ట్రం, భద్రక్ జిల్లా, కాన్పాడా గ్రామానికి చెందిన జనార్ధన్ మాలిక్ (వయస్సు 35 ఏళ్లు) గా గుర్తించారు. నిందితుడి వద్ద నిషేధిత పదార్థం దొరకడంతో మట్వాడ పోలీసులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారి ఆదేశాల మేరకు పంచులు (సాక్షులు), క్లూస్ టీంను సంఘటనా స్థలానికి రప్పించి చట్టపరమైన ప్రక్రియను చేపట్టారు.<br />పంచుల సమక్షంలో నిందితుడిని విచారించగా అసలు విషయం ఒప్పుకున్నాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన తన పరిచయస్తుడు అంకిత్ పాణిగ్రహి వద్ద నుండి ఈ గంజాయి మిశ్రమ చాక్లెట్లను తక్కువ ధరకు కొనుగోలు చేశానని.. వీటిని మహారాష్ట్రలోని సోలాపూర్ ప్రాంతానికి తరలించి అక్కడ అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోవాలనే దురాశతో తీసుకెళ్తున్నట్లు నిందితుడు స్వచ్ఛందంగా అంగీకరించాడు.<br />- ఘాటైన వాసన.. 'క్యానబిస్ సటైవా' గుర్తింపు<br />నిందితుడి వద్ద లభించిన గోల్డ్ కలర్ కవర్లపై “Seven Minor Vati” అని ముద్రించి ఉంది. పోలీసులు మొత్తం 72 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ కవర్లపై ఉన్న వివరాలను పరిశీలించగా.. అందులో ‘క్యానబిస్ సటైవా’ (గంజాయి) సహా పలు మత్తు పదార్థాలు కలిపి తయారు చేసినట్లు నిర్ధారణ అయింది. పంచులు, పోలీసుల సమక్షంలో వాటిని పరిశీలించగా చాక్లెట్ల నుండి గంజాయికి ఉండే ప్రత్యేకమైన ఘాటైన వాసన రావడంతో వాటిని సీజ్ చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న మట్వాడ ఎస్‌ఐ శివకృష్ణ, పీసీలు నాగరాజు, సత్యనారాయణ, రవిలను ఉన్నతాధికారులు అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/a-mix-of-cannabis-chocolates/article-455</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/a-mix-of-cannabis-chocolates/article-455</guid>
                <pubDate>Sun, 07 Jun 2026 22:13:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-06/img-20260607-wa0016.jpg"                         length="326068"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>యాక్సిడెంట్ లో ఒకరి మృతి </title>
                                    <description><![CDATA[<p>- మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి.</p>
<p>- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/one-died-in-an-accident/article-443"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-05/img-20260506-wa0016.jpg" alt=""></a><br /><p>రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి</p>
<p>- మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి.</p>
<p>- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు.</p>
<p>అక్షరదర్బార్, మొగుళ్లపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన హుజురాబాద్ మండలం చిలుకూరు ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద బుధవారం సంభవించింది. హుజురాబాద్ పోలీసుల కథనం ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన కత్తి నరసయ్య గౌడ్ అనే వ్యక్తి తన సొంత వాహనంలో హుజురాబాద్ నుండి జమ్మికుంట వైపు వస్తున్న క్రమంలో చేల్పూరు ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద అతివేగంగా కారు ను  ఢీకొట్టడంతో కారు నడుపుతున్న నరసయ్య. అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న హుజురాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. రంగాపురం గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి,<img src="https://www.aksharadarbar.com/media/2026-05/img-20260506-wa00151.jpg" alt="IMG-20260506-WA0015" width="1200" height="1600"></img></p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/one-died-in-an-accident/article-443</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/one-died-in-an-accident/article-443</guid>
                <pubDate>Wed, 06 May 2026 16:13:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-05/img-20260506-wa0016.jpg"                         length="296360"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేటుగాళ్ల నల్ల దందా </title>
                                    <description><![CDATA[<p>- నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్టు<br />- 1:3 ఆశచూపి నల్ల కాగితాలతో మోసాలు<br />- కలర్ ప్రింటర్లతో రూ.100 నోట్ల ముద్రణ<br />- రూ. 28 లక్షల విలువైన సామాగ్రి, నగదు స్వాధీనం</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/the-black-danda-of-ketugala/article-432"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-05/img-20260504-wa0012.jpg" alt=""></a><br /><div>కేటుగాళ్ల నల్ల దందా </div>
<div> </div>
<div>- నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్టు</div>
<div>- 1:3 ఆశచూపి నల్ల కాగితాలతో మోసాలు</div>
<div>- కలర్ ప్రింటర్లతో రూ.100 నోట్ల ముద్రణ</div>
<div>- రూ. 28 లక్షల విలువైన సామాగ్రి, నగదు స్వాధీనం</div>
<div> </div>
<div>అక్షరదర్బార్, హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న, రసాయనాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న భారీ ముఠాను వరంగల్ టాస్క్‌ఫోర్స్, నర్సంపేట పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. మొత్తం ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిఊ వద్ద నుండి రూ.1,48,000 నగదు, రెండు కార్లు, 13 సెల్ ఫోన్లు, సుమారు రూ. 28 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలను ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ సోమవారం మీడియాకు వెల్లడించారు. నిందితులు రెండు గ్రూపులుగా విడిపోయి నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. నర్సంపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులు ల్యాప్‌టాప్, కలర్ ప్రింటర్లను ఉపయోగించి రూ.100 నోట్లను ముద్రించి మార్కెట్‌లో చలామణి చేస్తున్నారు. మిగిలిన ఐదుగురు వ్యక్తులు 1:3 నిష్పత్తిలో (ఒక్క రూపాయికి మూడు రూపాయలు) డబ్బు ఇస్తామని నమ్మిస్తారు. ఇందుకోసం వారు అసలైన రూ.500 నోటును అయోడిన్ టింక్చర్ ద్రావణంలో ముంచి నల్లగా మారుస్తారు. తిరిగి దానిపై 'హైపో' (సోడియం థయోసల్ఫేట్) పోయగానే అది పాత రూపానికి వస్తుంది. ఇది చూసి నమ్మిన బాధితులకు నల్ల కాగితాల కట్టలను ఇచ్చి, అసలు నగదుతో పరారవుతారు.</div>
<div>- నిందితుల వివరాలు</div>
<div>పోలీసుల కథనం ప్రకారం అరెస్టయిన వారిలో శాగంటి కిరణ్ (నర్సంపేట), నీరటి శివ (నర్సంపేట), నీరటి రంజిత్ (నర్సంపేట), గుడికందుల రవి (నర్సంపేట), పోరిక రాజ్‌కుమార్ @ రాజు (ఘన్‌పూర్, ములుగు), తనమాల రాజశేఖర్ (ఖమ్మం), ముదురుకోల యాకంబరం (భువనగిరి), చేను సాయికిరణ్ (కొత్తగూడెం) ఉన్నారు.</div>
<div>- పాత నేరస్థులే..</div>
<div>ఈ ముఠా గతంలో ఘన్‌పూర్, సికింద్రాబాద్ (మోండా మార్కెట్), ఖమ్మం, కొత్తగూడెం, కేయూసీ, సుబేదారీ పరిధిలో అనేక మోసాలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లు డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఛత్రినాక, నర్సంపేటలలోనూ ఇవే తరహా మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.</div>
<div>సాహసోపేతంగా ఈ ముఠాను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూధన్, నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు బాబులాల్, శ్రీనివాస్, ఇతర సిబ్బందిని పోలీస్ కమిషనర్ (సీపీ) ప్రత్యేకంగా అభినందించారు.<img src="https://www.aksharadarbar.com/media/2026-05/img-20260504-wa0012.jpg" alt="IMG-20260504-WA0012" width="1600" height="1066"></img></div>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/the-black-danda-of-ketugala/article-432</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/the-black-danda-of-ketugala/article-432</guid>
                <pubDate>Mon, 04 May 2026 17:45:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-05/img-20260504-wa0012.jpg"                         length="337357"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జ్యువెలరీ షాపులో కాల్పులు</title>
                                    <description><![CDATA[<p>- కస్టమర్స్ లా షాప్ లోకి ప్రవేశించిన ఐదుగురు దుండగులు <br />- జ్యువెలరీ చూపించిన షాపులోని సిబ్బందిపై కాల్పులు <br />- సిబ్బందిని కట్టేసి నగలను పట్టుకెళ్ళిన దుండగులు<br />- కాల్పుల్లో ముగ్గురికి గాయాలు.. ఆసుపత్రికి తరలింపు<br />- కరీంనగర్ లో కలకలం రేపిన దోపిడి </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/firing-in-jewelery-shop/article-421"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-05/360_f_686082852_saeqr0eeqewbmv61hsysnphopczvhxts.webp" alt=""></a><br /><p>జ్యువెలరీ షాపులో కాల్పులు<br />- కస్టమర్స్ లా షాప్ లోకి ప్రవేశించిన ఐదుగురు దుండగులు <br />- జ్యువెలరీ చూపించిన షాపులోని సిబ్బందిపై కాల్పులు <br />- సిబ్బందిని కట్టేసి నగలను పట్టుకెళ్ళిన దుండగులు<br />- కాల్పుల్లో ముగ్గురికి గాయాలు.. ఆసుపత్రికి తరలింపు<br />- కరీంనగర్ లో కలకలం రేపిన దోపిడి </p>
<p>అక్షరదర్బార్, కరీంనగర్</p>
<p>కరీంనగర్ నగరంలో ఈరోజు ఉదయం సుమారు 11 గంటల సమయంలో జరిగిన సాయుధ దోపిడీ ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. కరీంనగర్ లోని పీఎంజే జ్యువెలరీ షాప్ కు దుండగులు బైక్ పై వచ్చారు. కస్టమర్సులా ఐదుగురు జ్యువెలరీ షాపులోకి ప్రవేశించారు. సిబ్బందిని జ్యువెలరీ చూపాలని అడిగారు. దీంతో షాపులోని సిబ్బంది జ్యువెలరీ చూపించారు. ఈ క్రమంలో గన్ తో షాపులోని సిబ్బందిని బెదిరించారు. తర్వాత సిబ్బంది కట్టేశారు. జ్యువెలరీ చూపించిన సిబ్బందిపై కాల్పులు జరిపి ఆ సిబ్బంది తమకు చూపించిన నగలను పట్టుకెళ్లారు. దుండగుల కాల్పుల్లో షాపులోని ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందగానే పీఎంజే జ్యువెలరీ షాప్ వద్దకు చేరుకున్న పోలీసులు జరిగిన ఘటనపై సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.<br />- తనిఖీలు <br />నిందితులు తప్పించుకోకుండా నగరం అంతటా పోలీసులు నాకాబందీ నిర్వహించి, వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఘటనస్థలిలో బుల్లెట్లను గుర్తించారు. జువెలరీ షాప్ సమీపంలోని డ్రైనేజీలో కత్తెర, ప్లాస్టర్, తుపాకి మ్యాగ్జిన్ కనుగొన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఘటన స్థలం వద్దకు చేరుకుని విచారణ జరుపుతున్నారు. నగరం నడిబొడ్డున, అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి సాహసోపేత దోపిడీ జరగడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. డ్రైనేజీలో కత్తెర ప్లాస్టరు ఘటనస్థలిలో బుల్లెట్లను పోలీసులు గుర్తించారు పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/firing-in-jewelery-shop/article-421</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/firing-in-jewelery-shop/article-421</guid>
                <pubDate>Sun, 03 May 2026 13:09:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-05/360_f_686082852_saeqr0eeqewbmv61hsysnphopczvhxts.webp"                         length="17570"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం</title>
                                    <description><![CDATA[<ul>
<li>ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకున్న డ్రైవర్</li>
<li>వరంగల్ జిల్లా నర్సంపేట బస్ స్టేషన్ వద్ద ఘటన</li>
<li>సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆత్మహత్యాయత్నం</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/rtc-driver-suicide-attempt/article-417"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260423-wa0009.jpg" alt=""></a><br /><p>ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్<br /> ఆత్మహత్యాయత్నం!<br />-నర్సంపేట డిపో వద్ద ఉద్రిక్తత.<br />-రంగంలో దిగిన పోలీసులు.<br />అక్షరదర్బార్ ,నర్సంపేట; వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు గత రెండు రోజుల నుండి చేపట్టిన నిరసన ప్రదర్శన ఒక్కసారిగా నర్సంపేట డిపో వద్ద హింసాత్మకంగా మారింది. ఆర్టీసీ యాజమాన్యం మరియు అధికారుల మొండి వైఖరిని నిరసిస్తూ నర్సంపేట డిపోకు చెందిన శంకర్ గౌడ్ అనే డ్రైవర్ అందరూ చూస్తుండగానే తన ఒంటికి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం కలకలం రేపింది. గురువారం తమ డిమాండ్ల సాధన కోసం నర్సంపేట డిపో కార్మికులు సమ్మె చేప‌ట్టారు. ఇందులో భాగంగా  డిపో గేటు ముందు భారీ ధర్నా చేపట్టారు. నిరసన హోరెత్తుతున్న సమయంలో, తీవ్ర మనస్తాపానికి గురైన డ్రైవర్ శంకర్ గౌడ్ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. క్షణాల్లో మంటలు చెలరేగడంతో తోటి కార్మికులు హతాశులయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పివేసి, బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన కార్మికులు యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరసనకారులను నిలువరిస్తున్నారు. ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాయపడిన శంకర్ గౌడ్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.  అధికారుల వేధింపులు మరియు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ అఘాయిత్యం జరిగిందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/rtc-driver-suicide-attempt/article-417</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/rtc-driver-suicide-attempt/article-417</guid>
                <pubDate>Thu, 23 Apr 2026 16:29:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260423-wa0009.jpg"                         length="78397"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లిఫ్ట్ ఇచ్చి మహిళపై అఘాయిత్యం </title>
                                    <description><![CDATA[<p>- అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్<br />- దొంగిలించిన బైక్‌పై వచ్చి ఘాతుకం.. <br />- చురుగ్గా వ్యవహరించి పట్టుకున్న పోలీసులు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/violence-against-woman-by-giving-lift/article-416"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260423-wa0006.jpg" alt=""></a><br /><p>లిఫ్ట్ ఇచ్చి మహిళపై అఘాయిత్యం<br />- అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్<br />- దొంగిలించిన బైక్‌పై వచ్చి ఘాతుకం.. <br />- చురుగ్గా వ్యవహరించి పట్టుకున్న పోలీసులు</p>
<p>అక్షరదర్బార్, టేకుమట్ల: లిఫ్ట్ ఇచ్చే నెపంతో మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, ఆమెపై దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడిన కిరాతకుడిని భూపాలపల్లి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి దొంగిలించిన మోటార్ సైకిల్, బాధితురాలి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఘటన వివరాలను చిట్యాల సీఐ మల్లేష్ గురువారం మీడియాకు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కుషీనగర్ జిల్లాకు చెందిన అమర్జిత్ సింగ్ (33) వరికోత యంత్ర డ్రైవర్‌గా పనిచేస్తూ వివిధ ప్రాంతాల్లో సంచరిస్తుంటాడు. ఈ నెల 18న కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మద్యం సేవించిన నిందితుడు, అక్కడ నిలిపి ఉంచిన ఒక బైక్‌ను దొంగిలించి భూపాలపల్లి జిల్లా వైపు బయలుదేరాడు. అదే రోజు రాత్రి 7:30 గంటల సమయంలో భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రాఘవరెడ్డిపేట సెంటర్ వద్ద ఓ మహిళ లిఫ్ట్ కోసం ఎదురుచూస్తుండగా, ఆమెను తన బండిపై ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో ఆరేపల్లి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో బైక్ ఆపి, ఆమెను పొదల్లోకి ఈడ్చుకెళ్లి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించగా, బాధితురాలు గట్టిగా ప్రతిఘటించడంతో ఆమె బ్యాగ్‌ను లాక్కుని పరారయ్యాడు.<br />- నిందితుడి పట్టివేత<br />బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, డీఎస్పీ సంపత్ రావు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం చిట్యాల పరిధిలోని కైలాపూర్ సబ్ స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, పారిపోవడానికి ప్రయత్నించిన అమర్జిత్ సింగ్‌ను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన టేకుమట్ల ఎస్ఐ అమూల్య, సిబ్బంది మహేందర్, రామకృష్ణలను జిల్లా ఎస్పీ అభినందించారు. "మహిళా భద్రత మా ప్రథమ ప్రాధాన్యం. అపరిచిత వ్యక్తులను నమ్మి వాహనాలు ఎక్కవద్దు. ప్రయాణాల్లో సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలి. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై ఉక్కుపాదం మోపుతాం." అని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/violence-against-woman-by-giving-lift/article-416</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/violence-against-woman-by-giving-lift/article-416</guid>
                <pubDate>Thu, 23 Apr 2026 15:38:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260423-wa0006.jpg"                         length="154904"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భారీగా 'హాష్ ఆయిల్' పట్టివేత</title>
                                    <description><![CDATA[<p>- నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు<br />- రూ. 2.50 కోట్ల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్ స్వాధీనం<br />- నిందితులు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు <br />- వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడి</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/heavy-hash-oil-seizure/article-412"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260421-wa0001.jpg" alt=""></a><br /><p>భారీగా ‘హాష్ ఆయిల్’ పట్టివేత <br />- నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు<br />- రూ. 2.50 కోట్ల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్ స్వాధీనం<br />- నిందితులు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు <br />- వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడి</p>
<p>అక్షరదర్బార్, హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఖరీదైన ‘హాష్ ఆయిల్’ (గంజాయి నూనె) స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలోని నలుగురు సభ్యులను వరంగల్ డ్రగ్ కంట్రోల్, క్యాట్ పార్టీ, ఇంతేజార్‌గంజ్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.2 కోట్ల 50 లక్షల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్‌తో పాటు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.<br />- నిందితుల వివరాలు<br />పోలీసుల కథనం ప్రకారం అరెస్టు అయిన వారిలో..<br /> 1. హంటల్ సన్ను (23) - ఒడిశా<br /> 2. హంటల్ సన్యాసి (23) - ఒడిశా<br /> 3. కండెల చిన్నబాబు (56) - ఆంధ్రప్రదేశ్ (అల్లూరి జిల్లా)<br /> 4. కృష్ణ హంటల్ (56) - ఒడిశా<br />   ఈ కేసులో మరో నిందితుడు కిలో పాండు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.<br />- నేపథ్యం అరెస్టు జరిగిన తీరు<br />వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు హంటల్ సన్ను తన గ్రామంలో గంజాయి మొక్కలను పెంచేవాడు. కేవలం గంజాయి అమ్మితే వచ్చే డబ్బు జల్సాలకు సరిపోకపోవడంతో, పరారీలో ఉన్న కిలో పాండు అనే వ్యక్తి సలహాతో గంజాయి మొక్కల నుండి ‘హాష్ ఆయిల్’ తయారు చేయడం ప్రారంభించారు. సుమారు 40 కిలోల ఆయిల్‌ను సేకరించగా, అందులో 20 కిలోల ఆయిల్‌ను ఐదు కిలోల చొప్పున ప్యాక్ చేసి ముంబాయిలో విక్రయించేందుకు నిందితులు ప్లాన్ చేశారు.<br />ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్‌లోని తుని రైల్వే స్టేషన్ నుండి కోనార్క్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన ఈ ముఠా, వరంగల్ రైల్వే స్టేషన్‌లో పోలీసుల తనిఖీలు ఉంటాయన్న అనుమానంతో ఇక్కడే దిగిపోయారు. మంగళవారం ఉదయం ముంబాయి వెళ్లేందుకు వరంగల్ బస్టాండ్ సమీపంలోని రైల్వే గూడ్స్ షెడ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా, పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు.<br />- పోలీసు బృందానికి అభినందనలు<br />భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత, వరంగల్ ఏఎప్పీ శుభం, ఏసిపిలు జితేందర్ రెడ్డి, జానీ నర్సింహులు, డ్రగ్ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ సతీష్, ఇంతేజార్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ షూకూర్, వారి బృందాన్ని పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/heavy-hash-oil-seizure/article-412</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/heavy-hash-oil-seizure/article-412</guid>
                <pubDate>Tue, 21 Apr 2026 12:50:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260421-wa0001.jpg"                         length="137104"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        