<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.aksharadarbar.com/rss" rel="self" type="application/rss+xml" />
                <generator>అక్షర దర్బార్ RSS Feed Generator</generator>
                <title>అక్షర దర్బార్</title>
                <link>https://www.aksharadarbar.com/rss</link>
                <description>RSS Feed of అక్షర దర్బార్</description>
                
                            <item>
                <title>అవమానం పెంచిన కసి</title>
                                    <description><![CDATA[<p>- ఫినోలెక్స్ కంపెనీ ఎంప్లాయ్ టూ స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ <br />- కూతురి స్కూల్ అడ్మిషన్.. గ్రీన్ ఉడ్ స్కూలు ఆవిర్భావం<br />- చలివాగు బ్రిడ్జి పనుల వద్ద మొదలైన రాజకీయ ప్రస్థానం <br />- యువగర్జనకు పరకాల కోసం వరంగల్ నుంచి స్పెషల్ ట్రైన్ <br />- మొదట ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం రాగా వద్దన్న<br />- 2009 ఎన్నికల్లో సినిమా సీన్ ను తలపించిన బీఫామ్ ఘటన <br />- ఓసారి రాజకీయ ప్రత్యర్థుల రాళ్లదాడితో మొక్కజొన్న చేనులో దాక్కున్న<br />- 2012 ఉప ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసే అవకాశం <br />- 'ఇంటింటికి మీ చల్లా' కార్యక్రమంతో ప్రజల్లోకి.. నియోజకవర్గంపై పట్టు<br />- ప్రత్యేక రాష్ట్రం కోసం 41 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు<br />- 2014 ఎన్నికల్లో విజయం సాధించి లక్ష్యాన్ని ముద్దాడ <br />- ఓ పొలిటికల్ లీడర్ చేసిన అవమానమే నన్ను ఎమ్మెల్యేను చేసింది <br />- పదేళ్లలో ఎమ్మెల్యేగా రూ.2,500 కోట్లతో అభివృద్ధి పనులు <br />- కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ తీసుకరావడం ఆనందాన్నిచ్చింది <br />- స్వగ్రామం ప్రగతి సింగారాన్ని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దాను<br />- కేసీఆర్ భోళా శంకరుడు.. కేటీఆర్, హరీష్ లతో నాది ప్రత్యేక అనుబంధం <br />- గత ఎన్నికల్లో జరిగిన తప్పులను సరిదిద్దుకొని ముందుకు పోతున్నం<br />- డీలిమిటేషన్ లో మూడు ముక్కలైనా.. వచ్చే ఎన్నికల్లో పోటీ ఖాయం<br />- ఈసారి నా కోసం కాదు.. నన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం గెలవాలి<br />- డిజిటల్ మీడియాతో బీఆర్ఎస్ నేత, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చిట్ చాట్</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/politics/a-shameless-graft/article-498"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-08/img-20260826-wa0007.jpg" alt=""></a><br /><p>అవమానం పెంచిన కసి </p>
<p>- ఫినోలెక్స్ కంపెనీ ఎంప్లాయ్ టూ స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ <br />- కూతురి స్కూల్ అడ్మిషన్.. గ్రీన్ ఉడ్ స్కూలు ఆవిర్భావం<br />- చలివాగు బ్రిడ్జి పనుల వద్ద మొదలైన రాజకీయ ప్రస్థానం <br />- యువగర్జనకు పరకాల కోసం వరంగల్ నుంచి స్పెషల్ ట్రైన్ <br />- మొదట ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం రాగా వద్దన్న<br />- 2009 ఎన్నికల్లో సినిమా సీన్ ను తలపించిన బీఫామ్ ఘటన <br />- ఓసారి రాజకీయ ప్రత్యర్థుల రాళ్లదాడితో మొక్కజొన్న చేనులో దాక్కున్న<br />- 2012 ఉప ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసే అవకాశం <br />- 'ఇంటింటికి మీ చల్లా' కార్యక్రమంతో ప్రజల్లోకి.. నియోజకవర్గంపై పట్టు<br />- ప్రత్యేక రాష్ట్రం కోసం 41 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు<br />- 2014 ఎన్నికల్లో విజయం సాధించి లక్ష్యాన్ని ముద్దాడ <br />- ఓ పొలిటికల్ లీడర్ చేసిన అవమానమే నన్ను ఎమ్మెల్యేను చేసింది <br />- పదేళ్లలో ఎమ్మెల్యేగా రూ.2,500 కోట్లతో అభివృద్ధి పనులు <br />- కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ తీసుకరావడం ఆనందాన్నిచ్చింది <br />- స్వగ్రామం ప్రగతి సింగారాన్ని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దాను<br />- కేసీఆర్ భోళా శంకరుడు.. కేటీఆర్, హరీష్ లతో నాది ప్రత్యేక అనుబంధం <br />- గత ఎన్నికల్లో జరిగిన తప్పులను సరిదిద్దుకొని ముందుకు పోతున్నం<br />- డీలిమిటేషన్ లో మూడు ముక్కలైనా.. వచ్చే ఎన్నికల్లో పోటీ ఖాయం<br />- ఈసారి నా కోసం కాదు.. నన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం గెలవాలి<br />- డిజిటల్ మీడియాతో బీఆర్ఎస్ నేత, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చిట్ చాట్</p>
<p>అక్షరదర్బార్, హనుమకొండ </p>
<p>మాది వ్యవసాయ కుటుంబం. నన్ను కూడా వ్యవసాయంలోనే కొనసాగించాలని మా తండ్రికి ఉండేది. నాకు మాత్రం కొత్తగా ఏదైనా చేయాలనే ఆసక్తి ఉండే. ఆ సమయంలో ఓ ఫ్రెండ్ ద్వారా ఫినోలెక్స్ కంపెనీలో ఎంప్లాయ్ గా చేరాను. మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేశాను. తర్వాత నంది పైప్స్, లూబీ ఎలక్ట్రికల్ కంపెనీల డిస్ట్రిబ్యూటర్ తీసుకున్న. ప్రభుత్వ పథకాల అమలుకు పైపులు, మోటార్లను సరఫరా చేసిన. ఈ క్రమంలో కాంట్రాక్ట్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. అనతి కాలంలోనే స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ గా ఎదిగాను. ఇందులో భాగంగా మా ఊరి వద్ద వాగుపై చేపట్టిన వంతెన నిర్మాణానికి సంబంధించి ఓ పొలిటికల్ లీడర్ తనను అవమానపరిచినట్లు మాట్లాడటం వల్ల రాజకీయాల్లోకి వచ్చిన. ఎలాగైనా ఎమ్మెల్యేను కావాలనే కసితో అప్పట్లో తెలుగుదేశం పార్టీలో చేరానని బీఆర్ఎస్ నేత, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చెప్పారు. అనుకోకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తాను ఆటంకాలెన్ని ఎదురైనప్పటికీ అధిగమిస్తూ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్యాన్ని ముద్దాడినట్లు ఆయన తెలిపారు. పదేళ్లు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో పరకాల శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగెత్తించినట్లు చల్లా చెప్పారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓటమి ఎదురు కావడానికి పోల్ మేనేజ్మెంట్ లో కొన్ని లోపాలు జరిగాయని గుర్తించినట్లు ధర్మారెడ్డి వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనను నమ్ముకున్న కార్యకర్తల కోసం మళ్లీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. డీలిమిటేషన్ లో నియోజకవర్గం మూడుముక్కలైనా ఎక్కడో ఒకచోట నుంచి తాను పోటీ చేయడం ఖాయమని చల్లా స్పష్టం చేశారు. హనుమకొండలోని తన నివాసంలో బుధవారం ధర్మారెడ్డి డిజిటల్ మీడియా చిట్ చాట్ లో తన అనుభవాలను పంచుకున్నారు. ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..</p>
<p>- ప్రగతిసింగారం నుంచి ప్రస్థానం <br />స్వగ్రామం శాయంపేట మండలంలోని ప్రగతిసింగారం. మాది వ్యవసాయ కుటుంబం. తల్లి సమ్మక్క, తండ్రి మల్లారెడ్డి. మేం ముగ్గురం అన్నదమ్ములం. నేను పెద్దవాడిని. రెండో తమ్ముడు మరణించాడు, ఇంటర్మీడియట్ కాగానే 18 ఏళ్లకే 1986లో మేనమామ కుమార్తె జ్యోతితో వివాహం జరిగింది. తండ్రి తనను వ్యవసాయంలోనే కొనసాగించాలని భావించినా.. తనకు మాత్రం కొత్తగా ఏదైనా చేయాలనే ఆసక్తి ఉండేది. డిగ్రీ చదువుకుంటున్న సమయంలోనే స్నేహితుడి సహకారంతో ఫినోలెక్స్ కంపెనీలో ‘మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేశాను. అప్పట్లో వ్యవసాయ బావులు, పొలాలకు పైప్‌లైన్లు వేసే కార్యక్రమాలు విస్తృతంగా సాగుతుండటంతో ఆ రంగంపై మంచి అవగాహన ఏర్పడింది.<br />- నంది పైప్స్‌తో వ్యాపారంలోకి <br />1993లో సొంతంగా నంది పైప్స్, లూబీ ఎలక్ట్రికల్స్ కంపెనీల డిస్ట్రిబ్యూటర్‌ తీసుకున్న. 1994లో అప్పటి టీడీపీ ప్రభుత్వం స్వజలధార, ఆర్ డబ్ల్యూఎస్ ద్వారా గ్రామాలకు నీటి సౌకర్యం కల్పించే పథకాలను అమల్లోకి తేవడంతో పైపులు, మోటార్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆ కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 80 శాతం పనుల ఆర్డర్లు నేనే తీసుకున్న. పైపులు, మోటార్ల సరఫరాతో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో సాన్నిహిత్యం ఉంది. తన అమ్మకాల ప్రతిభను గుర్తించిన నంది పైప్స్ సంస్థ 1997లో మారుతి కారును బహుమతిగా ఇచ్చింది.</p>
<p>- కాంట్రాక్టర్‌గా కొత్త మలుపు <br />1999లో ప్రభుత్వ పనుల్లో కాంట్రాక్టర్లే మెటీరియల్ కొనుగోలు చేయాలనే విధానం రావడంతో నా వ్యాపారంపై ప్రభావం పడింది. సరఫరా చేసిన మెటీరియల్‌కు బిల్లులు సకాలంలో రాకపోవడం, కొందరు డబ్బులు ఎగ్గొట్టడంతో నష్టాలు ఎదురయ్యాయి. అయితే నేను ఇతరులకు సరఫరా చేస్తే బిల్లుల కోసం ఎదురు చూడాల్సి వస్తుందని, స్వయంగా కాంట్రాక్టర్‌గా మారితేనే పరిస్థితి మారుతుందని నిర్ణయించుకున్న. కాంట్రాక్టర్‌గా అడుగుపెట్టి.. 2002లో స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్‌గా ఎదిగాను. చల్లా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించి 2003 నుంచి పెద్ద పెద్ద కాంట్రాక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ వంటివి, ఇతర ప్రాజెక్టులు చేశాను.</p>
<p>- కూతురు స్కూల్ అడ్మిషన్.. గ్రీన్‌వుడ్ ఆవిర్భావం <br />తన కుమార్తెను స్కూల్‌లో చేర్పించేందుకు వెళ్లిన సందర్భం విద్యారంగంలోకి తీసుకొచ్చింది. స్కూల్ లో సౌకర్యాలు లేకపోవడంతో అప్పటి ప్రిన్సిపాల్ కు కొత్త పాఠశాల ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, ఒక భాగస్వామి ఉంటే బాగుంటుందని చెప్పడంతో 2003లో గ్రీన్‌వుడ్ స్కూల్ ను ప్రారంభించడం జరిగింది. ఆరంభం నుంచే పాఠశాలకు మంచి ఆదరణ లభించింది. ఇప్పటి వరకు 23 బ్యాచ్‌లు పదో తరగతి పూర్తి చేసుకున్నయి.</p>
<p>- అవమానం పెంచిన కసి.. రాజకీయాల్లోకి ఎంట్రీ <br />కాంట్రాక్టర్ గా 2008లో శాయంపేట–ప్రగతిసింగారం మధ్య చలివాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాను. ఆ పనులకు సంబంధించిన బిల్లుల విషయంలో అప్పటి పొలిటికల్ లీడర్ ఒకరు తనను ఇబ్బంది పెట్టాడు. ఒకసారి వాల్ల ఇంటికి వెళ్లినప్పుడు ఎదురైన అవమానం తన జీవితాన్ని రాజకీయాల వైపు మళ్లించింది. “నన్ను అవమానించిన కుటుంబంపైనే ఎన్నికల్లో పోటీ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా”. 2009లో పరకాల నుంచి పోటీ చేయాలనే నిర్ణయాన్ని అప్పట్లో ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేం నరేందర్‌రెడ్డితో పాటు చంద్రబాబునాయుడికి వివరించిన. ఆ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ నాయకుడు తనను చులకనగా మాట్లాడినా.. పరకాల నుంచే పోటీ చేయాలనే నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు.<br />- ఎమ్మెల్సీ అవకాశం వచ్చినా వద్దన్నా.. <br />2009లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం వచ్చినప్పటికీ.. తన లక్ష్యం ప్రత్యక్ష ఎన్నికలేనని పార్టీ అధిష్టానానికి చెప్పి తిరస్కరించిన. అదే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ–టీఆర్ఎస్ పొత్తులో సీట్ల సర్దుబాటులో భాగంగా పరకాల సీటు టీఆర్ఎస్‌కు వెళ్లింది. అప్పుడు టీఆర్ఎస్ నేతలు మా పార్టీ తరఫున పోటీ చేయాలని అడిగినా నేను ఒప్పుకోలేదు.</p>
<p>- బీఫాం కోసం సినిమా తరహా డ్రామా <br />2009 ఎన్నికల్లో పార్టీ బీఫాం అందజేయాల్సిన ఆఖరి రోజు జరిగిన పరిణామాలు ఇప్పటికీ మర్చిపోలేనివి. చివరి నిమిషంలో పార్టీ నుంచి బీఫాం వస్తుందనే సమాచారం రావడంతో డ్రైవర్‌ను పార్టీ కార్యాలయానికి పంపాను. బీఫాంలతో కారు బయలుదేరిన సమయంలో కాజీపేట ఫాతిమా బ్రిడ్జి వద్ద కొందరు పార్టీ నాయకులు కారును అడ్డుకుని బీఫాంలను తీసుకున్నారు. తనకు రావాల్సిన బీఫాం మరొకరికి వెళ్లింది. మళ్లీ ఫాంలను సరిచేసుకుని వచ్చేలోపే నామినేషన్ కేంద్రం వద్ద గేట్లు మూసివేశారు. పోలీసులు నన్ను బలవంతంగా గేటు బయటికి తీసుకెళ్లగా.. మా డ్రైవర్ గోడ దూకి లోపలికి వచ్చాడు. నిమిషాల తేడాతో బీఫాం అందజేసే అవకాశం కోల్పోయాను. ఆ ఘటన మొత్తం సినిమా క్లైమాక్స్‌ను తలపించింది.</p>
<p>- 2012లో తొలి ఎన్నికల పోరు <br />పరకాల శాసనసభ నియోజకవర్గానికి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో నాకు పరకాల నుంచి టీడీపీ టికెట్ దక్కింది. పోటీ చేసి 33 వేల ఓట్లు సాధించిన. పార్టీకి చెందిన కొందరు తనకు ప్రతికూల పరిస్థితులు కల్పించడంతో ఓడిపోయాను. ఈ విషయం చంద్రబాబునాయుడికి తెలియడంతో సంబంధిత నాయకులను ఆయన మందలించారు. ఆ సమయంలోనే పరకాల నియోజకవర్గంతో పాటు శాయంపేట మండలంలోని 263 ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు కంప్యూటర్లను అందజేసిన.</p>
<p>- యువగర్జనకు పరకాల కోసం స్పెషల్ ట్రైన్<br />నందమూరి బాలకృష్ణ రాజకీయ ప్రవేశ సమయంలో 2008లో టీడీపీ గుంటూరులో నిర్వహించిన యువగర్జన సభకు పరకాల నియోజకవర్గం నుంచి ప్రత్యేక రైలును ఏర్పాటు చేయడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. జిల్లా నాయకుడిని తనకు ఒక బోగీ ఇవ్వాలని కోరగా.. ఇంకా తనకు పదవి లేదని, ఇవ్వలేమని చెప్పాడు. దీంతో సభ ఇన్ చార్జ్ ఎర్రం నాయుడు వద్దకు వెళ్లి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చవుతుందని తెలుసుకుని.. ఆ మొత్తాన్ని చెల్లించి వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి నుంచి పరకాల నియోజకవర్గ కార్యకర్తల కోసం ప్రత్యేక రైలు వేయించుకున్న. రైలు నిండా కార్యకర్తలను తీసుకెళ్లడమే కాకుండా వారికి భోజనం, తాగునీటి సౌకర్యాలు కల్పించిన. ఈ కార్యక్రమం అప్పట్లో రాజకీయంగా పెద్ద హల్‌చల్ సృష్టించింది.</p>
<p>- ‘ఇంటింటికీ మీ చల్లా’తో ప్రజల్లోకి.. <br />2013 నవంబర్ 22న ‘ఇంటింటికీ మీ చల్లా’ కార్యక్రమాన్ని ప్రారంభించి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను చుట్టివచ్చాను. ఒక్కో గ్రామంలో రెండు మూడు రోజుల పాటు ఉండి, ఉదయం–సాయంత్రం ప్రజలతో మమేకమయ్యాను. ఈ పర్యటన దాదాపు ఏడాది పాటు 2014 ఎలక్షన్ వరకు సాగింది. ప్రతీ ఇంటి పరిస్థితి, గ్రామాల్లోని మౌలిక సమస్యలు, రోడ్లు, కరెంటు, తాగునీరు, పేదరికం వంటి అంశాలను స్వయంగా తెలుసుకున్న. ఒక గ్రామంలో ఆకలితో పస్తులు పడుకున్న డిగ్రీ విద్యార్థినిని చూసిన ఘటన తనను తీవ్రంగా కలచివేసింది. ఈ పాదయాత్ర ద్వారా గ్రామాల అవసరాలపై స్పష్టమైన అవగాహన వచ్చింది. తర్వాత ఎమ్మెల్యేగా చేపట్టిన అభివృద్ధి పనులకు అదే ప్రణాళికగా మారింది.</p>
<p>- మొక్కజొన్న పొలంలో దాక్కున్న<br />రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఎన్నో దాడులు ఎదుర్కొన్న. పొలిటికల్ ప్రత్యర్థులు నన్ను నియోజకవర్గం నుంచి వెళ్లగొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. 2011–12 మధ్య నందిరాంనాయక్ తండాలో ప్రభ బండ్ల ప్రారంభోత్సవానికి వెళ్లిన సమయంలో రాళ్లతో దాడి చేశారు. కొబ్బరికాయ కొట్టేందుకు వంగిన సమయంలోనే దాడి జరగడంతో తాను, కార్యకర్తలు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశాం. కొందరితో కలిసి మొక్కజొన్న చేనులో దాక్కున్న. ఘటనపై సమాచారం అందడంతో భారీగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పట్లో ఈ ఘటన నియోజకవర్గంలో సంచలనం సృష్టించింది. పెద్ది సుదర్శన్‌రెడ్డి వచ్చి తనకు అండగా నిలిచారు. 2009లో కూడా తన వెంట వచ్చిన ఆరు కార్లను ధ్వంసం చేశారు. రాజకీయాల్లో మంచి, చెడు రెండూ ఉంటాయని ముందే నిర్ణయించుకుని వచ్చిన.</p>
<p>- తెలంగాణ కోసం పోరాటం <br />ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో పరకాల నియోజకవర్గంలో ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నడిపాను. టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడాను. నియోజకవర్గంలో 41 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించి అన్ని గ్రామాల ప్రజలను భాగస్వాములను చేయడం జరిగింది.</p>
<p>- 2014లో గెలుపు.. టీఆర్ఎస్‌లోకి చేరిక <br />2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పరకాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించా. తనపై ఉన్న అభిమానంతో కార్యకర్తలు కష్టపడి గెలిపించారు. ఆ తర్వాత వారి అభీష్టం మేరకు టీఆర్ఎస్‌లో చేరాను.</p>
<p>- ‘పదేళ్లలో రూ.2,500 కోట్ల అభివృద్ధి’ <br />ఎమ్మెల్యేగా పదేళ్ల కాలంలో పరకాల నియోజకవర్గానికి సుమారు రూ.2,500 కోట్ల అభివృద్ధి పనులు తీసుకొచ్చిన. ‘ఇంటింటికీ మీ చల్లా’ పర్యటనలో గుర్తించిన సమస్యల్లో దాదాపు 90 శాతం పరిష్కరించా. ప్రతీ ఎమ్మెల్యేకు రూ.5 కోట్ల నిధులు వచ్చే రోజుల్లోనూ ప్రత్యేకంగా పట్టుబట్టి రూ.35 కోట్ల వరకు నిధులు తీసుకొచ్చి పనులు చేపట్టిన. <br />తన హయాంలో చేపట్టిన ప్రధాన పనులు.. <br />* 2016లో పరకాల రెవెన్యూ డివిజన్ పునరుద్ధరణ <br />* కొనాయిమాకుల ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం <br />* రెండు కొత్త మండలాలు. కార్యాలయాల భవనాలు <br />* పరకాల ప్రజల చిరకాల కోరిక అయిన 100 పడకల ఆస్పత్రి <br />* డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు<br />* బాలురు, బాలికలతో పాటు ఆరు రెసిడెన్షియల్ విద్యాసంస్థలు<br />* 46 గ్రామాల్లో మహిళా భవనాలు<br />* 57 గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు<br />* పరకాల పట్టణంలో డివైడర్, సెంట్రల్ లైటింగ్<br />* దామెర చెరువులో బోటింగ్<br />* పాత మార్కెట్ అభివృద్ధి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం<br />* కంఠాత్మకూరు బ్రిడ్జికి నిధులు<br />* పల్లె దవాఖానలు, విద్యుత్ సబ్‌స్టేషన్లు</p>
<p>- ‘టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు ఆనందాన్నిచ్చింది..<br />వరంగల్‌కు ఒకప్పుడు అజంజాహి మిల్ ఎంతటి గుర్తింపు తెచ్చిందో, ఆ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించేలా పరకాల నియోజకవర్గానికి టెక్స్‌టైల్ పార్క్ తీసుకురావడం తనకు అత్యంత ఆనందాన్ని ఇచ్చిన విషయం. “అజంజాహి మిల్ తర్వాత వరంగల్ ప్రాంతానికి అదే స్థాయిలో ఉపాధి కల్పించే పరిశ్రమ రావాలనేది నా ఆలోచన. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్ పరకాల నియోజకవర్గానికి రావడం సంతోషంగా ఉంది”.<br />- పుట్టిన ఊరికి ప్రత్యేక అభివృద్ధి <br />నేను పుట్టిన ప్రగతిసింగారం గ్రామాన్ని అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాను. గ్రామ పంచాయతీని మోడల్‌గా తీర్చిదిద్దడంతో పాటు సొంత స్థలంలో రామాలయం నిర్మించిన. ప్రభుత్వ స్థలంతో పాటు ఎకరం భూమిని కొనుగోలు చేసి కమ్యూనిటీ హాల్, గ్రామ ప్రజల కోసం ఫంక్షన్ హాల్ నిర్మించిన. స్కూల్, లైబ్రరీ, ఆస్పత్రి ఏర్పాటు చేశాను.</p>
<p>- రైతులకు అన్యాయం చేయలే<br />తక్కువ ధరకు భూములను కొనుగోలు చేసి రైతులకు అన్యాయం చేశారని నాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు. రాజకీయ లబ్ధి కోసమే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. “ఏ ఒక్క రైతు భూమిని నేను అక్రమంగా తీసుకోలేదు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల జోలికే వెళ్లలేదు. నేను కొనుగోలు చేసినవి పట్టా భూములే.. అవి కూడా న్యాయబద్ధంగా అప్పటి ధర ప్రకారం కొనుగోలు చేశా”. తర్వాత కొన్ని కారణాలవల్ల వాటిని అమ్మేసిన. రాజకీయాల్లో ముళ్లకంప, పూలపాన్పు రెండూ ఉంటాయి. కష్టాలు సహజం. తాను ఎప్పుడూ వ్యక్తిగత దూషణలకు వెళ్లలేదు. రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగానే ఎదుర్కొంటా.</p>
<p>- ‘కేసీఆర్ భోళా శంకరుడు’ <br />మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉంది. మాట ఇస్తే నిలబెట్టుకునే వ్యక్తి కేసీఆర్. ఆయన మంచి విజన్ ఉన్న నాయకుడు. తనపై కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం ఉండేది. ఆ అనుబంధంతోనే పరకాల నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకురాగలిగా. నేను ఎవరిపైనా చాడీలు చెప్పను, వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉంటా. అందుకే కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీశ్‌రావు తనను అభిమానిస్తారు.</p>
<p>- ‘వచ్చే ఎన్నికల్లో మళ్లీ బరిలో ఉంటా’ <br />వాస్తవానికి గత ఎన్నికల్లో గెలిస్తే రాజకీయాలకు విరామం ఇవ్వాలని భావించా. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో కనిపిస్తున్న కక్షపూరిత వాతావరణం, తనను నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితిని చూసి మరోసారి పోటీ చేయాలని నిర్ణయించుకున్న. గత ఎన్నికల్లో జరిగిన తప్పులను గుర్తించాను. వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగుత. నియోజకవర్గంలోని 109 గ్రామ పంచాయతీల్లో నాకు బలమైన పట్టు ఉంది. పునర్విభజన జరిగినా.. నియోజకవర్గాల సరిహద్దులు మారినా.. ఎక్కడి నుంచి పోటీ చేయాలో నిర్ణయించుకుని వచ్చే ఎన్నికల్లో ఒకచోట నుంచి తప్పకుండా బరిలో ఉంటి. “ఈసారి నా కోసం కాదు.. నన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం గెలవాలి. ప్రజలు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది”.</p>]]></content:encoded>
                
                                                            <category>రాజకీయం</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/politics/a-shameless-graft/article-498</link>
                <guid>https://www.aksharadarbar.com/politics/a-shameless-graft/article-498</guid>
                <pubDate>Wed, 26 Aug 2026 19:48:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/img-20260826-wa0007.jpg"                         length="505434"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>aksharadarbar-26-08-2026</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/825/aksharadarbar-26-08-2026"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-08/2608wgl01.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/825/aksharadarbar-26-08-2026</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/825/aksharadarbar-26-08-2026</guid>
                <pubDate>Wed, 26 Aug 2026 07:24:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/2608wgl01.jpg"                         length="915796"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>రూ.1.25 కోట్ల గంజాయి సీజ్</title>
                                    <description><![CDATA[<p>- అంతర్‌రాష్ట్ర స్మగ్లర్ అరెస్ట్<br />- దామెర పోలీసుల భారీ ఆపరేషన్<br />- 251 కిలోల గంజాయి, బైక్, నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం<br />- వరంగల్ సీపీ ఎన్ శ్వేత వెల్లడి</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/rs-125-crore-ganja-seized/article-497"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-08/img-20260825-wa0011.jpg" alt=""></a><br /><p>రూ.1.25 కోట్ల గంజాయి సీజ్<br />- అంతర్‌రాష్ట్ర స్మగ్లర్ అరెస్ట్<br />- దామెర పోలీసుల భారీ ఆపరేషన్<br />- 251 కిలోల గంజాయి, బైక్, నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం<br />- వరంగల్ సీపీ ఎన్ శ్వేత వెల్లడి</p>
<p>అక్షరదర్బార్, హనుమకొండ: గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల విక్రయదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా హన్మకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామానికి చెందిన అంతర్‌రాష్ట్ర గంజాయి స్మగ్లర్ ముదిగొండ నాగేశ్వర్ రావు (55)ను దామెర పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.1 కోటి 25 లక్షల విలువైన 251 కిలోల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, రూ. 9,000 నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత మీడియా సమావేశంలో వెల్లడించారు. <br />- ఇతర రాష్ట్రాలకు రవాణా<br />ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ పర్యవేక్షణలో దామెర పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు నాగేశ్వర్ రావు సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఒడిశా రాష్ట్రానికి చెందిన రమేష్, సుధాకర్ వద్ద తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసేవాడు. ఆ తర్వాత తనకున్న నెట్‌వర్క్ ద్వారా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఉర్దు, రాందాస్ శేషరావు బీరదార్, అక్లీం, షారుఖ్ ఖాన్, షేక్ అక్బర్, నునావత్ రాజు అనే వ్యక్తుల ద్వారా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడు ఇచ్చిన పక్కా సమాచారంతో అతని ఇంటిపై దాడి చేసిన పోలీసులు భారీగా నిల్వ ఉంచిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇది ఏపీలోని విశాఖపట్నం జిల్లా సీలేరు ప్రాంతం నుంచి పులుకుర్తికి రవాణా అయింది. ఈ గంజాయి నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మిగతా రాష్ట్రాల నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించినట్లు సీపీ తెలిపారు. <br />- మత్తు పదార్థాలపై కఠిన చర్యలు<br />యువత మత్తు పదార్థాల బారిన పడి బంగారు భవిష్యత్తును పాడుచేసుకోకుండా కాపాడేందుకు ప్రత్యేక దృష్టి సారించామని సీపీ ఎన్.శ్వేత తెలిపారు. ఎవరైనా గంజాయి విక్రయించినా, వినియోగించినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.<br />- పోలీస్ సిబ్బందికి అభినందనలు<br />ఈ భారీ గంజాయి స్మగ్లింగ్ ముఠాను చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పరకాల ఏసీపీ సతీష్ బాబు, శాయంపేట సీఐ సుధాకర్ రెడ్డి, ఆత్మకూర్ సీఐ సంతోష్, దామెర ఎస్ఐ వీరభద్రరావు, శాయంపేట ఎస్ఐ పరమేశ్వర్, పరకాల ఎస్ఐ రఘుపతి, ఏఏఓ సల్మాన్ పాషా మరియు దామెర, శాయంపేట స్టేషన్ల కానిస్టేబుళ్లను సీపీ అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/rs-125-crore-ganja-seized/article-497</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/rs-125-crore-ganja-seized/article-497</guid>
                <pubDate>Tue, 25 Aug 2026 13:59:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/img-20260825-wa0011.jpg"                         length="590822"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఓటరు జాబితా సవరణపై బీజేపీ కార్యశాల</title>
                                    <description><![CDATA[<p>ఓటరు జాబితా సవరణపై బీజేపీ కార్యశాల</p>
<p>హడావుడిగా ఆసుపత్రి ప్రారంభం..</p>
<p>  తెరుచుకోని హాస్పిటల్‌</p>
<p>డాక్టర్‌ పగడాల కాళీప్రసాద్‌రావు</p>
<p>అక్షరదర్బార్,పరకాల: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) రెండో దశ కార్యక్రమంలో భాగంగా పరకాల బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి కార్యశాల నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల కాంటెస్టెడ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ పగడాల కాళీప్రసాద్‌రావు, ఎస్‌ఐఆర్‌ జిల్లా ప్రముఖ్‌ రావు అమరేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు సిరంగి సంతోష్‌కుమార్‌ హాజరయ్యారు.</p>
<p>ఈ సందర్భంగా డాక్టర్‌ కాళీప్రసాద్‌రావు మాట్లాడుతూ పరకాల ప్రభుత్వ ఆసుపత్రిని హడావుడిగా ప్రారంభించారని, ప్రస్తుతం అది మూతపడే పరిస్థితిలో ఉందని ఆరోపించారు. ఆసుపత్రి పరిస్థితిపై ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలను వెల్లడించాలని, ప్రారంభోత్సవ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని కోరారు.</p>
<p>సిరంగి సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/bjp-workshop-on-revision-of-voter-list/article-496"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-08/img-20260824-wa0758.jpg" alt=""></a><br /><p>ఓటరు జాబితా సవరణపై బీజేపీ కార్యశాల</p>
<p>హడావుడిగా ఆసుపత్రి ప్రారంభం..</p>
<p> తెరుచుకోని హాస్పిటల్‌</p>
<p>డాక్టర్‌ పగడాల కాళీప్రసాద్‌రావు</p>
<p>అక్షరదర్బార్,పరకాల: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) రెండో దశ కార్యక్రమంలో భాగంగా పరకాల బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి కార్యశాల నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల కాంటెస్టెడ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ పగడాల కాళీప్రసాద్‌రావు, ఎస్‌ఐఆర్‌ జిల్లా ప్రముఖ్‌ రావు అమరేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు సిరంగి సంతోష్‌కుమార్‌ హాజరయ్యారు.</p>
<p>ఈ సందర్భంగా డాక్టర్‌ కాళీప్రసాద్‌రావు మాట్లాడుతూ పరకాల ప్రభుత్వ ఆసుపత్రిని హడావుడిగా ప్రారంభించారని, ప్రస్తుతం అది మూతపడే పరిస్థితిలో ఉందని ఆరోపించారు. ఆసుపత్రి పరిస్థితిపై ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలను వెల్లడించాలని, ప్రారంభోత్సవ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని కోరారు.</p>
<p>సిరంగి సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలను కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు పరకాల బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్‌ ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.<br />కార్యశాలలో బీజేపీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్‌.పీ. జయంత్‌లాల్‌, దేవునూరి మేఘనాథ్‌, పరకాల కౌన్సిలర్లు బెజ్జంకి పునాచారి, ఆకుల లావణ్య శ్రీధర్‌, మండల అధ్యక్షులు కాసగాని రాజ్‌కుమార్‌, ఉప్పుగల శ్రీకాంత్‌రెడ్డి, వేల్పుల రాజ్‌కుమార్‌, మాజీ చైర్‌పర్సన్‌ మార్త రాజభద్రయ్య ఓబీసీ, ఎస్సీ మోర్చా నాయకులు, మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/bjp-workshop-on-revision-of-voter-list/article-496</link>
                <guid>https://www.aksharadarbar.com/bjp-workshop-on-revision-of-voter-list/article-496</guid>
                <pubDate>Tue, 25 Aug 2026 10:51:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/img-20260824-wa0758.jpg"                         length="494767"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>akshara Darbar special</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/824/akshara-darbar-special"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-08/darbar-special-swarna.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/824/akshara-darbar-special</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/824/akshara-darbar-special</guid>
                <pubDate>Tue, 25 Aug 2026 08:06:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/darbar-special-swarna.jpg"                         length="2155654"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>	aksharadarbar-25-08-2026</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/823/aksharadarbar-25-08-2026"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-08/2508wgl01.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/823/aksharadarbar-25-08-2026</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/823/aksharadarbar-25-08-2026</guid>
                <pubDate>Tue, 25 Aug 2026 01:58:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/2508wgl01.jpg"                         length="887772"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>నేను పార్టీకి కండువాను </title>
                                    <description><![CDATA[<p>- అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చా.. కాంగ్రెస్ తోనే నా ప్రయాణం.. నా శ్వాస <br />- అడ్డంకులు ఎదురైనా అడుగు ఆపలేదు.. పార్టీకి ఎప్పుడు వెన్ను చూపలేదు <br />- టికెట్లు ఆశించలేదు.. పదవుల కోసం కాంగ్రెస్ ను వీడలేదు <br />- కేసీఆర్ పిలిచినా పార్టీని వదిలి వెళ్లలే<br />- నా రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు<br />- ఆడపిల్ల గడప దాటని రోజుల్లోనే పీఏసీఎస్ చైర్ పర్సన్ గా తొలి విజయం<br />- ఒక్కరోజు ప్రచారంతో పీఏసీఎస్ విజయం.. అది కుటుంబం అందించిన ప్రోత్సాహం <br />- మామ భర్తే నా పొలిటికల్ గురువులు <br />- వైఎస్సార్ మాట ఇచ్చారు.. మేయర్ పీఠం దక్కింది<br />- మేయర్ గా ఐదేళ్లు ప్రజలకు సేవ చేయడం సంతృప్తినిచ్చింది <br />- నగర ప్రజల తాగునీటి కోసం రూ.178 కోట్లు తేవటం మర్చిపోలేనిది<br />- రాజకీయాల్లో వైఎస్సార్ నా అన్న.. రేవంత్ రెడ్డి నమ్మకమే నా బలం <br />- నా పొలిటికల్ భవిష్యత్తు పార్టీ నిర్ణయిస్తుంది<br />- డిజిటల్ మీడియా చిట్ చాట్ లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ <br />- ఇంటి గడప దాటని స్థాయి నుంచి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా స్వర్ణ రాజకీయ ప్రస్థానం</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/politics/im-a-party-goer/article-495"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-08/img-20260824-wa0023.jpg" alt=""></a><br /><p>నేను పార్టీకి కండువాను </p>
<p>- అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చా.. కాంగ్రెస్ తోనే నా ప్రయాణం.. నా శ్వాస <br />- అడ్డంకులు ఎదురైనా అడుగు ఆపలేదు.. పార్టీకి ఎప్పుడు వెన్ను చూపలేదు <br />- టికెట్లు ఆశించలేదు.. పదవుల కోసం కాంగ్రెస్ ను వీడలేదు <br />- కేసీఆర్ పిలిచినా పార్టీని వదిలి వెళ్లలే<br />- నా రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు<br />- ఆడపిల్ల గడప దాటని రోజుల్లోనే పీఏసీఎస్ చైర్ పర్సన్ గా తొలి విజయం<br />- ఒక్కరోజు ప్రచారంతో పీఏసీఎస్ విజయం.. అది కుటుంబం అందించిన ప్రోత్సాహం <br />- మామ భర్తే నా పొలిటికల్ గురువులు <br />- వైఎస్సార్ మాట ఇచ్చారు.. మేయర్ పీఠం దక్కింది<br />- మేయర్ గా ఐదేళ్లు ప్రజలకు సేవ చేయడం సంతృప్తినిచ్చింది <br />- నగర ప్రజల తాగునీటి కోసం రూ.178 కోట్లు తేవటం మర్చిపోలేనిది<br />- రాజకీయాల్లో వైఎస్సార్ నా అన్న.. రేవంత్ రెడ్డి నమ్మకమే నా బలం <br />-  నా పొలిటికల్ భవిష్యత్తు పార్టీ నిర్ణయిస్తుంది<br />- డిజిటల్ మీడియా చిట్ చాట్ లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ <br />- ఇంటి గడప దాటని స్థాయి నుంచి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా స్వర్ణ రాజకీయ ప్రస్థానం</p>
<p>అక్షరదర్బార్, హనుమకొండ </p>
<p>రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ తన బాల్యం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు అనేక ఆసక్తికర విషయాలను సోమవారం హనుమకొండలోని తమ నివాసంలో డిజిటల్ మీడియా చిట్ చాట్ లో పంచుకున్నారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం పాతగూడూరు తమ స్వస్థలమని స్వర్ణ తెలిపారు. తండ్రి హన్మంతరావు లాయర్‌గా ప్రాక్టీస్‌ చేసి, అనంతరం కాంట్రాక్టర్‌గా పనిచేశారని చెప్పారు. తల్లి జయలక్ష్మి. అక్క, చెల్లి, తమ్ముడితో కలిసి కరీంనగర్‌ పట్టణంలో పెరిగానన్నారు. ఇంటర్‌ వరకు కరీంనగర్‌లోనే చదివానని, ఇంటర్‌ సెకండియర్‌లో ఉండగానే వివాహం కావడంతో ఆ తర్వాత చదువును కొనసాగించలేకపోయానని గుర్తు చేసుకున్నారు. అక్క భర్త స్నేహితుడైన వరద రాజేశ్వర్‌రావుతో పరిచయం ద్వారా వివాహ సంబంధం కుదిరిందన్నారు. రాజేశ్వర్‌రావు అప్పట్లో ఏ ఉద్యోగం చేయకపోవడంతో ఇంట్లో కొంత అభ్యంతరం వ్యక్తమైనా, ఆయన మంచివారని చెప్పి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారని తెలిపారు. తన తాతకు ఆ సంబంధంపై అభ్యంతరం ఉంటే, ఆయనకంటే ముందే నువ్వే ‘నో’ చెప్పాలని చెప్పారని గుర్తు చేసుకున్నారు. అయితే తనకు రాజేశ్వర్‌రావు నచ్చారని, తనను కూడా ఆయనకు నచ్చడంతో వివాహం జరిగిందన్నారు.</p>
<p>- రాజకీయాలతో అసలు పరిచయం లేదు..<br />తమ కుటుంబానికి రాజకీయ నేపథ్యం లేదని స్వర్ణ తెలిపారు. ఆడవాళ్లు గడీల నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదని గుర్తు చేసుకున్నారు. పెళ్లి తర్వాత అత్తింట్లో తనకు ఎంతో గౌరవం లభించిందని చెప్పారు. కోడలిని కూడా కూతురిలాగే చూసుకునే సంప్రదాయం తమ అత్తింట్లో ఉందన్నారు. అత్తమామలు కులశేఖర్‌రావు, లక్ష్మీదేవి తనను సొంత బిడ్డలా చూసుకునేవారని తెలిపారు. వారి వృద్ధాప్యంలో ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం వారి బాగోగులు చూసుకునేదాన్నని, మరిది, తోటి కోడలు కూడా ఎంతో మంచిగా చూసుకునేవారని గుర్తు చేసుకున్నారు. అత్తింట్లో తనకు లభించిన గౌరవమే రాజకీయంగా ముందుకు సాగే అవకాశాన్ని కూడా కల్పించిందన్నారు.</p>
<p>- రాజకీయ ఓనమాలు నేర్పింది మా వారే..<br />రాజకీయాల్లోకి రావడం మాత్రం చాలా అనూహ్యంగా, తన ప్రమేయం లేకుండానే జరిగిందని స్వర్ణ తెలిపారు. రాజకీయ ఓనమాలు నేర్పింది తన భర్త వరద రాజేశ్వర్‌రావేనని చెప్పారు. రాజకీయంగా ముందుకు రావడానికి అన్ని విధాలుగా ప్రోత్సహించింది తన మామ కులశేఖర్‌రావేనని తెలిపారు. వరద రాజేశ్వర్‌రావు యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసేవారని చెప్పారు. ఆ సమయంలో సంజయ్‌ గాంధీ వచ్చిన సందర్భంగా అండాల కొద్దీ పులిహోర తయారు చేశానని, దానిని రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.</p>
<p>- అనుకోకుండా పీఏసీఎస్‌ చైర్మన్‌గా..<br />తాను రాజకీయాల్లోకి వస్తానని ఏనాడూ అనుకోలేదని స్వర్ణ చెప్పారు. వర్ధన్నపేట పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎన్నికలు వచ్చినప్పుడు తన మామ పోటీ చేయాలని సూచించారని తెలిపారు. పిల్లలు చిన్నవాళ్లు కావడంతో రాజకీయాల్లోకి వస్తే ఎలా అని తొలుత అడిగానని చెప్పారు. అయితే మామ కులశేఖర్‌రావు, భర్త వరద రాజేశ్వర్‌రావు పట్టుబట్టి పోటీ చేయించారని తెలిపారు. ఒక్క రోజు మాత్రమే ప్రచారానికి వెళ్లినా భారీ మెజార్టీతో గెలిచానని చెప్పారు. 1991లో తొలిసారి పీఏసీఎస్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టానని తెలిపారు. అనంతరం రాష్ట్రంలో టీడీపీ హవా నడుస్తున్న కాలంలో ఓడీసీఎంఎస్‌ డైరెక్టర్‌ పదవికి బరిలో నిలిపారని, ఆ ఎన్నికల్లో కూడా విజయం సాధించానన్నారు. అయితే చైర్మన్‌ కావాల్సిన సమయంలో సొంత పార్టీలోని వ్యక్తే హ్యాండ్‌ ఇవ్వడంతో ఆ పదవి చేజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో చైర్మన్‌గా బీరం సంజీవరెడ్డి గెలిచారని తెలిపారు.</p>
<p>- మాది కాంగ్రెస్‌ కుటుంబం..<br />తమ కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్‌తోనే ఉందని స్వర్ణ స్పష్టం చేశారు. అన్ని పార్టీల నాయకులతో వ్యక్తిగతంగా మంచి అనుబంధాలు ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం కాంగ్రెస్‌ను వీడలేదన్నారు. వివిధ పార్టీల నుంచి తమ కుటుంబాన్ని పార్టీలోకి రావాలని ఆహ్వానించినా వెళ్లలేదని తెలిపారు. కేసీఆర్‌ సైతం పార్టీలోకి రావాలని పిలిచారని, అయినా కాంగ్రెస్‌ను వీడలేదన్నారు. “ఎన్ని సమస్యలు వచ్చినా కాంగ్రెస్‌లోనే ఉన్నాం. పదవులు ఉన్నా, లేకున్నా పార్టీతో మా ప్రయాణం కొనసాగింది. జీవితం అంతా కాంగ్రెస్‌ పార్టీతోనే” అని స్పష్టం చేశారు.</p>
<p>- తొలి ఎమ్మెల్యే ఎన్నిక.. 10 వేల ఓట్లతో ఓటమి<br />1985లో వరద రాజేశ్వర్‌రావుకు ఎమ్మెల్యే టికెట్‌ వచ్చిందని గాంధీభవన్‌ నుంచి ఫోన్‌ వచ్చిందని స్వర్ణ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో టికెట్‌ అంటే ఏమిటో కూడా పూర్తిగా అర్థం కాలేదన్నారు. వరద రాజేశ్వర్‌రావు అంటే అప్పటికి రాజకీయంగా పెద్దగా ఎవరికీ తెలియదని, కేవలం మాధవరావు మనుమడు అనే గుర్తింపు మాత్రమే ఉండేదన్నారు. ఆ ఎన్నికల్లో సుమారు 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని తెలిపారు.</p>
<p>- ఓటమి తర్వాతే జనాలతో బంధం..<br />ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రోజు నుంచే రాజేశ్వర్‌రావు ఉదయం 7 గంటలకు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను కలవడం ప్రారంభించారని స్వర్ణ తెలిపారు. ప్రతి ఒక్కరినీ పలకరించి, వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ ప్రజలతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నారని చెప్పారు. మళ్లీ ఎన్నికలు రాగానే రాజేశ్వర్‌రావుకు టికెట్‌ వచ్చిందన్నారు. అయితే ఆ ఎన్నికల్లో భారీ మోసం జరిగిందని స్వర్ణ తెలిపారు. ముందుగా బీ-ఫాం ఇచ్చారని, కానీ ఎన్నికలకు ముందు రోజు మాచర్ల జగన్నాథంను అభ్యర్థిగా ప్రకటించారని చెప్పారు. రాజేశ్వర్‌రావు బీ-ఫాంతో నామినేషన్‌ వేయడంతో చేయి గుర్తు కూడా వచ్చిందన్నారు. పార్టీలోనే ఇద్దరు అభ్యర్థులు ఉండే పరిస్థితి రావడంతో చివరకు సుమారు 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని తెలిపారు. టీ. రాజేశ్వర్ రావు గెలిచారు.  ఆ ఎన్నికలతో రాజకీయంగా తీవ్ర దెబ్బ తగిలిందన్నారు.</p>
<p>- వైఎస్‌ పిలుపుతో ఎమ్మెల్యే బరిలోకి..<br />పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేస్తున్న తమ కుటుంబాన్ని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గుర్తించారని స్వర్ణ తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో ఐదు నియోజకవర్గాల సమీక్షను వర్ధన్నపేటలో ఏర్పాటు చేయాలని మా ఆయనకు ఫోన్‌ చేశారని చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు చెరుకుపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తన భర్త రాజేశ్వర్‌రావు వైఎస్‌తో కలిసి ఉన్నారని తెలిపారు. ఆ సమయంలో తనను పిలిచి వచ్చే ఎన్నికల్లో నీకు టికెట్‌ ఇస్తానని, నువ్వే పోటీ చేయాలని వైఎస్‌ చెప్పారని గుర్తు చేసుకున్నారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఎవరు పోటీ చేసినా పార్టీకి నష్టం జరుగుతుందని, ఒకవేళ ఓడిపోయినా తాను చూసుకుంటానని వైఎస్‌ భరోసా ఇచ్చారని తెలిపారు. చెప్పినట్లుగానే టికెట్‌ ఇచ్చారని అన్నారు. అప్పటికే దయాకర్‌రావు బలమైన నాయకుడిగా ఉన్నప్పటికీ పోటాపోటీగా ప్రచారం చేశానని స్వర్ణ చెప్పారు. తీగరాజుపల్లిలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో భారీ బహిరంగ సభ నిర్వహించామని, ఇసుకపోస్తే రాలనంతగా ప్రజలు తరలివచ్చారని తెలిపారు. ఆ సభను ఫెయిల్‌ చేసేందుకు దాడులు జరిగాయని, తన కుమారులను ఇష్టారాజ్యంగా కొట్టారని ఆరోపించారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు ప్రత్యర్థి అభ్యర్థి దయాకర్‌రావు చంద్రబాబుతో సమావేశం పెట్టారని, తన ఓటమి కోసం అనేక కుట్రలు జరిగాయని స్వర్ణ ఆరోపించారు. డిపాజిట్‌ ఓట్లు సాధించడమే కష్టమనుకున్న నియోజకవర్గంలో చివరకు కేవలం 4 వేల ఓట్ల తేడాతో ఓడిపోయానని తెలిపారు.</p>
<p>- మేయర్‌ ప్రకటన.. ఓ యుద్ధమే..<br />ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయినా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని స్వర్ణ చెప్పారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2005లో వరంగల్‌ మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తాను కేవలం కార్పొరేటర్‌గా మాత్రమే పోటీ చేసి గెలిచానని తెలిపారు. అయితే అప్పటికే నగర రాజకీయాల్లో మేయర్‌ పదవిపై తీవ్ర పోటీ నెలకొందన్నారు. పోటీలో ఉన్న ఇద్దరు కీలక నేతల భార్యలు తామే మేయర్‌ అభ్యర్థులమంటూ అప్పట్లో ప్రచారం కూడా చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. తాను మాత్రం ఎక్కడా మేయర్‌ పదవి గురించి ప్రచారం చేయలేదని చెప్పారు. ఎన్నికల తర్వాత తన భర్త వరద రాజేశ్వర్‌రావుతో కలిసి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని కలిశామని తెలిపారు. వైఎస్సార్‌తో తమ కుటుంబానికి ఉన్న సన్నిహిత అనుబంధం, ఆయన చలువతోనే తనకు మేయర్‌ పదవి దక్కిందన్నారు. బలమైన పోటీదారులు ఉన్నప్పటికీ వైఎస్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి తనను మేయర్‌గా చేశారని చెప్పారు. అయితే తనను వరంగల్‌ మేయర్‌గా ప్రకటించిన రోజు మాత్రం మున్సిపాలిటీ వద్ద పెద్ద యుద్ధమే జరిగినంత పరిస్థితి ఏర్పడిందని స్వర్ణ గుర్తు చేసుకున్నారు.  <br />- రూ.178 కోట్ల నిధులు.. <br />మేయర్‌గా ఉన్న సమయంలో వరంగల్‌ నగర అభివృద్ధిలో తన కృషి ఎంతో ఉందని స్వర్ణ తెలిపారు. ఎవరూ ఊహించని స్థాయిలో రూ.178 కోట్ల నిధులు తీసుకొచ్చి అనేక అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. ఆ నిధులను తీసుకురావడంలో అప్పటి కేంద్ర మంత్రి దివంగత నేత జయపాల్‌రెడ్డి వంద శాతం సహకరించారని తెలిపారు. ప్రధాన జంక్షన్ల అభివృద్ధి, విస్తరణ, తాగునీటి సరఫరా, స్లమ్‌ ఏరియాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. తన హయాంలో నగర అభివృద్ధికి సంతృప్తికరంగా పని చేశామని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సహకారంతో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని సంకల్పించామని చెప్పారు. మహిళలను లక్షాధికారులను చేయాలనే లక్ష్యంతో డ్వాక్రా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు అందించామని తెలిపారు.  </p>
<p>- వర్ధన్నపేటతో ప్రత్యేక అనుబంధం<br />వర్ధన్నపేట నియోజకవర్గంతో తమ కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉందని స్వర్ణ తెలిపారు. ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా తమ కుటుంబం అండగా ఉంటుందని చెప్పారు. ప్రజలతో, కార్యకర్తలతో మంచి సంబంధాలు కొనసాగించడమే తమ రాజకీయ బలమన్నారు.</p>
<p>- రేవంత్‌తో కలిసి పార్టీ విజయం కోసం..<br />రేవంత్‌రెడ్డి పాదయాత్ర సమయంలో వరంగల్‌లో తమ కుటుంబాన్ని కలిశారని స్వర్ణ తెలిపారు. తమది కాంగ్రెస్‌ కుటుంబమని, గతంలో తమకు ఉన్న గౌరవం పార్టీకి ఉంటుందని, కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు చివరి అవకాశమని, ఓడిపోతే భవిష్యత్‌ ఉండదని చెప్పి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని కోరారని చెప్పారు. ఆయన సూచన మేరకు పార్టీ విజయం కోసం పనిచేశామని తెలిపారు. కరీంనగర్‌లో ఇన్‌చార్జిగా బాధ్యతలు ఇచ్చినా పార్టీ కోసం పని చేశానన్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తాను ఏ పదవీ అడగలేదని చెప్పారు. అయితే తన పనిని గుర్తించి 2023లో వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా నియమించారని తెలిపారు. </p>
<p>- టికెట్‌ రాకపోయినా నిరాశ పడలేదు..<br />వరంగల్‌ టికెట్‌ వస్తుందని ఆశించానని స్వర్ణ తెలిపారు. అయితే అనుకోని రాజకీయ పరిణామాల్లో కొండా సురేఖ రావడంతో ఆమెకు టికెట్‌ ఇచ్చారని చెప్పారు. టికెట్‌ రాకపోయినా తాను బాధపడలేదన్నారు. తన పార్టీ సేవలను గుర్తించి రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఆ ప్రకటన వెలువడిన సమయంలో తాను ఆస్ట్రేలియాలో ఉన్నట్లు చెప్పారు.</p>
<p>- పదవులు ఆశించం.. పార్టీ కోసం పని చేస్తాం<br />తమది పదవులను ఆశించే కుటుంబం కాదని స్వర్ణ స్పష్టం చేశారు. పార్టీకి కట్టుబడి పనిచేస్తే పదవులు వాటంతట అవే వస్తాయని అన్నారు. ఇప్పటివరకు తాను ఏ పదవీ అడగలేదని తెలిపారు. సుమారు ఐదు దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్నామని, పదవులు ఉన్నా లేకున్నా కాంగ్రెస్‌తో తమ ప్రయాణం కొనసాగుతూనే ఉందన్నారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికే 20 జిల్లాల్లో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేశానని తెలిపారు. మహిళా సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని చెప్పారు. మహిళలను పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుగ్గా భాగస్వాములను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మండల కమిటీల ఏర్పాటు పూర్తి చేస్తున్నామని, రానున్న ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యం పెంచడంతో పాటు ప్రచారంలో వారిని ముందుండేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ, జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. <br />- ‘నాకు అన్న వైఎస్సారే.. పార్టీకి కండువా నేనే’<br />తనకు అన్నలు లేరని, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డినే అన్నగా భావిస్తానని స్వర్ణ భావోద్వేగంగా చెప్పారు. “నాకు పార్టీ కండువాలు కాదు.. నేను పార్టీకి కండువా. రాజకీయాల్లో రిటైర్‌మెంట్‌ ఉండదు. ఈ సందర్భంగా డిజిటల్ మీడియా ప్రతినిధులు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారా అని ప్రశ్నించగా.. పార్టీ అవకాశం వస్తే తప్పకుండా బరిలో ఉంటానని చెప్పారు. నాకు ఓపిక ఉన్నంత కాలం పార్టీ కోసం పనిచేస్తా. పదవులు వాటంతట అవే వస్తాయి” అని స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>రాజకీయం</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/politics/im-a-party-goer/article-495</link>
                <guid>https://www.aksharadarbar.com/politics/im-a-party-goer/article-495</guid>
                <pubDate>Mon, 24 Aug 2026 19:55:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/img-20260824-wa0023.jpg"                         length="2907093"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>aksharadarbar-23-08-2026</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/822/aksharadarbar-23-08-2026"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-08/6a8a582d82cb4-2308wgl01.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/822/aksharadarbar-23-08-2026</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/822/aksharadarbar-23-08-2026</guid>
                <pubDate>Sun, 23 Aug 2026 07:47:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/6a8a582d82cb4-2308wgl01.jpg"                         length="1280776"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>aksharadarbar-22-08-2026</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/821/aksharadarbar-22-08-2026"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-08/2208wgl01.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/821/aksharadarbar-22-08-2026</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/821/aksharadarbar-22-08-2026</guid>
                <pubDate>Sat, 22 Aug 2026 07:28:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/2208wgl01.jpg"                         length="1309520"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>akshara Darbar special</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/820/akshara-darbar-special"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-08/6a88ef1343ad0-darbar-special.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/820/akshara-darbar-special</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/820/akshara-darbar-special</guid>
                <pubDate>Sat, 22 Aug 2026 06:06:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/6a88ef1343ad0-darbar-special.jpg"                         length="2905747"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>కసితో ఎమ్మెల్యేనయ్య</title>
                                    <description><![CDATA[<p>- బిజినెస్ మ్యాన్ ను కావాలనే కాయిస్ ఉండే నాకు <br />- మా అన్న ఎమ్మెల్యే కావాలన్న టార్గెట్ ఉండేది <br />- అయితే ఒక్క అవమానం నన్ను అసెంబ్లీకి పంపింది<br />- 2004 ఎన్నికల్లో కేవలం రూ.91 వేలతో నామినేషన్ వేసిన <br />- ప్రతి ఎన్నికల్లో నామినేషన్ ఫీజు పొద్దుటూరి గంగారెడ్డి ఇచ్చారు <br />- 2005లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన <br />- డిప్యూటీ మేయర్ పదవి కోసం కార్పొరేటర్ గా పోటీ చేయమన్నారు <br />- తర్వాత పార్టీ సిటీ ప్రెసిడెంట్ గా నియమించారు <br />- మానవ సంబంధాలే నన్ను వరుసగా గెలిపించాయి<br />- ఐదు ప్రిన్సిపుల్స్ పై ఎమ్మెల్యేగా పనిచేసిన <br />- కార్మికులు, సహకార సంఘాలే నా బలం<br />- ఉద్యమకారులకు ఆర్థిక సాయం చేశాను <br />- ప్రతీకార రాజకీయాలకు దూరం.. ప్రజల సంక్షేమమే నా మంత్రం<br />- వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్త.. పనితీరుతోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా<br />- డిజిటల్ మీడియాతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ చిట్ చాట్ </p>
<p> </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/politics/kasitho-mla/article-494"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-08/img-20260821-wa0025.jpg" alt=""></a><br /><p>కసితో ఎమ్మెల్యేనయ్యా</p>
<p>- బిజినెస్ మ్యాన్ ను కావాలనే కాయిస్ ఉండే నాకు <br />- మా అన్న ఎమ్మెల్యే కావాలన్న టార్గెట్ ఉండేది <br />- అయితే ఒక్క అవమానం నన్ను అసెంబ్లీకి పంపింది<br />- 2004 ఎన్నికల్లో కేవలం రూ.91 వేలతో నామినేషన్ వేసిన <br />- ప్రతి ఎన్నికల్లో నామినేషన్ ఫీజు పొద్దుటూరి గంగారెడ్డి ఇచ్చారు <br />- 2005లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన <br />- డిప్యూటీ మేయర్ పదవి కోసం కార్పొరేటర్ గా పోటీ చేయమన్నారు <br />- తర్వాత పార్టీ సిటీ ప్రెసిడెంట్ గా నియమించారు <br />- మానవ సంబంధాలే నన్ను వరుసగా గెలిపించాయి<br />- ఐదు ప్రిన్సిపుల్స్ పై ఎమ్మెల్యేగా పనిచేసిన <br />- కార్మికులు, సహకార సంఘాలే నా బలం<br />- ఉద్యమకారులకు ఆర్థిక సాయం చేశాను <br />- ప్రతీకార రాజకీయాలకు దూరం.. ప్రజల సంక్షేమమే నా మంత్రం<br />- వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్త.. పనితీరుతోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా<br />- డిజిటల్ మీడియాతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ చిట్ చాట్ </p>
<p><br />అక్షరదర్బార్, హనుమకొండ </p>
<p>పొలిటీషియన్ ను కావాలన్న ఆలోచనతో తన ప్రస్థానం ప్రారంభం కాలేదని, మంచి బిజినెస్ మేన్ గా ఎదగాలన్నదే తన కల అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అయితే జీవితంలో ఎదురైన ఒక అవమానం తనలో ఎమ్మెల్యే కావాలనే కసిని రగిలించిందన్నారు. ఓటమిని అధిగమించి గెలుపు సాధించడం నుంచి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం వరకు సాగిన ప్రస్థానాన్ని ఆయన డిజిటల్ మీడియాతో శుక్రవారం చేసిన చిట్‌చాట్‌లో పంచుకున్నారు.</p>
<p>- ఉమ్మడి కుటుంబంలో పెరిగి..<br />తమది పెద్ద ఉమ్మడి కుటుంబమని, తండ్రి విద్యుత్ శాఖలో ఉద్యోగం చేసేవారని వినయ్ భాస్కర్ తెలిపారు. చిన్నతనంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నామని, అన్నలు, అక్కలు, తమ్ముళ్లతో కలిసి వడ్డేపల్లిలోని ఇంట్లో ఉండేవారమన్నారు. శనివారం వచ్చిందంటే ఇంట్లో సందడి వాతావరణం ఉండేదని గుర్తుచేసుకున్నారు. తాను రాజకీయ నాయకుడు కావాలని ఎప్పుడూ అనుకోలేదని, మంచి బిజినెస్‌మ్యాన్‌గా ఎదగాలనే కోరిక ఉండేదన్నారు. అందుకు తగ్గట్టుగానే కోకాకోలా డీలర్‌షిప్ తీసుకుని, దాన్ని విస్తరించాలనే ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు.</p>
<p>- అన్న రాజకీయాల్లో.. తాను బ్యాక్‌ఎండ్‌లో..<br />మా అన్న దాస్యం ప్రణయ్ భాస్కర్ రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారని, తాను మాత్రం ఆయనకు తెర వెనుక నుంచి సహకరించేవాడినని దాస్యం తెలిపారు. 1984లో ప్రణయ్ భాస్కర్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ప్రజలతో సంబంధాలను బలోపేతం చేసేందుకు పలు సంఘాలను ఏర్పాటు చేశామన్నారు. 1994లో ఆయన విజయం సాధించి మంత్రి అయ్యారని, అప్పటి నుంచి ఏర్పడిన సంఘాలు తమకు ఇప్పటికీ అండగా నిలుస్తున్నాయని చెప్పారు. అయితే ప్రణయ్ భాస్కర్ అకాల మరణం తమ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టిందన్నారు. ఆయన మరణం తర్వాత రాజకీయాలు వద్దనుకుని, కుటుంబం, వ్యాపారంపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.</p>
<p>- ఆ ఒక్క ఘటన.. ఎమ్మెల్యేను చేసింది <br />అన్న మరణం తర్వాత వదిన, పిల్లలు హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో తల్లిదండ్రులతో కలిసి వెళ్లామని వినయ్ భాస్కర్ తెలిపారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న తన అన్న క్వార్టర్‌కు సీల్ వేసి ఉండటం చూసి బాధ కలిగిందన్నారు. ఈ విషయంపై ఈవో కార్యాలయానికి వెళ్లి అడిగితే అక్కడ ఎదురైన నిర్లక్ష్యపూరిత వైఖరి, అవమానం తనలో కసిని పెంచిందని చెప్పారు. ఆ ఘటన తర్వాతే ఎమ్మెల్యే కావాలనే పట్టుదల బలపడిందన్నారు. ఈవోకు సవాల్ చేసి, ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పానని, అనుకున్నట్లుగానే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వెళ్లి శాలువా కప్పి స్వీటు ఇచ్చి వచ్చానని గుర్తుచేసుకున్నారు.</p>
<p>- అప్పటి రాజకీయాలు వేరు..<br />ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం ఇప్పటితో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉండేదని వినయ్ భాస్కర్ అన్నారు. రాజకీయ ప్రత్యర్థుల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో సత్సంబంధాలు ఉండేవన్నారు. 1998లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన తనకు వామపక్షాలు, కార్మిక సంఘాలు, యూనియన్లు మద్దతుగా నిలిచాయని చెప్పారు. 2004లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తానని చెప్పినా, రాజకీయ పరిణామాలు, బీజేపీతో పొత్తు నేపథ్యంలో పరిస్థితులు మారిపోయాయని అన్నారు. మరికొందరు నాయకులతో కలిసి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్న సమయంలో చంద్రబాబు వద్దకు వెళ్లినా, నామినేషన్ వేయొద్దని, నామినేటెడ్ పదవి ఇస్తానని చెప్పారని తెలిపారు. అయినప్పటికీ పోటీ చేయాలన్న నిర్ణయం మార్చుకోలేదన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి పోటీ చేయాలనే ఆఫర్ వచ్చినా, వామపక్షాలు, సంఘాల మద్దతుతో ఇండిపెండెంట్‌గానే పోటీ చేశానన్నారు. తనతో పాటు పోటీ చేస్తామని చెప్పిన కొందరు చివరి సమయంలో వెనక్కి తగ్గినా, తాను నమ్ముకున్న సంఘాలు మాత్రం తన వెంట నిలిచాయని చెప్పారు. 2004 ఎన్నికల్లో కేవలం 1,400 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యానని తెలిపారు.</p>
<p>- 2005లో కేసీఆర్‌ను కలిశా..<br />ఎన్నికల అనంతరం 2005లో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ను కలిసినట్లు వినయ్ భాస్కర్ తెలిపారు. తొలుత కార్పొరేటర్‌గా పోటీ చేయాలని కేసీఆర్ సూచించారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పట్టు పట్టణంలో కూడా పెరగాలంటే కార్పొరేటర్‌గా పోటీ చేయాలని కేసీఆర్ సూచించడంతో అంగీకరించానన్నారు. తనను నమ్ముకున్న వారికి కొన్ని టికెట్లు ఇప్పించాలని కోరగా అందుకు సహకరించారని, అనంతరం పోటీ చేసి విజయం సాధించానని తెలిపారు. ఆ తర్వాత టీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారని చెప్పారు.</p>
<p>- పార్టీ ఆఫీసు ప్రారంభం రోజే టికెట్‌ కన్ఫాం <br />టౌన్ అధ్యక్షుడిన అయిన తర్వాత కేయూ జంక్షన్ సమీపంలో పార్టీ కార్యాలయం కోసం భవనాన్ని అద్దెకు తీసుకున్నానని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. కేసీఆర్ హన్మకొండకు వచ్చినప్పుడు ఆయన చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. అయితే కొందరు తనపై లేనిపోని విషయాలు చెప్పి కేసీఆర్‌ను పార్టీ కార్యాలయానికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తాను స్వయంగా వెళ్లి కార్యాలయానికి రావాలని కోరగా, తొలుత నిరాకరించినా, కార్యాలయం కోసం పడిన కష్టం చెప్పడంతో కేసీఆర్ వచ్చి ప్రారంభించారని తెలిపారు. పార్టీ కార్యాలయ ఏర్పాటును చూసి కేసీఆర్ అభినందించారని, తనకు ఉన్న ప్రజాబలం, గత ఎన్నికల్లో వచ్చిన మద్దతును పరిశీలించిన తర్వాత అక్కడే తనకు పార్టీ టికెట్ ఖరారైందని చెప్పారు.</p>
<p>- ఓటమి నుంచి గెలుపు వరకు..<br />2004లో ఓడిపోయిన తర్వాత నిరాశ చెందకుండా ప్రజలు, కార్మికులు, వివిధ సంఘాలతో తన సంబంధాలను మరింత బలోపేతం చేసుకున్నట్లు వినయ్ భాస్కర్ తెలిపారు. 44 సంఘాలతో కార్మిక సమాఖ్య ఐక్యవేదికను ఏర్పాటు చేశామని, వారంతా అండగా నిలవడంతో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించానన్నారు. “నేను ఆర్థిక సంబంధాలతో కాదు.. మానవ సంబంధాలతో గెలిచాను” అని ఆయన అన్నారు. అందుకే కార్మిక, సహకార సంఘాలంటే తనకు ప్రత్యేక అభిమానమని, వాటికి ఎప్పుడూ తోడుగా ఉంటానన్నారు.</p>
<p>- ఐదు సూత్రాలు..<br />తన రాజకీయ, సామాజిక జీవితంలో ఐదు అంశాలను కచ్చితంగా పాటిస్తానని వినయ్ భాస్కర్ తెలిపారు. ఆరోగ్య సమస్యతో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే అర్ధరాత్రి అయినా స్పందించడం, ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం చేయడం, పేద విద్యార్థుల ఫీజులకు సహకరించడం, తన క్యాడర్‌కు అన్ని విధాలుగా అండగా నిలవడం, కార్మిక, సహకార సంఘాలకు తోడుగా ఉండడం తన నైజమన్నారు.</p>
<p>- 'కల్పలత’తో విడదీయరాని అనుబంధం..<br />గతంలో ఉన్న వరంగల్ సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న కల్పలతా సూపర్ బజార్‌తో చిన్ననాటి నుంచే తనకు ప్రత్యేక అనుబంధం ఉందని వినయ్ భాస్కర్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాన్ని మూసివేసేందుకు ప్రయత్నాలు జరిగినప్పుడు అడ్డుకున్నానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కల్పలతాపై ఉన్న అప్పును మాఫీ చేయించడంతో పాటు సభ్యత్వాలను పెంచి, అన్ని వర్గాలతో కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. పెట్రోల్ బంక్ ప్రారంభించి, వచ్చిన సంపదను వినియోగదారులకు చేరేలా లాటరీల ద్వారా బహుమతులు కూడా అందించామని చెప్పారు. అయితే ఇప్పుడు కల్పలతా సూపర్ బజార్‌లో అవినీతి జరిగిందని, దానికి తానే కారణమంటూ కొందరు బురద జల్లుతున్నారని ఆరోపించారు.</p>
<p>- ఉద్యమకారులకు సాయం..<br />మా అమ్మ ఎప్పుడూ.. చేసిన దానం గుప్తంగా ఉండాలని చెప్పేదని, ఆ మాటను ఇప్పటికీ పాటిస్తున్నానని వినయ్ భాస్కర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి పోరాడి మరణించిన వారి కుటుంబాలకు, కేసుల పాలైన వారికి, గాయపడిన వారికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సహాయం చేశానన్నారు. ఎంతో మందికి సాయం చేశానని, అది నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదని సాయం పొందిన వారి మనస్సులో ఉంటే చాలన్నారు. అలాగే 833 మంది సభ్యులతో త్రిచక్ర పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేయగా అది విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు.</p>
<p>- నో రివేంజ్ పాలిటిక్స్..  <br />తాను ఎప్పుడూ ప్రతీకార రాజకీయాలు చేయలేదని, చిల్లర వ్యాఖ్యలు చేయడం తన పద్ధతి కాదని వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. కబ్జాలంటూ పేరు బద్నాం చేశారని, వాటికి నేను సరైనా తీరుగా, సమయంలో స్పందించకపోవడం ముప్పుకొచ్చింది. కరోనా సమయంలో రాజకీయ భేదాలు చూడకుండా కాంగ్రెస్ నాయకుల ఇళ్లకు వెళ్లి మందులు, ఇంజెక్షన్లు అందించిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. తన ఓటమికి గల కారణాలను ఇప్పటికే గుర్తించానని, వాటిని సరిదిద్దుకునే పనిలో ఉన్నానని తెలిపారు. 2029 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఉంటుందని, అది చిల్లర రాజకీయాలతో కాదు.. తన పనితీరుతోనే ఉంటుందని స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>రాజకీయం</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/politics/kasitho-mla/article-494</link>
                <guid>https://www.aksharadarbar.com/politics/kasitho-mla/article-494</guid>
                <pubDate>Fri, 21 Aug 2026 20:32:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/img-20260821-wa0025.jpg"                         length="33283"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>aksharadarbar-21-08-2026</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/819/aksharadarbar-21-08-2026"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-08/6a8774e3f2af5-2108wgl01.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/819/aksharadarbar-21-08-2026</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/819/aksharadarbar-21-08-2026</guid>
                <pubDate>Fri, 21 Aug 2026 03:12:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/6a8774e3f2af5-2108wgl01.jpg"                         length="1196555"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>రేవూరి, సీఎంపై వ్యాఖ్యలు సరికాదు</title>
                                    <description><![CDATA[<p>రేవూరి, సీఎంపై వ్యాఖ్యలు సరికాదు</p>
<p>- కొండా సుస్మిత పటేల్‌ తీరుపై కాంగ్రెస్‌ నేతల మండిపాటు..</p>
<p>- క్షమాపణ చెప్పాలని డిమాండ్</p>
<p>- ఇక్కడ మంత్రి సుష్మతనా ...సురేఖా.!</p>
<p>- ధర్మారెడ్డికి భయపడి వరంగల్ పారిపోయారు</p>
<p>- గీసుకొండ మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు భీమగాని సౌజన్య </p>
<p>అక్షరదర్బార్, పరకాల: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై కొండ సుస్మిత పటేల్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. బుధవారం గీసుకొండ మండల కేంద్రంలో మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మిత పటేల్‌ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. గురువారం పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడారు.<br />నాగారం మాజీ సర్పంచ్‌ కట్కూరి స్రవంతి మాట్లాడుతూ.. అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో పాటు మహిళలకు అండగా నిలుస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/the-comments-on-revuri-cm-are-not-correct/article-493"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-08/img-20260820-wa1237(1).jpg" alt=""></a><br /><p>రేవూరి, సీఎంపై వ్యాఖ్యలు సరికాదు</p>
<p>- కొండా సుస్మిత పటేల్‌ తీరుపై కాంగ్రెస్‌ నేతల మండిపాటు..</p>
<p>- క్షమాపణ చెప్పాలని డిమాండ్</p>
<p>- ఇక్కడ మంత్రి సుష్మతనా ...సురేఖా.!</p>
<p>- ధర్మారెడ్డికి భయపడి వరంగల్ పారిపోయారు</p>
<p>- గీసుకొండ మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు భీమగాని సౌజన్య </p>
<p>అక్షరదర్బార్, పరకాల: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై కొండ సుస్మిత పటేల్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. బుధవారం గీసుకొండ మండల కేంద్రంలో మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మిత పటేల్‌ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. గురువారం పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడారు.<br />నాగారం మాజీ సర్పంచ్‌ కట్కూరి స్రవంతి మాట్లాడుతూ.. అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో పాటు మహిళలకు అండగా నిలుస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గతంలో చేసిన వ్యాఖ్యలను క్షమించినప్పటికీ, మరోసారి మాట్లాడటం ద్వారా ఆమెపై ఉన్న గౌరవాన్ని తగ్గించుకున్నారని అన్నారు. సుస్మిత పటేల్‌కు కాంగ్రెస్‌ పార్టీలో సభ్యత్వం లేదని పేర్కొన్నారు.</p>
<p>పరకాల మాజీ జెడ్పీటీసీ పాడి కల్పన మాట్లాడుతూ.. “పరకాల ఎవరి అడ్డా కాదు.. ప్రజల అడ్డా” అని అన్నారు. 2012లోనే కొండా సురేఖ పరకాలకు దూరమయ్యారని, అలాంటి కుటుంబం నుంచి సుస్మిత పటేల్‌ సీఎం, ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం తగదన్నారు. భాషను మార్చుకుని నాయకురాలిగా ఎదగాలని హితవు పలికారు.</p>
<p>గీసుకొండ మాజీ ఎంపీపీ, కాంగ్రెస్‌ నాయకురాలు భీమగాని సౌజన్య మాట్లాడుతూ.. “ఇక్కడ మంత్రి సురేఖనా.. సుస్మితనా?” అని ప్రశ్నించారు. పరకాలలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్న సభకు భారీగా ప్రజలు తరలిరావడం, పరకాల అభివృద్ధికి సీఎం ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమన్నారు. పరకాల అభివృద్ధి కోసం రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని సీఎం కోరడాన్ని సుస్మిత పటేల్‌ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.<br />చల్లా ధర్మారెడ్డికి భయపడి కొండా సురేఖ కుటుంబం పరకాల నుంచి దూరంగా వెళ్లిందంటూ సౌజన్య వ్యాఖ్యానించారు. గీసుకొండలో జరిగే జన్మదిన వేడుకలు, బోనాలు, కొమ్మాల జాతర వంటి కార్యక్రమాలకు వచ్చి సుస్మిత పటేల్‌ ఏదో ఒకటి మాట్లాడటం ద్వారా మంత్రి కొండా సురేఖకు రాజకీయంగా నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రులతో వివాదాలకు దారితీసేలా వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.<br />కాంగ్రెస్‌ అధిష్ఠానం రేవూరి ప్రకాశ్‌రెడ్డికి టికెట్‌ ఇస్తే పార్టీ శ్రేణులంతా ఆయన విజయానికి కృషి చేస్తారని సౌజన్య అన్నారు. స్వతంత్రంగా పోటీ చేయాలని భావిస్తున్న సుస్మిత పటేల్‌ ఇకపై కాంగ్రెస్‌ నాయకుల ఫొటోలను ఉపయోగించుకోవద్దని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్‌ పార్టీకి నష్టం కలిగించవద్దని హితవు పలికారు. చేసిన వ్యాఖ్యలకు సీఎం, కాంగ్రెస్‌ పార్టీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.<br />కాంగ్రెస్‌ పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే కార్యకర్తలు సహించబోరని నాయకులు హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/the-comments-on-revuri-cm-are-not-correct/article-493</link>
                <guid>https://www.aksharadarbar.com/the-comments-on-revuri-cm-are-not-correct/article-493</guid>
                <pubDate>Thu, 20 Aug 2026 12:28:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/img-20260820-wa1237%281%29.jpg"                         length="232121"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>aksharadarbar-20-08-2026</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/818/aksharadarbar-20-08-2026"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-08/6a860f65edf0a-2008wgl01.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/818/aksharadarbar-20-08-2026</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/818/aksharadarbar-20-08-2026</guid>
                <pubDate>Thu, 20 Aug 2026 01:47:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/6a860f65edf0a-2008wgl01.jpg"                         length="1735215"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>పరకాల కాంగ్రెస్ లో పొలిటికల్ సెగ</title>
                                    <description><![CDATA[<p>- రేవంత్ వ్యాఖ్యలకు కొండా సుస్మిత కౌంటర్<br />- డైపర్లు వేసుకునే వ్యక్తికి మళ్లీ టికెట్ ఇస్తారా? అని ప్రశ్న<br />- “పరకాల నాదే.. టికెట్ ఇచ్చేది అధిష్టానమే”నని వ్యాఖ్య<br />- సీఎం కుర్చీ కాపాడుకోవడానికే రేవంత్ ఆరాటమని ఆరోపణ</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/politics/political-segment-in-parakala-congress/article-490"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-08/img-20260819-wa0014.jpg" alt=""></a><br /><p>పరకాల కాంగ్రెస్‌లో పొలిటికల్ సెగ<br />- రేవంత్ వ్యాఖ్యలకు కొండా సుస్మిత కౌంటర్<br />- డైపర్లు వేసుకునే వ్యక్తికి మళ్లీ టికెట్ ఇస్తారా? అని ప్రశ్న<br />- “పరకాల నాదే.. టికెట్ ఇచ్చేది అధిష్టానమే”నని వ్యాఖ్య<br />- సీఎం కుర్చీ కాపాడుకోవడానికే రేవంత్ ఆరాటమని ఆరోపణ</p>
<p>అక్షరదర్బార్, గీసుకొండ:<br />కాంగ్రెస్ పార్టీలో పరకాల అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తాజా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించాలని ఈనెల 16న పరకాలలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరడం ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ఘాటుగా స్పందించారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో ఏర్పాటు చేసిన ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాలో పాల్గొన్న కొండా సుస్మిత మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.<br />- అప్పుడే ఎమ్మెల్యే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారు?<br />ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే, అప్పుడే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని సుస్మిత ప్రశ్నించారు. “పరకాలలో రేవూరి ప్రకాష్ రెడ్డి ఎవరో కూడా చాలామందికి తెలియదు. ఆయన గెలిచారంటే అది కొండా కుటుంబం చేసిన సహకారం వల్లే. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసేది నేనే” అని ఆమె స్పష్టం చేశారు.<br />రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్‌లో మొదట అడిగింది కొండా దంపతులేనని గుర్తుచేసిన ఆమె, పీసీసీ అధ్యక్షుడయ్యాక రేవంత్ తన మాట మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ గెలిచినా, ఓడినా కొండా మురళికి ఎమ్మెల్యే సీటు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు దానిని నెరవేర్చలేదని మండిపడ్డారు.<br />- డైపర్లు వేసుకునే స్థితిలో ఉన్నవారికి టికెట్ ఇస్తారా?<br />ఒకవైపు ‘జీన్ జీ’లకు (యువతకు) టికెట్లు ఇస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి, మరోవైపు డైపర్లు వేసుకునే స్థితిలో ఉన్న రేవూరి ప్రకాష్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇస్తాననడం ఏంటని సుస్మిత ఎద్దేవా చేశారు. పార్టీలో టికెట్ల కేటాయింపును అధిష్టానం నిర్ణయిస్తుందని, అలాంటప్పుడు పరకాల టికెట్‌పై రేవంత్ రెడ్డి సొంత నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. సీఎం కుర్చీ కాపాడుకోవడానికే రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, పార్టీలో ఆయన ఒక్కడే ఉన్నారా అని నిలదీశారు. బీసీలంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత చులకన భావమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.<br />- పొంగులేటిపైనా ఘాటు వ్యాఖ్యలు<br />ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించిన సుస్మిత, “రేవంత్ రెడ్డితో పాటు ఒక పొంగు ఉంది. ఆ పొంగు ఎక్కువసేపు ఉండదు. అసలు మీరే ముఖ్యమంత్రో లేక ఆయనే ముఖ్యమంత్రో తేల్చుకోండి” అంటూ ఘాటుగా విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల జాతరలో సీఎం ఫొటోతో పాటు పొంగులేటి ఫొటో పెట్టారని, కానీ ఫ్లెక్సీలలో సమాచార శాఖ మంత్రి ఫొటో వేయలేదని ఆక్షేపించారు. బీసీ నేతల కంటే పొంగులేటికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారా అని ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>రాజకీయం</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/politics/political-segment-in-parakala-congress/article-490</link>
                <guid>https://www.aksharadarbar.com/politics/political-segment-in-parakala-congress/article-490</guid>
                <pubDate>Wed, 19 Aug 2026 17:52:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/img-20260819-wa0014.jpg"                         length="47170"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>aksharadarbar-19-08-2026</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/817/aksharadarbar-19-08-2026"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-08/6a84bfb92a012-1908wgl01.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/817/aksharadarbar-19-08-2026</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/817/aksharadarbar-19-08-2026</guid>
                <pubDate>Wed, 19 Aug 2026 01:55:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/6a84bfb92a012-1908wgl01.jpg"                         length="1499518"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా</title>
                                    <description><![CDATA[<p>- రిజర్వేషన్లు మారితే నా సతీమణి బరిలో ఉంటారు<br />- పార్టీ నిర్ణయిస్తే మేయర్ గా బరిలోకి.. <br />- నేను పార్టీ విధేయుడిని.. పార్టీ నిర్ణయమే శిరోధార్యం <br />- అఫీషియల్ ప్రోగ్రాం కావటం వల్లే సీఎం సభకు అటెండ్ కాలేదు <br />- ఒకటి రెండు రోజుల్లో 'పశ్చిమ' డివిజన్ కమిటీల ప్రకటన <br />- దసరా వరకు పార్టీ ఆఫీసు నిర్మాణానికి శంకుస్థాపన <br />- డిజిటల్ మీడియా చిట్ చాట్ లో డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/politics/will-contest-the-next-election/article-489"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-08/img-20260818-wa0012.jpg" alt=""></a><br /><p>వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా <br />- రిజర్వేషన్లు మారితే నా సతీమణి బరిలో ఉంటారు<br />- పార్టీ నిర్ణయిస్తే మేయర్ గా బరిలోకి.. <br />- నేను పార్టీ విధేయుడిని.. పార్టీ నిర్ణయమే శిరోధార్యం <br />- అఫీషియల్ ప్రోగ్రాం కావటం వల్లే సీఎం సభకు అటెండ్ కాలేదు <br />- ఒకటి రెండు రోజుల్లో 'పశ్చిమ' డివిజన్ కమిటీల ప్రకటన <br />- దసరా వరకు పార్టీ ఆఫీసు నిర్మాణానికి శంకుస్థాపన <br />- డిజిటల్ మీడియా చిట్ చాట్ లో డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి </p>
<p>అక్షరదర్బార్, హనుమకొండ </p>
<p>వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇనుగాల పోటీలో ఉండటం ఖాయమని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి ప్రకటించారు. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జరిగి తనకు పోటీ చేసే అవకాశం రాకపోతే తన సతీమణి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటారని ఆయన స్పష్టం చేశారు. హనుమకొండలోని తన నివాసంలో మంగళవారం డిజిటల్ మీడియా చిట్ చాట్ లో వెంకట్రామిరెడ్డి మాట్లాడారు. ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. 2010 నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న. ప్రధానంగా 2012 నుంచి పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్న. తాను పూర్తిగా పార్టీ విధేయుడిని. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ తనకు కల్పించింది. ఓటమి ఎదురైనప్పటికీ నిరుత్సాహపడకుండా పార్టీ పటిష్టత కోసం పనిచేశాను. పరకాల శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జీరో నుంచి నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడంలో కీలకపాత్ర వహించాను. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, తర్వాత 2023 శాసనసభ ఎన్నికల్లో పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశించాను. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు పోటీ చేయకుండా రెండు సార్లు కూడా అభ్యర్థిత్వం బరిలో నుంచి తప్పుకున్న. మొదటి నుంచి కూడా ఒక కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటున్న. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం కచ్చితంగా తనకు పోటీ చేసే అవకాశం కల్పిస్తుందని విశ్వసిస్తున్న. ఎందుకంటే రెండుసార్లు వద్దని చెప్పిన పార్టీ మూడోసారి కూడా పోటీ ఊరుకోమని చెప్పదని నమ్ముతున్న. ఈసారి కచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఇనుగాల పోటీలో ఉండటం పక్కా. డీలిమిటేషన్ వల్ల రిజర్వేషన్లు మారి పోటీ చేయటానికి నాకు అవకాశం లేకపోతే నా సతీమణి బరిలో ఉంటారు.<br />- పార్టీ నిర్ణయిస్తే మేయర్ గా..<br />పార్టీ నిర్ణయమే నాకు శిరోధార్యం. త్వరలో జరిగే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించనుంది. పార్టీ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో 46 నుంచి 48 డివిజన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. కార్పొరేషన్ ఎన్నికలకు మరికొంత సమయం ఉన్నందున కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే డివిజన్ల సంఖ్య మరింత పెరగనుంది. నాకు ఈ పదవి కావాలని అడుగను. పార్టీ నిర్ణయిస్తే జీడబ్ల్యూఎంసీ మేయర్ పదవిని వద్దనను.<br />- అది అఫీషియల్ ప్రోగ్రాం <br />పరకాలలో ఈనెల 16న జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ పర్యటన అఫీషియల్ ప్రోగ్రాం. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభ జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు. ప్రభుత్వ కార్యక్రమం కావటం వల్ల నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న బహిరంగ సభకు హాజరు కాలేదు. పార్టీ కార్యక్రమం కాదనే నేను ఆ బహిరంగ సభకు దూరంగా ఉన్న. <br />- త్వరలో పార్టీ ఆఫీసుకు శంకుస్థాపన <br />హనుమకొండలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన జరగనుంది. దసరా వరకు జరగవచ్చు. జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం ముఖ్య నేతలతో ప్రత్యేకంగా కమిటీ ఏర్పడింది. ఇప్పటివరకు డీసీసీ పరిధిలో వివిధ కమిటీల ఎన్నిక జరిగింది. జిల్లాలో పార్టీ గ్రామ, మండల కమిటీల ఎన్నిక కూడా జరిగింది. నగరంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోగల డివిజన్ల కమిటీలను కూడా ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తాం.</p>]]></content:encoded>
                
                                                            <category>రాజకీయం</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/politics/will-contest-the-next-election/article-489</link>
                <guid>https://www.aksharadarbar.com/politics/will-contest-the-next-election/article-489</guid>
                <pubDate>Tue, 18 Aug 2026 15:40:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/img-20260818-wa0012.jpg"                         length="112163"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పెద్ది విగ్రహం తొలగింపు </title>
                                    <description><![CDATA[<p>- నర్సంపేటలో భారీగా పోలీసుల మోహరింపు.. ఉద్రిక్తత<br />- బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/politics/removal-of-elder-idol/article-488"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-08/img-20260818-wa0002.jpg" alt=""></a><br /><p>పెద్ది విగ్రహం తొలగింపు <br />- నర్సంపేటలో భారీగా పోలీసుల మోహరింపు.. ఉద్రిక్తత<br />- బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్</p>
<p>అక్షరదర్బార్ నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేటలో దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రభుత్వ వర్గాలు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించినట్లు తెలిసింది. భారీ భారీ పోలీసు బందోబస్తు మధ్య పెద్ది విగ్రహం తొలగింపు జరిగినట్లు సమాచారం. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు నర్సంపేటకు చేరుకునే అవకాశం ఉన్న దృష్ట్యా పోలీసులు ముందు జాగ్రత్తగా నర్సంపేట, పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేసినట్లు తెలిసింది.<img src="https://www.aksharadarbar.com/media/2026-08/img-20260818-wa0003.jpg" alt="IMG-20260818-WA0003" width="1152" height="864"/></p>]]></content:encoded>
                
                                                            <category>రాజకీయం</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/politics/removal-of-elder-idol/article-488</link>
                <guid>https://www.aksharadarbar.com/politics/removal-of-elder-idol/article-488</guid>
                <pubDate>Tue, 18 Aug 2026 08:30:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/img-20260818-wa0002.jpg"                         length="261446"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>aksharadarbar-18-08-2026</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/816/aksharadarbar-18-08-2026"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-08/1808wgl01.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/816/aksharadarbar-18-08-2026</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/816/aksharadarbar-18-08-2026</guid>
                <pubDate>Tue, 18 Aug 2026 00:39:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/1808wgl01.jpg"                         length="1574743"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>aksharadarbar-17-08-2026</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/815/aksharadarbar-17-08-2026"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-08/6a826d98550d3-1708wgl01.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/815/aksharadarbar-17-08-2026</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/815/aksharadarbar-17-08-2026</guid>
                <pubDate>Mon, 17 Aug 2026 07:40:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/6a826d98550d3-1708wgl01.jpg"                         length="1421748"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>aksharadarbar-16-08-2026</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/814/aksharadarbar-16-08-2026"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-08/6a810fed98d34-1608wgl01.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/814/aksharadarbar-16-08-2026</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/814/aksharadarbar-16-08-2026</guid>
                <pubDate>Sun, 16 Aug 2026 06:48:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/6a810fed98d34-1608wgl01.jpg"                         length="1432129"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>aksharadarbar-15-08-2026</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/813/aksharadarbar-15-08-2026"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-08/6a7fbfd374c5f-1508wgl01.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/813/aksharadarbar-15-08-2026</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/813/aksharadarbar-15-08-2026</guid>
                <pubDate>Sat, 15 Aug 2026 06:54:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/6a7fbfd374c5f-1508wgl01.jpg"                         length="1589684"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>aksharadarbar-14-08-2026</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/812/aksharadarbar-14-08-2026"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-08/1408wgl01.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/812/aksharadarbar-14-08-2026</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/812/aksharadarbar-14-08-2026</guid>
                <pubDate>Fri, 14 Aug 2026 06:48:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/1408wgl01.jpg"                         length="1514181"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>aksharadarbar-13-08-2026</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/811/aksharadarbar-13-08-2026"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-08/6a7d1eb356831-1308wgl01.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/811/aksharadarbar-13-08-2026</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/811/aksharadarbar-13-08-2026</guid>
                <pubDate>Thu, 13 Aug 2026 07:02:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/6a7d1eb356831-1308wgl01.jpg"                         length="1438486"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>aksharadarbar-12-08-2026</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/810/aksharadarbar-12-08-2026"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-08/6a7bd46e69f8d-1208wgl01.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/810/aksharadarbar-12-08-2026</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/810/aksharadarbar-12-08-2026</guid>
                <pubDate>Wed, 12 Aug 2026 07:33:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/6a7bd46e69f8d-1208wgl01.jpg"                         length="1353177"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>aksharadarbar-11-08-2026</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/809/aksharadarbar-11-08-2026"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-08/6a7a378c6ab25-1108wgl01.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/809/aksharadarbar-11-08-2026</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/809/aksharadarbar-11-08-2026</guid>
                <pubDate>Tue, 11 Aug 2026 02:11:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/6a7a378c6ab25-1108wgl01.jpg"                         length="1478213"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>aksharadarbar-09-08-2026</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/808/aksharadarbar-09-08-2026"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-08/6a77dee376819-0908wgl01.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/808/aksharadarbar-09-08-2026</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/808/aksharadarbar-09-08-2026</guid>
                <pubDate>Sun, 09 Aug 2026 07:28:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/6a77dee376819-0908wgl01.jpg"                         length="1557889"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>aksharadarbar-08-08-2026</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/807/aksharadarbar-08-08-2026"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-08/6a7685142b2de-0808wgl01.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/807/aksharadarbar-08-08-2026</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/807/aksharadarbar-08-08-2026</guid>
                <pubDate>Sat, 08 Aug 2026 06:53:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/6a7685142b2de-0808wgl01.jpg"                         length="1492456"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>aksharadarbar-07-08-2026</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/806/aksharadarbar-07-08-2026"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-08/6a75380a2b84c-0708wgl01.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/806/aksharadarbar-07-08-2026</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/806/aksharadarbar-07-08-2026</guid>
                <pubDate>Fri, 07 Aug 2026 07:09:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/6a75380a2b84c-0708wgl01.jpg"                         length="1341698"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>aksharadarbar-06-08-2026</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/805/aksharadarbar-06-08-2026"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-08/6a739e3280d05-0608wgl01.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/805/aksharadarbar-06-08-2026</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/805/aksharadarbar-06-08-2026</guid>
                <pubDate>Thu, 06 Aug 2026 02:03:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/6a739e3280d05-0608wgl01.jpg"                         length="1296216"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>aksharadarbar-05-08-2026</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/804/aksharadarbar-05-08-2026"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-08/6a7238bbdfde5-0508wgl01.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/804/aksharadarbar-05-08-2026</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/804/aksharadarbar-05-08-2026</guid>
                <pubDate>Wed, 05 Aug 2026 00:38:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/6a7238bbdfde5-0508wgl01.jpg"                         length="1428346"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>aksharadarbar-04-08-2026</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/803/aksharadarbar-04-08-2026"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-08/6a70f1ba606f7-0408wgl01.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/803/aksharadarbar-04-08-2026</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/803/aksharadarbar-04-08-2026</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 01:23:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/6a70f1ba606f7-0408wgl01.jpg"                         length="1219907"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>aksharadarbar-02-08-2026</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/802/aksharadarbar-02-08-2026"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-08/0208wgl01.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/802/aksharadarbar-02-08-2026</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/802/aksharadarbar-02-08-2026</guid>
                <pubDate>Sun, 02 Aug 2026 06:18:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/0208wgl01.jpg"                         length="1507989"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>aksharadarbar-01-08-2026</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/801/aksharadarbar-01-08-2026"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-08/page-1-8878409.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/801/aksharadarbar-01-08-2026</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/801/aksharadarbar-01-08-2026</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 01:18:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-08/page-1-8878409.jpg"                         length="711204"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>aksharadarbar-31-07-2026</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/800/aksharadarbar-31-07-2026"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-07/page-1-4628233.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/800/aksharadarbar-31-07-2026</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/800/aksharadarbar-31-07-2026</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 07:24:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/page-1-4628233.jpg"                         length="686314"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>aksharadarbar-30-07-2026</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/799/aksharadarbar-30-07-2026"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-07/30wgl01-images-0.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/799/aksharadarbar-30-07-2026</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/799/aksharadarbar-30-07-2026</guid>
                <pubDate>Thu, 30 Jul 2026 07:08:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/30wgl01-images-0.jpg"                         length="1497464"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>aksharadarbar-29-07-2026</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/798/aksharadarbar-29-07-2026"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-07/page-1-2721793.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/798/aksharadarbar-29-07-2026</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/798/aksharadarbar-29-07-2026</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 07:26:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/page-1-2721793.jpg"                         length="628250"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>aksharadarbar-28-07-2026</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/797/aksharadarbar-28-07-2026"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-07/page-1-2166031.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/797/aksharadarbar-28-07-2026</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/797/aksharadarbar-28-07-2026</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 07:23:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/page-1-2166031.jpg"                         length="566070"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>aksharadarbar-26-07-2026</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.aksharadarbar.com/epaper/view/796/aksharadarbar-26-07-2026"><img src="https://www.aksharadarbar.com/media/500/2026-07/page-1-7233031.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.aksharadarbar.com/epaper/view/796/aksharadarbar-26-07-2026</link>
                <guid>https://www.aksharadarbar.com/epaper/view/796/aksharadarbar-26-07-2026</guid>
                <pubDate>Sun, 26 Jul 2026 07:33:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/page-1-7233031.jpg"                         length="558461"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>పరకాలకు పారిశుధ్య ముప్పు</title>
                                    <description><![CDATA[<p>  పరకాలకు పారిశుధ్య ముప్పు</p>
<p>వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త.. </p>
<p>స్వైర విహారం చేస్తున్న పందులు.. </p>
<p>దుర్వాసనతో ప్రజల అవస్థలు.. </p>
<p>అక్షరదర్బార్,పరకాల:<br />వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని 22 వార్డుల్లో అనేక ప్రాంతాల్లో చెత్త కుప్పలు పేరుకుపోవడంతో పందులు స్వైర విహారం చేస్తున్నాయని, దీంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.<br />ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల సమీపంలో చెత్త పేరుకుపోవడంతో పందులు గుంపులుగా తిరుగుతున్నాయని, అక్కడి నుంచి వెళ్లే విద్యార్థులు, ప్రజలు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. వర్షాల కారణంగా చెత్త నుంచి దుర్గంధం వెదజల్లుతుండడంతో పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.<br />పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, చెత్తను సకాలంలో తొలగించడం, కాలువలను శుభ్రం చేయడం వంటి చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పట్టణవాసులు కోరుతున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/sanitation-threat-to-parakalas/article-487"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img-20260721-wa0541.jpg" alt=""></a><br /><p> పరకాలకు పారిశుధ్య ముప్పు</p>
<p>వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త.. </p>
<p>స్వైర విహారం చేస్తున్న పందులు.. </p>
<p>దుర్వాసనతో ప్రజల అవస్థలు.. </p>
<p>అక్షరదర్బార్,పరకాల:<br />వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని 22 వార్డుల్లో అనేక ప్రాంతాల్లో చెత్త కుప్పలు పేరుకుపోవడంతో పందులు స్వైర విహారం చేస్తున్నాయని, దీంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.<br />ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల సమీపంలో చెత్త పేరుకుపోవడంతో పందులు గుంపులుగా తిరుగుతున్నాయని, అక్కడి నుంచి వెళ్లే విద్యార్థులు, ప్రజలు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. వర్షాల కారణంగా చెత్త నుంచి దుర్గంధం వెదజల్లుతుండడంతో పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.<br />పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, చెత్తను సకాలంలో తొలగించడం, కాలువలను శుభ్రం చేయడం వంటి చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పట్టణవాసులు కోరుతున్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/sanitation-threat-to-parakalas/article-487</link>
                <guid>https://www.aksharadarbar.com/sanitation-threat-to-parakalas/article-487</guid>
                <pubDate>Tue, 21 Jul 2026 08:23:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260721-wa0541.jpg"                         length="129890"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పీడీఎస్ రైస్ పట్టివేత </title>
                                    <description><![CDATA[<p>- 62 బస్తాల బియ్యం స్వాధీనం</p>
<p>- టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/global/pds-rice-pattiveta/article-484"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img-20260706-wa0021.jpg" alt=""></a><br /><p>పీడీఎస్ రైస్ పట్టివేత <br />- 62 బస్తాల బియ్యం స్వాధీనం<br />- టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు</p>
<p>అక్షరదర్బార్, హనుమకొండ: ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 62 బస్తాల్లో నిల్వ ఉన్న 31 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.1.08 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు హనుమకొండలోని గోపాలపూర్ గణేష్‌నగర్‌లో దాడి నిర్వహించారు. అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బండారి రాజ్‌కుమార్ (30) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు పెద్దపల్లి జిల్లా కల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందినవాడని, ప్రస్తుతం గోపాలపూర్‌లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణలో గోపాలపూర్ పరిసర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి, అధిక ధరకు ఇతరులకు విక్రయిస్తున్నట్లు నిందితుడు అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం, నిందితుడిని తదుపరి చర్యల కోసం కేయూసీ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ఎ మధుసూదన్ తెలిపారు. ఈ దాడిలో టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ బండారి రాజు, సిబ్బంది పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/global/pds-rice-pattiveta/article-484</link>
                <guid>https://www.aksharadarbar.com/global/pds-rice-pattiveta/article-484</guid>
                <pubDate>Mon, 06 Jul 2026 19:35:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260706-wa0021.jpg"                         length="158194"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏసీబీ వలలో తహశీల్దార్ </title>
                                    <description><![CDATA[<p>- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు</p>
<p>- రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/tehsildar-in-acb-network/article-483"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img-20260706-wa0019.jpg" alt=""></a><br /><p>ఏసీబీ వలలో తహశీల్దార్ </p>
<p>- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు</p>
<p>- రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ </p>
<p>సిద్దిపేట జిల్లా చేర్యాల మండల తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. భూమి సంబంధిత పని కోసం వచ్చిన వ్యక్తి నుంచి రూ.70 వేల లంచం తీసుకుంటుండగా తహశీల్దార్ దిలీప్ నాయక్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.<br />ఫిర్యాదు మేరకు ముందస్తు ప్రణాళికతో ట్రాప్ నిర్వహించిన ఏసీబీ అధికారులు, అనంతరం కార్యాలయంలో సోదాలు చేపట్టి పలు రికార్డులు, పత్రాలను పరిశీలించారు. లంచం వ్యవహారానికి సంబంధించిన మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. తహశీల్దార్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలపై ఏసీబీ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ ఘటనతో చేర్యాల మండలంలో కలకలం రేగింది.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/tehsildar-in-acb-network/article-483</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/tehsildar-in-acb-network/article-483</guid>
                <pubDate>Mon, 06 Jul 2026 18:33:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260706-wa0019.jpg"                         length="132889"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గోదావరి జలాలను వృదా చేయొద్దు </title>
                                    <description><![CDATA[<p>- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి<br />- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం<br />- కేసీఆర్‌కు వారం రోజులు ప్రాజెక్టు అప్పగించండి.. తెలంగాణకు నీళ్లు అందించి చూపిస్తాం<br />- రాజకీయ కక్షతో కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.. రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు<br />- కాళేశ్వరం వద్ద కేటీఆర్ ఫైర్.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర విరుచుకుపాటు<br />- పోలీసుల అడ్డంకుల మధ్య కన్నెపల్లి చేరుకున్న కేటీఆర్.. భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/global/dont-waste-godavari-water/article-482"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img-20260705-wa0023(1).jpg" alt=""></a><br /><p>గోదావరి జలాలను వృథా చేయొద్దు<br />- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి<br />- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం<br />- కేసీఆర్‌కు వారం రోజులు ప్రాజెక్టు అప్పగించండి.. తెలంగాణకు నీళ్లు అందించి చూపిస్తాం<br />- రాజకీయ కక్షతో కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.. రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు<br />- కాళేశ్వరం వద్ద కేటీఆర్ ఫైర్.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర విరుచుకుపాటు<br />- పోలీసుల అడ్డంకుల మధ్య కన్నెపల్లి చేరుకున్న కేటీఆర్.. భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు</p>
<p>అక్షరదర్బార్, కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ కక్షసాధింపుతో నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గోదావరి జలాలు లక్ష క్యూసెక్కుల చొప్పున ప్రతిరోజూ సముద్రంలో కలిసిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెంటనే కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను ప్రారంభించి తెలంగాణ రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.</p>
<p>హైదరాబాద్ నుంచి కన్నెపల్లి పర్యటనకు బయలుదేరిన కేటీఆర్ కాన్వాయ్‌ను పోలీసులు పలు చోట్ల అడ్డుకున్నారు. భారీ పోలీసు బందోబస్తుతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను నిలిపివేయడంతో బీఆర్ఎస్ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జంగావ్ జిల్లా పెంబర్తి, భూపాలపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కాన్వాయ్‌ను కొంతసేపు నిలిపివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ కేటీఆర్ తన పర్యటనను కొనసాగించి కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్నారు.</p>
<p>ముందుగా ఫోర్‌బే బ్రిడ్జిపై నుంచి గోదావరి ప్రవాహాన్ని పరిశీలించిన కేటీఆర్, అనంతరం పంప్‌హౌస్ గేట్లను సందర్శించారు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లి గోదావరిలో నుంచి వృథాగా సముద్రంలోకి వెళ్తున్న నీటిని పరిశీలించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఘాటుగా విమర్శలు చేశారు.</p>
<p>కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ప్రస్తుతం 97 మీటర్ల నీటి మట్టం ఉందని, 93 మీటర్ల నీరు ఉన్నా పంపులను ప్రారంభించి తెలంగాణకు సాగునీరు అందించవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కావాలనే పంపులను ఆన్ చేయడం లేదని ఆరోపించారు. ప్రతిరోజూ లక్ష క్యూసెక్కుల గోదావరి నీరు సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిని ఎత్తిపోస్తే రాష్ట్రంలోని లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రైతుల కళ్ల ముందే నీటిని వృథా చేయడం దారుణం అని అన్నారు.</p>
<p>వెంటనే మోటార్లు ప్రారంభించండి. లేకపోతే తెలంగాణ నలుమూలల నుంచి 50 వేల మంది రైతులతో వచ్చి కన్నెపల్లి పంప్‌హౌస్‌ను మేమే ప్రారంభించి రైతులకు నీళ్లు అందిస్తాం. రైతుల ప్రయోజనాల కోసం ఎలాంటి పోరాటానికైనా వెనుకాడం అని కేటీఆర్ హెచ్చరించారు.</p>
<p>ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వహించే సామర్థ్యం లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పది రోజుల పాటు అప్పగించాలని సవాల్ విసిరారు. కేసీఆర్‌కు పది రోజులు ప్రాజెక్టు అప్పగించండి. అన్ని పనులు పూర్తి చేసి తెలంగాణ రైతులకు నీళ్లు అందించి చూపిస్తాం. చేతకాకపోతే పక్కకు తప్పుకోండి అని వ్యాఖ్యానించారు.</p>
<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్షతో కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్టును వినియోగించకుండా మూసివేయడం రైతులకు చేస్తున్న అన్యాయం. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఆలోచనతో కాళేశ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. రైతుల భవిష్యత్తుతో చెలగాటమాడే హక్కు ఎవరికీ లేదు అని విమర్శించారు.</p>
<p>మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి అవగాహనతో మాట్లాడాలని సూచించారు. ముందు ప్రాజెక్టు గురించి తెలుసుకోండి. ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయొద్దు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాళేశ్వరం నీళ్లే రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి చేరుతున్నాయి. మీ నియోజకవర్గంలోని చివరి గ్రామానికి కూడా కాళేశ్వరం నీరే వెళ్తుంది అని అన్నారు.</p>
<p>మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులపై స్పందించిన కేటీఆర్, రెండు పిల్లర్ల మరమ్మతులకు సుమారు రూ.400 కోట్లు అవసరమని, ఆ మొత్తాన్ని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి భరించేందుకు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం 30 నెలలుగా పనులు ప్రారంభించలేదని ఆరోపించారు. రాజకీయ కక్షతో పనులు నిలిపివేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేల్కొని మేడిగడ్డ మరమ్మతులు పూర్తి చేసి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగించాలి  అని డిమాండ్ చేశారు.</p>
<p>పోలవరం ప్రాజెక్టు దశాబ్దాలుగా పూర్తికాలేదని, కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ దూరదృష్టితో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పునర్వ్యవస్థీకరించి గోదావరి-ప్రాణహిత సంగమ ప్రాంతంలో సమగ్ర సర్వేలు నిర్వహించి మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించారని కేటీఆర్ వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, పర్యావరణ శాఖల నుంచి అన్ని అనుమతులు సాధించి కేవలం నాలుగేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాలలో ఒకటైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని చెప్పారు.</p>
<p>కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కాంక్రీట్ నిర్మాణం కాదు.. ఇది తెలంగాణ రైతుల జీవనాడి. ఈ ప్రాజెక్టును నిలిపివేయడం అంటే తెలంగాణ భవిష్యత్తును నిలిపివేయడమే. గోదావరి జలాలను సముద్రంలో కలపడం రైతుల పట్ల చేస్తున్న క్షమించరాని తప్పు అని కేటీఆర్ పేర్కొన్నారు.</p>
<p>ఈ సందర్భంగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ, ప్రభుత్వానికి నిజంగా దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కన్నెపల్లి పంప్‌హౌస్‌కు రావాలి. మేము రెండు రోజులైనా ఇక్కడే ఉంటాం. అందరం కలిసి పంపులను ప్రారంభించి తెలంగాణ రైతులకు నీళ్లు అందిద్దాం. హెలికాప్టర్లలో తిరుగుతూ విమర్శలు చేయడం కాదు.. క్షేత్రస్థాయికి వచ్చి వాస్తవాలు చూడాలి అని సవాల్ విసిరారు.</p>
<p>ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పెద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు పల్లె రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.<img src="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260705-wa0013.jpg" alt="IMG-20260705-WA0013" width="1280" height="850"/><img src="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260705-wa0014.jpg" alt="IMG-20260705-WA0014" width="1280" height="850"/></p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/global/dont-waste-godavari-water/article-482</link>
                <guid>https://www.aksharadarbar.com/global/dont-waste-godavari-water/article-482</guid>
                <pubDate>Sun, 05 Jul 2026 18:56:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260705-wa0023%281%29.jpg"                         length="139788"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ</title>
                                    <description><![CDATA[<p>నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ</p>
<p>అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు</p>
<p>అక్షరదర్బార్,నడికూడ: <br />నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల సమావేశంలో నూతన ప్రెస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జర్నలిస్టుల అభిప్రాయాలు, సూచనల మేరకు కమిటీని ఏర్పాటు చేశారు.నూతన కమిటీలో అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా గడ్డం బాలరాజు, ఉపాధ్యక్షుడిగా ముక్కెర చిరంజీవి, సహాయ కార్యదర్శులుగా ఐలి విజయ్, బొమ్మ అశోక్, భైరి సుధీర్ కుమార్, కోశాధికారిగా ఎం.డి. జమాలుద్దీన్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా బెజ్జంకి రాజేందర్, రజనీకాంత్, తాళ్ల రవి, చుక్క సతీష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.<br />ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శి పంచమనేని భాస్కరరావు మాట్లాడుతూ తమపై విశ్వాసం ఉంచి ఎన్నుకున్న జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తామని,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/new-committee-for-nadikooda-press-club/article-481"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img-20260705-wa1244.jpg" alt=""></a><br /><p>నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ</p>
<p>అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు</p>
<p>అక్షరదర్బార్,నడికూడ: <br />నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల సమావేశంలో నూతన ప్రెస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జర్నలిస్టుల అభిప్రాయాలు, సూచనల మేరకు కమిటీని ఏర్పాటు చేశారు.నూతన కమిటీలో అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా గడ్డం బాలరాజు, ఉపాధ్యక్షుడిగా ముక్కెర చిరంజీవి, సహాయ కార్యదర్శులుగా ఐలి విజయ్, బొమ్మ అశోక్, భైరి సుధీర్ కుమార్, కోశాధికారిగా ఎం.డి. జమాలుద్దీన్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా బెజ్జంకి రాజేందర్, రజనీకాంత్, తాళ్ల రవి, చుక్క సతీష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.<br />ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శి పంచమనేని భాస్కరరావు మాట్లాడుతూ తమపై విశ్వాసం ఉంచి ఎన్నుకున్న జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తామని, మండలంలోని పాత్రికేయులు ఎదుర్కొనే సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావాలని కోరారు. వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. అలాగే మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు నూతన ప్రెస్ క్లబ్ కమిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/new-committee-for-nadikooda-press-club/article-481</link>
                <guid>https://www.aksharadarbar.com/new-committee-for-nadikooda-press-club/article-481</guid>
                <pubDate>Sun, 05 Jul 2026 15:41:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260705-wa1244.jpg"                         length="173709"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భర్త హత్యకు భార్య స్కెచ్ </title>
                                    <description><![CDATA[<p>- రూ.4 లక్షల సుపారీ<br />- సింగారం మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేధన<br />- యాకయ్య మృతి వెనుక అసలు నిజాలు బయటపెట్టిన ఎస్పీ <br />- భార్యతో సహా ఏడుగురు అరెస్ట్</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/a-sketch-of-a-wife-for-murdering-her-husband/article-476"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img-20260704-wa0019.jpg" alt=""></a><br /><p>భర్త హత్యకు భార్య స్కెచ్ <br />- రూ.4 లక్షల సుపారీ<br />- సింగారం మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేధన<br />- యాకయ్య మృతి వెనుక అసలు నిజాలు బయటపెట్టిన ఎస్పీ <br />- భార్యతో సహా ఏడుగురు అరెస్ట్</p>
<p>అక్షరదర్బార్, మహబూబాబాద్:<br />మహబూబాబాద్ మండలం సింగారం గ్రామంలో ఈ నెల 1వ తేదీ తెల్లవారుజామున జరిగిన మాజీ ఉప సర్పంచ్ యాకయ్య (57) హత్య కేసును మహబూబాబాద్ టౌన్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. వివాహేతర సంబంధం, ఆస్తి గొడవలే ఈ దారుణ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. భర్తను అంతమొందించేందుకు రూ.4 లక్షల సుపారీ మాట్లాడిన భార్య యశోద (53)తో పాటు హత్యకు పాల్పడిన మరో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శబరిష్ ఈ సంచలన హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.<br />- పరాయి మహిళకు ఆస్తి ఇస్తాడనే భయంతోనే..<br />పోలీసుల కథనం ప్రకారం.. మృతుడు యాకయ్యకు గ్రామంలోని మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో తన ఆస్తిని ఆ మహిళకు ఎక్కడ రాసిస్తాడోననే భయం భార్య యశోదలో మొదలైంది. దీంతో భర్తను పూర్తిగా వదిలించుకోవాలని నిర్ణయించుకున్న ఆమె, యాకయ్యను హత్య చేసేందుకు రూ.4 లక్షల సుపారీని మాట్లాడి నిందితులతో ఒప్పందం కుదుర్చుకుంది.<br />- దోపిడీగా చిత్రీకరించే ప్రయత్నం ఫెయిల్..<br />పథకం ప్రకారం.. ఈ నెల 1వ తేదీ తెల్లవారుజామున దుండగులు యాకయ్యపై ఇనుప రాడ్‌తో దాడి చేసి దారుణంగా కొట్టి చంపారు. అనంతరం ఇదంతా దొంగల పనిగా చిత్రీకరించేందుకు యాకయ్య మెడలోని బంగారు గొలుసును తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. అయితే రంగంలోకి దిగిన టౌన్ పోలీసులు సాంకేతిక ఆధారాలు, పక్కా సమాచారంతో దర్యాప్తు చేపట్టి అసలు సూత్రధారి భార్య యశోదనే అని గుర్తించారు.<br />- సామగ్రి సీజ్.. పోలీసులకు అభినందనలు<br />ఈ కేసులో ప్రధాన నిందితురాలైన భార్య యశోదతో పాటు మరో ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి 7 సెల్‌ఫోన్లు, ఒక ఐరన్ రాడ్, 2 ద్విచక్ర వాహనాలు, మృతుడి మెడ నుంచి దొంగిలించిన 1 బంగారు గొలుసును పోలీసులు సీజ్ చేశారు. కేసును చాకచక్యంగా ఛేదించిన టౌన్ పోలీస్ సిబ్బందిని ఎస్పీ శబరిష్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.<img src="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260704-wa0020.jpg" alt="IMG-20260704-WA0020" width="540" height="1200"/></p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/a-sketch-of-a-wife-for-murdering-her-husband/article-476</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/a-sketch-of-a-wife-for-murdering-her-husband/article-476</guid>
                <pubDate>Sat, 04 Jul 2026 19:11:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260704-wa0019.jpg"                         length="75850"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దొంగతనం కేసు ఛేదన</title>
                                    <description><![CDATA[<p dir="ltr">దొంగతనం కేసు ఛేదన</p>
<p dir="ltr">ఆరుగురు నిందితుల అరెస్టు..</p>
<p dir="ltr">రూ.1.50 లక్షల నగదు స్వాధీనం</p>
<p dir="ltr">అక్షరదర్బార్, కాళేశ్వరం: <br />గత ఏడాది నిర్వహించిన సరస్వతీ పుష్కరాల సందర్భంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన టెంట్ సిటీలోని ఎనిమిది ఏసీ ఔటర్ యూనిట్లు దొంగిలించిన కేసును కాళేశ్వరం పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. టెంట్ సిటీ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ <a href="tel:592025">59/2025</a> కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా కాళేశ్వరం గ్రామానికి చెందిన మహేందర్, నారాయణ, జావేద్, సమ్మయ్య, సృజన్, సాయిలను అదుపులోకి తీసుకుని విచారించగా, టెంట్ సిటీలో ఏర్పాటు చేసిన ఎనిమిది ఏసీ ఔటర్ యూనిట్లను దొంగిలించినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దొంగిలించిన ఏసీ ఔటర్ యూనిట్లను గుర్తు తెలియని వ్యక్తికి విక్రయించి పొందిన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p dir="ltr">దొంగతనం కేసు ఛేదన</p>
<p dir="ltr">ఆరుగురు నిందితుల అరెస్టు..</p>
<p dir="ltr">రూ.1.50 లక్షల నగదు స్వాధీనం</p>
<p dir="ltr">అక్షరదర్బార్, కాళేశ్వరం: <br />గత ఏడాది నిర్వహించిన సరస్వతీ పుష్కరాల సందర్భంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన టెంట్ సిటీలోని ఎనిమిది ఏసీ ఔటర్ యూనిట్లు దొంగిలించిన కేసును కాళేశ్వరం పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. టెంట్ సిటీ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ <a href="tel:592025">59/2025</a> కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా కాళేశ్వరం గ్రామానికి చెందిన మహేందర్, నారాయణ, జావేద్, సమ్మయ్య, సృజన్, సాయిలను అదుపులోకి తీసుకుని విచారించగా, టెంట్ సిటీలో ఏర్పాటు చేసిన ఎనిమిది ఏసీ ఔటర్ యూనిట్లను దొంగిలించినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దొంగిలించిన ఏసీ ఔటర్ యూనిట్లను గుర్తు తెలియని వ్యక్తికి విక్రయించి పొందిన రూ.1.50 లక్షల నగదును నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.</p>
<p dir="ltr">ఎస్‌ఐ, సిబ్బందికి అభినందనలు</p>
<p dir="ltr">కేసును వేగంగా ఛేదించి నిందితులను గుర్తించి అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన కాళేశ్వరం ఎస్‌ఐ తమాషా రెడ్డి, పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/solving-the-theft-case/article-475</link>
                <guid>https://www.aksharadarbar.com/solving-the-theft-case/article-475</guid>
                <pubDate>Sat, 04 Jul 2026 18:27:39 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ</title>
                                    <description><![CDATA[<p>27 మందికి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ</p>
<p>పేద ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు సీఎం సహాయ నిధి</p>
<p>భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు</p>
<p><br />అక్షరదర్బార్, శాయంపేట: <br />శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం నిర్వహించిన సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) 30వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 27 మంది లబ్ధిదారులకు రూ.6,85,500 విలువైన చెక్కులను అందజేశారు.<br />ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో కవర్ కాని వైద్య చికిత్సలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు.<br />నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద రోగులు ఆసుపత్రి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/distribution-of-cm-relief-fund-cheques/article-473"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img-20260704-wa2056.jpg" alt=""></a><br /><p>27 మందికి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ</p>
<p>పేద ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు సీఎం సహాయ నిధి</p>
<p>భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు</p>
<p><br />అక్షరదర్బార్, శాయంపేట: <br />శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం నిర్వహించిన సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) 30వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 27 మంది లబ్ధిదారులకు రూ.6,85,500 విలువైన చెక్కులను అందజేశారు.<br />ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో కవర్ కాని వైద్య చికిత్సలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు.<br />నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద రోగులు ఆసుపత్రి నుంచి ఎస్టిమేషన్ కాపీ సమర్పిస్తే ప్రభుత్వం ఎల్‌ఓసీ మంజూరు చేసి చికిత్సకు అవసరమైన సహాయాన్ని అందిస్తోందని చెప్పారు. పేద ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు.<br />కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/distribution-of-cm-relief-fund-cheques/article-473</link>
                <guid>https://www.aksharadarbar.com/distribution-of-cm-relief-fund-cheques/article-473</guid>
                <pubDate>Sat, 04 Jul 2026 17:55:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260704-wa2056.jpg"                         length="183046"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి దారుణ హత్య</title>
                                    <description><![CDATA[<p>ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి దారుణ హత్య</p>
<p>షాప్ మూసి ఇంటికి వెళ్తుండగా ఘటన.. <br />పరారీలో నిందితుడు </p>
<p>అక్షరదర్బార్, రేగొండ: <br />జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని రంగయ్యపల్లి గ్రామానికి చెందిన జట్టి శ్రావణ్ (35) మండల కేంద్రంలో వైన్స్ షాప్ ఎదుట ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి సుమారు 10 గంటలకు షాప్ మూసి ఇంటికి వెళ్తుండగా మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు అతనిపై దాడి చేసి హత్య చేసినట్లు ఎస్సై దాసరి సుధాకర్ తెలిపారు. హత్యకు గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు ఘటన అనంతరం పరారైనట్లు తెలిపారు. మృతుడు శ్రావణ్‌కు భార్య మౌనిక, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/a-brutal-murder-of-a-fast-food-center-manager/article-472"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img_20260704_082456.jpg" alt=""></a><br /><p>ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి దారుణ హత్య</p>
<p>షాప్ మూసి ఇంటికి వెళ్తుండగా ఘటన.. <br />పరారీలో నిందితుడు </p>
<p>అక్షరదర్బార్, రేగొండ: <br />జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని రంగయ్యపల్లి గ్రామానికి చెందిన జట్టి శ్రావణ్ (35) మండల కేంద్రంలో వైన్స్ షాప్ ఎదుట ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి సుమారు 10 గంటలకు షాప్ మూసి ఇంటికి వెళ్తుండగా మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు అతనిపై దాడి చేసి హత్య చేసినట్లు ఎస్సై దాసరి సుధాకర్ తెలిపారు. హత్యకు గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు ఘటన అనంతరం పరారైనట్లు తెలిపారు. మృతుడు శ్రావణ్‌కు భార్య మౌనిక, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/a-brutal-murder-of-a-fast-food-center-manager/article-472</link>
                <guid>https://www.aksharadarbar.com/a-brutal-murder-of-a-fast-food-center-manager/article-472</guid>
                <pubDate>Sat, 04 Jul 2026 08:25:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img_20260704_082456.jpg"                         length="188304"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మహిళా ఉద్యోగులకు వేధింపులు</title>
                                    <description><![CDATA[<p>మహిళా ఉద్యోగులకు వేధింపులు<br />  <br />- ఓ ప్రభుత్వ కార్యాలయంలో కలకలం</p>
<p>- ఉన్నతాధికారిపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం</p>
<p>అక్షరదర్బార్, హనుమకొండ: హనుమకొండ జిల్లా డివిజన్‌లోని ఓ ఉన్నతాధికారిపై మహిళా ఉద్యోగులు వేధింపుల ఆరోపణలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన కింద పనిచేసే మహిళా సిబ్బందితో సదరు ఉన్నతాధికారి అనుచితంగా ప్రవర్తిస్తూ మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.<br />ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యేకు కూడా కొందరు మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తాము పనిచేస్తున్న కార్యాలయంలో విధులు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయని, ఇక్కడ పనిచేయడం కంటే సెలవులు తీసుకోవడమే మేలని కొందరు మహిళా ఉద్యోగులు తమ సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.<br />సదరు అధికారి వద్ద పనిచేయడానికి భద్రతాభావం లేకపోవడంతో పలువురు మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/harassment-of-women-employees/article-471"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img_20260703_131450.jpg" alt=""></a><br /><p>మహిళా ఉద్యోగులకు వేధింపులు<br /> <br />- ఓ ప్రభుత్వ కార్యాలయంలో కలకలం</p>
<p>- ఉన్నతాధికారిపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం</p>
<p>అక్షరదర్బార్, హనుమకొండ: హనుమకొండ జిల్లా డివిజన్‌లోని ఓ ఉన్నతాధికారిపై మహిళా ఉద్యోగులు వేధింపుల ఆరోపణలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన కింద పనిచేసే మహిళా సిబ్బందితో సదరు ఉన్నతాధికారి అనుచితంగా ప్రవర్తిస్తూ మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.<br />ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యేకు కూడా కొందరు మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తాము పనిచేస్తున్న కార్యాలయంలో విధులు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయని, ఇక్కడ పనిచేయడం కంటే సెలవులు తీసుకోవడమే మేలని కొందరు మహిళా ఉద్యోగులు తమ సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.<br />సదరు అధికారి వద్ద పనిచేయడానికి భద్రతాభావం లేకపోవడంతో పలువురు మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. అవసరమైతే సంబంధిత అధికారిని బదిలీ చేయాలని, లేదంటే మహిళా ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా బదిలీలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/harassment-of-women-employees/article-471</link>
                <guid>https://www.aksharadarbar.com/harassment-of-women-employees/article-471</guid>
                <pubDate>Fri, 03 Jul 2026 13:19:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img_20260703_131450.jpg"                         length="189386"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లంచం అడిగితే నా దృష్టికి తేండి </title>
                                    <description><![CDATA[<p>- పేదల సంక్షేమంలో రాజీ లేదు.. నియోజకవర్గ అభివృద్ధియే మా లక్ష్యం<br />- వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వమే కారణం<br />- ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి<br />- అభివృద్ధిపై చర్చకు సిద్ధమని బీజేపీ, బీఆర్ఎస్‌లకు సవాల్</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/global/a-bribe/article-469"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img-20260702-wa0013.jpg" alt=""></a><br /><p>లంచాలు అడిగితే <br />నా దృష్టికి తీసుకురండి<br />- పేదల సంక్షేమంలో రాజీ లేదు.. నియోజకవర్గ అభివృద్ధియే మా లక్ష్యం<br />- వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వమే కారణం<br />- ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి<br />- అభివృద్ధిపై చర్చకు సిద్ధమని బీజేపీ, బీఆర్ఎస్‌లకు సవాల్<br />- రూ.2.10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన</p>
<p>అక్షరదర్బార్, హనుమకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిలో భాగంగా 53వ డివిజన్ పరిధిలోని లష్కర్ నగర్ సింగారం, గోపాల్పూర్ జంక్షన్ ప్రాంతాల్లో సుమారు రూ.2.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి జరిగిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో ఒక్కో డివిజన్‌కు నామమాత్రంగా నిధులు కేటాయించి చేతులు దులుపుకునేవారని విమర్శించారు. కానీ ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో ప్రతి డివిజన్‌కు రూ.10 కోట్ల నుండి రూ.20 కోట్ల వరకు నిధులు కేటాయించి అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి కాలనీకి మెరుగైన రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.<br />- లంచాలు అడిగితే వెంటనే నా దృష్టికి తీసుకురండి<br />రేషన్ కార్డులు, పెన్షన్లు లేదా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఎవరైనా రాజకీయ నాయకులు గానీ, అధికారులు గానీ డబ్బులు అడిగితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేదలకు సంబంధించిన ప్రతి పథకం పూర్తిగా ఉచితమని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుల చేతికే నేరుగా ప్రయోజనాలు చేరేలా పారదర్శక వ్యవస్థను అమలు చేస్తున్నామని చెప్పారు. ఎవరైనా లంచాలు ఇచ్చి ప్రోత్సహిస్తే సమాజానికి అన్యాయం చేసినట్లవుతుందని హితవు పలికారు. ఇప్పటికే పెన్షన్లు, రేషన్ కార్డుల అర్హుల జాబితాలను డివిజన్ వారీగా తుది దశకు తీసుకువచ్చామని వెల్లడించారు.<br />- అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. విపక్షాలకు సవాల్<br />నియోజకవర్గ అభివృద్ధిపై తాము ఎప్పుడూ చర్చకు సిద్ధమేనని, ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం సరికాదని విపక్షాలకు ఎమ్మెల్యే నాయిని స్పష్టం చేశారు. విమర్శలు చేసే ముందు తాము చేసిన పనులేంటో చెప్పాలని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే వందల కోట్ల రూపాయలు వెచ్చించి భూసేకరణ పూర్తి చేసి, కేంద్రానికి అప్పగించినా కేంద్రం విమానాశ్రయ అభివృద్ధిని వేగవంతం చేయలేదని విమర్శించారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్ తీసుకురాకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక విధానాల పేరుతో లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను సైతం బలహీనపరుస్తూ ప్రైవేటీకరణకు ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు క్షేత్రస్థాయి అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం అనవసర రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. ఎవరు అభివృద్ధి చేస్తున్నారో, ఎవరు కేవలం మాటలకే పరిమితమవుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని, వారే సరైన తీర్పు ఇస్తారని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/global/a-bribe/article-469</link>
                <guid>https://www.aksharadarbar.com/global/a-bribe/article-469</guid>
                <pubDate>Thu, 02 Jul 2026 18:18:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260702-wa0013.jpg"                         length="114249"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లంచాలు అడిగితే నా దృష్టికి తేండి</title>
                                    <description><![CDATA[<p>పేదల సంక్షేమంలో రాజీ లేదు.. నియోజకవర్గ అభివృద్ధియే మా లక్ష్యం<br />- వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వమే కారణం<br />- ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి<br />- అభివృద్ధిపై చర్చకు సిద్ధమని బీజేపీ, బీఆర్ఎస్‌లకు సవాల్<br />- రూ.2.10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>లంచాలు అడిగితే <br />నా దృష్టికి తీసుకురండి<br />- పేదల సంక్షేమంలో రాజీ లేదు.. నియోజకవర్గ అభివృద్ధియే మా లక్ష్యం<br />- వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వమే కారణం<br />- ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి<br />- అభివృద్ధిపై చర్చకు సిద్ధమని బీజేపీ, బీఆర్ఎస్‌లకు సవాల్<br />- రూ.2.10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన</p>
<p>అక్షరదర్బార్, హనుమకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిలో భాగంగా 53వ డివిజన్ పరిధిలోని లష్కర్ నగర్ సింగారం, గోపాల్పూర్ జంక్షన్ ప్రాంతాల్లో సుమారు రూ.2.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి జరిగిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో ఒక్కో డివిజన్‌కు నామమాత్రంగా నిధులు కేటాయించి చేతులు దులుపుకునేవారని విమర్శించారు. కానీ ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో ప్రతి డివిజన్‌కు రూ.10 కోట్ల నుండి రూ.20 కోట్ల వరకు నిధులు కేటాయించి అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి కాలనీకి మెరుగైన రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.<br />- లంచాలు అడిగితే వెంటనే నా దృష్టికి తీసుకురండి<br />రేషన్ కార్డులు, పెన్షన్లు లేదా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఎవరైనా రాజకీయ నాయకులు గానీ, అధికారులు గానీ డబ్బులు అడిగితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేదలకు సంబంధించిన ప్రతి పథకం పూర్తిగా ఉచితమని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుల చేతికే నేరుగా ప్రయోజనాలు చేరేలా పారదర్శక వ్యవస్థను అమలు చేస్తున్నామని చెప్పారు. ఎవరైనా లంచాలు ఇచ్చి ప్రోత్సహిస్తే సమాజానికి అన్యాయం చేసినట్లవుతుందని హితవు పలికారు. ఇప్పటికే పెన్షన్లు, రేషన్ కార్డుల అర్హుల జాబితాలను డివిజన్ వారీగా తుది దశకు తీసుకువచ్చామని వెల్లడించారు.<br />- అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. విపక్షాలకు సవాల్<br />నియోజకవర్గ అభివృద్ధిపై తాము ఎప్పుడూ చర్చకు సిద్ధమేనని, ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం సరికాదని విపక్షాలకు ఎమ్మెల్యే నాయిని స్పష్టం చేశారు. విమర్శలు చేసే ముందు తాము చేసిన పనులేంటో చెప్పాలని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే వందల కోట్ల రూపాయలు వెచ్చించి భూసేకరణ పూర్తి చేసి, కేంద్రానికి అప్పగించినా కేంద్రం విమానాశ్రయ అభివృద్ధిని వేగవంతం చేయలేదని విమర్శించారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్ తీసుకురాకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక విధానాల పేరుతో లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను సైతం బలహీనపరుస్తూ ప్రైవేటీకరణకు ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు క్షేత్రస్థాయి అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం అనవసర రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. ఎవరు అభివృద్ధి చేస్తున్నారో, ఎవరు కేవలం మాటలకే పరిమితమవుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని, వారే సరైన తీర్పు ఇస్తారని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/global/if-you-ask-for-bribes-bring-it-to-my-attention/article-468</link>
                <guid>https://www.aksharadarbar.com/global/if-you-ask-for-bribes-bring-it-to-my-attention/article-468</guid>
                <pubDate>Thu, 02 Jul 2026 18:08:36 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తీర్మానం లేకుండా నిధుల డ్రా.. </title>
                                    <description><![CDATA[<p>తీర్మానం లేకుండా నిధుల డ్రా.. <br />వార్డు సభ్యుల ఆగ్రహం</p>
<p>అక్షర దర్బార్, శాయంపేట: <br />గ్రామపంచాయతీలో తీర్మానం చేసి వార్డు సభ్యుల అనుమతితోనే నిధులు డ్రా చేయాలని కోరుతూ శాయంపేట గ్రామపంచాయతీ వార్డు సభ్యులు శాయంపేట ఎంపీడీవోతో పాటు హనుమకొండ జిల్లా డీపీఓకు సోమవారం వినతిపత్రం అందజేశారు.<br />ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీలో నిధుల వినియోగంపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. గ్రామపంచాయతీ సమావేశంలో తీర్మానం చేయకుండా, వార్డు సభ్యుల సంతకాలు లేకుండానే సర్పంచి, ఉపసర్పంచి, కార్యదర్శి ఆధ్వర్యంలో నిధులు డ్రా చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న వార్డు సభ్యులుగా ఉన్నప్పటికీ పంచాయతీలో జరుగుతున్న వ్యవహారాలపై తమకు సమాచారం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. నిధులు ఏ పనుల కోసం ఖర్చు చేశారనే వివరాలు అడిగినా స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.<br />ఇకపై గ్రామపంచాయతీ తీర్మానం అనంతరం సభ్యుల అనుమతితోనే నిధులు డ్రా చేసేలా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/draw-funds-without-resolution/article-467"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-07/img-20260630-wa1668.jpg" alt=""></a><br /><p>తీర్మానం లేకుండా నిధుల డ్రా.. <br />వార్డు సభ్యుల ఆగ్రహం</p>
<p>అక్షర దర్బార్, శాయంపేట: <br />గ్రామపంచాయతీలో తీర్మానం చేసి వార్డు సభ్యుల అనుమతితోనే నిధులు డ్రా చేయాలని కోరుతూ శాయంపేట గ్రామపంచాయతీ వార్డు సభ్యులు శాయంపేట ఎంపీడీవోతో పాటు హనుమకొండ జిల్లా డీపీఓకు సోమవారం వినతిపత్రం అందజేశారు.<br />ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీలో నిధుల వినియోగంపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. గ్రామపంచాయతీ సమావేశంలో తీర్మానం చేయకుండా, వార్డు సభ్యుల సంతకాలు లేకుండానే సర్పంచి, ఉపసర్పంచి, కార్యదర్శి ఆధ్వర్యంలో నిధులు డ్రా చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న వార్డు సభ్యులుగా ఉన్నప్పటికీ పంచాయతీలో జరుగుతున్న వ్యవహారాలపై తమకు సమాచారం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. నిధులు ఏ పనుల కోసం ఖర్చు చేశారనే వివరాలు అడిగినా స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.<br />ఇకపై గ్రామపంచాయతీ తీర్మానం అనంతరం సభ్యుల అనుమతితోనే నిధులు డ్రా చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో కూడా సర్పంచి ఏకపక్షంగా వ్యవహరించారని, తమ వార్డుల్లో అర్హులు ఉన్నప్పటికీ వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండా లబ్ధిదారులను ఎంపిక చేశారని ఆరోపించారు. ఈ విషయంపై ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వలేదని తెలిపారు.<br />ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/draw-funds-without-resolution/article-467</link>
                <guid>https://www.aksharadarbar.com/draw-funds-without-resolution/article-467</guid>
                <pubDate>Wed, 01 Jul 2026 11:06:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-07/img-20260630-wa1668.jpg"                         length="246117"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సీఐ, ఎస్సై సస్పెన్షన్ </title>
                                    <description><![CDATA[<p>- ఒకే కేసులో సీఐ, ఎస్ఐలను సస్పెన్షన్ చేసిన వరంగల్ సీపీ <br />- విచారణలో అవినీతి ఆరోపణలు నిజమని తేలటంతో నిర్ణయం</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/suspension-of-ci-sci/article-466"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-06/546-5467892_telangana-police-logo-png-telangana-police-logo-transparent.png" alt=""></a><br /><p>సీఐ, ఎస్సై సస్పెన్షన్ </p>
<p>- ఒకే కేసులో సీఐ, ఎస్ఐలను సస్పెన్షన్ చేసిన వరంగల్ సీపీ <br />- విచారణలో అవినీతి ఆరోపణలు నిజమని తేలటంతో నిర్ణయం </p>
<p>అక్షరదర్బార్, హనుమకొండ: వరంగల్ కమిషనరేట్ పరిధిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారులపై కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కొరడా ఝలిపిస్తున్నారు. తాజాగా మరో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు. వెస్ట్ జోన్ పరిధిలోని నర్మెట్ట సర్కిల్ ఇన్ స్పెక్టర్ యం అబ్బయ్య, గతంలో బచ్చన్నపేట ఎస్ఐగా పని చేసి ప్రస్తుతం ఏఆర్ అటాచ్డ్ లో ఉన్న ఎస్ఐ షేక్ హమీద్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఇరువురు అధికారులను సస్పెండ్ చేస్తునట్లు సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే కేసులో సీఐ, ఎస్సైపై సీపీ సస్పెన్షన్ వేటు వేయడం కమిషనరేట్ పరిధిలో కలకలం రేపింది.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/suspension-of-ci-sci/article-466</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/suspension-of-ci-sci/article-466</guid>
                <pubDate>Sun, 28 Jun 2026 13:12:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-06/546-5467892_telangana-police-logo-png-telangana-police-logo-transparent.png"                         length="245806"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title> జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా వెంకన్న</title>
                                    <description><![CDATA[<ul>
<li>ఆయన స్వస్థలం మరిపెడ</li>
<li>అదనపు బాధ్యతల నుంచి కలెక్టర్ రిలీవ్ </li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/global/venkanna-as-gwmc-commissioner/article-465"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-06/img-20260626-wa0023.jpg" alt=""></a><br /><p>జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా వెంకన్న<br />- ఆయన స్వస్థలం మరిపెడ <br />- అదనపు బాధ్యతల నుంచి కలెక్టర్ రిలీవ్ </p>
<p>అక్షరదర్బార్, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బదిలీ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం హెచ్‌ఎండీఏలో కోర్ అర్బన్ రీజియన్, మెట్రో రైల్ విభాగం జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న టి వెంకన్న ను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ నియమించింది. ఈ మేరకు ఇప్పటి వరకు జీడబ్ల్యూఎంసీ మున్సిపల్ కమిషనర్ పదవికి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయిని ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన కమిషనర్ టి వెంకన్న త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. వెంకన్న స్వస్థలం మహబూబాబాద్ జిల్లా మరిపెడ. 2007లో గ్రూప్-1 అధికారిగా మున్సిపల్ కమిషనర్ గా ఎంపికయ్యారు. ఇప్పటివరకు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గా ఐఏఎస్ అధికారులను నియమించిన ప్రభుత్వం తాజాగా గ్రూప్ -1 అధికారిని నియమించటం చర్చనీయమైంది.</p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/global/venkanna-as-gwmc-commissioner/article-465</link>
                <guid>https://www.aksharadarbar.com/global/venkanna-as-gwmc-commissioner/article-465</guid>
                <pubDate>Fri, 26 Jun 2026 18:32:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-06/img-20260626-wa0023.jpg"                         length="112293"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రం గుట్టురట్టు</title>
                                    <description><![CDATA[<p>- టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి.. ఒకరి అరెస్ట్</p>
<p>- రూ. 2.25 లక్షల విలువైన నిల్వలు స్వాధీనం</p>
<p> </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/the-adulterated-greens-manufacturing-center-is-gutturattu/article-464"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-06/img-20260625-wa0003.jpg" alt=""></a><br /><p> </p>
<p>కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రం గుట్టురట్టు</p>
<p>- టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి.. ఒకరి అరెస్ట్</p>
<p>- రూ. 2.25 లక్షల విలువైన నిల్వలు స్వాధీనం</p>
<p> </p>
<p>అక్షరదర్బార్, వరంగల్: వరంగల్ నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఒక అక్రమ, కల్తీ పచ్చడి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ నకిలీ పచ్చళ్ల దందాను మట్టుబెట్టి, ఒకరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 2.25 లక్షల విలువైన కుళ్లిపోయిన ఆహార నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.</p>
<p>- ఇల్లే కేంద్రంగా అక్రమ వ్యాపారం</p>
<p>టాస్క్ ఫోర్స్ అధికారుల కథనం ప్రకారం... ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశీబుగ్గ సాయి వీధిలో ఉన్న ఓ నివాస గృహంలో అక్రమంగా పచ్చళ్లు తయారు చేస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఎ మధుసూదన్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ బండారి రాజు, ఆర్‌ఎస్‌ఐ ఓ. భాను ప్రకాష్ మరియు సిబ్బంది ఆ గృహంపై ఆకస్మిక దాడి జరిపారు. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున కుళ్లిపోయిన పచ్చడి ముడిసరుకులు, ప్రమాదకర రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ కుళ్లిపోయిన నిల్వలను చిన్న చిన్న ఆకర్షణీయమైన ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి, స్థానిక కిరాణా దుకాణాలు, హోటళ్లు, ఇతర చిన్న వ్యాపార కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.</p>
<p>- భారీగా కుళ్లిపోయిన సరుకు స్వాధీనం</p>
<p>ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన కాశీబుగ్గ నివాసి అరికెల శ్రీనివాస్ (51) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తయారీ కేంద్రం నుండి దాదాపు 2,100 కిలోల కల్తీ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 750 కిలోల టమోటా ముడిసరుకు, 900 కిలోల మామిడి ముక్కలు, 200 కిలోల నిమ్మకాయలు, 100 కిలోల ఉసిరికాయలు, 150 కిలోల అల్లం-వెల్లుల్లి పేస్ట్ ఉన్నాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ.2,25,000 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పట్టుబడిన నిందితుడిని, స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.</p>
<p>- ప్రజలు అప్రమత్తంగా ఉండాలి</p>
<p>"మార్కెట్లో లభించే బ్రాండ్ లేని, అనుమానాస్పద ఆహార పదార్థాలు, పచ్చళ్లను కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తక్కువ ధరకు వస్తున్నాయని కొని ఆరోగ్యాలను పాడుచేసుకోవద్దు. నగరంలో ఎక్కడైనా ఇలాంటి అక్రమ నిల్వ కేంద్రాలు లేదా కల్తీ ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలి, సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతాం." అని టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎ. మధుసూదన్ అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/the-adulterated-greens-manufacturing-center-is-gutturattu/article-464</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/the-adulterated-greens-manufacturing-center-is-gutturattu/article-464</guid>
                <pubDate>Thu, 25 Jun 2026 16:48:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-06/img-20260625-wa0003.jpg"                         length="223228"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లారీ బీభత్సం.. ఆర్టీవో మృతి </title>
                                    <description><![CDATA[<ul>
<li>భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు ఘోర ప్రమాదం</li>
<li>దూసుకెళ్లిన లారీ.. ఆర్టీవో వెంకన్న దుర్మరణం </li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/larry-bibhatsam-rto-died/article-463"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-06/img-20260622-wa0005.jpg" alt=""></a><br /><p>లారీ బీభత్సం.. ఆర్టీవో మృతి </p>
<p>- భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు ఘోర ప్రమాదం</p>
<p><br />అక్షరదర్బార్, భూపాలపల్లిక్రైమ్:</p>
<p>గణపురం మండలం చెల్పూర్ వద్ద భూపాలపల్లి - పరకాల ప్రధాన రహదారిపై గల జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా అధికారి (ఆర్టీవో) కార్యాలయం ముందు సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీవో వెంకన్న బొగ్గు లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఓ బొగ్గు లారీ ఆర్టీవో వెంకన్న పైనుంచి దూసుకు వెళ్లింది. నడుముపై నుంచి వెళ్లటం వల్ల తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే సంఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయారు. </p>
<p>సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్టీవో సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని భూపాలపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే అధికారిగా పేరున్న వెంకన్న మృతి పట్ల జిల్లా యంత్రాంగం, రవాణా శాఖ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీవో కార్యాలయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. వెంకన్న ఇటీవలే ఈనెల 4న జగిత్యాల నుంచి బదిలీపై భూపాలపల్లి జిల్లా రవాణా అధికారిగా వచ్చారు. వెంకన్న స్వస్థలం మహబూబాబాద్ జిల్లా. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు.<img src="https://www.aksharadarbar.com/media/2026-06/img-20260622-wa0008.jpg" alt="IMG-20260622-WA0008" width="1072" height="712"/></p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/larry-bibhatsam-rto-died/article-463</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/larry-bibhatsam-rto-died/article-463</guid>
                <pubDate>Mon, 22 Jun 2026 10:29:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-06/img-20260622-wa0005.jpg"                         length="187354"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు</title>
                                    <description><![CDATA[<p>ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు</p>
<p>- రేవూరి గొప్పతనం పరకాల ప్రజలకు తెలుసు </p>
<p>మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్</p>
<p>అక్షరదర్బార్, పరకాల :<br />పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదని పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ అన్నారు. ఆదివారం పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యఅతిథిగా సునీల్ కుమార్ పాల్గొని మాట్లాడారు.<br />రేవూరి ప్రకాష్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించిన నాయకుడని, పార్టీలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన సేవలను పరకాల ప్రజలు బాగా గుర్తించారని అన్నారు. అలాంటి నాయకుడిపై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం, దిష్టిబొమ్మ దహనం వంటి చర్యలకు పాల్పడటం సరికాదని విమర్శించారు.ప్రజా సమస్యల పరిష్కారంలో, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/brs-has-no-right-to-criticize-mla/article-462"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-06/img_20260621_174332.jpg" alt=""></a><br /><p>ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు</p>
<p>- రేవూరి గొప్పతనం పరకాల ప్రజలకు తెలుసు </p>
<p>మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్</p>
<p>అక్షరదర్బార్, పరకాల :<br />పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదని పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ అన్నారు. ఆదివారం పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యఅతిథిగా సునీల్ కుమార్ పాల్గొని మాట్లాడారు.<br />రేవూరి ప్రకాష్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించిన నాయకుడని, పార్టీలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన సేవలను పరకాల ప్రజలు బాగా గుర్తించారని అన్నారు. అలాంటి నాయకుడిపై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం, దిష్టిబొమ్మ దహనం వంటి చర్యలకు పాల్పడటం సరికాదని విమర్శించారు.ప్రజా సమస్యల పరిష్కారంలో, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నిరంతరం ముందుంటున్నారని తెలిపారు. ప్రజాదరణ కలిగిన నాయకుడిని విమర్శించడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు తమ రాజకీయ అసహనాన్ని బయటపెడుతున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, తగిన విధంగా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో కౌన్సిలర్లు బండి శ్రీధర్, కోయ్యడ శ్రీనివాస్ , దశరథం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/brs-has-no-right-to-criticize-mla/article-462</link>
                <guid>https://www.aksharadarbar.com/brs-has-no-right-to-criticize-mla/article-462</guid>
                <pubDate>Sun, 21 Jun 2026 17:48:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-06/img_20260621_174332.jpg"                         length="1960574"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నిషేధిత కలుపు మందు స్వాధీనం </title>
                                    <description><![CDATA[<p>- పరకాలలో విజిలెన్స్ దాడులు.. </p>
<p>- 150 లీటర్ల స్పీడ్ పారాక్వాట్ పట్టివేత</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/global/possession-of-prohibited-weed/article-459"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-06/img-20260614-wa0006.jpg" alt=""></a><br /><p>నిషేధిత కలుపు మందు స్వాధీనం</p>
<p>- పరకాలలో విజిలెన్స్ దాడులు.. </p>
<p>- 150 లీటర్ల స్పీడ్ పారాక్వాట్ పట్టివేత</p>
<p>అక్షరదర్బార్, పరకాల: <br />పరకాల పట్టణంలోని ఓ ఎరువులు, పురుగుమందుల దుకాణంలో నిషేధిత కలుపు మందును విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని లక్ష్మీ ఏజెన్సీలో నిల్వ ఉంచిన సుమారు 150 లీటర్ల స్పీడ్ పారాక్వాట్ (పారాకుట్) మందును అధికారులు తనిఖీల సందర్భంగా గుర్తించి పట్టుకున్నట్లు సమాచారం.భూమి సారంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు రైతుల ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉందన్న కారణాలతో ప్రభుత్వం ఈ మందు విక్రయాలు, వినియోగంపై నిషేధం విధించింది. అయినప్పటికీ కొందరు వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘిస్తూ రహస్యంగా విక్రయాలు కొనసాగిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలిసింది.పట్టణంలోని ఇతర ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లోనూ సమగ్ర తనిఖీలు చేపడితే మరింత పరిమాణంలో నిషేధిత మందులు బయటపడే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఘటనపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.</p>]]></content:encoded>
                
                                                            <category>వార్తలు</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/global/possession-of-prohibited-weed/article-459</link>
                <guid>https://www.aksharadarbar.com/global/possession-of-prohibited-weed/article-459</guid>
                <pubDate>Sun, 14 Jun 2026 14:02:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-06/img-20260614-wa0006.jpg"                         length="162418"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు</title>
                                    <description><![CDATA[<p>వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు</p>
<p>కాంట వేసి 10 రోజులు దాటినా ఖాతాల్లో జమ కాని చెల్లింపులు</p>
<p>ట్యాబ్‌లో నమోదు ఆలస్యం, ఒటీపీ సమాచారం లేక రైతుల ఆందోళన</p>
<p>ఎరువులు, విత్తనాల కొనుగోలుకు ఇబ్బందులు</p>
<p>అక్షరదర్బార్, శాయంపేట:<br />వరిధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపుల జాప్యం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. శాయంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మి 9 నుంచి 10 రోజులు గడిచినా ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.రైతుల వివరాల ప్రకారం, ధాన్యం కొనుగోలు అనంతరం కేంద్రాల ఇన్‌చార్జీలు ట్యాబ్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉండగా, కొన్ని కేంద్రాల్లో ఈ ప్రక్రియ పూర్తికాలేదని చెబుతున్నారు. వివరాలు నమోదు చేసినా ఒటీపీ సంబంధిత సమాచారాన్ని రైతులకు తెలియజేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో చెల్లింపుల ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. మరోవైపు, రుతుపవనాల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/expectations-of-farmers-for-wood-money/article-456"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-06/img_20260611_075757.jpg" alt=""></a><br /><p>వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు</p>
<p>కాంట వేసి 10 రోజులు దాటినా ఖాతాల్లో జమ కాని చెల్లింపులు</p>
<p>ట్యాబ్‌లో నమోదు ఆలస్యం, ఒటీపీ సమాచారం లేక రైతుల ఆందోళన</p>
<p>ఎరువులు, విత్తనాల కొనుగోలుకు ఇబ్బందులు</p>
<p>అక్షరదర్బార్, శాయంపేట:<br />వరిధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపుల జాప్యం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. శాయంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మి 9 నుంచి 10 రోజులు గడిచినా ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.రైతుల వివరాల ప్రకారం, ధాన్యం కొనుగోలు అనంతరం కేంద్రాల ఇన్‌చార్జీలు ట్యాబ్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉండగా, కొన్ని కేంద్రాల్లో ఈ ప్రక్రియ పూర్తికాలేదని చెబుతున్నారు. వివరాలు నమోదు చేసినా ఒటీపీ సంబంధిత సమాచారాన్ని రైతులకు తెలియజేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో చెల్లింపుల ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. మరోవైపు, రుతుపవనాల రాక సమీపిస్తున్న నేపథ్యంలో సాగు సన్నాహకాలకు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాల్సి ఉన్నా చేతిలో నగదు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం అమ్మిన సొమ్ము సమయానికి అందకపోవడం వల్ల వ్యవసాయ పనులు ప్రభావితమవుతున్నాయని వాపోతున్నారు.</p>
<p>అధికారులు స్పందించాలంటున్న రైతులు</p>
<p>ఐకేపీ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల రికార్డులను ఉన్నతాధికారులు తనిఖీ చేసి, ధాన్యం కొనుగోలు వివరాల నమోదులో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/expectations-of-farmers-for-wood-money/article-456</link>
                <guid>https://www.aksharadarbar.com/expectations-of-farmers-for-wood-money/article-456</guid>
                <pubDate>Thu, 11 Jun 2026 07:59:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-06/img_20260611_075757.jpg"                         length="393153"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గంజాయి చాక్లెట్ల కలకలం</title>
                                    <description><![CDATA[<p>- ఒడిశా కేటుగాడి అరెస్ట్<br />- ఎంజీఎం సర్కిల్ వద్ద పట్టుకున్న పోలీసులు..<br />- 72 'సెవెన్ మైనర్ వతి' చాక్లెట్లు స్వాధీనం</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/crime/a-mix-of-cannabis-chocolates/article-455"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-06/img-20260607-wa0016.jpg" alt=""></a><br /><p>గంజాయి చాక్లెట్ల కలకలం<br />- ఒడిశా కేటుగాడి అరెస్ట్<br />- ఎంజీఎం సర్కిల్ వద్ద పట్టుకున్న పోలీసులు..<br />- 72 'సెవెన్ మైనర్ వతి' చాక్లెట్లు స్వాధీనం</p>
<p>అక్షరదర్బార్, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు గంజాయి చాక్లెట్ల అక్రమ రవాణాను రట్టు చేశారు. మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు భారీగా గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకొని, ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. మట్వాడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్‌ఐ) ఎస్ శివకృష్ణ తన సిబ్బంది డి నాగరాజు, బి సత్యనారాయణ, పి రవిలతో కలిసి స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎంజీఎం సర్కిల్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసుల కంటపడ్డాడు. సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద ఉన్న నలుపు రంగు బ్యాగును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ బ్యాగులో చాక్లెట్ల రూపంలో ఉన్న గంజాయి పదార్థం బయటపడటంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు.<br />- ఒడిశా టు మహారాష్ట్ర.. వరంగల్ మీదుగా స్మగ్లింగ్<br />పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు ఒడిశా రాష్ట్రం, భద్రక్ జిల్లా, కాన్పాడా గ్రామానికి చెందిన జనార్ధన్ మాలిక్ (వయస్సు 35 ఏళ్లు) గా గుర్తించారు. నిందితుడి వద్ద నిషేధిత పదార్థం దొరకడంతో మట్వాడ పోలీసులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారి ఆదేశాల మేరకు పంచులు (సాక్షులు), క్లూస్ టీంను సంఘటనా స్థలానికి రప్పించి చట్టపరమైన ప్రక్రియను చేపట్టారు.<br />పంచుల సమక్షంలో నిందితుడిని విచారించగా అసలు విషయం ఒప్పుకున్నాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన తన పరిచయస్తుడు అంకిత్ పాణిగ్రహి వద్ద నుండి ఈ గంజాయి మిశ్రమ చాక్లెట్లను తక్కువ ధరకు కొనుగోలు చేశానని.. వీటిని మహారాష్ట్రలోని సోలాపూర్ ప్రాంతానికి తరలించి అక్కడ అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోవాలనే దురాశతో తీసుకెళ్తున్నట్లు నిందితుడు స్వచ్ఛందంగా అంగీకరించాడు.<br />- ఘాటైన వాసన.. 'క్యానబిస్ సటైవా' గుర్తింపు<br />నిందితుడి వద్ద లభించిన గోల్డ్ కలర్ కవర్లపై “Seven Minor Vati” అని ముద్రించి ఉంది. పోలీసులు మొత్తం 72 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ కవర్లపై ఉన్న వివరాలను పరిశీలించగా.. అందులో ‘క్యానబిస్ సటైవా’ (గంజాయి) సహా పలు మత్తు పదార్థాలు కలిపి తయారు చేసినట్లు నిర్ధారణ అయింది. పంచులు, పోలీసుల సమక్షంలో వాటిని పరిశీలించగా చాక్లెట్ల నుండి గంజాయికి ఉండే ప్రత్యేకమైన ఘాటైన వాసన రావడంతో వాటిని సీజ్ చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న మట్వాడ ఎస్‌ఐ శివకృష్ణ, పీసీలు నాగరాజు, సత్యనారాయణ, రవిలను ఉన్నతాధికారులు అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                    

                <link>https://www.aksharadarbar.com/crime/a-mix-of-cannabis-chocolates/article-455</link>
                <guid>https://www.aksharadarbar.com/crime/a-mix-of-cannabis-chocolates/article-455</guid>
                <pubDate>Sun, 07 Jun 2026 22:13:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-06/img-20260607-wa0016.jpg"                         length="326068"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[RV]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        