ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్

ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్

  • పరకాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో దాడులు
  • రూ.80 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత 
  • రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సబ్ రిజిస్ట్రార్ 
  • ఏసీబీ అధికారుల అదుపులో ప్రైవేటు వ్యక్తి కూడా
  • పరకాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో కరప్షన్ పై ఇటీవల 'అక్షర దర్బార్'  లో వరస కథనాలు

ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్ 

 

అక్షర దర్బార్, పరకాల: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దూకుడు మరింత పెంచారు. ప్రధానంగా కరప్షన్కు కేరాఫ్ గా మారిన వివిధ శాఖలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం హనుమకొండ జిల్లా పరకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాడులు జరిపారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతరాంపురంకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.80 వేల లంచం తీసుకుంటున్న సబ్ రిజిస్ట్రార్ సునీతను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆమె లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఆఫీస్ లో పనిచేస్తున్న ప్రైవేటు వ్యక్తి నరేశ్ తో పాటు సబ్ రిజిస్ట్రార్ సునీతను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ప్రైవేటు వ్యక్తి అజయ్ ద్వారా సబ్ రిజిస్ట్రార్ సునీత పెద్ద మొత్తంలో ప్రజల నుంచి డబ్బు గుంజుతున్నట్లు, అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఇటీవల పరకాల సబ్ రిజిస్టార్ కార్యాలయంపై 'అక్షర దర్బార్' పత్రికలో వరుస కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ తరుణంలో సబ్ రిజిస్ట్రార్ సునీత, ప్రైవేటు వ్యక్తి నరేశ్ ఏసీబీ వలకు చిక్కడం చర్చనీయాంశమైందిIMG-20240725-WA0060 .

Tags:

మూడు నెలల్లో నిర్వహించాలి

మూడు నెలల్లో నిర్వహించాలి  - గ్రామపంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు    అక్షరదర్బార్, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు నెలల్లో నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని...
Read More...
మూడు నెలల్లో నిర్వహించాలి

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....      జారి పడిపోతున్న వాహనదారులు..    పట్టించుకోని గ్రామ కార్యదర్శి.     అక్షర దర్బార్, పరకాల. నడికూడ మండల కేంద్రంలోని గొల్లవాడలో గత నాలుగు నెలల...
Read More...
నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

తొలుత ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు  రేపు కేబినెట్లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వారం రోజుల్లో రైతు భరోసా, సన్నాలకు బోనస్...
రాజకీయం 
Read More...
నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

కార్యకర్తలకు అండగా చల్లా..

   కార్యకర్తలకు అండగా చల్లా..    వెంకటేశ్వర్లపల్లిలో పర్యటించిన చల్లా..    కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.     అక్షర దర్బార్, పరకాల. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలం...
Read More...
కార్యకర్తలకు అండగా చల్లా..

పేలిన మందుపాతర

ముగ్గురు పోలీసుల దుర్మరణం మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు? బీజాపూర్ జిల్లాలో ఘటన
క్రైమ్ 
Read More...
పేలిన మందుపాతర