ఆయిల్ ఫామ్ పంట దగ్ధం ..
ఆవేదన వ్యక్తం చేసిన మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి
అక్షర దర్బార్, శాయంపేట
ఆయిల్ పంట ఫామ్ దగ్ధం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి కోరారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు.. మెతుకు తిరుపతిరెడ్డి తెలిపిన కథనం మేరకు..మండలంలోని ప్రగతి సింగారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 179/3 గల వ్యవసాయ భూమి మూడు సంవత్సరాల క్రితం ఆయిల్ ఫామ్ పెట్టడం జరిగిందని తన వ్యవసాయ భూమి పక్కన ప్రగతి సింగారం మాజీ ఉపసర్పంచ్ భర్త మోరే శ్రీనివాస్ అనే వ్యక్తి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు తన ఆయిల్ ఫామ్ తోటకు తన యొక్క వ్యవసాయ పొలంనకు మధ్యగల కందకాన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా తోటను ధ్వంసం చేయుట కొరకు కందకాన్ని నిప్పుతో అంటించగా కందకం కాలుతూ 20 గుంటల భూమిలో గల ఆయిల్ ఫామ్ చెట్లు కాలిపోగా అందులోని డ్రిప్ పైపులు మరియు పివిసి పైపులు గేటు వాల్స్ కాలిపోవడం జరిగిందని మెతుకు తిరుపతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న మా తండ్రి ఏడుస్తూ మంటలార్పుతుండగా అక్కడినుండి మోరి శ్రీనివాస్ వెళ్లిపోవడం జరిగిందని ఉద్దేశపూర్వకంగా కావాలని ఆయిల్ ఫామ్ తోటను కాలబెట్టి నష్టం చేసిన మోరే శ్రీనివాస్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోని తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయాన్ని స్థానిక ఎస్సై జక్కుల పరమేష్ నీ వివరణ కోరగా తిరుపతి రెడ్డి పిర్యాదు మేరకు విచారణ చెప్పినట్టు తెలిపారు.
