పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

- వెంకటేశ్వరపల్లిలో వంట నాణ్యతపై గ్రామస్థుల ఆవేదన

అక్షరదర్బార్, పరకాల:
పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీ సెంటర్లు ఇప్పుడు నాణ్యతారహిత ఆహారానికి అడ్డాగా మారుతున్నాయి. నడికూడ మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామంలో ఉన్న రెండు అంగన్వాడీ సెంటర్లకు అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా సరఫరా అవుతున్న భోజన నాణ్యతపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్థానికుల సమాచారం ప్రకారం, పిల్లలకు “పప్పు, సాంబార్, కూర” పేరుతో అందిస్తున్న ఆహారం వాస్తవానికి నీళ్లు కలిపిన పప్పు, నీళ్లు మసాలాతో కలిపిన సాంబార్ రూపంలో ఉందని వారు ఆరోపిస్తున్నారు. బాలింతలు, చిన్నారులు తినే స్థితిలో కూడా ఆ భోజనం లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీకి పంపడం మానేశారు.“పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలనుకున్న ప్రభుత్వం ఉద్దేశం వక్రీకృతమవుతోంది. ఈ పరిస్థితిని అధికారులు గమనించి చర్యలు తీసుకోవాలి” అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. భీమదేవరపల్లి ప్రాజెక్టు అంబాల సెక్టర్ పరిధిలో ఉండే ఈ అంగన్వాడీ కేంద్రాలపై జిల్లా అధికారుల దృష్టి నిలిచింది. జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి, అంగన్వాడీల్లో అందిస్తున్న ఆహార నాణ్యతపై సమగ్ర విచారణ జరపాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ! - వెంకటేశ్వరపల్లిలో వంట నాణ్యతపై గ్రామస్థుల ఆవేదన అక్షరదర్బార్, పరకాల:పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీ సెంటర్లు ఇప్పుడు నాణ్యతారహిత...
Read More...
పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి- 97 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత - నాలుగు వాహనాలు సీజ్- పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై విచారణ...
Read More...
టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు.. పట్టించుకోని అధికారులు! అక్షర దర్బార్, పరకాల:  పరకాల మండలం కామరెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం అధికారులకు సెలవు దినం కావడంతో గ్రామంలో...
Read More...
ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.       నకిలీ రైతుల పేరుతో పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం.      ఈఎఫ్‌టీ విచారణలో బహిర్గతం    అక్షర దర్బార్, శాయంపేట:...
Read More...
రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన

  అంతర్జాతీయ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా వచ్చిన స్వదేశీ యాప్ 'అరట్టై' (Arattai) పేరు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ వినిపించింది. తన వాట్సాప్
వార్తలు  వరంగల్ 
Read More...
వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన