బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే రేవూరి సమీక్ష.
అక్షర దర్బార్, పరకాల:
పరకాల పట్టణంలోని అంగడి మైదానం, దామెర చెరువు వద్ద జరుగనున్న బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను ప్రజలు ఆనందంగా, ఘనంగా జరుపుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలి” అని అధికారులకు సూచించారు. మహిళలు, కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నందున తాగునీరు, శానిటేషన్, లైటింగ్, భద్రత వంటి సదుపాయాలను పటిష్టంగా కల్పించాలని ఆదేశించారు. అదేవిధంగా, సద్దుల బతుకమ్మ, దసరా పండుగలకు ఎలాంటి అంతరాయం లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రజలతో కలిసి పండుగ ఉత్సాహాన్ని పంచుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే రేవూరి స్పష్టం చేశారు.