భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి
- ఎద్దుపై దాడి చేసి చంపినట్లు గుర్తింపు 
- ప్రజలు ఆందోళన చెందవద్దన్న జిల్లా ఎస్పీ

అక్షరదర్బార్, చిట్యాల: పెద్దపులి సంచారం భూపాలపల్లి జిల్లాలో కలకలం రేపింది. చిట్యాల మండలంలో పెద్దపులి సంచారం జరిగినట్లు తెలిసింది. ఈ మేరకు సమాచారం అందిందని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ వెల్లడించారు. జడల్‌పేట శివారు భీష్మనగర్ ప్రాంతంలో పెద్దపులి ఎద్దుపై దాడి చేసి చంపిన ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు భయాందోళనకు గురైనప్పటికీ, ఆందోళన చెందవద్దని జిల్లా ఎస్పీ ప్రజలకు భరోసా ఇచ్చారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు రాత్రి సమయాల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఒంటరిగా అడవుల వైపు లేదా పొలాల వైపు వెళ్లవద్దని, పెద్దపులి కదలికలపై అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పోలీసు శాఖ నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి అనుమానాస్పద కదలికలు గమనించినా వెంటనే పోలీస్ స్టేషన్‌కు లేదా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల భద్రతకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని, పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకు అవసరమైన పోలీస్ బందోబస్తు కొనసాగిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.

Tags:

భార్యపై కోపంతో అత్త, బావమరిదిపై కత్తితోదాడి

- హనుమకొండ న్యూశాయంపేటలో ఘటన 
Read More...
భార్యపై కోపంతో అత్త, బావమరిదిపై కత్తితోదాడి

సర్పంచ్ సనత్ చోరవతో అంగన్వాడీకి పునర్నిర్మాణం

సర్పంచ్ సనత్ చోరవతో అంగన్వాడీకి పునర్నిర్మాణం   రూ.1.80 లక్షలతో పాత స్కూల్ భవనానికి రిపేర్లు    జంగిలి రత్నాకర్ ఉదారత అక్షర దర్బార్, పరకాల:పరకాల మండలం అలియాబాద్...
Read More...
సర్పంచ్ సనత్ చోరవతో అంగన్వాడీకి పునర్నిర్మాణం

“మా నానమ్మను గెలిపించండి” 

“మా నానమ్మను గెలిపించండి”    చిన్నారి అభ్యర్థనకు కరిగిన ఓటర్ల హృదయాలు అక్షరదర్బార్, పరకాల:పరకాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 12వ వార్డులో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది....
Read More...
“మా నానమ్మను గెలిపించండి” 

మేడారం.. ట్రాఫిక్ నరకం

టెక్నాలజీ తుస్సు.. యంత్రాంగం ఫస్సు! మేడారం - హనుమకొండ 11 గంటల జర్నీ 
వార్తలు 
Read More...
మేడారం.. ట్రాఫిక్ నరకం

మహారాష్ట్రలో పెను విషాదం

ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం ప్రమాదంలో అజిత్ సహా ఆరుగురు మృతి
రాజకీయం 
Read More...
మహారాష్ట్రలో పెను విషాదం