రగిలిన కరీంనగర్

రగిలిన కరీంనగర్

  • గంగుల క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత 
  • ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం 
    - కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్ ధ్వంసం 
    - సంజయ్ పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తల దాడి
    - బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులను చదరగొట్టిన పోలీసులు

గంగుల క్యాంపు ఆఫీస్ వద్ద ఉద్రిక్తత 
- ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం 
- కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్ ధ్వంసం 
- సంజయ్ పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తల దాడి
- బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులను చదరగొట్టిన పోలీసులు

అక్షరదర్బార్, కరీంనగర్: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. గంగుల క్యాంపు ఆఫీస్ ఆవరణలో ఉన్న కౌశిక్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కమలాకర్ క్యాంపు కార్యాలయంలోని ఫర్నిచర్ తో పాటు ఇతర వస్తువులను కూడా ధ్వంసం చేశారు. గంగుల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని, ఉమ్మడి గన్ కల్చర్ వ్యాపిస్తుందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నా పైనా దుండగులురెక్కి నిర్వహిస్తున్నారని, జిల్లాలో శాంతిభద్రతలపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు సమీక్ష నిర్వహించాలని అన్నారు. బండి సంజయ్ తంబాకుతో డ్రగ్స్ కలిపి తీసుకుంటున్నారని, కేటీఆర్ డ్రగ్స్ టెస్టుకు సిద్ధమని, సంజయ్ కూడా టెస్టులకు రావాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. బుఆర్ఎస్, బీజేపీ శ్రేణులు గంగుల క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే చర్యలు చేపట్టారు. బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు గంగుల క్యాంపు కార్యాలయం నుంచి భద్రత నడుమ తీసుకెళ్లారు. తనను చంపడానికే బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

Tags:

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (50) (తండ్రి  కనుకయ్య) అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన...
Read More...
వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

రగిలిన కరీంనగర్

గంగుల క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం - కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్...
వార్తలు 
Read More...
రగిలిన కరీంనగర్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.    -మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి.    -కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు.    అక్షర దర్బార్, మొగుళ్లపల్లి:...
Read More...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

యాక్సిడెంట్ లో ఒకరి మృతి

- మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి. - కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు
క్రైమ్ 
Read More...
యాక్సిడెంట్ లో ఒకరి మృతి

వడదెబ్బతో వ్యక్తి మృతి..

వడదెబ్బతో వ్యక్తి మృతి శాయంపేట, అక్షర దర్బార్: భానుడి భగభగలతో మండిపోతున్న ఎండలు మరో ప్రాణాన్ని బలితీసుకున్నాయి. శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల సదాశివుడు...
Read More...
వడదెబ్బతో వ్యక్తి మృతి..