ఏసీబీ వలలో తహశీల్దార్
- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
- రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్
ఏసీబీ వలలో తహశీల్దార్
- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
- రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్
సిద్దిపేట జిల్లా చేర్యాల మండల తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. భూమి సంబంధిత పని కోసం వచ్చిన వ్యక్తి నుంచి రూ.70 వేల లంచం తీసుకుంటుండగా తహశీల్దార్ దిలీప్ నాయక్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు సమాచారం.
ఫిర్యాదు మేరకు ముందస్తు ప్రణాళికతో ట్రాప్ నిర్వహించిన ఏసీబీ అధికారులు, అనంతరం కార్యాలయంలో సోదాలు చేపట్టి పలు రికార్డులు, పత్రాలను పరిశీలించారు. లంచం వ్యవహారానికి సంబంధించిన మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. తహశీల్దార్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలపై ఏసీబీ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ ఘటనతో చేర్యాల మండలంలో కలకలం రేగింది.