ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల నాగుర్ల దిగ్భ్రాంతి

ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల నాగుర్ల దిగ్భ్రాంతి

డ్రైవర్ మృతి పట్ల నాగుర్ల దిగ్భ్రాంతి

ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శలు

 కుటుంబానికి రూ.1 కోటి, ఉద్యోగం డిమాండ్

అక్షరదర్బార్, పరకాల : 
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, శంకర్ గౌడ్ మృతి ఆత్మహత్య కాదని, ప్రభుత్వ మొండి వైఖరి వల్ల జరిగిన ఘటనగా పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి విషాదాలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు.మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ఈ కష్ట సమయంలో మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆందోళన చెందవద్దని, క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మిక సంఘాలను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.కార్మికుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. మృతుడి కుటుంబానికి రూ.1 కోటి ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

Tags:

ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల నాగుర్ల దిగ్భ్రాంతి

డ్రైవర్ మృతి పట్ల నాగుర్ల దిగ్భ్రాంతి ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శలు   కుటుంబానికి రూ.1 కోటి, ఉద్యోగం డిమాండ్ అక్షరదర్బార్, పరకాల : ఆర్టీసీ డ్రైవర్ శంకర్...
Read More...
ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల నాగుర్ల దిగ్భ్రాంతి

ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకున్న డ్రైవర్ వరంగల్ జిల్లా నర్సంపేట బస్ స్టేషన్ వద్ద ఘటన సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆత్మహత్యాయత్నం
క్రైమ్ 
Read More...
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

లిఫ్ట్ ఇచ్చి మహిళపై అఘాయిత్యం

- అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్- దొంగిలించిన బైక్‌పై వచ్చి ఘాతుకం.. - చురుగ్గా వ్యవహరించి పట్టుకున్న పోలీసులు
క్రైమ్ 
Read More...
లిఫ్ట్ ఇచ్చి మహిళపై అఘాయిత్యం

మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభం

మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభం రైతులు దళాలను నమ్మొద్దు..   ప్రభుత్వ కేంద్రాల్లోనే అమ్మాలి ఏఎంసీ చందుపట్ల రాజిరెడ్డి అక్షరదర్బార్, పరకాల:నడికూడ మండల కేంద్రంలో...
Read More...
మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభం

భారీగా 'హాష్ ఆయిల్' పట్టివేత

- నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు- రూ. 2.50 కోట్ల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్ స్వాధీనం- నిందితులు ఒడిశా, ఆంధ్రప్రదేశ్...
క్రైమ్ 
Read More...
భారీగా 'హాష్ ఆయిల్' పట్టివేత