భారీగా 'హాష్ ఆయిల్' పట్టివేత

భారీగా 'హాష్ ఆయిల్' పట్టివేత

- నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు
- రూ. 2.50 కోట్ల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్ స్వాధీనం
- నిందితులు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు 
- వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడి

భారీగా ‘హాష్ ఆయిల్’ పట్టివేత 
- నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు
- రూ. 2.50 కోట్ల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్ స్వాధీనం
- నిందితులు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు 
- వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడి

అక్షరదర్బార్, హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఖరీదైన ‘హాష్ ఆయిల్’ (గంజాయి నూనె) స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలోని నలుగురు సభ్యులను వరంగల్ డ్రగ్ కంట్రోల్, క్యాట్ పార్టీ, ఇంతేజార్‌గంజ్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.2 కోట్ల 50 లక్షల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్‌తో పాటు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
- నిందితుల వివరాలు
పోలీసుల కథనం ప్రకారం అరెస్టు అయిన వారిలో..
 1. హంటల్ సన్ను (23) - ఒడిశా
 2. హంటల్ సన్యాసి (23) - ఒడిశా
 3. కండెల చిన్నబాబు (56) - ఆంధ్రప్రదేశ్ (అల్లూరి జిల్లా)
 4. కృష్ణ హంటల్ (56) - ఒడిశా
   ఈ కేసులో మరో నిందితుడు కిలో పాండు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
- నేపథ్యం అరెస్టు జరిగిన తీరు
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు హంటల్ సన్ను తన గ్రామంలో గంజాయి మొక్కలను పెంచేవాడు. కేవలం గంజాయి అమ్మితే వచ్చే డబ్బు జల్సాలకు సరిపోకపోవడంతో, పరారీలో ఉన్న కిలో పాండు అనే వ్యక్తి సలహాతో గంజాయి మొక్కల నుండి ‘హాష్ ఆయిల్’ తయారు చేయడం ప్రారంభించారు. సుమారు 40 కిలోల ఆయిల్‌ను సేకరించగా, అందులో 20 కిలోల ఆయిల్‌ను ఐదు కిలోల చొప్పున ప్యాక్ చేసి ముంబాయిలో విక్రయించేందుకు నిందితులు ప్లాన్ చేశారు.
ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్‌లోని తుని రైల్వే స్టేషన్ నుండి కోనార్క్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన ఈ ముఠా, వరంగల్ రైల్వే స్టేషన్‌లో పోలీసుల తనిఖీలు ఉంటాయన్న అనుమానంతో ఇక్కడే దిగిపోయారు. మంగళవారం ఉదయం ముంబాయి వెళ్లేందుకు వరంగల్ బస్టాండ్ సమీపంలోని రైల్వే గూడ్స్ షెడ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా, పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు.
- పోలీసు బృందానికి అభినందనలు
భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత, వరంగల్ ఏఎప్పీ శుభం, ఏసిపిలు జితేందర్ రెడ్డి, జానీ నర్సింహులు, డ్రగ్ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ సతీష్, ఇంతేజార్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ షూకూర్, వారి బృందాన్ని పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.

Tags:

ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!

ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌! అక్షరదర్బార్,శాయంపేట:  గ్రామంలో తరచూ ఎదురవుతున్న విద్యుత్‌ సమస్యలను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో ఉపసర్పంచ్‌ సాయికృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు.
Read More...
ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!

ఫోన్ కాల్.. ఆపై మృతి!

ఫోన్ కాల్.. ఆపై మృతి! పరకాలలో యువకుడి అనుమానాస్పద మరణం.. హత్యేనని కుటుంబ సభ్యుల ఆరోపణ అక్షరదర్బార్, పరకాల: నడికూడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మమ్మద్...
Read More...
ఫోన్ కాల్.. ఆపై మృతి!

పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్

పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్ అంజయ్య బదిలీ..  అక్షరదర్బార్,పరకాల:పరకాల మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా గ్రూప్-1 అధికారి పోతరాజు పవన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు కమిషనర్‌గా...
Read More...
పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్

పరకాలలో ఒక్కసారిగా మంటలు

పరకాలలో ఒక్కసారిగా మంటలు సీఐ క్రాంతికుమార్ చొరవతో తప్పిన పేను ప్రమాదం అక్షరదర్బార్, పరకాల:పరకాల పట్టణంలోని ఇండియన్ గ్యాస్ గోదాం వెనుక ఉన్న పంట పొలాల్లో...
Read More...
పరకాలలో ఒక్కసారిగా మంటలు

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను 2 ఎకరాల 20 గుంటల పంట దగ్ధం తల్లడిల్లుతున్న రైతు కుటుంబం అక్షర దర్బార్,నడికూడ:నడికూడ మండలంలోని కంటత్మకూర్ గ్రామంలో రైతుకు...
Read More...
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను