యాక్సిడెంట్ లో ఒకరి మృతి
- మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి.
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
- మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి.
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు.
అక్షరదర్బార్, మొగుళ్లపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన హుజురాబాద్ మండలం చిలుకూరు ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద బుధవారం సంభవించింది. హుజురాబాద్ పోలీసుల కథనం ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన కత్తి నరసయ్య గౌడ్ అనే వ్యక్తి తన సొంత వాహనంలో హుజురాబాద్ నుండి జమ్మికుంట వైపు వస్తున్న క్రమంలో చేల్పూరు ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద అతివేగంగా కారు ను ఢీకొట్టడంతో కారు నడుపుతున్న నరసయ్య. అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న హుజురాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. రంగాపురం గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి,