ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు

ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు

ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు

- రేవూరి గొప్పతనం పరకాల ప్రజలకు తెలుసు 

మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్

అక్షరదర్బార్, పరకాల :
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదని పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ అన్నారు. ఆదివారం పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యఅతిథిగా సునీల్ కుమార్ పాల్గొని మాట్లాడారు.
రేవూరి ప్రకాష్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించిన నాయకుడని, పార్టీలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన సేవలను పరకాల ప్రజలు బాగా గుర్తించారని అన్నారు. అలాంటి నాయకుడిపై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం, దిష్టిబొమ్మ దహనం వంటి చర్యలకు పాల్పడటం సరికాదని విమర్శించారు.ప్రజా సమస్యల పరిష్కారంలో, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నిరంతరం ముందుంటున్నారని తెలిపారు. ప్రజాదరణ కలిగిన నాయకుడిని విమర్శించడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు తమ రాజకీయ అసహనాన్ని బయటపెడుతున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, తగిన విధంగా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో కౌన్సిలర్లు బండి శ్రీధర్, కోయ్యడ శ్రీనివాస్ , దశరథం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

పరకాలకు పారిశుధ్య ముప్పు

  పరకాలకు పారిశుధ్య ముప్పు వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త..  స్వైర విహారం చేస్తున్న పందులు..  దుర్వాసనతో ప్రజల అవస్థలు..  అక్షరదర్బార్,పరకాల:వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య...
Read More...
పరకాలకు పారిశుధ్య ముప్పు

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ