నడికూడ ప్రెస్ క్లబ్కు నూతన కమిటీ
నడికూడ ప్రెస్ క్లబ్కు నూతన కమిటీ
అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు
అక్షరదర్బార్,నడికూడ:
నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల సమావేశంలో నూతన ప్రెస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జర్నలిస్టుల అభిప్రాయాలు, సూచనల మేరకు కమిటీని ఏర్పాటు చేశారు.నూతన కమిటీలో అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా గడ్డం బాలరాజు, ఉపాధ్యక్షుడిగా ముక్కెర చిరంజీవి, సహాయ కార్యదర్శులుగా ఐలి విజయ్, బొమ్మ అశోక్, భైరి సుధీర్ కుమార్, కోశాధికారిగా ఎం.డి. జమాలుద్దీన్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా బెజ్జంకి రాజేందర్, రజనీకాంత్, తాళ్ల రవి, చుక్క సతీష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శి పంచమనేని భాస్కరరావు మాట్లాడుతూ తమపై విశ్వాసం ఉంచి ఎన్నుకున్న జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తామని, మండలంలోని పాత్రికేయులు ఎదుర్కొనే సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావాలని కోరారు. వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. అలాగే మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు నూతన ప్రెస్ క్లబ్ కమిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.