ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేసిన సర్పంచ్
*ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణి*
అక్షర దర్బార్, మొగుళ్లపల్లి: మొగుళ్ళపల్లి
మండల కేంద్రంలో జాతీయ ఉపాధి హామీ కూలీలకు సోమవారం మొగుళ్ళపల్లి గ్రామ సర్పంచ్ చాట్ల విజయ రవీందర్,మజ్జిగ ప్యాకెట్లను కూలీలకు పంపిణి చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా మొగుళ్ళపల్లి ఎంపిడిఓ సురేందర్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ.ఉపాధి హామీ కూలీలు పని ప్రదేశంలో ఉపాధి హామీ సిబ్బంది సూచించిన కొలతల ప్రకారం కూళీలు పనులు చేస్తే ప్రభుత్వం నిర్ణయించిన ధర కుళిలందరికి వస్తాయని పని ప్రదేశంలో ఏర్పాటు చేసిన ప్రధమ శికిత్సకు సంబందించిన కిట్స్, కూలీలకు త్రాగు నీరు, చలువ పందిళ్ళును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో మాధవి, టెక్నికల్ అసిస్టెంట్ శ్రావణ్, తిప్పారపు రాము, పంచాయతీ కార్యదర్శి నరేష్
, ఉప సర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు కోటేశ్వరరావు, వార్డు మెంబర్లు, తిప్పారపు మమత రాజు, తిప్పారపు బుచ్చక్క బుచ్చయ్య, గుడిమల్ల జయసుధ రమేష్, నాయకులు క్యాతరాజు రమేష్, ఎల్దండి ప్రకాష్, దేవనూరి కుమారస్వామి, గ్రామపంచాయతీ పాలకవర్గం, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.