అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను
2 ఎకరాల 20 గుంటల పంట దగ్ధం
తల్లడిల్లుతున్న రైతు కుటుంబం
అక్షర దర్బార్,నడికూడ:
నడికూడ మండలంలోని కంటత్మకూర్ గ్రామంలో రైతుకు చెందిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. గ్రామానికి చెందిన ఆకుల సుదర్శన్ తండ్రి గౌరయ్యకు చెందిన 2 ఎకరాల 20 గుంటల మొక్కజొన్న చేను మంగళవారం సాయంత్రం అనుకోకుండా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది.బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, చేతికొచ్చే సమయంలో పంట మొత్తం దగ్ధం కావడంతో తీవ్ర నష్టపోయామని వాపోయారు. గత వర్షాకాలంలో పంటలు దెబ్బతినడంతో ఈసారి వేసవిలో మొక్కజొన్న సాగు చేశామని, వచ్చిన దిగుబడితో అప్పులు తీర్చుకోవాలని ఆశించామని తెలిపారు. అయితే ఒక్కసారిగా మంటలు వ్యాపించి పంట మొత్తం కాలిపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతును ఆదుకోవాలని గ్రామస్థులు, రైతులు కోరుతున్నారు.