పరకాలకు పారిశుధ్య ముప్పు

పరకాలకు పారిశుధ్య ముప్పు

 పరకాలకు పారిశుధ్య ముప్పు

వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త.. 

స్వైర విహారం చేస్తున్న పందులు.. 

దుర్వాసనతో ప్రజల అవస్థలు.. 

అక్షరదర్బార్,పరకాల:
వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని 22 వార్డుల్లో అనేక ప్రాంతాల్లో చెత్త కుప్పలు పేరుకుపోవడంతో పందులు స్వైర విహారం చేస్తున్నాయని, దీంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.
ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల సమీపంలో చెత్త పేరుకుపోవడంతో పందులు గుంపులుగా తిరుగుతున్నాయని, అక్కడి నుంచి వెళ్లే విద్యార్థులు, ప్రజలు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. వర్షాల కారణంగా చెత్త నుంచి దుర్గంధం వెదజల్లుతుండడంతో పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, చెత్తను సకాలంలో తొలగించడం, కాలువలను శుభ్రం చేయడం వంటి చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పట్టణవాసులు కోరుతున్నారు.

Tags:

పరకాలకు పారిశుధ్య ముప్పు

  పరకాలకు పారిశుధ్య ముప్పు వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త..  స్వైర విహారం చేస్తున్న పందులు..  దుర్వాసనతో ప్రజల అవస్థలు..  అక్షరదర్బార్,పరకాల:వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య...
Read More...
పరకాలకు పారిశుధ్య ముప్పు

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ