నిషేధిత కలుపు మందు స్వాధీనం
- పరకాలలో విజిలెన్స్ దాడులు..
- 150 లీటర్ల స్పీడ్ పారాక్వాట్ పట్టివేత
నిషేధిత కలుపు మందు స్వాధీనం
- పరకాలలో విజిలెన్స్ దాడులు..
- 150 లీటర్ల స్పీడ్ పారాక్వాట్ పట్టివేత
అక్షరదర్బార్, పరకాల:
పరకాల పట్టణంలోని ఓ ఎరువులు, పురుగుమందుల దుకాణంలో నిషేధిత కలుపు మందును విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని లక్ష్మీ ఏజెన్సీలో నిల్వ ఉంచిన సుమారు 150 లీటర్ల స్పీడ్ పారాక్వాట్ (పారాకుట్) మందును అధికారులు తనిఖీల సందర్భంగా గుర్తించి పట్టుకున్నట్లు సమాచారం.భూమి సారంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు రైతుల ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉందన్న కారణాలతో ప్రభుత్వం ఈ మందు విక్రయాలు, వినియోగంపై నిషేధం విధించింది. అయినప్పటికీ కొందరు వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘిస్తూ రహస్యంగా విక్రయాలు కొనసాగిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలిసింది.పట్టణంలోని ఇతర ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లోనూ సమగ్ర తనిఖీలు చేపడితే మరింత పరిమాణంలో నిషేధిత మందులు బయటపడే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఘటనపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.