4.45 గంటల పర్యటన

4.45 గంటల పర్యటన


- మధ్యాహ్నం 3 మూడు గంటలకు కాళేశ్వరం చేరుకోనున్న సీఎం 
- శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం అనంతరం మేడిగడ్డకు 
- సాయంత్రం 6.30 గంటలకు నస్తురుపల్లి వద్ద సభలో రైతు భరోసా నిధుల విడుదల

4.45 గంటల పర్యటన 
- మధ్యాహ్నం 3 మూడు గంటలకు కాళేశ్వరం చేరుకోనున్న సీఎం 
- శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం అనంతరం మేడిగడ్డకు 
- సాయంత్రం 6.30 గంటలకు నస్తురుపల్లి వద్ద సభలో రైతు భరోసా నిధుల విడుదల

అక్షరదర్బార్, కాటారం: రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి 20వ తేదీ సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన జిల్లాలో 4.45 గంటల పాటు కొనసాగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లాలోని కాళేశ్వరం చేరుకునే సీఎం రేవంత్ రెడ్డి కాటారం మండలంలోని మస్తురిపల్లి వద్ద జరిగే బహిరంగ సభ ముగిసిన తర్వాత రాత్రి 7:45 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన షెడ్యూల్ ఆదివారం విడుదలైంది. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి..

మధ్యాహ్నం 1.45 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తమ నివాసం నుంచి బయలుదేరి 2.00 గంటలకు బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 3.00 గంటలకు కాళేశ్వరం ఆలయానికి చేరుకుంటారు.
3.05 నుండి 3.25 గంటల మధ్య శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం చేసి, ఆలయంలో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.
3.30 గంటలకు కాళేశ్వరం నుంచి బయలుదేరి 3.45 గంటలకు మహాదేవపూర్ మండలం మేడిగడ్డకు చేరుకుంటారు. అక్కడ 3.45 నుండి 4.30 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతాన్ని పరిశీలిస్తారు.
4.35 నుండి 5.30 గంటల వరకు అంబట్‌పల్లి గెస్ట్ హౌస్‌లో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం 5.35 నుండి 6.00 గంటల వరకు మీడియా సమావేశంలో పాల్గొంటారు.
6.00 గంటలకు మేడిగడ్డ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 6.30 గంటలకు కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ 6.30 నుండి 7.45 గంటల వరకు  రైతు భరోసా పథకం రెండో విడత నిధులను విడుదల చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ ముగిసిన తర్వాత రాత్రి 7.45 గంటలకు నస్తూరుపల్లి నుంచి బయలుదేరి రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుంటారు.IMG-20260419-WA0008

Tags:

తప్పిన పెను ప్రమాదం...

తప్పిన పెను ప్రమాదం... లారీ తాకి తెగిన సర్వీస్ వైరు... డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అక్షరదర్బార్, పరకాల:పరకాల పట్టణంలోని బస్టాండ్ వెనుక కాలనీలో ఆదివారం ప్రమాదం...
Read More...
తప్పిన పెను ప్రమాదం...

4.45 గంటల పర్యటన

- మధ్యాహ్నం 3 మూడు గంటలకు కాళేశ్వరం చేరుకోనున్న సీఎం - శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం అనంతరం మేడిగడ్డకు - సాయంత్రం 6.30 గంటలకు...
వార్తలు 
Read More...
4.45 గంటల పర్యటన

ఈత సరదా ప్రాణం తీసింది..

ఈత సరదా ప్రాణం తీసింది..    చలివాగు ప్రాజెక్టు కాలువలో వ్యక్తి గల్లంతు      హెచ్చరికలు లెక్కచేయని యువకులు    అక్షరదర్బార్, శాయంపేట: శాయంపేట మండలం జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు వద్ద...
Read More...
ఈత సరదా ప్రాణం తీసింది..

ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు

- ఐదుగురి అరెస్ట్, రూ.లక్షకుపైగా నగదు సీజ్- ముగ్గురు పరారీ 
క్రైమ్ 
Read More...
ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు

భర్త హత్యకు రూ.5 లక్షల సుపారీ

- హత్య చేసి వీడియో తీసిన కిరాయి హంతకులు - ప్రియుడు తమ్ముడు తో కలిసి భర్తను అంతం చేసిన ఇల్లాలు- భర్తను చంపాక తగులబెట్టి.....
క్రైమ్ 
Read More...
భర్త హత్యకు రూ.5 లక్షల సుపారీ