జీడబ్ల్యూఎంసీ కమిషనర్గా వెంకన్న
- ఆయన స్వస్థలం మరిపెడ
- అదనపు బాధ్యతల నుంచి కలెక్టర్ రిలీవ్
జీడబ్ల్యూఎంసీ కమిషనర్గా వెంకన్న
- ఆయన స్వస్థలం మరిపెడ
- అదనపు బాధ్యతల నుంచి కలెక్టర్ రిలీవ్
అక్షరదర్బార్, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బదిలీ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం హెచ్ఎండీఏలో కోర్ అర్బన్ రీజియన్, మెట్రో రైల్ విభాగం జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న టి వెంకన్న ను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) మున్సిపల్ కమిషనర్గా బదిలీ చేస్తూ నియమించింది. ఈ మేరకు ఇప్పటి వరకు జీడబ్ల్యూఎంసీ మున్సిపల్ కమిషనర్ పదవికి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయిని ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన కమిషనర్ టి వెంకన్న త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. వెంకన్న స్వస్థలం మహబూబాబాద్ జిల్లా మరిపెడ. 2007లో గ్రూప్-1 అధికారిగా మున్సిపల్ కమిషనర్ గా ఎంపికయ్యారు. ఇప్పటివరకు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గా ఐఏఎస్ అధికారులను నియమించిన ప్రభుత్వం తాజాగా గ్రూప్ -1 అధికారిని నియమించటం చర్చనీయమైంది.