వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

కాంట వేసి 10 రోజులు దాటినా ఖాతాల్లో జమ కాని చెల్లింపులు

ట్యాబ్‌లో నమోదు ఆలస్యం, ఒటీపీ సమాచారం లేక రైతుల ఆందోళన

ఎరువులు, విత్తనాల కొనుగోలుకు ఇబ్బందులు

అక్షరదర్బార్, శాయంపేట:
వరిధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపుల జాప్యం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. శాయంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మి 9 నుంచి 10 రోజులు గడిచినా ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.రైతుల వివరాల ప్రకారం, ధాన్యం కొనుగోలు అనంతరం కేంద్రాల ఇన్‌చార్జీలు ట్యాబ్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉండగా, కొన్ని కేంద్రాల్లో ఈ ప్రక్రియ పూర్తికాలేదని చెబుతున్నారు. వివరాలు నమోదు చేసినా ఒటీపీ సంబంధిత సమాచారాన్ని రైతులకు తెలియజేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో చెల్లింపుల ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. మరోవైపు, రుతుపవనాల రాక సమీపిస్తున్న నేపథ్యంలో సాగు సన్నాహకాలకు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాల్సి ఉన్నా చేతిలో నగదు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం అమ్మిన సొమ్ము సమయానికి అందకపోవడం వల్ల వ్యవసాయ పనులు ప్రభావితమవుతున్నాయని వాపోతున్నారు.

అధికారులు స్పందించాలంటున్న రైతులు

ఐకేపీ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల రికార్డులను ఉన్నతాధికారులు తనిఖీ చేసి, ధాన్యం కొనుగోలు వివరాల నమోదులో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:

తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!

తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ! పీఎం శ్రీ నిధుల ఖర్చుపై వివాదం..   పరస్పరం ఆరోపణలు..  పోలీసులకు ఫిర్యాదు చేసిన హెడ్మాస్టర్ అక్షరదర్బార్, నడికూడ: సమాజంలో గౌరవప్రదమైన వృత్తిగా...
Read More...
తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!

సేవా కార్యక్రమాలతో ఇనగాల జన్మదిన వేడుకలు

సేవా కార్యక్రమాలతో ఇనగాల జన్మదిన వేడుకలు రక్తదాన శిబిరంలో 132 మంది రక్తదానం..  రక్తదాతలకు టీ-షర్టుల పంపిణీ..   ఘనంగా అన్నదానం అక్షరదర్బార్,పరకాల: హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల...
Read More...
సేవా కార్యక్రమాలతో ఇనగాల జన్మదిన వేడుకలు

పరకాలను అభివృద్ధి చేయాలి

పరకాలను అభివృద్ధి చేయాలి సీఎం సభకు రూ.30 లక్షలు ఖర్చు..  పరకాల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రశ్నించిన ఎమ్మెల్సీ పోచంపల్లి...
Read More...
పరకాలను అభివృద్ధి చేయాలి

ప్రశ్నించటమే నా బలం

- విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల్లో ఉన్న.. నిర్బంధాలే నన్ను నిలబెట్టాయి- అప్పట్లో నా రాజకీయ గురువు సుధాకర్ గాంధీ- కాంగ్రెసే నా...
రాజకీయం 
Read More...
ప్రశ్నించటమే నా బలం

హైకమాండ్ ను బ్లాక్‌మెయిల్‌ చేశారు

- పట్టుబట్టి నన్ను బర్తరఫ్‌ చేయించారు- సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ ఆరోపణలు - తన కుమార్తె వ్యాఖ్యలకు నన్నెలా బాధ్యురాలిని చేస్తారని నిలదీత...
రాజకీయం 
Read More...
హైకమాండ్ ను బ్లాక్‌మెయిల్‌ చేశారు