వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

కాంట వేసి 10 రోజులు దాటినా ఖాతాల్లో జమ కాని చెల్లింపులు

ట్యాబ్‌లో నమోదు ఆలస్యం, ఒటీపీ సమాచారం లేక రైతుల ఆందోళన

ఎరువులు, విత్తనాల కొనుగోలుకు ఇబ్బందులు

అక్షరదర్బార్, శాయంపేట:
వరిధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపుల జాప్యం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. శాయంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మి 9 నుంచి 10 రోజులు గడిచినా ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.రైతుల వివరాల ప్రకారం, ధాన్యం కొనుగోలు అనంతరం కేంద్రాల ఇన్‌చార్జీలు ట్యాబ్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉండగా, కొన్ని కేంద్రాల్లో ఈ ప్రక్రియ పూర్తికాలేదని చెబుతున్నారు. వివరాలు నమోదు చేసినా ఒటీపీ సంబంధిత సమాచారాన్ని రైతులకు తెలియజేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో చెల్లింపుల ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. మరోవైపు, రుతుపవనాల రాక సమీపిస్తున్న నేపథ్యంలో సాగు సన్నాహకాలకు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాల్సి ఉన్నా చేతిలో నగదు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం అమ్మిన సొమ్ము సమయానికి అందకపోవడం వల్ల వ్యవసాయ పనులు ప్రభావితమవుతున్నాయని వాపోతున్నారు.

అధికారులు స్పందించాలంటున్న రైతులు

ఐకేపీ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల రికార్డులను ఉన్నతాధికారులు తనిఖీ చేసి, ధాన్యం కొనుగోలు వివరాల నమోదులో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:

వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు కాంట వేసి 10 రోజులు దాటినా ఖాతాల్లో జమ కాని చెల్లింపులు ట్యాబ్‌లో నమోదు ఆలస్యం, ఒటీపీ సమాచారం లేక...
Read More...
వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

గంజాయి చాక్లెట్ల కలకలం

- ఒడిశా కేటుగాడి అరెస్ట్- ఎంజీఎం సర్కిల్ వద్ద పట్టుకున్న పోలీసులు..- 72 'సెవెన్ మైనర్ వతి' చాక్లెట్లు స్వాధీనం
క్రైమ్ 
Read More...
గంజాయి చాక్లెట్ల కలకలం

ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!

ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌! అక్షరదర్బార్,శాయంపేట:  గ్రామంలో తరచూ ఎదురవుతున్న విద్యుత్‌ సమస్యలను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో ఉపసర్పంచ్‌ సాయికృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు.
Read More...
ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!

ఫోన్ కాల్.. ఆపై మృతి!

ఫోన్ కాల్.. ఆపై మృతి! పరకాలలో యువకుడి అనుమానాస్పద మరణం.. హత్యేనని కుటుంబ సభ్యుల ఆరోపణ అక్షరదర్బార్, పరకాల: నడికూడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మమ్మద్...
Read More...
ఫోన్ కాల్.. ఆపై మృతి!

పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్

పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్ అంజయ్య బదిలీ..  అక్షరదర్బార్,పరకాల:పరకాల మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా గ్రూప్-1 అధికారి పోతరాజు పవన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు కమిషనర్‌గా...
Read More...
పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్