సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

- హనుమకొండ కాంగ్రెస్ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ ధర్నా 
- బండి సంజయ్ తనయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్

సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం 
- హనుమకొండ కాంగ్రెస్ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ ధర్నా 
- బండి సంజయ్ తనయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్

అక్షరదర్బార్, హనుమకొండ: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి సాయి భగీరథ్ ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనను నిరసిస్తూ, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ కాంగ్రెస్ భవన్ కూడలి వద్ద భారీ ధర్నా నిర్వహించారు. హనుమకొండ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని, బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ తన కుమారుడు చేసిన అకృత్యానికి నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ వెంటనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. లేనిపక్షంలో ప్రధాని మోదీ ఆయన్ను వెంటనే మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని అన్నారు. సాధారణ పౌరులపై పోక్సో కేసు నమోదైతే వెంటనే అరెస్టు చేసే పోలీసులు, కేంద్ర మంత్రి కుమారుడు కాబట్టే విచారణలో జాప్యం చేస్తున్నారా? అని ఆమె ప్రశ్నించారు. బండి సంజయ్ హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నంత కాలం పోలీసులపై ఒత్తిడి ఉంటుందని, బాధితురాలికి న్యాయం జరగదని ఆవేదన వ్యక్తం చేశారు.'బేటీ బచావో - బేటీ పడావో' అనేది బీజేపీకి కేవలం ఎన్నికల నినాదమే తప్ప, ఆచరణలో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా బీజేపీకి చెందిన 44 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై అత్యాచార, వేధింపుల కేసులు ఉన్నా పార్టీ వారికి రక్షణ కల్పిస్తోందని ధ్వజమెత్తారు. వేధింపులు తాళలేక బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసే స్థాయికి వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలని, నిందితుడు సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అధికారం అండతో చట్టాన్ని చుట్టంలా మార్చుకోవాలని చూస్తే మహిళా కాంగ్రెస్ ఊరుకోదని, బాధితురాలికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఎర్రబెల్లి స్వర్ణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలు, కార్యకర్తలు పాల్గొని ప్లకార్డులతో నిరసన తెలిపారు.

Tags:

వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు కాంట వేసి 10 రోజులు దాటినా ఖాతాల్లో జమ కాని చెల్లింపులు ట్యాబ్‌లో నమోదు ఆలస్యం, ఒటీపీ సమాచారం లేక...
Read More...
వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

గంజాయి చాక్లెట్ల కలకలం

- ఒడిశా కేటుగాడి అరెస్ట్- ఎంజీఎం సర్కిల్ వద్ద పట్టుకున్న పోలీసులు..- 72 'సెవెన్ మైనర్ వతి' చాక్లెట్లు స్వాధీనం
క్రైమ్ 
Read More...
గంజాయి చాక్లెట్ల కలకలం

ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!

ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌! అక్షరదర్బార్,శాయంపేట:  గ్రామంలో తరచూ ఎదురవుతున్న విద్యుత్‌ సమస్యలను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో ఉపసర్పంచ్‌ సాయికృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు.
Read More...
ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!

ఫోన్ కాల్.. ఆపై మృతి!

ఫోన్ కాల్.. ఆపై మృతి! పరకాలలో యువకుడి అనుమానాస్పద మరణం.. హత్యేనని కుటుంబ సభ్యుల ఆరోపణ అక్షరదర్బార్, పరకాల: నడికూడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మమ్మద్...
Read More...
ఫోన్ కాల్.. ఆపై మృతి!

పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్

పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్ అంజయ్య బదిలీ..  అక్షరదర్బార్,పరకాల:పరకాల మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా గ్రూప్-1 అధికారి పోతరాజు పవన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు కమిషనర్‌గా...
Read More...
పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్