వడదెబ్బతో వ్యక్తి మృతి
శాయంపేట, అక్షర దర్బార్:
భానుడి భగభగలతో మండిపోతున్న ఎండలు మరో ప్రాణాన్ని బలితీసుకున్నాయి. శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల సదాశివుడు (70) వడదెబ్బకు మంగళవారం మృతి చెందాడు.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సదాశివుడు మధ్యాహ్నం భోజనం చేసి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా కొద్దిసేపటి తర్వాత అపస్మారక స్థితిలో కనిపించాడు. ఎంత పిలిచినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఎండ తీవ్రతను తట్టుకోలేక నోరు ఆరిపోవడంతో వడదెబ్బ కారణంగానే మృతి చెందినట్లు వారు భావిస్తున్నారు.సదాశివుడు మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మండలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.