వడదెబ్బతో వ్యక్తి మృతి..

వడదెబ్బతో వ్యక్తి మృతి..

వడదెబ్బతో వ్యక్తి మృతి

శాయంపేట, అక్షర దర్బార్: 
భానుడి భగభగలతో మండిపోతున్న ఎండలు మరో ప్రాణాన్ని బలితీసుకున్నాయి. శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల సదాశివుడు (70) వడదెబ్బకు మంగళవారం మృతి చెందాడు.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సదాశివుడు మధ్యాహ్నం భోజనం చేసి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా కొద్దిసేపటి తర్వాత అపస్మారక స్థితిలో కనిపించాడు. ఎంత పిలిచినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఎండ తీవ్రతను తట్టుకోలేక నోరు ఆరిపోవడంతో వడదెబ్బ కారణంగానే మృతి చెందినట్లు వారు భావిస్తున్నారు.సదాశివుడు మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మండలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.

Tags:

నిషేధిత కలుపు మందు స్వాధీనం

- పరకాలలో విజిలెన్స్ దాడులు..  - 150 లీటర్ల స్పీడ్ పారాక్వాట్ పట్టివేత
వార్తలు 
Read More...
నిషేధిత కలుపు మందు స్వాధీనం

వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు కాంట వేసి 10 రోజులు దాటినా ఖాతాల్లో జమ కాని చెల్లింపులు ట్యాబ్‌లో నమోదు ఆలస్యం, ఒటీపీ సమాచారం లేక...
Read More...
వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

గంజాయి చాక్లెట్ల కలకలం

- ఒడిశా కేటుగాడి అరెస్ట్- ఎంజీఎం సర్కిల్ వద్ద పట్టుకున్న పోలీసులు..- 72 'సెవెన్ మైనర్ వతి' చాక్లెట్లు స్వాధీనం
క్రైమ్ 
Read More...
గంజాయి చాక్లెట్ల కలకలం

ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!

ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌! అక్షరదర్బార్,శాయంపేట:  గ్రామంలో తరచూ ఎదురవుతున్న విద్యుత్‌ సమస్యలను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో ఉపసర్పంచ్‌ సాయికృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు.
Read More...
ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!

ఫోన్ కాల్.. ఆపై మృతి!

ఫోన్ కాల్.. ఆపై మృతి! పరకాలలో యువకుడి అనుమానాస్పద మరణం.. హత్యేనని కుటుంబ సభ్యుల ఆరోపణ అక్షరదర్బార్, పరకాల: నడికూడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మమ్మద్...
Read More...
ఫోన్ కాల్.. ఆపై మృతి!