అలియాబాద్లో చలివేంద్రం ప్రారంభం
అలియాబాద్లో చలివేంద్రం ప్రారంభం
విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేసిన సర్పంచ్ సనత్..
ముఖ్య అతిథిగా ఎస్సై పవన్
అక్షరదర్బార్, పరకాల:
పరకాల మండలం అలియాబాద్ గ్రామంలో గ్రామ ప్రజలు, బాటసారుల సౌకర్యార్థం శాతరాసి సుధాకర్ రావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గ్రామ సర్పంచ్ శాతరాశి సనత్ కుమార్ పటేల్ ఆధ్వర్యంలో పరకాల ఎస్సై పవన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ను అందజేశారు. సర్పంచ్ సనత్ కుమార్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. వేసవి కాలంలో పాఠశాలలు లేక విద్యార్థులు ఈతలకు పోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారని , మొబైల్ ఫోన్లకు అలవాటు పడకుండా క్రీడలపై ఆసక్తి పెంచేందుకు స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రతిరోజూ విద్యార్థులతో కలిసి తాను కూడా మైదానంలో పాల్గొంటానని పేర్కొన్నారు.
అలియాబాద్ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, గ్రామ ప్రజల సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.