ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
- ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకున్న డ్రైవర్
- వరంగల్ జిల్లా నర్సంపేట బస్ స్టేషన్ వద్ద ఘటన
- సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆత్మహత్యాయత్నం
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్
ఆత్మహత్యాయత్నం!
-నర్సంపేట డిపో వద్ద ఉద్రిక్తత.
-రంగంలో దిగిన పోలీసులు.
అక్షరదర్బార్ ,నర్సంపేట; వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు గత రెండు రోజుల నుండి చేపట్టిన నిరసన ప్రదర్శన ఒక్కసారిగా నర్సంపేట డిపో వద్ద హింసాత్మకంగా మారింది. ఆర్టీసీ యాజమాన్యం మరియు అధికారుల మొండి వైఖరిని నిరసిస్తూ నర్సంపేట డిపోకు చెందిన శంకర్ గౌడ్ అనే డ్రైవర్ అందరూ చూస్తుండగానే తన ఒంటికి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం కలకలం రేపింది. గురువారం తమ డిమాండ్ల సాధన కోసం నర్సంపేట డిపో కార్మికులు సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా డిపో గేటు ముందు భారీ ధర్నా చేపట్టారు. నిరసన హోరెత్తుతున్న సమయంలో, తీవ్ర మనస్తాపానికి గురైన డ్రైవర్ శంకర్ గౌడ్ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. క్షణాల్లో మంటలు చెలరేగడంతో తోటి కార్మికులు హతాశులయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పివేసి, బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన కార్మికులు యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరసనకారులను నిలువరిస్తున్నారు. ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాయపడిన శంకర్ గౌడ్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అధికారుల వేధింపులు మరియు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ అఘాయిత్యం జరిగిందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.