ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

  • ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకున్న డ్రైవర్
  • వరంగల్ జిల్లా నర్సంపేట బస్ స్టేషన్ వద్ద ఘటన
  • సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆత్మహత్యాయత్నం

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్
 ఆత్మహత్యాయత్నం!
-నర్సంపేట డిపో వద్ద ఉద్రిక్తత.
-రంగంలో దిగిన పోలీసులు.
అక్షరదర్బార్ ,నర్సంపేట; వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు గత రెండు రోజుల నుండి చేపట్టిన నిరసన ప్రదర్శన ఒక్కసారిగా నర్సంపేట డిపో వద్ద హింసాత్మకంగా మారింది. ఆర్టీసీ యాజమాన్యం మరియు అధికారుల మొండి వైఖరిని నిరసిస్తూ నర్సంపేట డిపోకు చెందిన శంకర్ గౌడ్ అనే డ్రైవర్ అందరూ చూస్తుండగానే తన ఒంటికి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం కలకలం రేపింది. గురువారం తమ డిమాండ్ల సాధన కోసం నర్సంపేట డిపో కార్మికులు సమ్మె చేప‌ట్టారు. ఇందులో భాగంగా  డిపో గేటు ముందు భారీ ధర్నా చేపట్టారు. నిరసన హోరెత్తుతున్న సమయంలో, తీవ్ర మనస్తాపానికి గురైన డ్రైవర్ శంకర్ గౌడ్ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. క్షణాల్లో మంటలు చెలరేగడంతో తోటి కార్మికులు హతాశులయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పివేసి, బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన కార్మికులు యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరసనకారులను నిలువరిస్తున్నారు. ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాయపడిన శంకర్ గౌడ్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.  అధికారుల వేధింపులు మరియు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ అఘాయిత్యం జరిగిందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

Tags:

పరకాలకు పారిశుధ్య ముప్పు

  పరకాలకు పారిశుధ్య ముప్పు వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త..  స్వైర విహారం చేస్తున్న పందులు..  దుర్వాసనతో ప్రజల అవస్థలు..  అక్షరదర్బార్,పరకాల:వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య...
Read More...
పరకాలకు పారిశుధ్య ముప్పు

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ