షార్ట్సర్క్యూట్తో మొక్కజొన్న చేనులలో మంటలు
గాలి బీభత్సం..
షార్ట్సర్క్యూట్తో మొక్కజొన్న చేనులలో మంటలు
హుస్సేన్పల్లి శివారులో రైతుల్లో ఆందోళన..
అదుపులోకి రాని అగ్నిజ్వాలలు
అక్షరదర్బార్, శాయంపేట:
శాయంపేట మండలంలోని హుస్సేన్పల్లి గ్రామ శివారులో హనుమాన్ టెంపుల్ ప్రాంతంలో ఆదివారం గాలి బీభత్సానికి విద్యుత్ తీగలు తాకి షార్ట్సర్క్యూట్ ఏర్పడటంతో మొక్కజొన్న చేనుల్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు గాలికి వేగంగా వ్యాపించి పంటచేలను ఆవరించాయి.ఈ ప్రాంతంలో కొంతమంది రైతుల మొక్కజొన్న పంట ఇంకా కోతకు రాకపోవడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. స్థానిక రైతులు, గ్రామస్థులు కలిసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ గాలివేగం కారణంగా మంటలు అదుపులోకి రావడం లేదని తెలిపారు.ఆరుగాలం శ్రమించి పండించిన పంట అగ్నికి ఆహుతి అయితే తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తేవాలని గ్రామస్థులు కోరుతున్నారు.