సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
27 మందికి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
పేద ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు సీఎం సహాయ నిధి
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
అక్షరదర్బార్, శాయంపేట:
శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం నిర్వహించిన సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) 30వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 27 మంది లబ్ధిదారులకు రూ.6,85,500 విలువైన చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో కవర్ కాని వైద్య చికిత్సలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు.
నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద రోగులు ఆసుపత్రి నుంచి ఎస్టిమేషన్ కాపీ సమర్పిస్తే ప్రభుత్వం ఎల్ఓసీ మంజూరు చేసి చికిత్సకు అవసరమైన సహాయాన్ని అందిస్తోందని చెప్పారు. పేద ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.