పెద్ది విగ్రహం తొలగింపు
- నర్సంపేటలో భారీగా పోలీసుల మోహరింపు.. ఉద్రిక్తత
- బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్
పెద్ది విగ్రహం తొలగింపు
- నర్సంపేటలో భారీగా పోలీసుల మోహరింపు.. ఉద్రిక్తత
- బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్
అక్షరదర్బార్ నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేటలో దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రభుత్వ వర్గాలు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించినట్లు తెలిసింది. భారీ భారీ పోలీసు బందోబస్తు మధ్య పెద్ది విగ్రహం తొలగింపు జరిగినట్లు సమాచారం. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు నర్సంపేటకు చేరుకునే అవకాశం ఉన్న దృష్ట్యా పోలీసులు ముందు జాగ్రత్తగా నర్సంపేట, పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేసినట్లు తెలిసింది.