సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి
సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి
తెలంగాణ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి
గుజ్జల ప్రేమేందర్రెడ్డి
అక్షరదర్బార్,పరకాల:
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జల ప్రేమేందర్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పరకాల బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ చేపట్టిన పోలీసు చర్య అనంతరం హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైందన్నారు. తెలంగాణ చరిత్ర, ఉద్యమాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చి విద్యార్థులకు బోధించాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎంఐఎంతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ పగడాల కాళీప్రసాద్రావు మాట్లాడుతూ.. రజాకారుల దాడులు, అకృత్యాలను చరిత్రలో గుర్తుంచుకోవాలని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కాలేదని విమర్శించారు. పరకాలకు వైద్య కళాశాల ఎవరూ తీసుకొచ్చినా స్వాగతిస్తామని, గత పదేళ్లలో ఎందుకు ఏర్పాటు కాలేదని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ప్రశ్నించారు. కార్యక్రమంలో పరకాల మున్సిపల్ కౌన్సిలర్లు కుక్కల విజయకుమార్, బెజ్జంకి పూర్ణ చారి, ఆకుల లావణ్య శ్రీధర్, జిల్లా కోశాధికారి ఎర్రం రామన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి, దంచనాధుల కిరణ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మార్త రాజభద్రయ్య,ఓబీసీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి ఉడుత చిరంజీవి,జిల్లా నాయకులు బాసాని సోమరాజు, బీసీ మోర్చా మండల అధ్యక్షులు పైండ్ల రంజిత్, నాయకులు కోడెల లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.