దొంగతనం కేసు ఛేదన

దొంగతనం కేసు ఛేదన

ఆరుగురు నిందితుల అరెస్టు..

రూ.1.50 లక్షల నగదు స్వాధీనం

అక్షరదర్బార్, కాళేశ్వరం:
గత ఏడాది నిర్వహించిన సరస్వతీ పుష్కరాల సందర్భంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన టెంట్ సిటీలోని ఎనిమిది ఏసీ ఔటర్ యూనిట్లు దొంగిలించిన కేసును కాళేశ్వరం పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. టెంట్ సిటీ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 59/2025 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా కాళేశ్వరం గ్రామానికి చెందిన మహేందర్, నారాయణ, జావేద్, సమ్మయ్య, సృజన్, సాయిలను అదుపులోకి తీసుకుని విచారించగా, టెంట్ సిటీలో ఏర్పాటు చేసిన ఎనిమిది ఏసీ ఔటర్ యూనిట్లను దొంగిలించినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దొంగిలించిన ఏసీ ఔటర్ యూనిట్లను గుర్తు తెలియని వ్యక్తికి విక్రయించి పొందిన రూ.1.50 లక్షల నగదును నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఎస్‌ఐ, సిబ్బందికి అభినందనలు

కేసును వేగంగా ఛేదించి నిందితులను గుర్తించి అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన కాళేశ్వరం ఎస్‌ఐ తమాషా రెడ్డి, పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

Tags:

భర్త హత్యకు భార్య స్కెచ్

- రూ.4 లక్షల సుపారీ- సింగారం మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేధన- యాకయ్య మృతి వెనుక అసలు నిజాలు బయటపెట్టిన...
క్రైమ్ 
Read More...
భర్త హత్యకు భార్య స్కెచ్

దొంగతనం కేసు ఛేదన

దొంగతనం కేసు ఛేదన ఆరుగురు నిందితుల అరెస్టు.. రూ.1.50 లక్షల నగదు స్వాధీనం అక్షరదర్బార్, కాళేశ్వరం: గత ఏడాది నిర్వహించిన సరస్వతీ పుష్కరాల సందర్భంగా భక్తుల కోసం...
Read More...
దొంగతనం కేసు ఛేదన

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

27 మందికి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ పేద ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు సీఎం సహాయ నిధి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు...
Read More...
సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి దారుణ హత్య

ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి దారుణ హత్య షాప్ మూసి ఇంటికి వెళ్తుండగా ఘటన.. పరారీలో నిందితుడు  అక్షరదర్బార్, రేగొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో...
Read More...
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి దారుణ హత్య

మహిళా ఉద్యోగులకు వేధింపులు

మహిళా ఉద్యోగులకు వేధింపులు  - ఓ ప్రభుత్వ కార్యాలయంలో కలకలం - ఉన్నతాధికారిపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం అక్షరదర్బార్, హనుమకొండ: హనుమకొండ జిల్లా డివిజన్‌లోని ఓ...
Read More...
మహిళా ఉద్యోగులకు వేధింపులు