ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి దారుణ హత్య
ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి దారుణ హత్య
షాప్ మూసి ఇంటికి వెళ్తుండగా ఘటన..
పరారీలో నిందితుడు
అక్షరదర్బార్, రేగొండ:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని రంగయ్యపల్లి గ్రామానికి చెందిన జట్టి శ్రావణ్ (35) మండల కేంద్రంలో వైన్స్ షాప్ ఎదుట ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి సుమారు 10 గంటలకు షాప్ మూసి ఇంటికి వెళ్తుండగా మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు అతనిపై దాడి చేసి హత్య చేసినట్లు ఎస్సై దాసరి సుధాకర్ తెలిపారు. హత్యకు గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు ఘటన అనంతరం పరారైనట్లు తెలిపారు. మృతుడు శ్రావణ్కు భార్య మౌనిక, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు.