ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
- ఐదుగురి అరెస్ట్, రూ.లక్షకుపైగా నగదు సీజ్
- ముగ్గురు పరారీ
ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
- ఐదుగురి అరెస్ట్, రూ.లక్షకుపైగా నగదు సీజ్
- ముగ్గురు పరారీ
అక్షరదర్బార్, వరంగల్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల నేపథ్యంలో సాగుతున్న ఆన్లైన్ బెట్టింగ్లపై వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఒక నిర్వాహకుడితో పాటు నలుగురు పందెం రాయుళ్లను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఏ. మధుసూదన్ నేతృత్వంలోని బృందం దాడులు నిర్వహించింది. *Cricxbet.99.win* మరియు *Bsf2020.com* వంటి వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక నిర్వాహకుడు, 4 గురు పందెం రాయుళ్లు మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు. ముగ్గురు పరారీలో ఉన్నారు. రూ.1,02,000 నగదు, 5 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
- అరెస్టయిన నిందితుల వివరాలు
నిర్వాహకుడు తాడెం భరత్ వరంగల్ మధ్యకోట నివాసి. ఇతను ప్రధానంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లౌడ్యా వెంకన్నది వరంగల్ ఎస్.ఆర్ నగర్. పైడి శ్రీధర్ వరంగల్ కొత్థవాడ వాసి. వంగ రమేష్ ది వరంగల్ కరీమాబాద్.ములుక శ్రీనివాస్ ది వరంగల్ ఎస్.ఆర్.ఆర్ తోట. ఈ కేసులో సంతోష్ కుమార్ (హన్మకొండ), పూల శ్రీకాంత్ (శంభునిపేట), రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్కు చెందిన మరో నిర్వాహకుడు రావుల దిలీప్ కుమార్ పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
- పోలీసుల హెచ్చరిక
పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదు, ఫోన్లను తదుపరి చర్యల నిమిత్తం మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఏ. మధుసూదన్, ఇన్ స్పెక్టర్ సర్ల రాజు, ఆర్.ఎస్.ఐ భాను ప్రకాష్, సిబ్బంది పాల్గొన్నారు. యువత క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.