దామెరలో గంజాయి పట్టివేత..
దామెరలో గంజాయి పట్టివేత..
210 గ్రాములు స్వాధీనం
ఇద్దరు యువకులు అరెస్ట్
అక్షరదర్బార్, పరకాల:
దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టి ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం 10:30 గంటల సమయంలో ఎస్ఐ కొంక అశోక్ తన సిబ్బందితో కలిసి లాదేల్ల గ్రామ శివారు శ్రీ అన్నపూర్ణ రైస్ మిల్లు సమీపంలోని సిరి క్రషర్ క్రాస్ రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్ లేని మోటార్ సైకిల్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలో వారి వద్ద 210 గ్రాముల గంజాయి లభించడంతో స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు.
పట్టుబడిన వారు మేకల అనిల్ కుమార్ (23), బైరపాక రాజేష్ (19)గా గుర్తించారు. వీరు నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామానికి చెందినవారు. విచారణలో బొల్లికుంట వద్ద బుస్స అరవింద్, ఊకంటి పూర్ణచందర్ రెడ్డి @ సన్నీ రెడ్డి వద్ద గంజాయి కొనుగోలు చేసి తీసుకువస్తున్నట్లు ఒప్పుకున్నారు.
అనంతరం కేసు నమోదు చేసి పరకాల రూరల్ సీఐ పి. రంజిత్ రావు నిందితులను రిమాండ్కు తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.10,000 వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.