దామెరలో గంజాయి పట్టివేత..

దామెరలో గంజాయి పట్టివేత..

దామెరలో గంజాయి పట్టివేత..

210 గ్రాములు స్వాధీనం  

ఇద్దరు యువకులు అరెస్ట్

అక్షరదర్బార్, పరకాల:
దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టి ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం 10:30 గంటల సమయంలో ఎస్‌ఐ కొంక అశోక్ తన సిబ్బందితో కలిసి లాదేల్ల గ్రామ శివారు శ్రీ అన్నపూర్ణ రైస్ మిల్లు సమీపంలోని సిరి క్రషర్ క్రాస్ రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్ లేని మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలో వారి వద్ద 210 గ్రాముల గంజాయి లభించడంతో స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు.
పట్టుబడిన వారు మేకల అనిల్ కుమార్ (23), బైరపాక రాజేష్ (19)గా గుర్తించారు. వీరు నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామానికి చెందినవారు. విచారణలో బొల్లికుంట వద్ద బుస్స అరవింద్, ఊకంటి పూర్ణచందర్ రెడ్డి @ సన్నీ రెడ్డి వద్ద గంజాయి కొనుగోలు చేసి తీసుకువస్తున్నట్లు ఒప్పుకున్నారు.
అనంతరం కేసు నమోదు చేసి పరకాల రూరల్ సీఐ పి. రంజిత్ రావు నిందితులను రిమాండ్‌కు తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.10,000 వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Tags:

దామెరలో గంజాయి పట్టివేత..

దామెరలో గంజాయి పట్టివేత.. 210 గ్రాములు స్వాధీనం   ఇద్దరు యువకులు అరెస్ట్ అక్షరదర్బార్, పరకాల:దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు...
Read More...
దామెరలో గంజాయి పట్టివేత..

బాబు జగ్జీవన్ రామ్ జయంతి ..

  బాబు జగ్జీవన్ రామ్ జయంతి .. పూలమాలలు, కేక్ కట్ చేసి నివాళులర్పించిన నాయకులు పండ్లు పంపిణీ చేసిన వైస్ చైర్ పర్సన్ ఏకు దివ్య అక్షరదర్బార్,...
Read More...
బాబు జగ్జీవన్ రామ్ జయంతి ..

ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు..

ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు అక్షర దర్బార్ కథనంతో మేల్కొన్న అధికారులు   అక్రమ కాంపౌండ్ గోడ కూల్చివేత అక్షరదర్బార్,పరకాల: పట్టణంలోని 15వ వార్డులో ప్రభుత్వ భూమిని అక్రమంగా...
Read More...
ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు..

తహసిల్దార్ల బదిలీ

పదిమంది తహసిల్దార్లు, ముగ్గురు నాయబ్ తహసిల్దార్లకు స్థాన చలనం జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ
వార్తలు 
Read More...
తహసిల్దార్ల బదిలీ

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి..

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి.. అక్షర దర్బార్,నడికూడ: నడికూడ మండలంలోని వరికోలు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై సనుగోజు వనమాల (46) శుక్రవారం సాయంత్రం మృతి చెందారు....
Read More...
విద్యుత్ షాక్‌తో మహిళ మృతి..