బావిలో ముగ్గురు మృతి

బావిలో ముగ్గురు మృతి

  • పూడిక తీస్తుండగా తెగిన క్రేను వైరు
  • ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి 
  • మరొకరికి తీవ్ర గాయాలు 
  • కొరికిశాల గ్రామంలో విషాదం

క్రేన్ వైరు తెగి 
బావిలో ముగ్గురు మృతి 
- మొగుళ్లపల్లి మండలం కొరికిశాల గ్రామంలో ఘటన 

అక్షరదర్బార్, మొగుళ్లపల్లి: భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కొరికిశాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ వైరు తెగి పడటంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను కొరికిశాల గ్రామానికి చెందిన దేవారావు(48), అభిలాష్(16), పిడిసిల్ల గ్రామస్తుడు పైడయ్య(53)గా గుర్తించారు. సుకినె మోహన్ రావు గాయపడ్డారు. ఈ నలుగురు శనివారం మధ్యాహ్నం వ్యవసాయ బావిలో ఉన్న సమయంలో పూడికతీత పనిలో ఉన్న క్రేన్ వైరు తెగి బావిలో పడిపోవడంతో ముగ్గురు దుర్మరణం చెందగా గాయపడిన మోహన్ రావు ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందగానే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో బావిలో నుంచి ముగ్గురు మృతదేహాలను బయటకు తీశారు. మృతుల కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. వేసవి దృష్ట్యా సాగు నీటి కోసం వ్యవసాయ బావిలో నుంచి పూడిక తీసే పనులు చేపట్టగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

Tags:

ఫర్టిలైజర్ షాపులకు బంద్ పిలుపు...

ఫర్టిలైజర్ షాపులకు బంద్ పిలుపు... స్వచ్చందంగా మూసివేతకు డీలర్లకు విజ్ఞప్తి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొలం సత్యనారాయణ రెడ్డి అక్షరదర్బార్, హనుమకొండ:వరంగల్ జిల్లా ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ అండ్...
Read More...
ఫర్టిలైజర్ షాపులకు బంద్ పిలుపు...

ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల నాగుర్ల దిగ్భ్రాంతి

డ్రైవర్ మృతి పట్ల నాగుర్ల దిగ్భ్రాంతి ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శలు   కుటుంబానికి రూ.1 కోటి, ఉద్యోగం డిమాండ్ అక్షరదర్బార్, పరకాల : ఆర్టీసీ డ్రైవర్ శంకర్...
Read More...
ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల నాగుర్ల దిగ్భ్రాంతి

ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకున్న డ్రైవర్ వరంగల్ జిల్లా నర్సంపేట బస్ స్టేషన్ వద్ద ఘటన సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆత్మహత్యాయత్నం
క్రైమ్ 
Read More...
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

లిఫ్ట్ ఇచ్చి మహిళపై అఘాయిత్యం

- అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్- దొంగిలించిన బైక్‌పై వచ్చి ఘాతుకం.. - చురుగ్గా వ్యవహరించి పట్టుకున్న పోలీసులు
క్రైమ్ 
Read More...
లిఫ్ట్ ఇచ్చి మహిళపై అఘాయిత్యం

మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభం

మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభం రైతులు దళాలను నమ్మొద్దు..   ప్రభుత్వ కేంద్రాల్లోనే అమ్మాలి ఏఎంసీ చందుపట్ల రాజిరెడ్డి అక్షరదర్బార్, పరకాల:నడికూడ మండల కేంద్రంలో...
Read More...
మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభం