ఏసీబీ పంజా
- లంచం తీసుకుంటూ పట్టుపడిన ఎంఈవో, స్కూల్ అసిస్టెంట్
- అరెస్టు, విచారణ
ఏసీబీ పంజా
- లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎంఈఓ, స్కూల్ అసిస్టెంట్
అక్షరదర్బార్, మహబూబాబాద్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జిల్లాలో మరో భారీ ట్రాప్ నిర్వహించారు. గూడూరు మండలం అయోధ్యపురంలోని ఒక పాఠశాలలో పదవీ విరమణ పొందనున్న ఉపాధ్యాయుడి నుండి లంచం డిమాండ్ చేసిన ఇంచార్జ్ ఎంఈఓ, స్కూల్ అసిస్టెంట్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. అయోధ్యపురం పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. ఆయనకు సంబంధించిన అధికారిక పనులను పూర్తి చేసేందుకు ఇంచార్జ్ ఎంఈఓ రవికుమార్, ఆయనకు సహకరిస్తున్న స్కూల్ అసిస్టెంట్ చంద్రమౌళి రూ.15,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పథకం ప్రకారం ఈరోజు దాడి నిర్వహించారు.
- అరెస్ట్, విచారణ
లంచం డబ్బులు తీసుకుంటుండగా రవికుమార్, చంద్రమౌళిలను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ధృవీకరించారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.