పేకాట శిబిరంపై పోలీసుల దాడి....
ఐదుగురు అదుపులోకి…
నగదు, మొబైళ్లు, కార్డులు స్వాధీనం
అక్షరదర్బార్, శాయంపేట:
శాయంపేట మండలం తాహరాపూర్ గ్రామ శివారులో గోకుంట చెరువు కట్ట ప్రాంతంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు కొంతమంది వ్యక్తులు గుంపుగా చేరి డబ్బులతో పేకాట ఆడుతున్నారని తెలిసి పేకాట శిబిరంపై శాయంపేట ఎస్సై పరమేశ్వర్ చాకచక్యంగా అక్కడ ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 2,500 నగదు, మూడు మొబైల్ ఫోన్లు, ప్లేయింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న వారిలో కంబాల శివ, తక్కళ్ల సాయికుమార్, బండారి రమేష్, బెడితల రాజ్కుమార్, కుక్కల రాజు తదితరులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు శాయంపేట పోలీసులు వెల్లడించారు.