9 మంది ఎస్సైల బదిలీ
- ఉత్తర్వులు విడుదల
అక్షరదర్బార్, మొగుళ్లపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 9 మంది పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్ఐ)లు బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉత్తర్వులు విడుదల చేశారు. మొగుళ్లపల్లి ఎస్సై బి అశోక్ గణపురం ఎస్ఐగా, టేకుమట్ల ఎస్సై డి సుధాకర్ రేగొండ ఎస్సైగా, చిట్యాల ఎస్ఐ జి శ్రావణ్ కుమార్ భూపాలపల్లి సెకండ్ ఎస్సైగా, గణపురం ఎస్ఐ ఆర్ అశోక్ భూపాలపల్లి వేకెన్సీ రిజర్వ్ (వీఆర్)కు, కొత్తపల్లి గోరి ఎస్సై ఎస్ దివ్య భూపాలపల్లి వీఆర్ ఎస్ ఐ గా, ప్రస్తుతం భూపాలపల్లి వీఆర్ లో ఉన్న ఎస్ ఐ సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి కొత్తపల్లిగోరి ఎస్సైగా, వీఆర్ లో ఉన్న ఎస్ఐ పి సతీష్ చిట్యాల ఎస్సైగా, ప్రస్తుతం ములుగులో వీఆర్ లో ఉన్న ఎస్సై ఎం సురేష్ మొగుళ్లపల్లి ఎస్సైగా నియమితులయ్యారు.