మహారాష్ట్రలో పెను విషాదం
- ఘోర విమాన ప్రమాదం
- ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం
- ప్రమాదంలో అజిత్ సహా ఆరుగురు మృతి
మహారాష్ట్రలో పెను విషాదం
- విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
- ఘోర విమాన ప్రమాదంలో అజిత్ సహా ఆరుగురు మృతి
అక్షరదర్బార్, ముంబై: మహారాష్ట్ర రాజకీయ ధృవతార, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) ఇకలేరు. నేడు (బుధవారం) ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. తన సొంత నియోజకవర్గమైన బారామతిలో ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా సాంకేతిక లోపంతో ఆయన ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
- ఘటన వివరాలు
ముంబై నుంచి బారామతికి బయలుదేరిన చార్టర్డ్ ఫ్లైట్, ల్యాండింగ్కు మరికొద్ది నిమిషాల ముందు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రన్వే సమీపంలో కుప్పకూలింది. విమానం భూమిని ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగడంతో పరిస్థితి భీభత్సంగా మారింది. విమానంలో ఉన్న అజిత్ పవార్తో పాటు మరో ముగ్గురు సిబ్బంది కూడా ఈ ఘటనలో మరణించినట్లు ప్రాథమిక సమాచారం.
- ఆరుసార్లు డిప్యూటీ సీఎంగా రికార్డు
అజిత్ పవార్ మరణం మహారాష్ట్రకు తీరని లోటు. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత చతురత కలిగిన నాయకుడిగా ఆయనకు పేరుంది. మహారాష్ట్ర చరిత్రలో 6 సార్లు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక నేత ఆయనే. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా, ఎన్సీపీ (NCP) అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బారామతిని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో ఆయన కృషి అనన్యసామాన్యం.
- విషాదంలో రాష్ట్రం
అజిత్ పవార్ మరణవార్త వినగానే మహారాష్ట్ర ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, కేంద్ర మంత్రులు మరియు పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బారామతిలో వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి నివాళులర్పిస్తున్నారు.