కాంగ్రెస్ వశమైన పరకాల
- చివరి వరకు ఉత్కంఠ రేపిన ఫలితాలు
- 22 వార్డుల్లో కాంగ్రెస్ కు 13, బీఆర్ఎస్ కు 6, బీజేపీకి 3
- మున్సిపాలిటీ చైర్మన్ పదవిని దక్కించుకోనున్న కాంగ్రెస్
పరకాల మున్సిపాలిటీపై కాంగ్రెస్ విజయకేతనం
13 స్థానాల్లో ఘన విజయం
బీఆర్ఎస్కు 6, బిజెపికి 3
17వ వార్డులో ఒకే ఓటుతో కాంగ్రెస్ గెలుపు
మాజీ చైర్మన్ మార్త రాజభద్రయ్యకు ఎదురుదెబ్బ
అక్షరదర్బార్, పరకాల:
పరకాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. మొత్తం 22 వార్డుల్లో కాంగ్రెస్ 13 స్థానాలను కైవసం చేసుకొని ఆధిపత్యాన్ని చాటింది. బిఆర్ఎస్ 6 స్థానాలకు, బిజెపి 3 స్థానాలకు పరిమితమయ్యాయి. ఈనెల 16న జరిగే ఎన్నికల్లో ఈ మునిసిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ దక్కించుకోనుంది. మున్సిపాలిటీ చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్ ఎన్నికయ్యే అవకాశం ఉంది.
వార్డువారీ ఫలితాలు
1వ వార్డు – వెంకట స్వామి దుబాసి (బిఆర్ఎస్)
2వ వార్డు – శ్యామల (బిఆర్ఎస్)
3వ వార్డు – పోరండ్ల మౌనిక (కాంగ్రెస్)
4వ వార్డు – ఏకు దివ్య (కాంగ్రెస్)
5వ వార్డు – గొడుగు రజిత (బిఆర్ఎస్)
6వ వార్డు – రాణి తుమ్మల (బిఆర్ఎస్)
7వ వార్డు – సునీల్ కుమార్ పావుశెట్టి (కాంగ్రెస్)
8వ వార్డు – నల్లెల కుమార్ (కాంగ్రెస్)
9వ వార్డు – బెజ్జంకి పూర్ణాచారి (బిజెపి)
10వ వార్డు – లావణ్య పసుల (కాంగ్రెస్)
11వ వార్డు – గుడెల్లి సాధన్ కుమార్ (కాంగ్రెస్)
12వ వార్డు – ఆకుల లావణ్య (బిజెపి)
13వ వార్డు – మాధవి లత (కాంగ్రెస్)
14వ వార్డు – పడిదల దీప్తి (బిఆర్ఎస్)
15వ వార్డు – విజయ్ కుమార్ (బిజెపి)
16వ వార్డు – బండి శ్రీదర్ (కాంగ్రెస్)
17వ వార్డు – బొచ్చు సుభద్ర (కాంగ్రెస్)
18వ వార్డు – రేగూరి కరుణ (బిఆర్ఎస్)
19వ వార్డు – శ్రీనివాస్ కొయ్యడ (కాంగ్రెస్)
20వ వార్డు – పాలకుర్తి శ్రీనివాస్ (కాంగ్రెస్)
21వ వార్డు – సూదమల్ల రమేష్ (కాంగ్రెస్)
22వ వార్డు – అల్లే దశరథం (కాంగ్రెస్)
ఉత్కంఠ రేపిన 17వ వార్డు
పరకాల మున్సిపాలిటీ 17వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొచ్చు సుభద్ర కేవలం ఒకే ఓటు తేడాతో బిఆర్ఎస్ అభ్యర్థి శనిగరం రజనీపై విజయం సాధించడం విశేషంగా నిలిచింది. ఈ ఫలితం స్థానికంగా తీవ్ర ఉత్కంఠ రేపింది.
మాజీ చైర్మన్కు ఎదురుదెబ్బ
మున్సిపల్ మాజీ చైర్మన్ మార్త రాజభద్రయ్య 11వ వార్డులో ఓటమి పాలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
బిఆర్ఎస్ అంచనాలకు భిన్నంగా ఫలితాలు
ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం సాధిస్తుందని భావించిన ఆ పార్టీ నాయకులకు ఫలితాలు నిరాశ కలిగించాయి. మరోవైపు కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రతి వార్డులో చురుకైన ప్రచారం నిర్వహించడంతో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.
పరకాల మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగరవేయడంతో స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేచింది.