రైతులకు అండగా బీఆర్‌ఎస్‌

రైతులకు అండగా బీఆర్‌ఎస్‌

IMG-20250911-WA0896రైతులకు అండగా బీఆర్‌ఎస్‌ .
 
- ఎమ్మెల్యే పీఏ పీఏనా, మినిస్టరా?"
 
- రైతులపై కేసులు వద్దు.
 
- పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి.
 
అక్షరదర్బార్, పరకాల:
కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత మాటలకు మోసపోయిన రైతులు ఇప్పుడు గోస పడుతున్నారని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌ పార్టీ రైతులకు పూర్తి అండగా నిలుస్తుందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం పరకాల పట్టణంలోని ఎస్‌ జె గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
 
ఈ సందర్భంగా, గురువారం మృతి చెందిన పరకాల మాజీ జడ్పీటీసీ సభ్యుడు సీలువేరు మొగిలి మరణం పట్ల ఆయన సంతాపం ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, "తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన నీటి ప్రాజెక్టులు ఆనందం చేకూర్చాయి. అయితే, కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు రైతులు యూరియా కొరతతో రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది," అన్నారు.
 
"ఎమ్మెల్యే పీఏ పీఏనా, మినిస్టరా?"
 
పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు బదులుగా ఆయన పీఏ అధికారం చలాయిస్తున్నారని ధర్మారెడ్డి ఆరోపించారు. "ప్రభుత్వ అధికారులను బెదిరించడం, కాంట్రాక్టర్లపై ఒత్తిడి తేవడం వంటి చర్యలు అతను తీసుకుంటున్నాడు. ప్రజలతో సంబంధం లేని వ్యక్తి ఇంత అధికారాన్ని ఎలా కలిగి ఉన్నాడో ప్రజలకు తెలియాలి," అని ధర్మారెడ్డి ప్రశ్నించారు.
 
- యూరియా అందక రైతుల గోస – ఎమ్మెల్యేపై ప్రజల ఆగ్రహం
 
రైతులకు తగినంత యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన ఆయన, పరకాల నియోజకవర్గంలో రైతులు రెండురోజులుగా ధర్నాలు చేస్తున్నా ఎమ్మెల్యే స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. "రైతులు యూరియా కోసం పోరాడుతుంటే, వారిపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని మేము సహించం. వెంటనే చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యేపై ఉద్యమానికి సిద్ధంగా ఉంటాం," అని హెచ్చరించారు.
 
- రైతులపై కేసులు వద్దు – బీఆర్ఎస్ మద్దతు
 
"రైతులపై అక్రమ కేసులు పెట్టొద్దు. ప్రభుత్వం వారి పక్షంలో ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది," అని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పరకాల, నడికుడ, దామెర, ఆత్మకూరు మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:

తక్షణమే మున్సిపల్ ఎన్నికలు

- ఫిబ్రవరిలోనే జరిపేలా ప్లాన్ చేయాలని ఆదేశాలు - బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్, ఎకో టూరిజం సర్క్యూట్- రూ.143 కోట్లతో పొట్లాపూర్ లిఫ్ట్...
Read More...
తక్షణమే మున్సిపల్ ఎన్నికలు

పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు

పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు అక్షరదర్బార్, పరకాల:పరకాల మున్సిపాలిటీలో రాబోయే ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ కలెక్టరేట్‌లో అధికారికంగా ప్రకటించారు....
Read More...
పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు

సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్

నడికూడ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్ అక్షర దర్బార్,నడికూడ:పరకాల శాసనసభ సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు నడికూడ మండల కాంగ్రెస్...
Read More...
సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి- ఎద్దుపై దాడి చేసి చంపినట్లు గుర్తింపు - ప్రజలు ఆందోళన చెందవద్దన్న జిల్లా ఎస్పీ అక్షరదర్బార్, చిట్యాల: పెద్దపులి సంచారం భూపాలపల్లి...
Read More...
భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి

వృత్తికే మచ్చ....

వృత్తికే మచ్చ.... ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కీచక పర్వం.. విద్యార్థినిని వేధించిన అధ్యాపకుడు.. అక్షర దర్బార్, పరకాల:విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు మార్గదర్శకుడిగా ఉండాల్సిన అధ్యాపకుడే కీచకుడిగా...
Read More...
వృత్తికే మచ్చ....