వృత్తికే మచ్చ....

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కీచక పర్వం..

వృత్తికే మచ్చ....

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కీచక పర్వం..

విద్యార్థినిని వేధించిన అధ్యాపకుడు..

అక్షర దర్బార్, పరకాల:
విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు మార్గదర్శకుడిగా ఉండాల్సిన అధ్యాపకుడే కీచకుడిగా మారిన ఘటన పరకాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చోటుచేసుకుంది. కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్న మోరే అశోక్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయమై తల్లిదండ్రులు కళాశాల ప్రిన్సిపాల్ సంతోష్ కు ఫిర్యాదు చేయగా, ప్రాథమిక విచారణ అనంతరం పై అధికారులకు నివేదిక పంపినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థుల భద్రత, గౌరవం కాపాడాల్సిన విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగించే విషయమని పలువురు అభిప్రాయ పడుతున్నారు. విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తనకు పాల్పడిన అధ్యాపకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యా దేవాలయాలుగా భావించే కళాశాలల్లోనే విద్యార్థినులు భయంతో ఉండాల్సిన పరిస్థితి రావడం వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Tags:

బావిలో ముగ్గురు మృతి

పూడిక తీస్తుండగా తెగిన క్రేను వైరు ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి  మరొకరికి తీవ్ర గాయాలు  కొరికిశాల గ్రామంలో విషాదం
క్రైమ్ 
Read More...
బావిలో ముగ్గురు మృతి

పోలీస్ ఎస్సైల బదిలీ

9 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వివిధ పోలీసు స్టేషన్లకు కొత్త ఎస్ఐలు
క్రైమ్ 
Read More...
పోలీస్ ఎస్సైల బదిలీ

ఆరబెట్టిన మిర్చి చోరీ

5 క్వింటాళ్ల మిర్చి అపహరణ విలువ రూ.లక్ష.. పోలీసులకు ఫిర్యాదు హనుమకొండ జిల్లాలో ఘటన
వార్తలు 
Read More...
ఆరబెట్టిన మిర్చి చోరీ

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు      పారిశుద్ధ కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన 9 వ వార్డు కౌన్సిలర్ పూర్ణచారి  కౌన్సిలర్ పూర్ణ చారిని అభినందించిన కార్మికులు. అక్షరదర్బార్,...
Read More...
డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ ఖాతాలో పరకాల

- చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సునీల్ వైస్ చైర్ పర్సన్ గా ఏకు దివ్య 
రాజకీయం 
Read More...
కాంగ్రెస్ ఖాతాలో పరకాల