5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు
అక్షర దర్బార్, పరకాల.
భూభారతి రెవెన్యూ సదస్సులు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నడికూడ మండలంలోని గ్రామాలలో 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఒక్కో రోజు ఒక్కో గ్రామంలో రెండు టీములుగా నిర్వహించనున్నట్లు నడికూడా తహసిల్దార్ నాగరాజు తెలిపారు.ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు రెవిన్యూ సదస్సు నిర్వహించి భూ సమస్యలపై అప్లికేషన్లు తీసుకోబడునని తెలిపారు.భూ సమస్యలపై అన్ని ఆధారాలతో అప్లికేషన్ చేసుకుంటే ఎంక్వయిరీ చేసి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని నడికూడ మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రెవిన్యూ సదస్సు షెడ్యూల్ వివరాలు
5 వ తేదీ చౌటుపర్తి, ధర్మారం ,6వ తేదీ
ముస్తాలపల్లి , సర్వాపూర్ ,7వ తేదీ
పులిగిల్ల, కౌకొండ,8వ తేది చర్లపల్లి , నడికూడ ,9వ తేదీ నార్లాపూర్ , రాయపర్తి,10 తేదీ వరికోల్ , కంటాత్మకూర్ నిర్వహించడం జరుగుతుంది.
