ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

పట్టించుకోని అధికారులు!
ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు.. 
పట్టించుకోని అధికారులు!

అక్షర దర్బార్, పరకాల:
 పరకాల మండలం కామరెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం అధికారులకు సెలవు దినం కావడంతో మట్టి మాఫియా చెలరేగింది. ఉదయం మొదలుకుని ట్రాక్టర్లతో గ్రామ పరిసరాల బోడు నుండి ఎకధాటిగా మట్టిని తరలిస్తున్నారు. విషయం అధికారులకు తెలియజేసినా, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో అనధికారికంగా జరుగుతున్న ఈ మట్టి తరలింపుపై సంబంధిత విభాగాలు కళ్లుమూసుకోవడం స్థానికుల ఆగ్రహానికి గురి చేస్తోంది. “రోజూ ఇలాగే మట్టిని తీసుకెళ్తున్నారు. చెప్పినా పట్టించుకోవడం లేదు” అని గ్రామస్తులు వాపోతున్నారు.

పర్మిషన్ ఎవరికీ ఇవ్వలేదు:
కామరెడ్డి పల్లి గ్రామంలో మట్టి తరలించడానికి ఎవరికి అనుమతి ఇవ్వలేదని పరకాల తహసీల్దార్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. “మట్టి తవ్వకానికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. విషయం దృష్టికి తీసుకువచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం” అని ఆమె తెలిపారు.

Tags:

భార్యపై కోపంతో అత్త, బావమరిదిపై కత్తితోదాడి

- హనుమకొండ న్యూశాయంపేటలో ఘటన 
Read More...
భార్యపై కోపంతో అత్త, బావమరిదిపై కత్తితోదాడి

సర్పంచ్ సనత్ చోరవతో అంగన్వాడీకి పునర్నిర్మాణం

సర్పంచ్ సనత్ చోరవతో అంగన్వాడీకి పునర్నిర్మాణం   రూ.1.80 లక్షలతో పాత స్కూల్ భవనానికి రిపేర్లు    జంగిలి రత్నాకర్ ఉదారత అక్షర దర్బార్, పరకాల:పరకాల మండలం అలియాబాద్...
Read More...
సర్పంచ్ సనత్ చోరవతో అంగన్వాడీకి పునర్నిర్మాణం

“మా నానమ్మను గెలిపించండి” 

“మా నానమ్మను గెలిపించండి”    చిన్నారి అభ్యర్థనకు కరిగిన ఓటర్ల హృదయాలు అక్షరదర్బార్, పరకాల:పరకాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 12వ వార్డులో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది....
Read More...
“మా నానమ్మను గెలిపించండి” 

మేడారం.. ట్రాఫిక్ నరకం

టెక్నాలజీ తుస్సు.. యంత్రాంగం ఫస్సు! మేడారం - హనుమకొండ 11 గంటల జర్నీ 
వార్తలు 
Read More...
మేడారం.. ట్రాఫిక్ నరకం

మహారాష్ట్రలో పెను విషాదం

ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం ప్రమాదంలో అజిత్ సహా ఆరుగురు మృతి
రాజకీయం 
Read More...
మహారాష్ట్రలో పెను విషాదం