భార్యపై కోపంతో అత్త, బావమరిదిపై కత్తితోదాడి
- హనుమకొండ న్యూశాయంపేటలో ఘటన
భార్యపై కోపంతో అత్త, బావమరిదిపై కత్తితోదాడి
హన్మకొండ న్యూశాయంపేటలో ఘటన
అక్షరదర్బార్, హనుమకొండ:
హన్మకొండ నగరంలోని న్యూశాయంపేట ప్రాంతంలో మంగళవారం ఉదయం కలకలం రేగింది. భార్యతో ఉన్న విభేదాల నేపథ్యంలో ఓ వ్యక్తి అత్త, బావమరిది పై కత్తితో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. న్యూశాయంపేటకు చెందిన దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్యపై తీవ్ర కోపంతో ఉన్న భర్త, ఆమె ఇంట్లో లేని సమయంలో అత్త నివాసానికి వెళ్లి అక్కడ ఉన్న అత్త, బావమరిది పై అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో అత్త, బావమరిది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. ఈఎంటి మమత, పైలెట్ వేణు క్షతగాత్రులను హన్మకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.