కాంగ్రెస్ ఖాతాలో పరకాల
- చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్
- ప్రమాణ స్వీకారం చేసిన సునీల్
- వైస్ చైర్ పర్సన్ గా ఏకు దివ్య
చైర్మన్గా పావుశెట్టి సునీల్ కుమార్
- పరకాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
అక్షరదర్బార్, పరకాల:
ఊహించినట్లే జరిగింది. పరకాల మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. కొద్ది రోజుల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలోని 22 వార్డుల్లో కాంగ్రెస్ 13 సీట్లు గెలుచుకోగా, బీఆర్ఎస్ 6, బీజేపీ 3 స్థానాలను సాధించాయి. సోమవారం కాంగ్రెస్ కౌన్సిలర్లు క్యాంప్ నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని ముందుగా కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అధికారులు చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. 7వ వార్డు నుంచి గెలుపొందిన కౌన్సిలర్ పావుశెట్టి సునీల్ కుమార్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. వెంటనే అధికారుల సమక్షంలో భవిష్యత్తు సునీల్ కుమార్ పరకాల మున్సిపాలిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. కౌన్సిలర్లు నూతన చైర్మన్ ను అభినందించారు. వైస్ చైర్ పర్సన్ గా 4వ వార్డు నుంచి గెలిచిన ఏకు దివ్య ఎన్నికయ్యారు. పరకాల మున్సిపాలిటీ చైర్మన్ పదవి అన్ రిజర్వుడ్ అయిన విషయం తెలిసిందే.