కాంగ్రెస్‌కు రోజులు దగ్గరపడ్డాయి..

కాంగ్రెస్‌కు రోజులు దగ్గరపడ్డాయి..

కాంగ్రెస్‌కు రోజులు దగ్గరపడ్డాయి..
మాజీ ఎమ్మెల్యే చల్లా.
 
అక్షర దర్బార్, పరకాల:
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పరిపాలన చేతకావడం లేదని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్‌ను కర్రుకాల్చి వాతపెట్టే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. సోమవారం ఆత్మకూర్, దామెర, గీసుగొండ మండలాల సమన్వయ కమిటీ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా జరిగిన పార్టీ సమావేశాలపై సమీక్ష చేపట్టారు.
 
ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, తప్పుడు కేసులు పెట్టించే వారిని ఎవ్వరినీ వదలబోమని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
 
“ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేయడం పట్ల ఇప్పుడు బాధపడుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం బీఆర్‌ఎస్‌కే పట్టం కట్టేలా సిద్ధంగా ఉన్నారు” అని ఆయన పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి విజయకేతనం ఎగురవేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఆత్మకూర్, దామెర, గీసుగొండ మండలాల సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు
Tags:

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం.  ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర  సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.  అక్షర దర్బార్, శాయంపేట:శాయంపేటలో...
Read More...
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ! - వెంకటేశ్వరపల్లిలో వంట నాణ్యతపై గ్రామస్థుల ఆవేదన అక్షరదర్బార్, పరకాల:పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీ సెంటర్లు ఇప్పుడు నాణ్యతారహిత...
Read More...
పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి- 97 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత - నాలుగు వాహనాలు సీజ్- పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై విచారణ...
Read More...
టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు.. పట్టించుకోని అధికారులు! అక్షర దర్బార్, పరకాల:  పరకాల మండలం కామరెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం అధికారులకు సెలవు దినం కావడంతో గ్రామంలో...
Read More...
ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.       నకిలీ రైతుల పేరుతో పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం.      ఈఎఫ్‌టీ విచారణలో బహిర్గతం    అక్షర దర్బార్, శాయంపేట:...
Read More...
రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.