ఏసీబీ అధికారుల సోదాలు
- సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు
- కీలక పత్రాలు, డాక్యుమెంట్లు పరిశీలన
ఏసీబీ కలకలం
- సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు
అక్షరదర్బార్, హనుమకొండ:
హనుమకొండ వడ్డేపల్లి వద్ద ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులకు దిగడం సంచలనం సృష్టిస్తుంది. ఈ కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు ఆఫీస్ లో నుంచి ఎవరు బయటకు వెళ్లకుండా తలుపులు మూసివేసి సోదాలు నిర్వహిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఛాంబర్ లోని కీలక పత్రాలు, రిజిస్ట్రేషన్ ఫైళ్ళు, నగదు నిల్వలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అక్రమ వసూళ్లు లేదా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరుగుతున్నాయనే సమాచారంతో ఏసీబీ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తుంది. ఈ దాడుల్లో ఎంత నగదు దొరికింది? ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? అనే పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మొత్తానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండటం ఇక్కడ కలకలం రేపింది.